Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

బల్దియాలో ఆర్థిక సంక్షోభం తప్పదా?

0
0

హైదరాబాద్: మహానగరంలోని కోటి మంది జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనుల చేపట్టడటంతో పాటు అత్యవసర, కనీస వౌలిక సదుపాయాలు, పౌరసేవల నిర్వాహణ వంటి బాధ్యతలను మోస్తున్న జీహెచ్‌ఎంసీకి మున్ముందు ఆర్థికంగా గడ్డుకాలం ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను రానున్న ముప్పై ఏళ్ల ముందుచూపుతో ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో వందలాది కోట్ల రూపాయల పనులు త్వరలోనే పూర్తయ్యే అవకాశముండటంతో, ఆ బిల్లులన్నీ జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం అంతంతమాత్రం నిధులతో నడుస్తున్న జీహెచ్‌ఎంసీ ఇటీవలే రూ. 800 కోట్లను బాండ్ల రూపంలో సేకరించిన సంగతి తెలిసిందే! ఇందులో కూడా అత్యధికంగా నిధులు ఖర్చయినట్లు సమాచారం. వర్తమాన ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1500 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేసుకున్నా, జీహెచ్‌ఎంసీకి కలిగే ఉపశమనం అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. మార్చి నెలాఖరు వరకు నిర్దేశిత లక్ష్యం ప్రకారం రూ. 1500 కోట్లను జీహెచ్‌ఎంసీ వసూలు చేసుకున్నా, ఎస్‌ఆర్‌డీపీ బిల్లులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రొటీన్ మెయింటనెన్స్, సిబ్బంది జీతభత్యాలతో రెండు నుంచి మూడు నెలల్లోనే నిధులు ఖర్చయ్యే అవకాశముంది. వీటిలో ముఖ్యంగా ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల బిల్లులు, తుది దశలో ఉన్న సుమారు 40వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల బిల్లులకే అత్యధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ రానున్న ఆర్థిక సంవత్సరం(2019-2020)కు రూపొందించనున్న రాష్ట్రంలో బడ్జెట్‌లో కేటాయించే నిధులపైనే జీహెచ్‌ఎంసీ ఆశలు పెట్టుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఇప్పటికే వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, అవి పూర్తయ్యేందుకు అవసరమైన నిధులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా భారీ ప్రాజెక్టులకు అవసరమైన నిధులతో కూడిన నివేదికలను పంపేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి మూడు వారంలో మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశముండటంతో అంతలోపు అవసరమైన నిధులతో కూడిన ప్రతిపాదనలు, అలాగే జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్ ముద్ర వేసి సర్కారుకు పంపాలని జీహెచ్‌ఎంసీ అధికారులు యోచిస్తున్నారు.


బీసీలను అణిచివేసే కుట్ర

0
0

ఖైరతాబాద్: కోర్టు ఉత్తర్వుల సాకుతో బీసీలను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు కేసీ కాళప్ప మాట్లాడారు. రాజ్యాంగం బీసీలకు ఫ్రసాదించిన హక్కులను హరించే చట్టాలు అమలు కాకుండా ఎదుర్కొనేందుకు వర్గ విభేదాలు విడనాడాలని కోరారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాకా కాలేకర్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిందని చెప్పారు. బీసీల జనాభాను లెక్కించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినా ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరమని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలు ఏకమై పోరాటం చేయడంతోనే దేశంలో అణగారిన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. బీసీలను రాజకీయంగా అణిచివేసేందుకే సుప్రీం తీర్పును చూపుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో రివిజన్ పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో బీసీలను ఏ, బీ, సీ, డీగా విభజించి గతంలో 34శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రేమ్‌లాల్, మల్లిఖార్జున్, గాండ్ల లక్ష్మణ్, అబ్బులింగం పాల్గొన్నారు.
రిజర్వేషన్లు తేలే వరకు ఎన్నికలు వద్దు
బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి అంటూనే మరోవైపు అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లపై కేసులు వేసిన టీఆర్‌ఎస్ నాయకులను ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీల జనాభా ఎంత ఉందో బహిర్గతం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పాలూరి రామకృష్ణయ్య డిమాండ్ చేశారు.
శ్వాసకోశ వ్యాధులపై అవగాహన
ఖైరతాబాద్, డిసెంబర్ 27: శ్వాసకోశ సంబంధ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని పల్మనాలజిస్ట్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు సుదర్శన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. దేశంలో సంభవిస్తున్న మరణాలకు రెండవ అతిపెద్ద కారణం శ్వాస సంబంధ వ్యాధులేనన్నారు. నానాటికి పెరిగిపోతున్న వాయు కాలష్యంతో శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వాహన ఈ ప్రభావం అధికంగా ఉందని అన్నారు. శారీరాకిని ఆక్సిజన్‌ను అందించే ఊపిరి తిత్తులు చెడిపోవడంతో వ్యాధి నిరోదక శక్తి తగ్గి, వివిధ రకాల వ్యాధుల భారిన పడి మృత్యువుకు చేరువ అవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులకు కారణాలు - చికిత్స విధానాలను వివరించేందుకు బేరోక్ జిందగీ పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

నిఘా ఏదీ?

0
0

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ రోజురోజుకీ విస్తరిస్తున్నా, సిటీలో లక్షల్లో వెలిసిన ఆహార విక్రయ కేంద్రాలపై సరైన నిఘా సమకూరటం లేదు. ఫలితంగా ఆయా వ్యాపార సంస్థలు విక్రయించే శాఖాహార, మాంసాహారంలో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చలి, వర్షాకాలాల్లో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నపుడు ఆహారంలో ఏర్పడే స్వల్ప లోపాలతో ప్రజలు అనేక రకాలుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. కానీ ఏ కాలంలోనూ ఆహార విక్రయ కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించటం లేదు. దీనికి జీహెచ్‌ఎంసీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు. కానీ, నగరంలో సర్కిల్‌కు ఓ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని కౌన్సిల్ చేసిన తీర్మానానికి స్పందించిన ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, నేటికీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం పూర్తి కాలేదు. 30 సర్కిళ్లు, లక్షల్లో హోటళ్లున్న నగరానికి ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లుండటం గమనార్హం. ఎక్కడైనా కల్తీ, కుళ్లిపోయిన ఆహారాన్ని తీసుకుని, వినియోగదారులు అనారోగ్యం బారిన పడి, ఫిర్యాదులు చేస్తే తప్ప, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించటం లేదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ఓ పేరుగాంచిన హోటల్‌కు భోజనానికి వెళ్లిన కొందరు ఉన్నతాధికారులు అక్కడ మటన్ బిర్యానీని ఆర్డర్ ఇచ్చారు. అప్పటికే అందులో ఓ అధికారికి అనుమానం వచ్చి, కొన్ని మాంసపు ముక్కలను పక్కనబెట్టి, బిల్ కట్టి వెళ్లే సమయంలో వాటిని పార్శిల్ చేయించుకుని తీసుకెళ్లాడు. అప్పటికే సదరు అధికారికి అనుమానం రావటంతో ఆ ముక్కలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించగా, అది బీఫ్‌గా తెలటంతో సదరు అధికారి హోటల్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారిని హోటల్ యజమానులు మేనేజ్ చేసి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడినట్లు సమాచారం. ఈ రకంగా సామాన్యులు కొందరు హోటళ్లపై చేస్తున్న ఫిర్యాదులు ఒక రకంగా జీహెచ్‌ఎంసీ అధికారులకు వరంగా మారుతున్నాయి. ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకుని కొందరు జీహెచ్‌ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బంది అధికారులు నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత బేరం కుదుర్చుకుని అక్రమార్జనకు పాల్పడుతున్న ఆరోపణలు సైతం ఉన్నాయి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా నగరంలోని బిర్యానీ హోటళ్లపై ప్రజల్లో అనేక రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. పేరుగాంచిన ఓ హోటల్ కుక్క మాంసపు బిర్యానీని మట్టన్ బిర్యానీగా విక్రయిస్తుందన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆ తప్పుడు ప్రచారానికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఆహార విక్రయ కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ అధికారుల నిఘా కొరవడటంతో ప్రజారోగ్య పరిరక్షణ పత్తాలేకుండాపోయింది. ఇప్పటికైన జీహెచ్‌ఎంసీలో అందుబాటులో ఉన్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి మెడికల్ ఆఫీసర్లు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి, ఆహారాన్ని పరీక్షిస్తే నమ్మలేని నిజాలు బయట పడుతాయనే వాదనలు ఉన్నాయి.

ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

0
0

శంషాబాద్, డిసెంబర్ 27: అంతర్జాతీయ విమానాశ్రయంలో 310గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రయాణికురాలను ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో గుర్తించి అమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణ కోసం మహిళను ఇమిగ్రేషన్ అధికారులు.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

వరస స్నాచింగ్‌లతో వణికిపోతున్న ప్రజలు

0
0

వనస్థలిపురం, డిసెంబర్ 27: వనస్థలిపపురం పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్‌లు రెండవ రోజు కూడా రెచ్చిపోయారు. బుధవారం రోజున జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లు మరవక ముందే గురువారం రోజుకుడా వనస్థలిపురంతో పాటు ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని చైతన్యపురి, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో స్నాచర్స్‌లు మరోసారి విజృంభించారు. రెండు రోజులుగా వరస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దిక్కుదోచని స్థితిలో రాచకొండ పోలీసులు కంటికి నిద్ర లేకుండా స్నాచర్స్ కోసం గాలిస్తూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
రెండేళ్ల నుంచి నగరంతో పాటు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తగ్గడంతో ప్రజలు, పోలీసులు ప్రశాంతంగా గడిపారు. ఎల్బీనగర్ డీసీపీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటికే పెద్ద ఎత్తున సీసీ కేమారాలను ఏర్పాటు చేయించడంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీగా ఉండే ప్రధాన చౌరస్తాలలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీసు ఉన్నత అధికారులు పూర్తి స్థాయిలో సఫలమయ్యారు. రెండు రోజులుగా ఎల్బీనగర్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్లను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారు. మహిళలు తాము చెప్పిన సూచనలను పాటించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
మన్సూరాబాద్‌లో స్నాచింగ్
వాకింగ్ చేస్తున్న మహిళల మెడలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కెల్లిన సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మన్సూరాబాద్ డివిజన్, ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గృహిణి గుర్రం ధణలక్ష్మీ (40) గురువారం తెల్లవారుఝామున వాకింగ్ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా ఎంఈరెడ్డి గార్డెన్ రోడ్డులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.

మలుపులు.. మెరుపులు

0
0

ప్రపంచాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఆయుధ సంపత్తి పరంగా శాసించే దేశాల మధ్య సఖ్యత ఉంటేనే విశ్వశాంతి బలపడుతుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన దేశాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు నెలకొనడం కూడా ఇందుకు ఎంతైనా అవసరం. 2018 సంవత్సరం ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఎన్నో కీలక పరిణామాలకు కేంద్ర బిందువయింది. అగ్ర రాజ్యాలుగా వున్న అమెరికా రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తడం అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మరోసారి అంతర్జాతీయంగా పట్టుని బిగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నించడం, బ్రెగ్జిట్‌పై ముందుకా, వెనక్కా అన్న సందిగ్ధంలో బ్రిటన్ ప్రధాని థెరిస్సామే డోలాయమనం ప్రపంచ పరిణామాలను శాసిస్తూనే వచ్చాయి.
అడుగేస్తే అలజడే!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఎంత వివాదాస్పదమైందో వైట్‌హౌస్‌ను అధిష్టించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతే అలజడికి కారణమయ్యాయి. విస్మయపూరిత నిర్ణయాలను తీసుకోవడమే గాకుండా, ఇక మిత్ర దేశాలను కలవరపాటుకు గురిచేశాయి. చైనాతో అమీతుమీ అన్న రీతిలో వాణిజ్య యుద్ధ సెగలను రగిలించి సమర వాతావరణానికి ఆజ్యం పోశారు. ఇటు నాటో దేశాలతో కూడా తెగతెంపులకు తెరతీయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఏ వ్యక్తి సాహసించని చర్యలకు ఒడిగట్టి అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడికే గండి కొట్టడమన్నది ఒక్క ట్రంప్‌కే సాధ్యమైందేమో. ఇలాంటి వ్యక్తిని అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిగా ఎందుకు నామినేట్ చేశామా? అంటూ రిపబ్లికన్ పార్టీ అధినాయకత్వమే తలలు పట్టుకునేలా సాగిన ట్రంప్ వ్యవహార శైలి ఆయన అధ్యక్ష పదవికే ముప్పుతెచ్చే పరిణామాలకు దారులు తీస్తుందా? ఆయన ఈ పదవిలో ఉండేది మరో రెండేళ్లే అయినా.. ఆ రెండేళ్లు కూడా భరించడం కష్టమేనన్న భావన ఇటు రిపబ్లికన్‌లలోనూ, అటు డెమోక్రట్లలోనూ వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రాబర్ట్ ముల్లర్ విచారణ కొలక్కి వస్తే అది ట్రంప్‌కు పూర్తి స్థాయిలో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు ఎప్పటికప్పుడు వేడి రగిలిస్తూనే వచ్చాయి. తాజాగా మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలన్న ఆయన నిర్ణయం అమెరికా ప్రభుత్వమే స్తంభించిపోయే పరిస్థితులకు దారితీసింది. మరి అమెరికా ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు ఈ వివాదాస్పద అధ్యక్షుడి విషయంలో కొత్త సంవత్సరంలో ఎలా వ్యవహరిస్తాడన్నది ఉత్కంఠను రేపే అంశమే.
కునుకు పట్టనివ్వని బ్రెగ్జిట్!
ఎప్పటికప్పుడు బ్రెగ్జిట్ వివాదం కొత్త తలనొప్పులు తెస్తూనే ఉంది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలిగి సొంతంగానే మనుగడ సాగించాలంటూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయ ఫలితంగానే బ్రెగ్జిట్ అవతరించింది. ఐతే ఈ ప్రతిపాదనను ఆమోదించినవారికి, వ్యతిరేకించిన వారికి మధ్య తేడా తక్కువగా ఉండడం వల్ల ఈ విడాకుల వ్యవహారం విపరీత పరిణామాలకు తెరతీసింది. బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆమెకు ఎడతెగని సమస్యలే సృష్టించింది. సంక్షోభాల మీద సంక్షోభాలను తట్టుకుంటూ ఏటికి ఎదురీదే చందంగానే థెరిసా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా? లేదా అన్నది అనుమానాలకు దారితీసింది. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని థెరిసా హామీ ఇవ్వడంతోనే ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గట్టెక్కగలిగింది. దాదాపుగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, లేబర్ పార్టీ సభ్యులు బ్రెగ్జిట్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తూనే వున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న బ్రెగ్జిట్ వ్యవహారం వచ్చే ఏడాది మార్చి 29 నాటికి పూర్తి కావలసివుంది. అప్పట్లోగా అంతర్గత వివాదాలను థెరిసా మే చక్కబెట్టకపోతే బ్రిటన్ తీవ్ర స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటుంది. బ్రిటన్‌కు అన్ని విధాలుగా ప్రయోజనం కలిగించే రీతిలోనే ఐరోపా యూనియన్ ఒప్పందం కుదుర్చుకుంటున్నామని థెరిసా చెబుతున్నా, అంతర్గత తిరుగుబాటు మాత్రం ఆమెకు నిద్రపట్టనివ్వడం లేదు. డెడ్‌లైన్‌లోగా ఒప్పందం కుదరకపోతే ఎలాంటి ఒడంబడిక లేకుండానే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా థెరిసా యుద్ధ ప్రాతిపదికన వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.

