Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

$
0
0

భద్రాచలం టౌన్, జనవరి 10: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఎదగాలని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి పేర్కొన్నారు. తెలంగాణ రాష్టస్థ్రాయి గిరిజన క్రీడోత్సవాలు భద్రాచలంలో గురువారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీవో హాజరయ్యారు. గిరికూనలు చదువుతూ ఆటలాడుతూ తమ భవిష్యత్‌కు మంచి మార్గాన్ని వేసుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను ప్రోత్సహించి రాష్టస్థ్రాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి వచ్చిన గిరిజన బాలబాలికలు మూడురోజులు పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. అన్ని క్రీడల్లో తమ సత్తా చాటుకొని బహుమతులు సొంతం చేసుకున్నారని అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు అదనంగా క్రీడల్లో పాల్గొంటున్నారని, దీనివల్ల వారిలో మానసిక ఉల్లాసంతో పాటు చురుకుతనం పెరుగుతుందన్నారు. గిరిజన క్రీడోత్సవాలు తొలిసారి భద్రాచలంలో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బెన్‌హర్ మహేష్‌దత్ ఎక్కా, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చెంగ్తోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి మేటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు కావడానికి ఇదొక చక్కటి అవకాశంగా విద్యార్థులు తీసుకోవాలన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్టస్థ్రాయి పోటీలు ఇంత ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన గిరిజన సంక్షేమశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లలో పాలుపంచుకున్న గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, పోలీసుశాఖలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కాగా ఈ పోటీల్లో ఓవరాల్ చాంఫియన్‌షిప్‌గా భద్రాచలం నిలిచింది. ద్వితీయస్థానంలో ఏటూరునాగారం, ఊట్నూరు తృతీయస్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ రామ్మూర్తి, తెలంగాణ రాష్ట్ర క్రీడల నిర్వహణ అధికారి వి.జ్యోతి, జిల్లా క్రీడల అధికారి పుట్టా శంకరయ్య, ఏపీవో జనరల్ నాగోరావు, అసిఫాబాద్ ఏటీడీవో శ్రీనివాస్, ఏటూరునాగారం డీటీడీవో ఎర్రయ్య, ఏటూరునాగారం డిప్యూటీ డీఈవో నర్సింహా, సంబంధిత ఏటీడీవోలు జహీరుద్దీన్, లక్ష్మణ్‌బాబు, సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.


ప్రజల కోసం బతికిన నేత రఘు

$
0
0

ఖమ్మం(కల్చరల్), జనవరి 10: స్వార్థంతో ఎవరికి వారే జీవిస్తున్న ఈ రోజుల్లో తన ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నేత ఏలూరి రఘు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సిపిఎం టూటౌన్ మండల కమిటి సభ్యుడు, ఖమ్మం డివిజన్ నాయకులు కామ్రేడ్ ఏలూరి రఘు సంతాపసభ ఆపార్టీ టూటౌన్ కార్యదర్శి వై విక్రమ్ అధ్యక్షతన స్ధానిక హరిత గార్డెన్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రఘు పార్టీ కార్యకర్తగానే కాకుండా వారి కుటుంబం వ్యక్తిగతంగా తనతో సన్నిహితంగా ఉండేదని తెలిపారు. మనిషి పుట్టుక, మరణిచడం అనేది చిన్న విషయమని, ఏ మనిషైనా బ్రతికున్నంత కాలం ఎలా బ్రతికాడన్నదే ముఖ్యమని, కొద్దిమంది మాత్రమే ప్రజలకోసం బ్రతుకుతారని అలాంటి వారిలో రఘు ఒకడని కొనియాడారు. డబ్బుకోసం గడ్డికరిచే ఈ రోజుల్లో ఎర్రజెండాతోనే చివరిదాకా నడిచిన యోధుడు రఘు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అజరామరమైందని, రఘు కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంలోనే గడిపిందని, ఆకుటుంబం ఖమ్మం జిల్లాలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. రఘు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ రఘు మరణంతో యావత్ పార్టీ యంత్రాంగం ఒక కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిందన్నారు. రఘు పార్టీకోసం, ప్రజలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశాడని ఆయన తెలిపారు. పాల్వంచలో విద్యార్ధి దశ నుండే విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవాడని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పార్టీ అభవృద్ధికోసం నిబద్దతగా పనిచేశాడని తెలిపారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ సిద్ధాంతంకోసం సమాజ మార్పుకోసం నిర్మొహమాటంగా తాను నమ్మిన సిద్దాంతంకోసం ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడన్నారు. రాష్ట్ర కమిటి సభ్యుడు పి సోమయ్య మాట్లాడుతూ రఘు తండ్రి ఖమ్మం జిల్లా కమ్యునిస్టు ఉద్యమ నిర్మాణంలో ఒకరని, అలాంటి తండ్రి ఆశయ సాధనకోసం కడదాకా పేద ప్రజలకోసం పనిచేసిన ఉద్యమనేత రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నవతెలంగాణ ఎడిషన్ మేనేజర్ ఎం సుబ్బారావు, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ జిల్లా నాయకులు వినయ్, టిడిపి రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబిస్వర్ణకుమారి, టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి, మాజీ ఎంపి మిడియం బాబురావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ముందుగా రఘు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంక్రాంతికి 648 ప్రత్యేక బస్సులు

