Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నాం

$
0
0

గుడ్లవల్లేరు, : ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. గుడ్లవల్లేరులో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ నగర్‌లోని భారత ఉప రాష్టప్రతి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. 10వేల జనాభా కలిగిన గుడ్లవల్లేరులో వెయ్యి పెన్షన్‌లను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 54లక్షల మందికి రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని అన్నారు. 80లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఉచితంగా రూ.10వేలను చంద్రబాబు అందజేశారన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా రైతులకు సాగునీరు అందించారన్నారు. గంగిరెద్దుల ఆట, వర్ల రామయ్య, రావి వెంకటేశ్వరరావు హరిదాసుల వేషాలతో ఆకట్టుకున్నారు. చంద్రన్న బీమా చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ సత్యవాణి, ఐఎఎస్ అధికారి ఉషాకుమారి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి, ఎంపీపీ కొసరాజు విజయ భారతి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజాభిమానం

బంటుమిల్లి, జనవరి 11: ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలకు అధికారులపై నమ్మకం ఏర్పడుతోందని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి ఆర్ విక్టర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ములపర్రు, నాగేశ్వరరావుపేట గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా విక్టర్ మాట్లాడుతూ గ్రామసభల ప్రారంభం నుండి ఆఖరి రోజు వరకు ఎక్కువ శాతం మంచినీరు, సాగునీటి సమస్యలపై ప్రజలు గళమెత్తారన్నారు. వృద్దాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళలు పెన్షన్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీటిని పరిష్కరించి త్వరలో పెన్షన్‌లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పారదర్శకత, సుస్థితర అభివృద్ధి, సుపరిపాలనపై శే్వత పత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చింతా కళావతి, తహశీల్దార్ డివి శేఖరరావు తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధే టీడీపీ మంత్రం

$
0
0

మచిలీపట్నం, : అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వ మంత్రమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరవ విడత జన్మభూమిలో భాగంగా చివరి రోజైన శుక్రవారం స్థానిక 39, 40, 41, 42 వార్డులకు సంబంధించి జన్మభూమి కార్యక్రమాన్ని పద్మావతి మహిళా బీఇడీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200లు ఉన్న పెన్షన్‌ను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రూ.2వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. బందరు నియోజకవర్గంలో నివేశన స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 6400 మంది వరకు జీ ప్లస్ త్రీ ద్వారా పక్కా గృహాలు నిర్మించి ఇస్తున్నామన్నారు. సమావేశానంతరం ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాలకు నాగాయలంక సిద్ధం

నాగాయలంక, జనవరి 11: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద పుష్కరఘాట్ వేదికగా నేటి నుండి నాలుగు రోజుల పాటు జిల్లా పర్యాటక శాఖ, గ్రామ పంచాయతీ, స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభ్యుదయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు, పడవల పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాలను శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం లాంఛనంగా ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా ఉపసభాపతి బుద్ధప్రసాద్ పాల్గొంటారని పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మల్లిఖార్జునరావు, ఎఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, స్వచ్ఛ నాగాయలంక అధ్యక్ష, కార్యదర్శులు గడ్డిపాటి సుధీర్‌బాబు, బోయపాటి రాము తెలిపారు. ఉదయం 10గంటలకు నాగాయలంక పొలిమేరలో ఉన్న శ్రీ షిర్డి సాయిబాబా ఆలయం వద్ద నుంచి వివిధ రకాల సాంస్కృతిక కళాకారులతో రూపొందించిన ప్రదర్శనలో కలెక్టర్, ఉపసభాపతి పాల్గొంటారని, ఈ ప్రదర్శన పుష్కరఘాట్ వరకు కొనసాగుతోందని వారు తెలిపారు. 13, 14 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పడవల పోటీలకు ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, మహిళల కొరకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్టులపై పోలీసుల దాడి