డ్రాగన్ రూటేవేరు..
ఎప్పటికప్పుడు ప్రపంచ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆర్థికంగానూ, రాజకీయంగానూ మరింతగా పలుకుబడిని పెంచుకోవడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆర్థికస్థితి కలిగిన దేశంగా రాణిస్తున్న చైనా దాదాపుగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని తన గుప్పిట పెట్డుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేయడం ఈ ఏడాది కీలక పరిణామం. చైనా అధ్యక్షుడిగానే కాకుండా, సుప్రీం నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకున్న జీ జిన్‌పింగ్ తమ దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు పావులు కదుపుతున్నారు. అమెరికా వ్యతిరేకిస్తున్న పారిస్ సహా కీలక ఒప్పందాలకు మద్దతు ఇవ్వడం, అలాగే అమెరికా నిధులు ఆపేసిన పాక్ వంటి దేశాలను ఆదుకోవడమే పనిగా పెట్టుకున్న చైనా వ్యాపార, వాణిజ్య పరంగానూ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది. ట్రంప్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాల పుణ్యమా అని మరో బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన దేశంగా ఉన్న చైనా అన్ని విధాలుగా బలపడుతోంది. అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు అమెరికా వైఫల్యాలను ఆలంబనగా మార్చుకుంటోంది. ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలపై చైనా పలుకుబడి పెరగడం, ప్రపంచ శాంతికి నిధులు అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఎదగడం జీ జిన్‌పింగ్ వ్యూహాత్మక చర్యలకు నిదర్శనం. అమెరికా ధోరణి ఇలాగే కొనసాగితే కొత్త సంవత్సరంలో చైనాకు పట్టపగ్గాలే వుండవన్నది నిపుణుల వాదన.
అడియాసల పుతిన్
రష్యా ప్రధానిగా అనంతరం అధ్యక్షుడిగా తిరుగులేని పట్టును కొనసాగిస్తూ వచ్చిన వ్లాదిమిర్ పుతిన్ పాపులారిటీ తగ్గుతోందా? అమెరికాతో ఎడతెగని వివాదాలు ఓ పక్క, సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన రెపబ్లిక్‌లతో వివాదాలు మరోపక్క పుతిన్‌ను వేధిస్తూనే వున్నాయి. భారీ ఓట్ల మెజార్టీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పుతిన్‌తప్ప మరోబలమైన నాయకుడి గురించి తెలియని రష్యా యువతరానికి ఆయన నిర్ణయాలు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా అలెక్సీ నావాల్ని చేపడుతున్న ఉద్యమం పుతిన్ నాయకత్వానికే సవాల్‌గా మారుతుంది.ఈ ఏడాదిలో ప్రపంచ ఫుట్‌బాల్ కప్ నిర్వాహణతో పాటు ఎన్నో రకాలుగా అంతర్జాతీయ ఖ్యాతిని రష్యా సంపాదించుకున్నప్పటికీ అంతర్జాతీయంగా మళ్లీ పట్టు సంపాదించి పూర్వ వైభవాన్ని పొందాలన్న పుతిన్ ప్రయత్నాలు మాత్రం ఓ కొలిక్కి రావడంలేదు. అమెరికా సారథ్యంలో పలు పశ్చిమ దేశాలు ఇందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపైనా ప్రధావాన్ని కనబరుస్తున్నాయి. సిరియా విషయంలో ఇటీవల తాము సాధించిన విజయాన్ని సానుకూలంగా మార్చుకుని అంతర్జాతీయంగా మరోసారి ఎదిగేందుకు రష్యా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కారణం సిరియా విషయంలో రష్యా తీసుకుంటున్న నిర్ణయాలను జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్‌లు వ్యతిరేకించడమే. రష్యా ప్రయోజనాల కోసం తామెందుకు నిధులను వెచ్చించాలన్న మెలికతో పుతిన్ ప్రయత్నాలకు ఈ దేశాలు గండికొట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్గత సెగలు, అంతర్జాతీయ సవాళ్లు, అలాగే పెరుగుతున్న జనాభా పుతిన్‌కు గుదిబండలుగా మారుతున్నాయి. కొత్త సంవత్సరం ఆయనకు సవాళ్లమయంగానే పరిణమించే అవకాశం ఉంది.

కొలిక్కిరాని కొరియా!
ఈ ఏడాది ఉత్తర కొరియా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అమెరికాపై దాడిచేస్తామని, పొరుగున వున్న దక్షిణ కొరియాపై యుద్ధ్భేరి మోగిస్తానంటూ అలజడి సృష్టించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాన్ ఎట్టకేలకు అమెరికా ఒత్తిళ్ల ఫలితంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిఖరాగ్ర భేటీ అయినప్పటికీ పరిస్థితులు అనుకూలంగానే మారిపోయాయి. తమ వద్ద వున్న క్షిపణులను తొలగిస్తామని చెప్పిన కిమ్‌జోన్ అంతలోనే మాటమార్చారు. అమెరికా తమపై ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్న ఆయన మళ్లీ కొత్త వివాదాన్ని తెరతీశారు. తమ అణ్వాయుధాలను వదులుకోవడం లేదని చెప్పడం ద్వారా ఇటు దక్షిణ కొరియాకే కాకుండా ఇతర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరి కొత్త ఏడాదిలో ఉత్తర కొరియా ఎలాంటి విపరిణామాలకు ఆజ్యం పోస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీ వివరాలివ్వలేదు

0
0

న్యూఢిల్లీ: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదికలో వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇప్పటికి వివరాలు ఏవీ అందజేయలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఉక్కు కార్మాగరం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము నిల్వలకు సంబంధించి వివరాలు అందించలేదని తెలిపింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం శంకుస్థాపన చేసి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు తీసుకుంటుందని అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌పై ఉన్నత స్థాయి ట్రాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. టాస్క్ఫోర్స్ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నెల 17న టాస్క్ఫోర్స్ సమావేశం జరిగిందని పేర్కొన్నారు. టాస్స్‌పోర్సు నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్రం తప్పుపట్టింది.
పని తక్కువ ఆర్భాటం ఎక్కువ: జీవీఎల్
ఉత్తుత్తి స్టీల్ ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి మరొక డ్రామాకు తెరలేపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుఆరోపించారు. ఎటువంటి అమలుకు నోచుకోని చంద్రన్న శంకుస్థాపన రాళ్లు రాయలసీమలో చాలా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీకి న్యాయం చేయండి:
టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్‌కు న్యాయం చేయాలని తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ అవరణలో తన నిరసనను గురువారం కూడా కోనసాగించారు. పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాలలో వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీ ఎన్ శివప్రసాద్ గురువారం కూడా అదే కొనసాగించారు.

సికింద్రాబాద్ నుంచే పోటీచేస్తా

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. దత్తాత్రేయ గురువారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తనను గవర్నర్‌గా పంపించి మరొకరిని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తారని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇదే విషయం విలేఖరులు అడగ్గా ‘2019 లోక్‌సభ ఎన్నికే కాదు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ నుంచి నేనే పోటీచేస్తా’అని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందని ఆయన గుర్తుచేశారు. ‘నేను రాజభవన్‌కు వెళ్లను. రాజ్యసభకు వెళ్లను. నేను ప్రజా భవన్‌లోనే ఉంటాను’ అని బండారు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.