$
0
0

ఖానాపురంహవేలి, జనవరి 10: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ నెల 14వరకు 648 ప్రత్యేక బస్ సర్వీస్‌లను ఏర్పాటుచేసినట్లు ఆర్‌టిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్‌ఎం జివియస్ కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్ సర్వీస్‌లలో 315 రిజర్వేషన్ బస్‌లు, మరో 333 నాన్ రిజర్వేషన్ బస్‌సర్వీలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రత్యేక బస్‌లకు 50శాతం అధనపు చార్జీలుంటాయన్నారు. అంతేకాక ఖమ్మం నుండి హైదరాబాద్‌కు ఈ నెల 15నుండి 20వరకు 615 ప్రత్యేక బస్ సర్వీస్‌లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదిన 181 బస్‌లు, 12న 161, 13న 135, 14న 90 ప్రత్యేక బస్‌లను హైదరాబాద్‌నుండి ఖమ్మంకు నడపడం జరుగుతుందన్నారు. ఖమ్మం డిపో నుండి 158 బస్‌లు, మధిర నుండి 83, సత్తుపల్లి నుండి 128, భద్రాచలం నుండి 104, కొత్తగూడెం నుండి 89, మణుగూరు నుండి 86 ప్రత్యేక బస్‌లను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. 15న హైదరాబాద్‌కు 80 బస్‌లు, 16న 135, 17న 135, 18న 80, 19న 80, 20న 105 ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్‌ఎం తెలిపారు.

ఇక రెండవ దశకు నేడు శ్రీకారం

$
0
0

ఖమ్మం, జనవరి 10: గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలిదశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే రెండవ దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కానున్నది. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి మండలాల పరిధిలోని 204గ్రామ పంచాయతీలకు ఈ నెల 11వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి 14వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే అపీల్ చేసుకునేందుకు 15వ తేదీ వరకు గడువు విధించారు. వాటిని 16వ తేదీన పరిష్కరించి ఉప సంహరణకు 17వ తేదీ వరగు గడువు విధించారు. అదే రోజున పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులు జరపనున్నారు. ఈ నెల 25వ తేదీన 204గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు, 1862వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1862పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 1862మంది ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించారు. నాలుగువేల మంది పోలింగ్ సిబ్బందిని రెండవ దశలో వినియోగించుకోనున్నారు.
ఇదిలా ఉండగా రెండవ దశలో ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోనూ ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీకి పరాభవం ఎదురైంది. రెండవ దశలో ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఐదు మండలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉండగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించగా మిగిలిన రెండు మండలాలు వైరా నియోజకవర్గంలో ఉండగా అక్కడ మాత్రం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికలు అయిన తరువాత స్వతంత్ర అభ్యర్థి అధికార టిఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌తో ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వర్గీయుల మధ్య ఉన్న విభేదాలు నియోజకవర్గంలో పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. అయితే రాష్ట్ర మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయా మండలాల పరిధిలోని నేతలతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించి సాధారణ ఎన్నికల్లో జరిగిన ఓటమికి పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. అయితే దీనిపై నాయకులు మాత్రం పెద్దగా స్పందించకపోగా ఆయా గ్రామాల్లో తమ అభ్యర్థి గెలిచేలా ఏ పార్టీతోనేనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నేతలు వార్డులు, ఉప సర్పంచ్‌లు ఎవరు గెలిచినా సర్పంచ్ మాత్రం టిఆర్‌ఎస్ నేత మాత్రమే అయి ఉండాలని దిశా, నిర్దేశం చేయడంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు.

సర్పంచ్‌కు 1952, వార్డులకు 8419
* 15చోట్ల ఒకే నామినేషన్

ఖమ్మం, జనవరి 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లను గురువారం పరిశీలించిన అధికారులు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 13మండలాల పరిధిలో 362సర్పంచ్ పదవులకు 1952మంది, 3270వార్డులకు 8419మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే 15గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వారంతా ఎకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. చర్ల మండలంలోని పెద్దిపల్లి, అశ్వాపురం మండలంలోని నెల్లిపాక, మణుబోతులగూడెం, దుమ్ముగూడెం మండలంలోని అచ్చుతాపురం, కోయ నర్సాపురం, పెద్ద కమలాపురం, తిరుమలాయపాలెం మండలంలోని సోలీపురం, కామేపల్లి మండలంలోని పాతలింగాల, తాళ్ళగూడెం, లాల్యాతండా, నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, తిరుమలాపురం, మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అవి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధిక స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులతో మాట్లాడుతూ ఏకగ్రీవం చేయడం ద్వారా జరిగే లబ్ధిని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా మొదటి దశ ఎన్నికలు జరిగే మండలాల్లో దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

==================================================
మండలం సర్పంచ్ వార్డు
====================================================

నేలకొండపల్లి 174 699
ఖమ్మం రూరల్ 159 745
కూసుమంచి 293 906
తిరుమలాయపాలెం 244 964
కామేపల్లి 100 532
ముదిగొండ 155 718
ముల్కలపల్లి 95 433
మణుగూరు 62 416
చర్ల 128 543
అశ్వాపురం 105 531
బూర్గంపాడు 104 476
దుమ్ముగూడెం 144 710
పాల్వంచ 169 746

========================
మొత్తం 1952 8419
==================================================

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

$
0
0

ఖమ్మం రూరల్, జనవరి 10: స్థానిక బైపాస్‌రోడ్‌లోని కరుణగిరి టిఎన్‌జివోస్ కాలనీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామన్నపేటకు చెందిన ఇద్దరు సుతారి కూలీలు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రామన్నపేటకు చెందిన యాకూబ్ (26), చంద్రగాని శ్రీకాంత్ (25)లు మండలంలోని సాయి గణేష్‌నగర్‌లో సుతారి పనిచేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదేసమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొని వారి తలపై భాగం నుండి వెళ్లడంతో మెదడు ఛిద్రమై ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. యాకూబ్‌కు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. మృతునికి భార్య, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మృతుడు శ్రీకాంత్‌కు భార్య, ఆరు నెలల బిడ్డ ఉన్నారు. వీరిద్దరు ఒక్క కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటారు. ఇద్దరు మిత్రులు మృతి చెందడంతో రామన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తలు చిన్న వయస్సులోనే మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలకు దిక్కులేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురికీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల రోదనలు ప్రతి ఒక్కరిని కంఠతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి మృతుల భౌతిక కాయాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పొత్తులకు పెద్దపీట