$
0
0

మైలవరం, జన్మభూమి కార్యక్రమాన్ని కవర్ చేసే కార్యక్రమంలో ఉన్న ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయటంతో జర్నలిస్టులంతా ఏకమై ఆందోళనకు దిగారు. వివరాలలోకి వెళితే జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వైకాపా నేత కేపీ తన అనుచరులతో సభాస్థలికి రావటానికి ప్రయత్నించే సమయంలో పోలీసులకు, వైకాపా నేతలకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ సంఘటనను కవర్ చేస్తున్న సేన ప్రతినిధి మనె్న శ్రీనివాస్, సూర్య రిపోర్టర్ వైడిపి రెడ్డిలపై నూజివీడు సీఐ ఎం రామ్‌కుమార్, మరో ఎస్‌ఐ దాడి చేశారు. తాము విలేఖరులమని చెప్పినా వినకుండా అయతే ఏంటీ మేం పోలీస్ అంటూ దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపియుడబ్ల్యుజే) జిల్లా అధ్యక్షులు యు వెంకట్రావ్ నాయకత్వంలో జర్నలిస్టులంతా ఏకమై బోసుబొమ్మ సెంటరులో నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. వీరికి వైకాపా నేతలు కేపీ తన అనుచరులతో మద్దతు పలికారు. సీఐ రామ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జులుం నశించాలని, జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలంటూ నినదించారు. ఈ దశలో నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పినప్పటికీ సీఐ రామ్‌కుమార్ వచ్చి క్షమాపణ చెప్పే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ దశలో పోలీసులు వైకాపా నేత కేపీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అక్కడికి చేరుకుని విలేఖర్లకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో మరోమారు అక్కడ జర్నలిస్టులు, వైకాపా నేతలు, కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. కొద్దిసేపటి తర్వాత డీఎస్పీ అక్కడికి చేరుకుని నేతలతో మాట్లాడి ర్యాలీగా పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి అక్కడ తనతోపాటు సీఐ రామ్ కుమార్‌తో జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పటంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.

టీడీపీ - వైసీపీ బాహాబాహీ

ఉయ్యూరు, జనవరి 11: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాలలో నిర్వహించే కోడి పందాలను తలపించే విధంగా అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు బాహాబాహీకి దిగడం, హోదా మరచి నేతలే పరుష పదజాలాలు ఉపయోగిండం మండలోని పెదఓగిరాల వద్ద శుక్రవారం జరిగింది. జన్మభూమి-మా ఊరు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసారు. ఈ గ్రామ సభకు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరుకానున్నారని, వీరితోపాటు మాజీ మంత్రి, వైకాపా నేత కొలుసు పార్ధసారధి కూడ హాజరుకానున్నారని తెలిసింది. గురువారం ఉయ్యూరు గ్రామసభలో జరిగిన ఉద్రిక్తతల నేపద్యంలో పెదఓగిరాల సభకు పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సమావేశానికి హాజరై ప్రజాసమస్యలు చర్చించేందుకు సారధి గ్రామానికి రాగా, ఆయనను గ్రామం వెలుపలే పోలీసులు నిలువరించారు. దీంతో ఆయన పోలీసులతో చర్చలు జరిపారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తమకు సహకరించాలని ఎసిపి విజయభాస్కర్ తదితరులు సారధికి విజ్ఞప్తి చేసారు. ఈ నేపద్యంలో వివిధ గ్రామాలనుంచి భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ లోగా గ్రామసభను ముగించుకొని శాసనసభ్యులు బోడే ప్రసాద్ తిరిగి వెళుతూ ఉండగా, ఎంఎల్‌ఎ డౌన్‌డౌన్ అంటూ కొంత మంది నినదించారు. దీంతో ఆగ్రహానికి గురైన బోడే తన వాహనం నుంచి క్రిందకు దిగి వైకాపా శ్రేణుల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీనిని ఆసరాగా తీసుకున్న టిడిపి పక్ష కార్యకర్తలు వైకాపా కార్యకర్తల మద్య తోపులాట చోటు చేసుకుంది. పరుషపదజాలంతో ఎంఎల్‌ఎ దూషించడం ఉద్రిక్తతను పెంచింది. ఇరుపక్షాలు ముష్టిగాతాలకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. తనను సమావేశ ప్రాంతానికి పంపించక పోతే ఎంఎల్‌ఎనే తన వద్దకు రమ్మనండి చర్చిస్తానని సారధి పోలీసులకు తెలిపారు. దానికి పోలీసులు ససేమిరా అని, ఆయనను అక్కడి నుంచి పోలీస్టేషన్‌కు తరలించారు. కాగా ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని, ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోశారు. కాగా స్ధానిక 18, 19 వార్డులలో జరిగిన గ్రామసభలలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ అబ్ధుల్ ఖుద్ధూస్, కమిషనర్ రాంకుమార్ పాల్గొన్నారు.

గ్రామాభ్యుదయమే ప్రభుత్వ ధ్యేయం

* జన్మభూమి ముగింపు సభలో మంత్రి రవీంద్ర

మచిలీపట్నం, జనవరి 11: గ్రామీణ ప్రాంతాల అభ్యుదయమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం మండల పరిధిలోని చిన్నాపురంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన నాలుగున్నర యేళ్లుగా రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. నిరుపేదల సంక్షేమం కోసం రాజీ లేని పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. వృద్దాప్య, వితంతువులకు ఆసరగా ఉండేందుకు నాడు నందమూరి తారక రామారావు పెన్షన్‌లను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. పెన్షన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150లు ఉన్న పెన్షన్‌ను ఐదు రెట్లు చేసిన ముఖ్యమంత్రి ఫిబ్రవరి నెల నుండి రూ.2వేలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. గ్రామాల్లో ఎన్టీఆర్ గృహాలు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1.5లక్షలు సబ్సిడీని రూ.2లక్షలకు పెంచినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు.