ప్రజలకు నీటి భద్రతే లక్ష్యం

0
0

విజయవాడ: ప్రజలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకూ సాగునీటి ప్రాజెక్టులపై 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి స్థిరీకరించినట్లు తెలిపారు. సహజ వనరులు- జలవనరులపై ఉండవల్లిలోని ప్రజావేదికలో 5వ శే్వతపత్రంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఇప్పటి వరకూ 15,363 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి 3500 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. 2019 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గత నాలుగు పంట సీజన్లలో 263 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీరు ఇవ్వడం ద్వారా తుపానుల నుంచి పంటలను కాపాడగలిగాం. 1667 కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు చేయగా, 44 వేల కోట్ల రూపాయల మేర పంట దిగుబడులు వచ్చాయి. ప్రాధాన్య ప్రాజెక్టులను 62 గుర్తించి చేపట్టాం, ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మరో ఆరు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఇప్పటికే పూర్తి చేయగా, గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా 320 టీఎంసీల నీటిని ప్రకాశం, గుంటూరు, నెల్లూలు జిల్లాలకు, సోమశిల రిజర్వాయరుకు నీటి తరలింపును రెండు దశల్లో చేపట్టనున్నాం. వంశధార, నాగావళి, నాగావళి-స్వర్ణముఖి, వేగవతి, చంపావతి నదుల అనుసంధానం ప్రక్రియ జరుగుతోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ జరుగుతోంది. వంశధార-బాహుదా నదుల అనుసంధానంపై డీపీఆర్ తయారైంది. ఇటువంటి చర్యల ద్వారా మహా సంగమం సాధ్యం కానుంది.నీరు-చెట్టు, నీరు- ప్రగతి కింద 3348 కేస్కేడ్‌లను అభివృద్ధి చేశాం. 8.356 లక్షల పంట కుంటలను తవ్వాం. వివిధ చెరువుల్లో, కుంటల్లో 84 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేయడం ద్వారా అదనంగా 7.11 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగాం. భూగర్భ జలాలలను ఉపరితలం నుంచి 3 - 8 మీటర్ల లోతులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నీ టి సంరక్షణ చర్యల కారణంగా లోతుగా నీరు ఉం డే ప్రాంతాల సంఖ్యను 2874 నుంచి 2297కు త గ్గించగలిగాం. దీంతో రూ.440 కోట్లు ఆదా అయిం ది. భూగర్భ జలాల 708 టీఎంసీలకు చేరుకుంది. పచ్చదనంను 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతానికి తీసుకువచ్చేందుకు చర్యలు రూపొందించాం.
విభజనకు ముందు..
రాష్ట్ర విభజనకు ముందు రూ.1.90 లక్షల కోట్ల తో 86 ప్రాజెక్టులు ప్రతిపాదించారు. నిధులు ఖ ర్చు చేసినా సాగు నీరు అందుబాటులోకి రాలేదు. కాలువలు తవ్వి, ప్రధాన హెడ్ వాటర్ పనులను చేపట్టకపోవడం వల్ల నిధులు వృథా అయ్యాయి. నీటి నిర్వహణ, నీటి పర్యవేక్షణ విధానాల అమలు వల్ల నీటి లభ్యతను రియల్ టైమ్‌లో తెలుసుకునే వీలు కలిగింది. భూగర్భ జలాల లభ్యతను తెలుసుకునేందుకు 1254 చోట్ల పీజో మీటర్లను ఏర్పా టు చేశాం. విభజనకు ముందు గోదావరి, కృష్ణా, పెన్నా, సాగర్ కాలువ వ్యవస్థలను ఆధునీకరించ డంతో కరవు నివారణకు చర్య లు తీసుకోలేదు. చి న్న నీటి పారుదల వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర విభజన వల్ల దాని ప్రభావం సాగునీటి అవసరాలపై పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంతరాష్ట్ర సమస్యగా మారింది. 2014 తరువాత నీటికి సంబంధించి మూడంచెల విధా నం అమలు చేసింది. నీటి పొదుపు, నదుల అనుసంధానం, పెండిం గ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సా రించింది. నీటి పొదుపు చర్యలు ఉద్యమ రూపం గా చేపట్టింది. నీరు చెట్టు, జలసిరికి హారతి వంటి కార్యక్రమాల ద్వారా నీటి పొదుపు ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఈ ప్రభుత్వం 13 కొత్త ప్రా జెక్టులు చేపట్టింది. వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా కొ త్త బ్యారేజీ నిర్మాణం, ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, గుంటూ రు కాలువ విస్తరణ వంటివి ప్రతిపాదించింది. గోదావరి, పెన్నా, గోదావరి- వంశధా ర, ఉత్తరాంధ్ర సులజ స్ర వంతి, వంశధార, నాగావళి, నాగావళి- స్వర్ణముఖి, వేగవతి, చంపావతి నదుల అనుసంధానించింది.

ప్రపంచంతో పోటీ పడటమే లక్ష్యం

0
0

విజయవాడ(సిటీ), డిసెంబర్ 27: ప్రపంచంతో పోటీ పడుతూ 2050 నాటికి నెంబర్ వన్‌గా నిలవాలనే అంతిమ లక్ష్యంతో నిరంతరాయంగా పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విభజన కష్టాలు, సమస్యలను అధిగమిస్తూ, మరోవైపు అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ అతి తక్కువ సమయంలో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటలో భాగంగా మంత్రి లోకేష్ రెండో రోజు గురువారం పలు సమావేశాలు, భేటీలతో బీజీ బీజీగా గడిపారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో ప్రతిష్టాత్మకమైన ఎస్‌ఆర్ నాథన్ పురస్కారాన్ని లోకేష్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్ లోకేష్‌కి ఎస్‌ఆర్ నాథన్ అందించారు. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతి నిర్మాణం పురోగతిని వివరించారు. భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఏలో కూడా బ్లాక్ చైన్‌ను పెద్దఎత్తున వినియోగిస్తున్నట్లు చెప్పారు. సింగపూర్ నుండి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
సింగపూర్ టూరిజం బోర్డు అధికారులతో భేటీ
సింగపూర్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్వర్డ్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. సింగపూర్‌లో టూరిజం అభివృద్ధికి తీసుకున్న చర్యలు, రా నున్న కాలంలో మరింతగా టూరిజం అభివృద్ధికి చే స్తున్న ప్రయత్నాలను ఎడ్వర్డ్ వివరించారు. టూరిజం అభివృద్ధిలో కీలకంగా ఉన్న హోటల్స్, క్రూజ్ సర్వీస్‌లు, ఇలా అందరికీ రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ ఏపీలో టూరిజం అభివృద్ధికి సింగపూర్ సహకరించాలన్నారు. సింగపూర్ పాలసీలను అధ్యయనం చేసి ఏపీలో టూరిజం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీ
సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ మినిస్టిర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధిలో జరుగుతున్న పనులను వివరించారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఈశ్వర్ అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఉన్న ఐల్యాండ్స్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంటేనే వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం అమరావతి పార్టనర్‌షిప్ ఆఫీస్ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సింగపూర్ కో ఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విభజకు ముందు ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. నాలుగేళ్లలో అనేక పాలసీలు, రాయితీలు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో తయారవుతున్న ఫోన్లలో 30 శాతం ఏపీలోనే తయారు అవుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక కంపెనీలు ప్రారంభించి, ఉత్పత్తులు చేస్తున్నాయని, త్వరలోనే మరిన్ని ప్రముఖ కంపెనీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి క్లస్టర్ మోడల్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ పార్క్స్ ఏర్పాటు చేయడంలో నైపుణ్యం ఉన్న సింగపూర్ ఏపీకి సహకారం అందించాలన్నారు.
పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం
సింగపూర్‌లో ఉన్న పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువన్నారు. కేవలం నాలుగేళ్లలోనే సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పేపర్ లెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నామన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ ప్రజలకు ప్రాథమిక హక్కుగా మారబోతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అనేక ప్రయత్నాలు అభివృద్ధి కోసం చేస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన అక్కడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
చిత్రం..సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయిన లోకేష్