$
0
0

చెన్నై: బీజేపీ కొత్త, పాత స్నేహితులను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తోందని, వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలను కలుపుకుని పోటీచ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. తమిళనాడులో బీజేపీని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో ప్రధాని వాజపేయి చేసి చూపించారన్నారు. మిత్రపక్షాలకు బీజేపీ తలుపులు తెరిచి ఉంటాయన్నారు.
భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన చరిత్ర దివంగత మాజీ ప్రధాని వాజపేయిదేనన్నారు. వాజపేయి ఆధ్వర్యంలో సంకీర్ణప్రభుత్వాలు బాగా నడిచాయన్నారు. ఈ విషయంలో బీజేపీకి వాజపేయి మార్గం శిరోధార్యమన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియచేయాలని కోరారు. డీఎంకే లేదా ఎఐడిఎంకే లేదా రజనీకాంత్ పెట్టనున్న కొత్త పార్టీనా ఏదైతే బాగుంటుందో తెలియచేయాలన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ డీఎండీకే, పీఎంకే, వైకో ఆధ్వర్యంలో ఎండీఎంకే తదితర పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈ పార్టీలన్నీ బీజేపీకి దూరమయ్యాయి. ఈ పొత్తు వల్ల బీజేపీ ఒక సీటు, పీఎంకే ఒక సీటు గెలుచుకున్నాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తగినన్ని సీట్లు గెలిచినా, మిత్ర పక్షాలను కలుపుకుని పోతోందన్నారు. ప్రాంతీయ పార్టీలను అవమానపరచడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ ఎప్పుడూ చిన్న చూపుచూసిందన్నారు. సామాన్యప్రజలతో సంబంధాలు కలిగి ఉండడమే అతి పెద్ద బలమైన కూటమి అన్నారు. బీజేపీ నాలుగేళ్ల పాలనలో చేపట్టిన విజయాలను వివరించారు. కార్యకర్తలు జనంలోకి ప్రభుత్వ సంక్షేమ విధానాలను చెప్పాలన్నారు. రైతుల సంక్షేమం నుంచి విద్య, వైద్య రంగం వరకు తీసుకున్న చర్యలను వివరించారు. బీజేపీ సంక్షేమ రంగంలో ముందంజలో ఉందన్నారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు అనే లక్ష్యంతో ముందుకుపోతోందన్నారు. ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా బీజేపీ అవతరించనుందన్నారు. దేశ భద్రతలో రాజీలేదన్నారు. సమగ్రత, అభివృద్థి నినాదాలతో బీజేపీ ప్రజలకు చేరువైందన్నారు. అరక్కోణం, కడలూరు, కృష్ణగిరి, ఏరోడ్, కడలూరు, ధర్మపురి నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ జీఎం

$
0
0

మహబూబాబాద్, జనవరి 10: మహబూబాబాద్ జిల్లాకేంద్రంపై మరోసారి ఏసీబీ అధికారులు వల విసిరారు. ఈసారి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వేముల వీరేశం రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మానుకోటలోని పెద్దవంగర మండలం మేట్యతండా శివారు ఈక్యతండాకు చెందిన గిరిజన రైతు దారావత్ భగ్న 2017లో సబ్సిడిపై వరి కోత యంత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2018లో అతనికి వరి కోత యంత్రం మంజూరైంది. గిరిజన రైతుకు రావాల్సిన సబ్సిడీ నగదు రావడంలో మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ నగదు కోసం అనేకమార్లు భగ్న జిల్లా పరిశ్రమల కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. రేపో మాపో అంటూ అధికారులు దాటవేయసాగారు. ఇదేక్రమంలో జిల్లాపరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వేముల వీరేశంను అనేకమార్లు భగ్న కలవడం జరిగింది. సబ్సిడి సొమ్ము త్వరగా రావాలంటే పై అధికారులకు కొంత లంచం ముట్టచెప్పాల్సి వస్తుందని, ఇతర ఖర్చులు ఉంటాయని చెప్పుకొచ్చిన వీరేశం రూ. 15వేలు డిమాండ్ చేసినట్లు భగ్న తెలిపారు. అనేకమార్లు బతిమిలాడి రూ.10వేలు ఇస్తానని భగ్న బతిమిలాడుకున్నారు. లంచం కోసం తనను వేధిస్తున్న అధికారిని ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలనే నిర్ణయానికి వచ్చిన భగ్న వారిని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం జిల్లా పరిశ్రమల శాఖ అధికారికి రూ.10వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. తనకు రావాల్సిన సబ్సిడీ కోసం లంచం ఇవ్వాలంటూ పదేపదే ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని గిరిజన రైతు ధారావత్ భగ్న తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు వాసాల సతీష్, వెంకటేష్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో జిల్లాస్థాయి అధికారి 10వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డడని తెలియడంతో ఒక్కసారి పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వణుకు ప్రారంభమైంది. లంచం తీసుకునే అధికారుల సమాచారాన్ని తమకు ఇచ్చినట్లైతే కచ్చితంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఏసీబీ డీ ఎస్పీ భద్రయ్య తెలిపారు.