అరెస్ట్‌లు, ఆందోళనలు, ధర్నాలతో

$
0
0

మైలవరం, : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మా వూరు కార్యక్రమం చివరి రోజైన శుక్రవారం మైలవరంలో ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌లు, ఆందోళనలు, ధర్నాలతో అట్టుడికింది. ఒక వైపు వైకాపా, మరోవైపు జర్నలిస్టుల ఆందోళనలతో మైలవరం సెంటర్ దద్ధరిల్లింది. జన్మభూమి సభలో ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించటంతో నిరుపేదలకు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు. మరోవైపు విపక్ష నేతలైన సీపీఎం నేతలను ఉదయానే్న పోలీసులు అరెస్ట్ చేశారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (కేపీ) తమ అనుచరులతో జన్మభూమి సభకు వచ్చేందుకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. ఐనప్పటికీ వారి నుండి తప్పించుకుని తన అనుచరులతో పరిగెత్తుకుంటూ సమీపంలోని జన్మభూమి సభ జరిగే ప్రదేశానికి గోడ దూకి రావటంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిని తేరుకుని పోలీసుల బలగంతో వారిని అడ్డుకుని అక్కడి నుండి పంపివేశారు. ఈ దశలో వైకాపా, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. ఒకరిపై ఒకరు ఘర్షణకు పూనుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను తరిమివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైకాపా కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను జన్మభూమి సభ వద్ద పంచుతుండగా టీడీపీ కార్యకర్తలు వారిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కేపీ తన అనుచరులు, పార్టీ నేతలతో కలసి ర్యాలీగా స్థానిక బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు. ఈ సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు బారులు తీరాయి. ధర్నానుద్దేశించి కేపీ మాట్లాడుతూ ఇళ్ళ పట్టాల పంపిణీ పేరుతో మంత్రి ఉమ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ళ పట్టాలు ఇస్తున్నట్లు పేదలను నమ్మించి జవాబు పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. మంత్రి ఉమ నిజస్వరూపం దీంతో బయటపడిందన్నారు. ఈ దశలో మరో మార్గం ద్వారా మంత్రి ఉమ జన్మభూమి సభకు వచ్చారని సమాచారం తెలుసుకున్న కేపీ తన కార్యకర్తలతో కలసి ర్యాలీగా అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని కేపీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో ఇక్కడికి చేరుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. మంత్రి ఉమ జన్మభూమి సభను త్వరగానే ముగించుకుని రెడ్డిగూడెం మండలం వెళ్ళిపోయిన తర్వాత కేపీని, సీపీఎం నాయకులను విడుదల చేశారు. దీంతో జోగి రమేష్ ఆందోళన విరమించారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

* మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు

మైలవరం, జనవరి 11: మాటిమాటికీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే మంత్రి దేవినేని ఉమ తానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు ధ్వజమెత్తారు. జన్మభూమి - మా వూరు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమని, ఆ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకుని అర్జీలు అందించవచ్చని ప్రభుత్వం నిర్దేశిస్తే మంత్రి ఉమ దానిని కాలరాస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా జరిగే జన్మభూమి పూర్తిగా తెలుగుదేశం నేతలు కనుసన్నలలో నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను రానీయకుండా అరెస్ట్ చేయటం, పోలీస్‌లతో అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. మంత్రి ఉమ ఇక్కడ ప్రజాప్రతినిధిగా పదేళ్ళ కాలం పని చేసి నేటికీ ఒక్క గజం స్థలాన్ని కూడా నిరుపేదల ఇళ్ళ స్థలం కోసం సేకరించకుండా, కనీసం గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొనుగోలు చేసిన తొమ్మిదిన్నర ఎకరాల స్థలాన్ని కూడా పంపిణీ చేయకుండా తాజాగా ఎవరో దాచిపెట్టిన పూరగుట్టను తానే బయటికి తీశానని చెప్పి దానిలో పేదలకు ఇళ్ళస్థలాలు ఇస్తున్నట్లు నిన్నటి వరకూ ప్రగల్బాలు పలికి చివరికి చేతకాక చతికిలపడ్డాడన్నారు. పూరగుట్ట 1974లో రైతుల కోసం 84 ఎకరాలను సేకరించి చెరువు తవ్వాలనుకున్నప్పటికీ సాధ్యం కాక వదిలి వేశారన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వటానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఇరిగేషన్ స్థలాన్ని రెవెన్యూ స్థలంగా మార్పు చేయకుండానే పేదలకు ఎలా ఇళ్ళ స్థలాలుగా ఇస్తారని ప్రశ్నించారు. అదేమంటే జవాబుప్రతం పేరుతో ఇళ్ళ స్థలం ఇస్తున్నట్లు పేదలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలం అభివృద్ధి పేరుతో అందులో ఉన్న 40, 50 లక్షల రూపాయల విలువైన కలపను తన అనుచరులతో ఏ శాఖ అనుమతులు లేకుండా యధేచ్ఛగా నరికించి కలపను వేలం వేసి ప్రభుత్వానికి జమ చేయకుండా స్వాహా చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సంబంధిత అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత

$
0
0

చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8కోట్లు వుంటుందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పొగ మంచు వల్ల ప్రమాదాలు:పలు వాహనాలు ధ్వంసం

$
0
0

హైదరాబాద్: నగరాన్ని శనివారంనాడు పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షాద్‌నగర్ కొత్తూరు వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 ఆర్టీసీ బస్సులు, రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, ఆటో, కారు ధ్వంసం అయ్యాయి. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

తెలంగాణ చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఆకస్మిక బదిలీ

$
0
0

హైదరాబాద్: తెలంగాణ చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సుల మేరకు ఆయనను కోల్‌కతా చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు. జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే గుప్తా పదవీ విరమణతో ఖాళీ ఏర్పడింది. ఇక్కడకు జస్టిస్ రాధాకృష్ణన్‌ను బదిలీ చేశారు.

అనాథ పిల్లలకు సీఎం కుమారస్వామి చేయూత

$
0
0

బెంగళూరు: పట్టణంలోని శాంతినగర్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మంగళవారం శ్రీనివాస్, దుర్గమ్మ దంపతుల పిల్లలకు సీఎం కుమారస్వామి ఆర్థిక చేయూతనందించారు. మృతుల పిల్లలు ఈశ్వర్ (7), పల్లవి (4)లకు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. అంతేకాదు వారి విద్యాభివృద్ధి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.


ఢిల్లీలో భారీఎత్తున హెరాయిన్ పట్టివేత

$
0
0

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్గనిస్థాన్‌కు చెందిన అసదుల్లా, నైజీరియాకు చెందిన వౌసాజీ హెరాయిన్ క్యాప్సుల్స్ తమ ఉదర భాగాన పెట్టుకుని వస్తుండగా గుర్తించిన అధికారులు వారి వద్ద నుంచి దాదాపు రూ.32 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వైద్యులను అనుమతించటం లేదు..

$
0
0

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయనను చూసేందుకు వైద్యులను అనుమతించటం లేదని షరీఫ్ కుమార్తె మర్యం అన్నారు. లాహోర్‌లోని లఖ్‌పట్ జైలులో ఏడేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌కు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వైద్యులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు కుమార్తె మర్యం వెల్లడించారు. తన సోదరుడికి ఏదైనా జరిగితే ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని షరీఫ్ సోదరుడు, పీఎంఎల్‌ఎన్ అధ్యక్షుడు షహ్‌బాజ్ హెచ్చరించారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

$
0
0

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతివిహార్‌లో ఉన్న సీజేఓ కాంప్లెక్స్‌లో బ్లాక్-14లో మంటలు చెలరేగాయి. దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

ప్రజల ప్రయోజనం కోసమే పొత్తు:మాయావతి

$
0
0

లక్నో : ప్రజలను కాపాడటానికే సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. లక్నోలో మాయావతి, ఎస్సీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ సంయుక్త మీడియా సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీల పొత్తు, సీట్ల పంపకంపై ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ.. ఈ కూటమి యూపీలో బీఎస్పీ 38, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తాయి అని తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌ మాట్లాడుతూఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలిసి పనిచేయాలని అఖిలేశ్‌ తెలిపారు.

మోదీకి చంద్రబాబు లేఖ

$
0
0

అమరావతి: ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. వైకాపా అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ లేఖ రాశారు. జగన్‌పై దాడి కేసును ఏన్‌ఐఏకి అప్పగించటం సరికాదని, కేంద్రం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐదుపేజీల లేఖను రాశారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి:మోదీ

$
0
0

న్యూఢిల్లీ: రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నాయని అన్నారు. రైతులు శక్తిప్రధాతలని పేర్కొన్నారు.

ఏపీ ఓటర్ల తుది జాబితా ప్రకటన

$
0
0

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏపీలో మొత్తం 3,69,33091 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,83,24,538 మంది ఉన్నారు. మహిళలు 1,86,04,742 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,767మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా గా తూర్పుగోదావరి. తక్కువ ఓటర్లు ఉన్న జిల్లా విజయనగరం నిలిచాయి.


మహాకూటమి వల్ల అరాచకత్వం

$
0
0

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి ఏర్పాటు చేయటం వల్ల అరాచకత్వం, అవినీతి రాజ్యమేలుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగత్యానాథ్ అన్నారు. ఆయన లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోని వాళ్లు కూటమిగా ఏర్పడితే అరాచకత్వమే రాజ్యమేలుతుందని చెప్పారు.