రాష్ట్రాలంటే డబ్బులు సంపాదించే యంత్రాలు

0
0

విజయవాడ: రాష్ట్రాలను డబ్బులు సంపాదించే యంత్రాలుగానే కేంద్రం భావిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ కొత్తగా ఏర్పడినా మనుగడ ఉండదని స్పష్టం చేశారు. హైకోర్టు తరలింపులో కేంద్రం పద్ధతి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి బానిసలం కాదని హెచ్చరించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన సహజ వనరులు- జల వనరులు నిర్వహణపై శే్వతప్రతం విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాగా వెనుక బడిన జిల్లా అయిన కడపలో ఉక్కు కర్మాగారం పెట్టాలని తాము కోరామని తెలిపారు. తమ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళన చేశారని గుర్తు చేశారు. వివిధ రకాలుగా ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సహకరించమని కోరామన్నారు. భూమి, నీరు, తదితర అంశాలపై పన్ను మినహాయింపు ఇస్తామని, కేంద్రానికి వచ్చే పన్నులను వదులుకోవాలని కోరామన్నారు. అవసరమైతే జాయింట్ వెంచర్‌గా ఉక్కు కర్మాకారం ఏర్పాటు చేద్దామని సూచించానన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు వల్ల పన్నుల రూపంలో దాదాపు 900 కోట్ల రూపాయల మేర ఆదాయం కేంద్రానికి వస్తుందని తెలిపారు. దానిని వదులుకునేందుకు కేంద్రం సిద్ధపడలేదన్నారు. రాష్ట్రాలను కేంద్రం డబ్బులు సంపాదించే యంత్రాలుగానే చూస్తోందని విమర్శించారు. కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించేందుకు వీలుగా శంకుస్థాపన చేశామన్నారు. దీనికి కూడా ఏమి చేస్తుందో చూడాలన్నారు. తాము కేంద్రానికి బానిసలం కాదని స్పష్టం చేశారు. కేంద్రం బాధ్యతతో వ్యవహరించకపోవల్ల ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఓబులాపురం గనుల కేటాయింపు ఉత్తర్వుల్లో కాప్టివ్ అన్న పదం లేకుండా చేసి, చైనాకు ఎగుమతి చేయటం ద్వారా అప్పటి నేతలు దాదాపు రూ.30 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ లీ జును రద్దు చేసి, ఆ గనులను కడప ఉక్కు కర్మాగారానికి కేటాయించామన్నారు. ఈ కర్మాగారం ఏర్పాటుకు శ్రీకా రం చుట్టడంతో ఇప్పుడు బీజేపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే ఈ ఇబ్బందులు కొన్నిరోజులే ఉంటాయని, ఆ తరువాత ఉండవని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన దానిలో ఇంకా రూ.3500 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇంకా 35 వేల కోట్ల రూపాయలను కేంద్రం చెల్లించాల్సి ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండా ఏ ఫ్రంట్‌ను కొత్తగా ఏర్పాటు చేసినా, దానికి మనుగడ ఉండదన్నారు. దేశంలో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీతో ఫ్రంట్ ఏర్పాటు తప్పనసరి అన్నారు. సమాజ్‌వాదీ పార్టీనేత అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ఫ్రంట్‌కు అనుకూలంగా ఉన్నారన్న ప్రచారంపై వ్యాఖ్యానిస్తూ, అఖిలేష్, మాయావతి ఇద్దరూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, బీజేపీకి వ్యతిరేకం అంటే కాంగ్రెస్ దగ్గర అవడంగా అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్గమన్నారు. కేసీఆర్ చెబుతున్న బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ సాధ్యం కాదన్నారు. అఖిలేష్‌తో చర్చలు జరిపితే, అందులో చేరినట్లు కాదుగా అని ప్రశ్నించారు. ఈ విషయాలను నిశితంగా విశే్లషించుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు తరలింపుపై కేంద్రం పద్ధతి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కనీస గడువు, ముందస్తు సమచారం లేకుండా హైకోర్టు తరలిస్తే, ఎలా అని ప్రశ్నించారు. వారి ఇబ్బందులు తనకు తెలుసునని, వీలైనంత వరకూ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడలోని సీఎంవో లేదా ఆర్ అండ్ బి భవనంలో తాత్కాలికంగా కోర్టు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కాగ్ చెప్పినప్పటికీ, లోటు బడ్జెట్ కింద రూ.16 వేలు విడుదల చేయడంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసించారు. నిధులను పేదల పింఛన్లు, రైతుల సంక్షేమానికి బదలాయిస్తే, తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

పంట రుణాల పంపిణీకి ‘ధరణి’ అడ్డంకులు!

0
0

నిజామాబాద్, డిసెంబర్ 27: రైతులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా పంట రుణాలు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ అటు రైతులను, ఇటు బ్యాంకర్లను ముప్పతిప్పలు పెడుతోంది. ఈ వెబ్‌సైట్ సహాయంతో సకాలంలో రుణాలు పొందవచ్చని ఆశించిన రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారుతుండగా, ధరణి వినియోగం వల్ల సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయని భావించిన బ్యాంకర్లకు కూడా నిరాశే ఎదురవుతోంది. ధరణి వెబ్‌సైట్‌తో పంట రుణాల పంపిణీ ప్రక్రియను అనుసంధానించగా, ఈ వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడం వల్ల రుణ పంపిణీ లక్ష్యానికి విఘాతం ఏర్పడుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం నిన్నమొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో తీరిక లేకుండా ఉండడం, మునుముందు జరుగనున్న వరుస ఎన్నికలకు కసరత్తులు చేయాల్సి వస్తుండడంతో పంట రుణాల పంపిణీ అంశాన్ని సమీక్షించడం కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యకు పరిష్కారం చూపుతూ లక్ష్యాల సాధనకై తమకు ఎవరు సహాయం చేస్తారోనని బ్యాంకర్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తూ, రైతులకు సింగిల్ విండో పద్ధతిలో సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇతర కీలకమైన ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుని తమ సేవలను రైతులకు సులభతర పద్ధతిలో అందించాలన్నది ప్రభుత్వ అభిమతం. ఈ వెబ్‌సైట్‌ను గత కొద్ది మాసాల క్రితమే అధికారికంగా ప్రారంభించినప్పటికీ, ఇంకనూ అనేక సాంకేతిక సమస్యలు దూరంకాలేకపోతున్నాయి. ప్రధానంగా వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం, ఒకవేళ తెరుచుకున్నా అందులో భూ ప్రక్షాళనకు సంబంధించిన రికార్డుల వివరాలన్నీ పూర్తిస్థాయిలో అప్‌లోడ్ చేయబడి లేకపోవడంతో రైతులకు వ్యవసాయ రుణాలను అందించేందుకు బ్యాంకర్లకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ, ఇంకనూ ఇది బాలారిష్టాలను అధిగమించకుండా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేకపోతోందనే అభిప్రాయాలు అధికార వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా భూరికార్డుల నకళ్లు, ఇతర భూ సంబంధిత వివరాలు, రుణ లావాదేవీల చిట్టా, భూముల అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలను వెంటదివెంట తెలుసుకునేందుకు వీలుంటుంది.
కాగా, వ్యవసాయ రుణాల మంజూరుకు పాస్ పుస్తకాలను తనఖా పెట్టుకోవడం, పూచీకత్తులు తీసుకోవడం, పాస్ బుక్కులలో వివరాలను నిక్షిప్తం చేయడం వంటి వాటిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేస్తూ, ధరణి వెబ్‌సైట్ ద్వారా రైతుల అర్హతను పరిశీలించుకోవాలని సూచించింది. రైతులకు రుణాలు అందించేందుకు ఎలాంటి ఆంక్షలు విధించరాదని సర్కారు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ధరణి వెబ్‌సైట్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, ప్రభుత్వం జారీ చేసిన ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలు పాటించాల్సి ఉండడం వల్ల రుణాల పంపిణీలో జాప్యం కొనసాగుతోంది.