గుట్కాలపై టాస్క్‌‘్ఫర్స్’

$
0
0

వరంగల్, జనవరి 10: టాస్క్ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ షాపులకు సరఫరాకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలపై వరంగల్ పోలీస్ కమిషరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు గుట్కా వ్యాపారులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుండి 16 లక్షల రూపాయల విలువగల 40 బ్యాగులు, 72వేల నగదుతోపాటు, గుట్కా బ్యాగులను తరలించేందుకు వినియోగించే రెండు కార్లతో పాటు, ఒక బోలేరో వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో జనగామ జిల్లా నర్మెట్ట మండలం బోతేలబర్రే గ్రామానికి చెందిన సిద్దిరాజు, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రాజుతో పాటు హైద్రబాద్ ప్రాంతానికి చెందిన బొద్దుల శ్రీనివాస్, లోరేల్, మాలి లక్ష్మణ్ ఉన్నారు.
అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ గురువారం వెల్లడించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలకు నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకేట్లను సరఫరా జరుగుతున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో, టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవరి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది నర్మెట్ట మండలం బోతేలబర్రే గ్రామంలోని సిద్దం రాజు ఇంటిపై దాడులు నిర్వహించడంతో రవాణకు సిద్ధంగా ఉన్న గుట్కాల ప్యాకెట్ల గోదాములో నిల్వచేసిన వున్న గుట్కా బ్యాగులు లభించాయి. దీంతో సిద్దం రాజును పోలీసులు విచారించడంతో హైద్రబాద్ ప్రాంతానికి చెందిన రాజు, శ్రీనివాస్, లోరేల్, లక్ష్మణ్‌తో కలసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో గుట్కా, అంబర్ తయారీ కేంద్రాల నుండి కొనుగోళ్లు చేసి వాటిని రెండు కార్లు, బొలేరో వాహనం ద్వారా రాత్రి సమాయాల్లో నర్మెట్ట గ్రామానికి తరలించడం జరుగుతుందని ప్రధాన నిందితుడు అంగీకరించాడని సీపీ తెలిపారు.
గురువారం తెల్లవారు జామున నిందితులు నలుగురు బీదర్ నుండి గుట్కా బ్యాగులను మూడు వాహనాల్లో తరలిస్తున్నట్లుగా నిందితుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నర్మెట్ట మండల శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుట్కా బ్యాగులను తరలిస్తున్న వాహనాలను గుర్తించి నిందితులను అరెస్ట్ చేసి గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వచ్చే రోజుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో గుట్కా, మాట్కా, జూదం, వ్యభిచారం లాంటి కార్యకలపాలను నిర్వహించే వారిని కఠినంగా అణిచివేయాలని టాస్క్ఫోర్స్ సిబ్బందికి సూచించడంతోపాటు సిబ్బందిని సీపీ అభినందించారు. పోలీస్ కమిషనర్ అభినందించిన వారిలో ఏసీపీ చక్రవరి, ఇన్స్‌స్పెక్టర్ రమేష్‌కుమార్‌తోపాటు సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, క్రాంతి, శ్రీను, ఆలీ, వెంకన్నలు ఉన్నారు.
చిత్రం..టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా బ్యాగులను పరిశీలిస్తున్న సీపీ రవీందర్


బెహ్రయిన్‌లో ఇందూరు వాసి ఆత్మహత్య

$
0
0

నిజామాబాద్, జనవరి 10: జీవనోపాధిని అనే్వషిస్తూ ఎడారి దేశాలకు వెళ్తున్న వారు అక్కడ పరిస్థితులు అనుకూలించక ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరాయిగడ్డపై అర్ధాంతరంగా తనువులు చాలిస్తూ తమ కుటుంబీకులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఇబ్బడిముబ్బడిగా చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ దేశాల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందగా, మరో నలుగురు గుండెపోటు, ఇతరాత్ర అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీటికి తోడు అక్కడ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు కూడా నిండు ప్రాణాలను కబళిస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని కొత్తకోరుట్ల తండాకు చెందిన బదావత్‌గణేష్ (26) అనే గిరిజన యువకుడు బెహ్రయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. కేకే.తండాకు చెందిన గణేష్ నిన్నమొన్నటి వరకు తన తండ్రితో కలిసి స్థానికంగానే వ్యవసాయం చేసుకుంటూ జీవనం వెళ్లదీసేవాడు. గణేష్‌కు మూడున్నరేళ్ల క్రితమే మంజులతో వివాహం జరిగింది. వారికి మహాలక్ష్మి (2) అనే రెండేళ్ల వయస్సు గల కుమార్తె ఉండగా, మంజుల ప్రస్తుతం గర్భిణి. అయితే గత కొంతకాలం నుండి సేద్యం కలిసిరాక కుటుంబ పోషణ భారంగా మారడంతో గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న గణేష్, తనకు తెలిసిన వారితో కలిసి గల్ఫ్ ఏజెంట్‌ను సంప్రదించాడు. బెహ్రయిన్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం ఉందని సదరు ఏజెంట్ నమ్మబలకడంతో అప్పుసొప్పులు చేసి అతనికి డబ్బులు చెల్లించి నెల రోజుల క్రితమే బెహ్రయిన్‌కు వెళ్లాడు. అయితే అక్కడికి చేరుకున్న తరువాత కాని తాను మోసపోయినట్టు గణేష్ గుర్తించలేకపోయాడు. సదరు కంపెనీలో గణేష్‌కు ఏజెంట్ చెప్పిన కొలువు దక్కకపోగా, లేబర్ పనిపై అతి తక్కువ వేతనం చెల్లిస్తామని చెప్పారు. ఇష్టముంటే పని చేయాలని, లేకపోతే తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక గణేష్ అత్తెసరు జీతానికే ఒప్పుకుని అక్కడే ఉండిపోయాడు. అప్పులు చేసి వెళ్లడంతో వాటిని ఎలా తీర్చాలి, కుటుంబ పోషణకు డబ్బులు ఎలా పంపించాలన్నది తేల్చుకోలేక మథనపడేవాడని, ఇదే విషయాన్ని ఫోన్‌లో తమతో పదేపదే ప్రస్తావిస్తూ బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మనస్థాపానికి లోనైన బదావత్ గణేష్ మంగళవారం రాత్రి తన గదిలోకి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు గమనించిన తోటి కార్మికులు గురువారం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. గణేష్ మృతితో అతని కుటుంబం వీధినపడినట్లయ్యిందని స్థానికులు కంటతడి పెడుతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించి కడచూపు భాగ్యాన్ని ప్రసాదించాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.
బదావత్ గణేష్ (ఫైల్‌ఫొటో)