భారీగా నిలిచిన వాహనాలు

$
0
0

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు జనం ఊరి బాట పట్టడంతో వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. వాహనాలు మూడు కిలోమీటర్ల మేర నిలచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.

చొరవ

$
0
0

నేను వికారాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నప్పుడు మద్రాస్‌లో ఓ సమావేశం జరిగింది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో న్యాయమూర్తుల పాత్ర అన్న అంశం మీద నేషనల్ జ్యుడీషియల్ అకాడెమీ దక్షిణాది రాష్ట్రాలకి చెందిన న్యాయమూర్తుల కోసం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ అది. మేజిస్ట్రేట్ స్థాయి నుంచి జిల్లా జడ్జి స్థాయి వరకు అందరూ పాల్గొన్న కాన్ఫరెన్స్ అది. కాబోయే హైకోర్టు న్యాయమూర్తులతో పాటూ, హైకోర్టు న్యాయమూర్తులు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.గోఖలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సదాశివంలతో బాటూ చాలామంది ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన న్యాయమూర్తులు చాలామంది అందులో వున్నారు. ఈ న్యాయమూర్తులందరినీ నాలుగు భాగాలుగా రెండో రోజు కాన్ఫరెన్స్‌లో విభజించారు. ఒక దాంట్లో నేనూ వున్నాను. అందరమూ చర్చించి ఆ గ్రూపు తరఫున ఒకరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మా గ్రూప్‌ని సమన్వయం చేయడానికి మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విమల వచ్చారు. ఇప్పుడు ఆమె మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.
మా గ్రూప్ తరపున ఎవరు ప్రెజెంటేషన్ ఇస్తారని ఆవిడ మా అందరినీ అడిగారు. నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఆ చర్చలో ఎక్కువ పాల్గొన్నది నేనే. చాలామంది సీనియర్ జిల్లా జడ్జిలు వున్నప్పటికీ, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. దానికి కారణాలు రెండు - మొదటిది క్రిమినల్ లా మీద నాకు ప్రావీణ్యం ఉండటం, రెండవది నేను మాట్లాడటానికి ఇన్షియేషన్ తీసుకోవడం.
మాది మూడవ గ్రూప్. భోజనానికి ముందు ప్రెజెంటేషన్. అప్పటికి ఇద్దరు సీనియర్ జడ్జీలు ప్రెజెంటేషన్లు ఇచ్చారు. నేను మూడవ వ్యక్తిని. ఓ సీనియర్ సివిల్ జడ్జీ ప్రెజెంటేషన్ ఏముంటుందీ అనుకున్నారు.
నేను మొదలుపెట్టాను. న్యాయమూర్తికన్నా ముందు నేను రచయితనని, కథలూ కవిత్వంతోపాటూ ఓ ఇరవై దాకా ‘లా’ పుస్తకాలు రాశానని చెబుతూ నా ప్రెజెంటేషన్ ఇచ్చాను. ప్రెజెంటేషన్ బాగా వచ్చింది. నేను చెప్పిన అంశాలు సరైనవా కాదానని పుస్తకాలని తెరిచి ప్రధాన న్యాయమూర్తి గోఖలే చూశారు. నా ప్రెజెంటేషన్ అయిన తరువాత అకాడెమీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నా దగ్గర నుంచి జమానత్ ఇంగ్లీష్ కథల పుస్తకం తీసుకున్నారు.
భోజన సమయంలో ప్రధాన న్యాయమూర్తి గోఖలే గారు దగ్గరకొచ్చి మాట్లాడి ‘జమానత్’ కథల పుస్తకాన్ని తీసుకున్నారు.
తెల్లవారి ఉదయం సమావేశంలో ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నన్ను సభకు ప్రత్యేకంగా పరిచయం చేసి నా కథని ఒకటి వివరించాడు. న్యాయమూర్తులు లేచి చప్పట్లు కొట్టారు. అందరూ నన్ను అభినందించారు. ఈ అద్భుతమైన సన్నివేశానికి కారణం-
ప్రతిభ మాత్రమే కాదు. నేను తీసుకున్న ఇనీషియేషన్ (చొరవ) దాన్ని అభినందించే సంస్కారం ఉన్న వ్యక్తులు.