రాహుల్ ఆదేశిస్తే పార్లమెంటుకు పోటీ

0
0

నల్లగొండ రూరల్, డిసెంబర్ 27: భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డాక్డర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌లు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులని అట్టడుగు వర్గాల సంక్షేమంకోసం పోరాడిన మహానీయులని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నల్లగొండ మండలంలోని పెద్ద సూరారంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందు పరిచిన హక్కుల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన మార్గంలో నడుస్తూ ఆశయాల కోసం కృషి చేయాలని సూచించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటానని, తనకి పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లనే తాను కూడా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యానన్నారు. రాజకీయాల్లో నిలకడ అవసరమని పేర్కొన్నారు.

యాదాద్రి హుండీ ఆదాయం రూ.1.12కోట్లు

0
0

యాదగిరిగుట్ట, డిసెంబర్ 27: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 29రోజుల హుండీ ఆదాయం 1కోటి 12లక్షల 884రూపాయలు వచ్చిందని ఈవో గీత తెలిపారు. గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. బంగారం 134 గ్రాములు, వెండి 3కిలోల 800 గ్రాములు వచ్చిందని తెలిపారు.
ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ సేవలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని గురువారం తెలంగాణ ఆర్టీసీ ఎండి, ఐఏఎస్ సునీల్‌శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చక బృందం ఆశీర్వచనాలు, ఈవో గీత ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
చిత్రం..సునీల్‌శర్మ కుటుంబీకులకు ఆశీర్వచనం పలుకుతున్న అర్చకులు

కేటీఆర్ చేతిలోనే మేయర్ ఎంపిక బాధ్యత

0
0

వరంగల్, డిసెంబర్ 27: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. మేయర్ పదవితో పాటు 19వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు బల్దియా కమిషనర్ పీ.వీ. గౌతమ్ తెలిపారు. నన్నపునేని నరేందర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన తన మేయర్ పదవితో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా సమర్పించారు. తాజాగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఖాళీ కావడంతో ఆ పదవి కోసం అనేక మంది కార్పొరేటర్లు క్యూ కట్టారు. ఎవ్వరికి వారు వారి వారి గాడ్ ఫాదర్ల ద్వారా కీలకమైన వరంగల్ మొదటి పౌరుడి పదవి కోసం ప్రయ్నతాలు చేస్తున్నారు. ఇప్పటికే మేయర్ రేసులో పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. వద్దిరాజు గణేష్‌తో పాటు గుండా ప్రకాష్‌రావు, నల్లా స్వరూపరాణిరెడ్డి, డిప్యూటీ మేయర్ సిరాజుద్దిన్‌కూడా ఉన్నారు. గుండా ప్రకాష్‌రావు సీనియర్ నాయకుడు కావడంతో తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. అదే విధంగా వద్దిరాజు గణేష్ కూడా కార్పొరేషన్ ఎన్నికల ముందే మేయర్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అండదండలు ఆయనకు ఉన్నాయి. బ్రహ్మణ లాబీయింగ్‌తో తనకు మేయర్ పదవి వస్తుందన్నా ధీమాలో ఉన్నారు. అదే విధంగా నల్ల స్వరూప రాణి రెడ్డి మహిళా కోటా నుండి మేయర్ పదవి ఆశిస్తుండగా ఈమెకు కేటీఆర్ అండదండలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైనార్టీ కోటా నుండి డిప్యూటీ మేయర్ సిరాజుద్దిన్ కూడా తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అయితే మేయర్ పదవి కీలకం కావడంతో అధిష్టానం ఈ విషయంలో ఆచితూచీ నిర్ణయం తీసుకోనుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మేయర్ ఎంపిక విషయంలో అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోనుంది. మెజార్టీ కార్పొరేటర్లు వరంగల్ తూర్పు, పశ్చిమ నుండే ఉన్నారు.
అయితే, వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మాత్రం వారి పరిధిలో లేని కార్పొరేటర్లనే మేయర్‌గా కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి కీలకం కావడంతో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరంగా ఇబ్బంది ఉంటుందని ఉద్దేశంతో మేయర్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. అయితే టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఎవరిని నామినెట్ చేస్తే వారికే మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉండడంతో మేయర్ బంతి కేటీఆర్ చేతిలోనే ఉంది. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
చిత్రం.. నన్నపునేని నరేందర్


సం‘గ్రామం’లో సాంకేతిక విప్లవం!

0
0

ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేసి, పనిభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈసారి పల్లె పల్లెకు సాంకేతికతను జోడించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల ఎన్నికలకు సన్నాహాలు సాగుతుండగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని 3,146 పంచాయతీల్లో సాంకేతికతను జోడించేలా ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం గమనార్హం. బ్యాలెట్ ద్వారానే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా.. పోలింగ్ చీటి నుండి నామినేషన్ల ఘట్టం వరకు ప్రతీది ఆన్‌లైన్‌లోనే నమోదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారో..? వారి అర్హతలు, నేర చరిత్ర తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా ప్రభుత్వం సన్నాహాలు సాగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ‘టిఈపోల్’ వెబ్‌సైట్‌లో ప్రతి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా ఎన్నికలను స్వేచ్చగా, పారదర్శకంగా నిర్వహించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం వెబ్‌పోర్టల్ వినియోగంపై జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు రాష్ట్ర రాజధానిలోనూ శిక్షణ కల్పించారు. టీఈపోల్ వెబ్‌పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ఎంపిడీవోలకు ప్రత్యేక పాస్‌వర్డ్‌లు కేటాయించడం గమనార్హం. గ్రామపంచాయతీలు, వార్డుల ఎన్నికలకు సంబంధించి ఎంపీడీవోలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పనిభారాన్ని తగ్గించేందుకు ఈ ప్రక్రియ సులభతరమవుతందని భావిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు పాత పంచాయతీల నుండి తొలగించి వేరు చేసిన పంచాయతీ వార్డులను, ఓటర్ల జాబితాను విభజించి పూర్తిగా అంతర్జాలంలో నమోదు చేయడం గమనార్హం. ఓటరు జాబితాను టీఈపోల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఓటర్లు తమ ఓటరు చీటీలను సైతం ఇదే వెబ్‌సైట్ నుండి తీసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్ ఉపయోగపడనుంది.
అభ్యర్థుల నేర చరిత్రపై అఫిడవిట్ తప్పనిసరి..
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ పోరుకు సిద్దపడే అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించి అఫిడవిట్ బహిర్గతం చేయాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను బహిర్గతం చేయాల్సి ఉంటుందని, ఇందులో పోలీసు కేసుల వివరాలు, సెక్షన్లు పొందుపర్చాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీకయ్యే ఖర్చులు కూడా అభ్యర్థులు ఎన్నికల వ్యయంలో చూపించాల్సి ఉంటుంది. తమ బ్యాంకు ఖాతాల ద్వారానే ఖర్చుల వివరాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన లావాదేవీలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. 5వేల పైన జనాభా ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థులు రూ.2లక్షల లోపు ఖర్చుచేయాల్సి ఉంటుంది. గ్రామ సర్పంచ్ బ్యాలెట్ పత్రాన్ని గులాబి రంగులో, వార్డు స్థానాల బ్యాలెట్ తెలుపు రంగులో ముద్రిస్తున్నారు. బ్యాలెట్ బాక్స్‌ల కొరత లేకుండా అన్ని మండలాలకు సామాగ్రి ఇప్పటికే తరలిపోగా జనవరి మొదటివారంలో తొలి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు పంచాయతీ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 1508 గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణ, బందోబస్తు ఎన్నికల కమిషన్‌కు సవాళ్ళను రేపుతుండగా తొలిసారి చేపడుతున్న సాంకేతిక సంస్కరణలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
చిత్రం..టిఈ పోల్ వెబ్ పోర్టల్