పానగల్లు ఛాయ సోమేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

$
0
0

నల్లగొండ రూరల్, జనవరి 10: నల్లగొండ పట్టణంలోని చారిత్రక పానగల్లు ఛాయ సోమేశ్వరాలయాన్ని గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ. రామసుబ్రమణ్యన్ సందర్శించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ రామసుబ్రమణ్యన్ ఆలయంలో సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయాన్ని పరిశీలించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక పానగల్లు దేవాలయాలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోని భావితరాలకు చరిత్రను అందజేయాలన్నారు. అనంతరం జస్టిస్‌ను చైర్మన్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, ఎండోమెంట్ అధికారులు, తహశీల్దార్ దామోదర్ రావు, గిర్దవార్ సందీప్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..పానగల్లు ఛాయ సోమేశ్వరాలయాన్ని సందర్శించిన
హైకోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రమణ్యన్

పునరావాసమా... వనవాసమా!

$
0
0

రాజమహేంద్రవరం, జనవరి 10: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న తమకు కల్పిస్తున్నది పునరావాసమా లేక వనవాసామా అనేది అర్థం కావడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టుకు ఎడమవైపు తూర్పు గోదావరి జిల్లా పి.గొందూరు గ్రామవాసుల ఆవేదన ఇది. ఈ గ్రామంలో నిర్వాసితులయ్యే వారికి దేవీపట్నం మండలం నేలకోట వద్ద కాలనీ నిర్మించారు. అయితే తమకు నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం లభించే వరకూ గ్రామాన్ని ఖాళీచేసేది లేదని పి.గొందూరు వాసులు భీష్మించడంతో, వారి కోసం నిర్మించిన పునరావాస కాలనీ శిథిలావస్థకు చేరింది. అలాగే తమ జీవనోపాధిని దూరంచేసేలా ఎక్కడో దూరంగా నిర్మించిన కాలనీలోకి చేరేది లేదని గ్రామస్థులు స్పష్టంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎడమ గట్టు వైపు రెండో విడత ఖాళీ చేయాల్సిన పనె్నండు గ్రామాల్లో పి గొందూరు గ్రామంవుంది. సుమారు పదేళ్ల క్రితం ఖాళీచేయవలసిన గ్రామంగా గుర్తించిన పి.గొందూరులో సుమారు 148 కుటుంబాల వరకు నిర్వాసితులవుతారని అధికారుల సామాజిక సర్వేలో తేలింది. వీరందరికీ దేవీపట్నం మండలం నేలకోట వద్ద పునరావాస కాలనీ నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. తాగడానికి ఉపయోగపడని నీరు కాకపోయినా బోరు కూడా వేశారు. అయితే కొత్త పునరావాస చట్టం ప్రకారం తమకు రావాల్సిన మొత్తం పునరావాస ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే గ్రామాన్ని విడిచిపెడతామని, అంతవరకు పునరావాస కాలనీకి వెళ్ళేది లేదని గ్రామస్థులు భీష్మించారు. 18 ఏళ్ళు నిండిన వారికి కూడా పునరావాస ప్యాకేజి ఇవ్వాలని, చట్టం ప్రకారం వారికి కూడా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని గత పదేళ్లుగా నిర్వాసితులు అధికారులకు చెబుతూనే ఉన్నారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే తమ గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నేలకోట వద్ద నిర్మించిన పునరావాస కాలనీలో నివాసం ఉంటే తమకు ఎటువంటి కూలీ పనులు కూడా దొరకవని నిర్వాసితులు వాపోతున్నారు. తమ గ్రామాలకు దగ్గరలోనే పునరావాసం కల్పిస్తేనే వెళతామని చెబుతున్నారు. దీనికితోడు భూమికి భూమి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, వ్యవసాయానికి యోగ్యమైన భూమి కేటాయింలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం తమ గ్రామాన్ని ఖాళీచేసిన జాబితాలో కలిపేసి, కనీస వౌలిక సదుపాయాలు కూడా రద్దుచేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.ఇక ఈ గ్రామస్థుల కోసం నేలకోట వద్ద నిర్మించిన పునరావాస కాలనీలోని ఇళ్లు ఇంకా ప్రాంభించకుండానే శిథిలావస్థకు చేరాయి. ఇపుడు బలవంతంగా ఆ ఇళ్ళల్లోకి వెళ్ళాలన్నా నివాసం వుండలేని పరిస్థితి నెలకొంది. తలుపులు లేకుండా, శ్లాబులు శిథిలమై, డాబా మెట్ల కూలిపోయి, ఇళ్లల్లో పిచ్చి మొక్కలు మొలిచి ఆ ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. ఈ కాలనీకి వెళ్లడానికి నిర్వాసితులు విముఖత వ్యక్తం చేయడానికి మరో ప్రధానమైన కారణం కాలనీని చేరుకోవడానికి ప్రధానమైన రహదారి లేదు. ఉన్న ఒక రోడ్డు నుంచి కనీసం 15 కిలోమీటర్లు తిరిగివెళ్తే తప్ప దైనందిన జీవితం గడవని పరిస్థితి. ఏ అవసరానికైనా అటు సీతానగరం గానీ, ఇటు గోకవరం గానీ పరిగెట్టాల్సిందే.ఆసుపత్రికి వెళ్లాలన్నా కాలి నడకే శరణ్యం. ఇలాంటి పరిస్థితుల్లో నేలకోట పునరావాస కాలనీలో నిర్వాసితులు ఎలా జీవిస్తారనేది ప్రశ్నార్థకమే. కాలనీ పేరిట ఖర్చుచేసిన కోట్లాది రూపాయలు అడవిపాలైనట్టయ్యింది.
చిత్రం..పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్న నేలకోట పునరావాస కాలనీ