రావణుడికి శ్రీరాముడిని, సీతను వర్ణించి చెప్పిన శూర్పణఖ (అరణ్యకాండ)

$
0
0

ఈ విధంగా సిగ్గు, బిడియం, భయం లేకుండా శూర్పణఖ చెప్పిన తన దోషాల గురించి ధనగర్వం, సేనాబల గర్వం కలవాడైనందున, ఎంత మాత్రం విచారపడక, తనను ఎవ్వడు ఏం చేయగలడన్న మదాంధుడై, తన చెల్లెలు చెప్పిన విషయం గురించి ఆలోచన చేశాడు. కోపంతో కళ్లెర్ర చేసి, తనను నిష్ఠూరాలు ఆడే చుప్పనాతితో, ‘చెల్లెలా! అక్కడి వృత్తాంతమంతా వివరంగా చెప్పు. రాముడనే ఎవడు? వాడెట్టి పరాక్రమవంతుడు? దేవతా రూపమా? మనుష్య రూపమా? ఎలాంటి స్వరూపం కలవాడు? ఎందుకు దండకారణ్యానికి వచ్చాడు? ఖరాది రాక్షసులను ఏ ఆయుధాలతో చంపాడు? విల్లు, బాణాలతోనా? లేక ఏదైనా నూతన ఆయుధాలతోనా?’ అని అడగ్గా శూర్పణఖ రామచరిత్ర చెప్పడం మొదలుపెట్టింది ఇలా.
(రాముడు ఎలాంటి పరాక్రమం కలవాడు, ఏ ఆయుధం కలవాడు, మనుష్యుడా? దేవతా? అని రావణుడు తనకు కావాల్సిన విషయాల గురించి ప్రశ్నిస్తే, శూర్పణఖ కామంతో వున్న వ్యక్తీ కాబట్టి, రాముడి ఆకారం మరిచిపోదామన్నా మరువలేక, కళ్లకు కట్టినట్లు ఉండడం వల్ల, ఆయన ఆకార సౌందర్య వర్ణనతో జవాబిచ్చింది.)
‘దీర్ఘమైన భుజాలతో, విశాలమైన కళ్లతో, నారచీరెలు, జింక చర్మం వస్త్రాలుగా ధరించి, మన్మథుడిలాగా సుందరంగా ఉండే దశరథ కుమారుడు ఆయన. పేరు రాముడు. భయంకరమైన శౌర్యం కలవాడాయన. భయంకరమైన విల్లు ఉంది ఆయన దగ్గర. దాంతో పుట్టలో నుండి పాములు బయటకి వచ్చే విధంగా బాణాలను చిమ్ముతాడు. ఖరుడు, దూషణుడు, పధ్నాలుగు వేల మంది రాక్షసులను సరిగ్గా మూడు గడియల్లో కాళ్ల మీద నిలిచి, ఒంటరిగా బాణాలతో నాశనం చేశాడు. దండకారణ్యంలో వున్న మునులకు ఇక నుండి వాళ్లు రాక్షసులకు భయపడాల్సిన పని లేదని అభయ హస్తం ఇచ్చాడు. అంతా చస్తే నేనెలా బతికి బయటకు వచ్చానంటావేమో? నేనక్కడ లేకుండా విని చెప్తున్నానేమో అని అనుమానం వద్దు. నేనా గుంపులోనే ఉన్నాను. కాని, నేను ఆడదాన్నైనందున స్ర్తి హత్యాదోషం కలగవచ్చని గొప్ప మనస్సుతో నన్ను చంపకుండా వదిలాడు. ఇంకొకడైతే పధ్నాలుగు వేల మందిని తెచ్చింది ఇదే అని నన్ను కూడా చంపేవాడే. ఎంతమంది వచ్చినా తననేమీ చేయలేరని ఆయన ధైర్యం. ఆ విధంగా ఆయన చేతికి చిక్కినా పోపొమ్మని విడవడం వల్ల బతికాను. ఆ రాముడికి లక్ష్మణుడు అనే తమ్ముడున్నాడు. అన్నకు అన్నిటా సమానుడు. అన్నను భక్తితో సేవిస్తాడు. కోపిష్టి. యుద్ధంలో అజేయుడు. సాధువర్తనం కలవాడు. రాముడికి కుడిభుజం, బహిప్రాణం లక్ష్మణుడు.’