సైనిక లాంఛనాలతో హవల్దార్ అంతిమ సంస్కారం

0
0

కౌటాల, డిసెంబర్ 27: ఈనెల 24 వతేదీ రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎదురు కాల్పులలో మృతి చెందిన హవల్దార్ రాజేష్ దాక్వా (15319305ఏ) అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం అయిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో ముగిశాయి. సైనిక లాంఛనాల నడుమ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిదులు హాజరైన అంత్యక్రియల్లో ఆయన పనిచేసే బీహార్, నాలుగు ఆర్‌ఆర్ రెజిమెంట్ నాయక్ సుబేదార్, లాలన్ సింగ్ నేతృత్వంలో మరో ముఖ్య అధికారి 60 మంది జవాన్‌లతో కలిసి సైనిక పద్దతిలో హవల్దార్ రాజేష్‌కు అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. రాజేష్ కుమార్తెలు ఖుషి, రోషిణి కాందిశీకుల సంప్రదాయానికి అనుగుణంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించి చితికి నిప్పు అంటించారు. ముక్కు పచ్చలారని చిన్నారుల రోదనతో పాటు హవల్దార్ తల్లి లతిక, భార్య జయతో పాటు ఇతర కుటుంబీకుల ఆర్తనాదాలు, రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.
సమీప గ్రామాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి హవల్దార్‌కు నివాళులు అర్పించేందుకు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు తోపాటు అధికారులు, అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు.
చిత్రాలు.. రోధిస్తున్న సతీమణి * హవల్దార్ భౌతిక కాయాన్ని మోసుకొస్తున్న సైనికులు
*గాలిలోకి తుపాకులు పేల్చి తుదివీడ్కోలు పలుకుతున్న దృశ్యం

‘ఎడారి’ మంటల్లో ఎన్ని వెతలో!

0
0

కరీంనగర్, డిసెంబర్ 27: దినసరి కూలీ గగనమవుతున్న నేటి రోజుల్లో వలస వెళ్లైనా నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే ఆశతో వెళ్తున్న అబలలను ‘ఎడారి’ మంటలు చుట్టుముడుతున్నాయి. తృణమో, ఫణమో సంపాదించుకుందామనే ఉద్ధేశంతో ఉన్న ఊరిని కన్న వారిని వదిలి వెళ్లిన వారి ఆశలు ఏజెంట్ల నిర్వాకంతో అడియాశలవుతున్నాయి. విదేశాల్లో వంట మనుషులుగా ఉపాధి చూపిస్తామని నమ్మబలుకుతూ మహిళల అక్రమ రవాణాతో ఇక్కడి ఏజెంట్లు కోట్లు గడిస్తుండగా, అక్కడ అబలలు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిసింది. ఇటీవల పలువురు ఏజెంట్ల మాయ మాటలు నమ్మి ఉపాధికోసం గల్ఫ్‌బాట పట్టిన మహిళలు దళారుల మాయ మాటలు నమ్మి నరకయాతన అనుభవిస్తున్న వైనాన్ని కొందరు తమ బంధువులకు ఫోన్ చేసి బోరున విలపిస్తున్న వైనాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సోసైటి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా ఈ వ్యవహారంపై రాష్టప్రతి, ప్రధాని, ఇండియన్ ఎంబసీ, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేట్ అదికారి (పిజి), ఎన్‌ఆర్‌ఐ సెల్‌లకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మహిళలు సఖీనా, బోర్న అనురాధ, సూర్య కుమారి, రత్నలతో పాటు కొందరు మహిళలకు ఏజెంట్లు వంట మనుషులుగా ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి విదేశాలకు పంపించిన వ్యవహారంపై భారత రాష్టప్రతి వరకు తీసుకెళ్లడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో మహిళలను కొందరు ఏజెంట్లు వంచించి విదేశాలకు పంపించిన వైనాలు వెలుగు చూస్తున్నాయి. విదేశాల్లో రోజుకు 18 గంటలు పని చేయించుకుంటూ కనీసం కడుపునిండా తిండి కూడా పెట్టకుండా వేదింపుకు గురి చేస్తున్నారని పలువురు మహిళలు బోరునవిలపిస్తూ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో వెల్లడించారు. ఎంప్లాయిమెంట్ వీసాగా నమ్మించి విజిట్ వీజాలో మహిళలను విదేశాలకు పంపిస్తూ ఇక్కడి ఏజెంట్లు కోట్లు గడిస్తూ మహిళల జీవితాలతో చెలగాటమాడుకుంటుండగా అక్కడ ఇక్కడి మహిళలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1500 మంది మహిళలు అరబ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్నట్లు రాష్టప్రతి, ప్రధానికి రాసిన లేఖలో చాంద్ పాషా పేర్కొన్నారు. ఇందులో భర్తలు చనిపోయిన వారు కొందరైతే, పిల్లల పెళ్లిల్లు, చదువుల కోసం ఎంతో కొంత సంపాదించవచ్చనే సమాలోచనతో విదేశాలకు వెళ్లిన మహిళలు మరికొందరు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి బుర్ర అనురాధను విజిట్ వీసాపై ఇక్కడి గల్ఫ్ ఏజెంట్ మస్కట్‌కు పంపించాడు. ఇదేవిధంగా సూర్యకుమారి, రత్న, లక్ష్మికుమార్, సఖీనా, రాజమ్మలతోపాటు పలువురు మహిళలకు కూడా రూ.30 వేల జీతం, భోజన వసతి, 7 గంటలే పనిదినం ఉంటుందని చెప్పి పంపించగా, 15 నుంచి 18 గంటల పాటు పనిచేస్తే వారికి నచ్చినంత జీతం ఇచ్చేవారని వెల్లడించారు. చెప్పిన మాట వినకపోతే శారీరకంగా, మానసికంగా హింసించేవారని, వీసా ప్రకారం పనిచేసిన తరువాత బయటపడిన కొందరు పై విషయాల్ని కూడా వెల్లడిస్తున్నారు. మస్కట్‌లో ఇండియన్ ఎంబసీకి, ఇంటర్ పోల్ పోలీసులకు సమాచారం అందించినా పెద్దగా స్పందన లే కపోవడంతో భారత రాష్టప్రతికి, ప్రధానిల దృష్టికి కూడా తీసుకెళ్లానని చాంద్ పాషా తెలిపారు. నమ్మించిన నయ వంచనకు గురి చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర డీజీపి సంబంధిత పోలీస్ అధికారులను కూడా ఆదేశించినట్లు చాంద్ పాషా వెల్లడించారు. ఏజెంట్ల మాయ మాటలు నమ్మి విదేశాలకు వెళ్లి తమలాగా నరక యాతనను ఏ మహిళలు అనుభవించవద్దని, ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలు, మాలాగా ఇంకా ఏ ఇతర మహిళలకు రాకూడదని, గల్ఫ్ వెల్ఫేర్ సోసైటీ రాష్ట్ర అద్యక్షుడు చాంద్ పాషా పోరాటాల ఫలితంగా విదేశాలలోని అష్ట కష్టాల నుంచి బయటపడిన పలువురు మహిళలు కూడా తమ బాధను వెల్లగక్కారు. తమ స్నేహితుల మాటలు కూడా నమ్మి మోసపోయిన వారు కొందరు ఉన్నారని, షేక్ షకీలా గల్ఫ్‌లో పడిన బాధలను వివరించారు. విదేశాల్లో నెలకు రూ.12 వేల రియాల్ సంపాదించవచ్చని, షకీనాకు స్నేహితులు చెప్పగా ముంబాయిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీకి రూ.50 వేలు చెల్లించి మెడికల్ రిపోర్ట్ టికెట్, వీసా పూర్తి చేయించి సౌదీకి పంపించగా, అక్కడ అరబ్ షేక్‌ల ఇండ్లలోపని మనిషిగా చేయించుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసించేవారని, ఈ విషయాన్ని చాంద్ పాషా దృష్టికి తీసుకెళ్లగా, భారత రాయబారి కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగి తెప్పించాలని షకీనా వెల్లడించారు. ఇదేవిధంగా తమతో పాటు ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది మహిళలు ఇక్కడ మోసపోయి విదేశాల్లో గోసపడుతూనే ఉన్నారని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలందరినీ స్వదేశానికి రప్పించేందుకు కృషి చేయాలని రాష్టప్రతి, ప్రధాని, ఎంబసీకి విజ్ఞప్తి చేశారు.