పోలీసుశాఖలో ప్రతిభకు ప్రోత్సాహం

$
0
0

విజయవాడ (క్రైం), జనవరి 10: పోలీసుశాఖలో ప్రతి మూడు నెలలకు ఓసారి ఇస్తున్న ‘అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్’ (ఏబీసీడీ) అవార్డులు అధికారులు, సిబ్బంది ప్రతిభ, పనితీరుకు ప్రోత్సాహమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా అన్నారు. డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ తమ స్ధాయిలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం ‘ఏబీసీడీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పునేఠా హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ కీలకమైన కేసులను ఛేదించి, టెక్నాలజీని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయా కేసుల్లో నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన అవార్డులు అందచేశారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి చెందేందుకు పూర్తి ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో పోలీసుశాఖ పనితీరు బావుందని, విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పెట్టుబడులకు అవకాశం ఏర్పడిందన్నారు. కొత్త రాష్ట్రంలో అత్యంత అధునాతన భవనాన్ని నిర్మించుకున్న పోలీసుశాఖ అంతకన్నా మెరుగైన పోలీసు వ్యవస్ధను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేశారు. పోలీసుశాఖలో స్ధాయిన బట్టి గుర్తింపు కాకుండా.. చేసే పని, సామర్థ్యాన్ని బట్టి గుర్తింపునివ్వాలని, ఇందుకు ఏబీసీడీ అవార్డులు దోహదపడతాయన్నారు. సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. డీజీపీ ఆర్‌పి ఠాకూర్ మాట్లాడుతూ ప్రశాంత రాష్ట్రం కోసం పోలీసుశాఖ నిరంతరం శ్రమిస్తోందని, సంఘవిద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచుతూ సామాన్యులకు రక్షణ దిశగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. పోలీసు దర్యాప్తులో సామర్థ్యాలను వెలికి తీసేందుకే ఏబీసీడీ అవార్డులు ప్రవేశపెట్టామని, ప్రతి మూడు మాసాలకు ఒక సారి మొదటి అవార్డుకు లక్ష రూపాయలు, రెండో అవార్డుకు 60వేలు, మూడో అవార్డుకు 40వేలు చొప్పున నగదు రివార్డు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుండగా నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీస్టేషన్ పరిధిలో బస్టాండు వద్ద 2018 నవంబర్ 3వ తేదీన జరిగిన రాజపురోహిత్ మహేంద్ర సింగ్ హత్య కేసును ఛేదించిన అధికార బృందానికి మొదటి అవార్డు లభించింది. అదేవిధంగా 2018 మార్చి 24వ తేదీన విజయవాడలో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు బృందానికి రెండో అవార్డు, చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 5.75 కిలోల బంగారం దోపిడీ కేసు ఛేదించిన బంగారుపాళ్యం పోలీసు బృందానికి మూడో అవార్డు లభించింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అనంతరం చీఫ్ సెక్రటరీకి మెమోంటో అందచేసి డీజీపీ గౌరవించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ అమిత్‌గార్గ్, శాంతి భద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, ఐజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కమలానికి కష్టకాలం!

$
0
0

భీమవరం, జనవరి 10: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్‌బై చెప్పి, జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించగా, పార్టీని వీడే ఆలోచనలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఒక ఆ ఎమ్మెల్యే తన అనుచర వర్గంతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన తన నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నాయకులతో పార్టీ మారే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తనకు ఏ పార్టీ టిక్కెట్టు వచ్చినా మద్దతివ్వాలని నియోజకవర్గంలోని కొందరు పెద్దల నుండి హామీ తీసుకున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ నేతలతో సాన్నిహిత్యం ఉన్న మరో ఎమ్మెల్యే సైతం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా పార్టీకి చెందిన ఒక ఎంపీ తనయుడు వైసీపీ అధినేత జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్‌కు సన్నిహితుడైన ఆ ఎంపీ తనయుడు వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక విశాఖలో పార్టీకి కీలకమైన నేతలు పృధ్వీరాజ్, చెరుకు రామకోటయ్య కూడా పార్టీకి రాజీనామా చేయడం కూడా బీజేపీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చు. అయితే వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు కావడంతో ఎన్నికల ముందు ఇటువంటి చిన్నపాటి స్టంట్లు సహజంగానే ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ల పరధిలోని బూత్ కార్యకర్తలతో మాట్లాడటం, అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం వంటి సంస్కరణలతో పార్టీకి జోష్ ఇస్తున్నారని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఈ నెలలో అమిత్ షా పర్యటనను ఖరారు చేసుకున్న తరుణంలో ఈ రాజీనామాల పరిణామాలు పార్టీ నేతలను కాస్త ఇబ్బందులకు గురి చేసినట్లేనని చెప్పవచ్చు.

పాదయాత్ర ఎవరి కోసం జగన్?

