న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితోనే హైకోర్టును కూ డా సాధించుకున్నామని టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు వినోద్కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉమ్మ డి హైకోర్టు విభజనకోసం పార్లమెంట్ లోపల, వెలుపల తమ పార్టీ చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. తెలంగాణలో హైకోర్టు ఏర్పాటు వల్ల రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మరింత పటిష్టపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు మూలంగా జిల్లాల్లోనూ కోర్టులు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులకు వినోద్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడుతున్నారని ఆయన అన్నారు.
రైల్వే బోర్డు చైర్మన్తో భేటీ
తెలంగాణలో పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్కు టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైల్వే బోర్డు చైర్మన్గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన వినోద్ యాదవ్ను వినోద్ కుమార్ రైల్వే భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎంగా బాధ్యతలు నిర్వహించిన వినోద్ యాదవ్కు పెండింగ్ అంశాలపై అవగాహన ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే బోర్టు చైర్మన్గా నియమితులయ్యారని, తెలంగాణలో పెండింగ్ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు వినోద్ తెలిపారు.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర సమాజిక న్యాయ శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్కు తెలంగాణ దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రమణీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, టీ.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షుడు గడ్డం యాదయ్య మాదిగ తదితరులు మంగళవారం తావర్ చంద్ గెహ్లట్ను కలిశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.
చిత్రం.. ఎంపీ వినోద్