చిత్రాలు.. అరబ్ షేక్‌ల వేధింపులతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న మహిళ
*గల్ఫ్‌లో అబలలు అనుభవించిన బాధలను తెలుసుకుంటున్న చాంద్ పాషా, అమెరికా రిసెర్చ్‌స్కాలర్ అమోదీ మాలియా

కార్యదర్శుల నియామకం.. కంచికేనా?

0
0

కరీంనగర్, డిసెంబర్ 27: ఏళ్ళ తరబడి కుంటుపడిన పల్లెసీమల అభివృద్ధికోసం చేపట్టిన పంచాయితీ కార్యదర్శులు నియామకం కథ కంచికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా యుద్ధ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు, హైకోర్టు ఉత్తర్వులతోనియామక పత్రాలు అందజేయలేదు. కోర్టు ఆదేశించే వరకు నిలిపేయాలంటూ ఉత్తర్వులు వెలువడటంతో, ఆఫైలును అధికారులు సందూకులో దాచి తాళాలేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఇప్పట్లో కార్యదర్శుల నియామకం కలగా మారబోతుండగా,రాబోయే ఎన్నికల్లో గ్రామాల్లో ఏర్పాట్లు చేయటంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. మరోవైపు పంచాయితీ ఎన్నికలు ముంచుకొస్తుండగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంపై అధికారులు తర్జన భర్జన పడుతుండగా, ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. పల్లెల అభివృద్ధికి పట్టుగొమ్మలైన గ్రామకార్యదర్శుల కొరత గత కొంతకాలంగా తీవ్రంగా ఉంది. 1:4 పద్ధతిన కార్యదర్శులు గ్రామాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ, నెట్టుకొస్తున్నారు. అయితే, పెరిగిన అవసరాల రీత్యా వారిపై పనిభారం అధికమవుతుండగా, అదనపు బాధ్యతలపై వారు చేతులెత్తేస్తున్నారు. దీంతోగ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారుతుండటంతో, పంచాయితీ కార్యదర్శుల నియామకంపై దృష్టిసారించిన ప్రభుత్వం, ఎట్టకేలకు గత ఆగస్టు మాసంలోనియామకాల ప్రక్రియకు తెరలేపింది. అక్టోబర్‌లో అర్హత పరీక్ష నిర్వహించింది. ఫలితాలు వెల్లడించే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావటంతోనిలిచిపోయాయి. అయితే, ఈనియామకాలపై సీ ఎం కేసీ ఆర్ పట్టుదలతో ఉండగా, ఈనెల 17న ఫలితాలు విడుదల చేశారు. 19 నుంచి 21వరకు దృవీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి, నియామక ఉత్తర్వులు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈతరుణంలోకొంతమంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు, ఫలితాల ప్రకటనలోప్రభుత్వం అనుసరించిన విధానం, వెరసి తాము తీవ్రంగా నష్టపోయామంటూ కోర్టుకు విన్నవించారు. దీంతోతీవ్రంగా స్పందించిన న్యాయస్థానం నియామక ఉత్తర్వులు నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈప్రక్రియ స్థంభించగా, ఇటు ప్రభుత్వం అటు అభ్యర్థులు ఎటు పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో వారం రోజులైతే స్థానిక కోడ్ కూసే అవకాశాలుండగా, పంచాయితీ సమరం ముగియగానే సహాకార ఎన్నికలు, అనంతరం స్థానిక సంస్థలు అవి పూర్తికాగానే మున్సిపల్, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఇలా వరుసగా జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇపుడు కాకపోతే మరో ఆరు నెలల పాటు కొత్తకార్యదర్శుల నియామకం వాయిదా తథ్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎంసీహెచ్‌లో కంప్యూటర్ సేవలు

0
0

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 27: జిల్లాకేంద్రంలోని మాతా,శిశు ఆస్పత్రిలో త్వరలోనే కంప్యూటర్ సేవలతోరోగులకు వైద్యం అందబోతుంది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు ఆన్‌లైన్ చేసి, కంప్యూటరీకరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు అనుమతులతో పాటు నిధుల విడుదల కోసం వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటికి అమోదముద్ర పడగానే యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు సన్నాహాలు సైతం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే, ఎంసిహెచ్‌లో చికిత్స పొందే మాతా,శిశువులకు మరింత సత్వర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి, ప్రసూతి కోసం వచ్చే గర్భిణీల తాకిడి మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే జంట నగరాలు మినహా మిగతా తెలంగాణలో ప్రసూతి సేవల్లో జిల్లాకేంద్రంలోని ఎంసిహెచ్ మొదటిస్థానంలో ఉంది. సగటున నెలకు 800 కేసులు విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం సంగారెడ్డి, మహాబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాకేంద్రాల్లోని మాతా,శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. భవిష్యత్‌లో నెలకు 1000 ప్రసూతిలే లక్ష్యంగా స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మరింత త్వరితగతిన మెరుగైన వైద్య సేవలందించేందుకు ఆస్పత్రిని ఆన్‌లైన్ చేస్తూ, కంప్యూటరీకరించేందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌లోని గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్ చేయటంతో రోగులకు విజయవంతంగా సత్వర వైద్య సేవలందుతున్నాయి. రోగుల పూర్తి వివరాలు సేకరించి, కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి, ఆన్‌లైన్‌లో పెట్టడంతోమిగతా విభాగాల్లో రోగుల వివరాలు తెల్సుకోవటంలో ఇబ్బందులు తప్పి, వారికి సత్వరమే వైద్య సేవలందించే అవకాశాలు మెరుగుపడుతుండటంతో, ఈ విధానం నగరంలోని ఎంసిహెచ్‌లో కూడా అమలు పర్చేందుకు జిల్లా అధికారులు అసక్తి కనబరుస్తున్నారు. అనుమతులు రాగానే ఆన్‌లైన్ కోసం అవసరమైన 32కంప్యూటర్‌లతో పాటు మిగతా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంసిహెచ్ కార్యనిర్వహణాధికారి డా.అలీం తెలిపారు. ఔట్ పేషెంట్ విభాగం నుంచి మొదలయ్యే కంప్యూటరీకరణ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, ల్యాబ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, హెచ్‌ఐవి కౌనె్సలింగ్, ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎన్‌హెచ్‌ఎం కార్యాలయం, కార్యనిర్వాహక కార్యాలయం, రెండు మెటర్నిటీ వార్డులు, ఎఎంసీ వార్డు, ఐపివో వార్డు, ఎస్‌ఎన్‌సి, కేసీఆర్ కిట్, ఇమ్యునైజేషన్ వార్డుతో పాటు ఫార్మసీలో కూడా కంప్యూటర్లతో అనుసంధానం చేసి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఏవో వెల్లడించారు. రోజురోజుకు ప్రసూతి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిపై రూ.6.25కోట్లతో మరో 50 పడకల కోసం భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూరె్తై, కంప్యూటర్ సేవలు ఆరంభిస్తే ప్రసూతి కేసుల తాకిడి భారీగా పెరిగే అవకాశాలున్నాయి.

Viewing all 69482 articles
Browse latest View live