$
0
0

గుంటూరు, జనవరి 10: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టుల కోసం కేసీఆర్‌కు, గతంలో బెయిల్ కోసం సోనియాగాంధీకి, కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి అమ్ముడు పోయారని తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియతో పాటు పలువురు ఎమ్మెల్యేలు జగన్‌కు బహిరంగ లేఖ విడుదల చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. మీరు అవినీతి చక్రవర్తి అనేది బహిరంగ రహస్యం, అటువంటి మీరు అభివృద్ధి చక్రవర్తి చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని వారు హితవుపలికారు. రూ.43 వేల కోట్ల అవినీతిలో 12 చార్జిషీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సుమారు 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్న విషయాన్ని మరచినట్లున్నారన్నారు. మీ దుర్మార్గాన్ని, దుష్ట రాజకీయాలను భరించలేక రాష్ట్ర, నియోజకవర్గాల అభివృద్ధి కోసం తామంతా బయటకు వచ్చామన్నారు. వేల కోట్ల అక్రమార్జనతో జైలుపాలైన మీరు కేసుల నుండి బయటపడటానికే అవినీతి సొమ్ముతో పార్టీ స్థాపించి, అధికారులు, ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసేందుకు పత్రిక, టీవీ ఛానల్ పెట్టడం వాస్తవం కాదా అని లేఖలో ప్రశ్నించారు. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ నిలదీశారు. జగన్‌కు మానవత్వం, జాలి లేవని, పార్లమెంటు మాజీ సభ్యుడు సబ్బం హరి పేర్కొనడం సత్యదూరం కాదన్నారు. గతంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూను మీ పక్కసీటులో కూర్చోవద్దని శాసించి సీనియర్ నాయకుడన్న గౌరవం లేకుండా అవమానించడం మీ సైకో తనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
మీ రాజకీయ అరంగేట్రం కోసం చేసే ఒత్తిడి భరించలేక మీ చిన్నాన్న వివేకానందరెడ్డి రాజీనామా చేశారని, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య కూడా జగన్ పోరు పడలేక పోతున్నానని విజయమ్మకు పలుమార్లు చెప్పలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొంటున్నారన్న మీరు అంటున్నారని.. కసాయి వద్ద నుండి తమకు విముక్తి లభించిందని బహిరంగంగా తాము చెప్తున్నామంటే మీ నిరంకుశత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారికి మేలు చేసేందుకు గనుల శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలుపాలవడానికి కారణం మీరే కదా అన్నారు. పరిటాల హత్య కేసు నుండి జగన్‌ను కాపాడటానికి 60 రోజులు కష్టపడ్డానని మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం మీ దుర్మార్గానికి, ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మీరు రోడ్లపై తిరుగుతూ లక్షలాది రూపాయల జీతం తీసుకోవడం ప్రజా ద్రోహం కాదా అని ప్రశ్నించారు.
ఐదు కోట్ల ఆంధ్రులను నమ్మించి మోసం చేసిన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని మీ పాదయాత్రలో ఎప్పుడైనా ప్రశ్నించారా, యాత్ర ముగింపు సభలో విభజన హామీల గురించి, ప్రధాని ద్రోహం గురించి ఎందుకు మాట్లాడలేదో రాష్ట్ర ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మీ పాదయాత్రలో ఎన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పాలన్నారు. బహిరంగ లేఖ విడుదల చేసిన వారిలో మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు చాంద్ బాషా, జ్యోతుల నెహ్రూ, ఎస్‌వి మోహన్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, జయరాములు, మణిగాంధీ, పాశం సునీల్, గొట్టిపాటి రవికుమార్, అశోక్‌రెడ్డి, రామారావు, డేవిడ్‌రాజు, పరుపుల సుబ్బారావు, కలమట వెంకట రమణ, బుడ్డా రాజశేఖరరెడ్డి తదితరులున్నారు.