‘రాముడికి ఇష్టమైన భార్య సీతాదేవి. ఆమె అందమైన గమనం కలది. సమస్త సద్గుణాలతో గొప్ప కీర్తిని సంపాదించింది. ఆమె తొడలు అరటి స్తంభాల్లా వుంటాయి. ఆమె ముక్కు సంపెంగ పువ్వులాగా ఉంటుంది. సౌందర్యానికి వునికిపట్టైన ఆమె వెనె్నల్లాంటి చిరునవ్వు కలది. షోడశ కళాపూర్ణుడైన చంద్రుడిలాంటి ముఖం కలదామెకు. పతికి హితం చేయాలనే కోరిక ఉందామెకు. మంచి బంగారు వనె్న గలది. తలనిండా నల్లటి వెంట్రుకలున్నాయామెకు. నీతిలోని స్థిరాంశమేదో అదే ఆమె. సింహం నడుం లాంటి సన్నటి నడుం వుందామెకు. రెండో లక్ష్మిలాగా వనదేవతగా వెలుగుతున్నది. దేవతా స్ర్తిలను, కినె్నర స్ర్తిలను, గంధర్వ స్ర్తిలను చూసా కానీ ఇలాంటి స్ర్తిని చూడలేదు. యక్ష స్ర్తిలను, కింపురుష స్ర్తిలను, దైత్య స్ర్తిలను చూశాను కానీ రామచంద్రుడి భార్యలాంటి, కళ్లకు ఆనందం కలిగించే కలువపూల లాంటి కళ్లున్న దాన్ని ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఇలాంటి ఆమె మరొకరున్నారని కూడా వినలేదు. ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పాలి?’
‘సీత ఎవరికి భార్యో, ఎవరిని ఆమె సంతోషంగా కౌగిలించుకుంటుందో, ఆ పురుషుడు మూడు లోకాలలో ఇంద్రుడి కంటే గొప్పవాడై పేరు తెచ్చుకుంటాడు. చక్కటి సౌందర్యం, నడవడి కలిగి స్ర్తిలలో శ్రేష్టురాలైన ఈ సీత నీకు తగిన భార్య. ఆమెకు నువ్వు తగిన భర్తవి. ఇద్దరినీ పోల్చి చూసి ఆ సీతను తెచ్చి నీకివ్వాలని భావించి నేనక్కడికి పోయాను. ముక్కును పోగొట్టుకున్నాను. మగవారికి తెలియకుండా సీతాదేవిని ఎత్తుకొచ్చి నీకిద్దామనుకున్నాను. దాని కోసం చుట్టుపక్కల తిరుగుతూ సీత దగ్గరకు పోయాను. నా ఆలోచన తెలుసుకున్న లక్ష్మణుడు నేను మొత్తుకుంటున్నా వినకుండా, నన్ను పట్టుకొని నా ముక్కులు, చెవులు మొదలంటా కోశాడు. నువ్వే స్వయంగా పోయి ఆ సొగసుగత్తెను కళ్లారా చూస్తే, మన్మథుడికి దాసుడవై ఆ క్షణంలోనే ఆమె కావాలని పట్టుబట్టుతావు.’
‘ప్రేమతో నువ్వు జానకిని భార్యగా చేసుకోవాలంటే అది సాధించడానికి కుడికాలు ముందు పెట్టి తక్షణం బయల్దేరు. ఇప్పుడే దండకారణ్యంలో సీత వున్న చోటుకు పో. రామలక్ష్మణులను యుద్ధంలో చంపు. మగడు చచ్చి దిక్కులేక వున్న సీతను తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం సుఖపడు. రాముడి చేతిలో చనిపోయిన ఖరుడు మొదలైన రాక్షస సమూహంలో ఒక్కడిమీదైనా నీకు కొంచెం ప్రేమున్నా రాముడిని, వాడికి సహాయం చేసిన వాడిని చంపిరా. ఇది నీకు అంగీకారమైతేనే ధైర్యంతో వెళ్లు. నా మాటలు నీకు మంచిగా అనిపిస్తే, శీఘ్రంగా ఆలస్యం చేయకుండా సందేహం వదిలి మల్లెపూవు లాంటి సీతను తీసుకొని రా. రావణా! నేను చెప్పానని నా మీద నింద వేయవద్దు. నాకు తోచింది నేను చెప్పాను. ఎదుటి వారి బలం గురించి కూడా చెప్పాను. నీ బలం ఎంతో ఆలోచించి, అంతకంటే ఎక్కువ బలం ఉందనుకుంటే బలవంతంగా సీతను తీసుకురా. నీ కొరకై దండకలో దిక్కులేని వారిలాగా చచ్చిపోయిన ఖరాది రాక్షసుల మీద కృతజ్ఞతతో వాళ్లకు కలిగిన అకాల మరణం ఆలోచించి దానికి ఎలా బదులివ్వాలో అదే చేయి.’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