సీఈవోను కాను.. సేవ చేసే ముఖ్యమంత్రిని

$
0
0

విజయవాడ, జనవరి 10: నిధుల సమస్య ఉన్నా భారీ ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ‘వయాడక్ట్’ విజయమంత్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాజధాని అమరావతి నుంచి వచ్చే ఒక ఏడాది ఆదాయాన్ని రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని విమర్శించారు. గతంలో తనను అందరూ సీఈవో అనే వారని, తాను సీఈవో కాదని, ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రిని అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానన్నారు. నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్‌లో ఒక్క ఇంజనీరింగ్ కళాశాల పెట్టలేదని విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. నిర్మాణంలో తెలుగుజాతికి మించిన వారు లేరన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి జన్మభూమి- మా ఊరులో భాగంగా 9వ రోజు పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అంశంపై ఆయన గురువారం విశాఖ తదితర ప్రాంతాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు భారీ నిధులు ఎక్కడ నుంచి సమకూరాయన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానంగా నవ్వుతూ వయాడక్ట్ మంత్రం అన్నారు. ముందు చూపు, వినూత్న ఆవిష్కరణలు, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఊబరైజేషన్, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ విజయమంత్రంగా అభివర్ణించారు. 22 వేల కోట్ల రూపాయలతో జలధార కార్యక్రమం చేపట్టామన్నారు. పొరుగు రాష్ట్రం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ఏపీ 22 వేల కోట్లతోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తోందన్నారు. మరో ఏడాదిన్నరలో అన్ని ఇళ్లకు తాగునీటి సదుపాయం ఏర్పడుతుందన్నారు.
రాజధాని నుంచి కేంద్రానికి రూ. 6 వేల కోట్ల పన్నులు
రాజధాని అమరావతి నుంచి కేంద్రానికి ఏటా 6 వేల కోట్ల రూపాయల మేర పన్నులు వస్తాయన్నారు. ఒక్క ఏడాది వచ్చే ఆదాయం కూడా మనకు ఇచ్చేందుకు కేంద్రానికి చేతులు రావడం లేదని విమర్శించారు. ఇది ప్రజల ఆస్తి అన్నారు. ప్రజల రాజధాని అన్నారు. 48 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. పేదల ఇళ్ల కోసం 500 ఎకరాలు కేటాయించామని, 4 వేల ఇళ్లను షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మించామన్నారు. ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మిస్తూనే, మరోవైపు ఐకానిక్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో జీఎస్‌డీపీ 60 బిలియన్ డాలర్ల మేర అదనంగా పెరిగిందన్నారు. రాబోయే 10 ఏళ్లలో జీఎస్‌డీపీ 7 శాతం మేర పెరగాలని, వృద్ధి రేటు 12 శాతం సాధించాలన్నారు. డబ్బులు సంపాదించడం, సంపద సృష్టించడం తెలుగుజాతికి సులభమని చరిత్రలో రుజువైన సత్యమంటూ అభివర్ణించారు. నిర్మాణంలో తెలుగుజాతికి మించిన వారులేరన్నారు. వ్యవసాయంలో ఏపీ ముందు ఉందన్నారు. పరిశ్రమల్లో కూడా రాబడి పెంచుకున్నామన్నారు. సేవారంగంలో ఆదాయం పెంచుకోవాల్సి ఉందన్నారు. దీనిపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో విలువల జోడింపు అవసరమన్నారు. ప్రకృతి సేద్యానికే భవిష్యత్తు అని, పంట ఎక్కడ పండించారో తెలుసుకుని కొనే పరిస్థితి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ట్రేసబులిటీకీ ప్రాధాన్యం ఇస్తురన్నారు. ఎంఎస్‌ఎంఈలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అవి ఖాయిలా పడకుండా చూస్తున్నామన్నారు.
గతంలో గుజరాత్ ఐటీ రంగాన్ని ప్రోత్సహించలేదని, హైదరాబాద్‌కు, అహ్మదాబాద్‌కు పోలిక ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కూడా పెట్టలేదని, అదే హైదరాబాద్‌లో వందలాది ఇంజనీరింగ్ కళాశాలను తాను నెలకొల్పానని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది యువత ఇంజనీర్లుగా ప్రతిభ చూపుతున్నారన్నారు. గుజరాతీయులు ఎంటర్‌ప్రెన్యూర్లు కారని, వ్యాపారస్తులు మాత్రమేనన్నారు. వ్యాపారుల రాబడి ఎప్పుడైనా సింగిల్ డిజిట్‌లోనే ఉంటుందని, ఎంటర్‌ప్రెన్యూర్ల ఆదాయం మల్టిపుల్‌గా ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రో-యాక్టివ్‌గా ఉండాలన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరినీ ఇబ్బందులు పెట్టకూడదన్నారు. బ్యాంకుల తప్పులకు, ప్రభుత్వ తప్పులకు పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు బ్యాంక్‌లు దివాళా తీసే పరిస్థితి వచ్చిందని, దేశ వ్యవస్థ కుప్పకూలే దుస్థితి వచ్చిందన్నారు. తప్పును ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలన్నారు. రాజకీయ నాయకులు తాము కష్టపడుతున్నామనుకుంటే సరికాదని, ప్రతి పారిశ్రామికవేత్త తనతో పాటు మరో 10 మంది కోసం కష్టపడుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను గౌరవించి, అండగా ఉండాలన్నారు. వివిధ చర్యల కారణంగా పరిశ్రమలు మూతపడే దుస్థితి లేకుండా చేశామన్నారు. ఎక్కడైతే పారిశ్రామిక సాధికారత ఉంటుందో, ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో నాలుగు నోడ్‌లు వస్తాయన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలపై తనకు అంచంచల విశ్వాసం ఉందన్నారు. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ల ప్రోత్సాహం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. వ్యవస్థల్లోని లోపాలను మనం సరిదిద్దగలమని, కానీ వ్యక్తుల్లో లోపాలను వాళ్లే చక్కదిద్దుకోవాలన్నారు. ఒకప్పుడు వ్యాపారంలో కొన్ని కుటుంబాలదే గుత్త్ధాపత్యం ఉండేదన్నారు. నేడు ఆ కుటుంబాల ఆధిపత్యం తగ్గిందన్నారు. వారసత్వ ప్రతిభతో పారిశ్రామికంగా రాణించలేమని, ప్రతిభ ఉన్న వారే రాణిస్తారన్నారు.
చిత్రం..వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు


శ్రీనగర్-జమ్ము రహథారి మూసివేత

$
0
0

జమ్మూకాశ్మీర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు వల్ల శ్రీనగర్-జమ్మూ రాహదారిని మూసివేశారు. రోడ్డుపై విపరీతంగా మంచు పేరుకుపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో రహదారిని మూసివేశారు. జవహర్ టనె్నల్‌కు ఇరువైపులా మూసివేశారు.

మిర్యాలగూడలో యువ జంట ఆత్మహత్య

$
0
0

నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు చివ్వెంల మండలం మాల్యాతండాకు చెందిన ధీరావతి భాస్కర్ (28), షాలుకు (25)గా గుర్తించారు.

భార్యను చంపి భర్త ఆత్మహత్య

$
0
0

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మారన్న అనే వ్యక్తి అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఆతను పొలాల్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల మృతితో ఏడాది చిన్నారి, ఐదు సంవత్సరాల కుమారుడు అనాథలయ్యారు.

అంబులెన్స్‌ను ఢీకొన్న కారు

$
0
0

హైదరాబాద్: ఔటరింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గంగావతికి చెందినవారు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరుగుప్రయాణంలో వెళుతుండగా ఔటర్ రింగురోడ్డుపై ఎదురుగా వస్తున్న కారు డివైడర్‌ను దాటుకుని వచ్చి అంబులెన్స్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న బొల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, ఆయన భార్య వరలక్ష్మి, ఏలూరుకు చెందిన డ్రైవరు శివ అక్కడికక్కడే చనిపోయారు. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురితో కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

కేజ్రీవాల్‌తో నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ

$
0
0

న్యూఢిల్లీ: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై తాము మాట్లాడుకున్నామని ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహిళలకు వ్యతిరేకి కాదని అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోదీ సభకు రావటం లేదనే కోణంలోనే మనం రాహుల్ మాటలు చూడాలని అన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live

More Pages to Explore .....

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>