మునగచెట్టు - డాబా దెయ్యం

$
0
0

మునగఛెట్టు పూల గుత్తుల ముసిముసి నవ్వులు నవ్వుతుంది అన్నది చూశాను - కాని దాని మీద కథ రాయడానికి ప్రేరణ మాత్రం వో చిన్ని సంఘటన - జరిగింది. అప్పటికే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ గారితో పరిచయం గాఢం కాసాగింది. పత్రికకి కథ పంపాలి అన్న కోరిక మొలకెత్తింది. మా పేట హిందువుల సందులో మునగచెట్టు జ్ఞాపకం వచ్చింది.
లోగడ నేను చెప్పానుగా, మాకు మా వించిపేటలో మా పెద్ద మామయ్య గ్రామఫోను గట్రా వున్న బావి పంపుల వీధిలోని విశాలమయిన డాబా యిల్లు సంగతి - నీళ్లు మాత్రం ‘హుళక్కి’ అని. ఆ ఇంట్లో బారాకాసంత డాబా మీదికి - మెట్లు ఎక్కుతూ వుంటే మలుపు దగ్గర నుంచే తలకి మునగకాయలు తగిలే చెట్టుంది. కాకపోతే ప్రక్క సందులోకి ప్రవేశద్వారమున్న ఆ ఇల్లు ‘గామా’ పహిల్వాన్ గారిది. ఈ కాయలు కోస్తే ‘రిస్కుంది’. అట్లాంటి ఆ ఇంట్లోకి మేము మారిపోయాం.
ఓసారి మా సత్యం అత్త (మేనత్త) భర్త బూసి మామయ్య వచ్చాడు. ఆ రోజుల్లో భార్యలకీ భర్తలకీ వయస్సు వ్యత్యాసం యెక్కువ. ఈ బూసి మామయ్య మా అత్తకన్నా చాలా పెద్ద. బాల్డ్‌హెడ్డూ బొజ్జతో వో పహిల్వాన్‌లా వుంటాడు. గళ్లలుంగీ కట్టుకొని, పైన వో తుండు - వైకల్పికంగా వేసుకుంటాడు. ‘గట్టిపిండం’ అనేది మా మామ్మ.
అతను ఫుట్‌బాల్ ఆడే రోజుల్లో ఒకసారి ఎదుటి జట్టు వాడి మీద కసితో బంతిని లాగి గోల్‌లోకి అన్నట్లు లాగి తంతే - అది వెళ్లి - పాపం.. ప్రత్యర్థి క్రీడాకారుడికి ఛాతీ మీద తగిలింది. అంతే, అతడు ‘హరీ’మన్నాడుట! అట్టి ‘్భశాలి’ (అనగా బలశాలి) ‘అబ్బా! గుమాయిస్తుందే (ఉక్కబోతని వైజాగ్ వాళ్లు అలా అంటారు) అమ్మారుూ? అంటూ మా అమ్మనడిగి ఒక చిరుచాపనీ, దిండునీ (వాళ్లు ‘తలగడ’ అంటారు) పట్టుకొని రాత్రి పది గంటల వేళ డాబా ఎక్కేశాడు.
గగనాన కాటుక తివాసీ మీద ముత్యాలు వొలకబోసినట్లు నక్షత్రాల మిలమిలలు చూస్తూ - చుట్ట ఆర్పేసి, ప్రక్క నేల మీద నొక్కేసి పడుకున్నాడు - నిద్రాదేవి ఒడిలో, హాయిగా...
ఓ రాత్రివేళ, అర్ధరాత్రి దాటింది కాబోలు మెట్ల మీద - దడదడా ఏదో దొర్లించినట్లు - చప్పుడు చీకటిలో లాంతరు వొత్తి పైకి లేపి - చూశారు నాన్నగారు. బూసి మామయ్య? హడిలి.. ఛస్తూ - ‘అబ్బ! దెయ్యం వీపు మీద చరిచిందే!’ అంటూ, చేతనున్న చాపా, దిండూ మెట్ల మలుపులోనే జార్చేసుకుంటూ వచ్చాడు. అదేలెండి ‘పడ్డాడు’ - అనాలి గానీ అతిథి, యింటి అల్లుడూ కావున ‘అట్లు అనరాదు.’
‘మీ డాబా మీద.. దాని మొహం తగలెయ్యా.. బండదెయ్యం వుందే - సుబ్బమ్మత్తయ్యా!’ అంటూ చెంబుడు నీళ్లు వొగరుస్తూ త్రాగేశాడు.
తనకి నిద్ర పట్టింది. కృష్ణాతీరానికి స్నానానికి వెళ్లాలని బయలుదేరుతున్నట్లు కల వచ్చింది. కాని, విసుక్కుని అట్నుంచిటు బోర్లా తిరిగాడుట. మునగచెట్టు వూగిందిట పూనకం వచ్చినట్లు. కళ్లు తెరుద్దాం అనుకుంటూ వుండగానే దెయ్యం వీపు మీద ఓ గ్రుద్దు - అబ్బాయిలా గుద్దేసింది - ఆనక మరో రెండు...
‘బద్మాష్! కోనైబే మేరే జగాపీ - ‘బాజేట్’ అంటూ అరిచింది. అదా! మునగచెట్టు మీద దెయ్యమే. మీ డాబా మీది దయితే మీ పిల్లల్ని గుద్దేది కాదా?’ అన్నాడు బూసిమామయ్య, తేరుకుని. అందరం లేచాం. ‘ఆ దెయ్యం వైజాగ్ తురక దెయ్యమే. అతనితోనే వచ్చి ఉంటుంది’ అన్నది మా అత్త, బూసి మామయ్య చెప్పేది వినకుండా. మునగచెట్టు మీదికి నా దృష్టి మళ్లింది. నేను కాలేజీకి రోజూ, మా ఇంటి జంక్షన్ నుంచి - సన్నగా, నైజాం గూడ్సు షెడ్డు వేపు సాగే ‘సందు’గుండా పోయేవాణ్ణి. పేటలో అంతటా హిందువులున్నారు. గానీ, గల్లీల్లో తూర్పు నించి వచ్చి సెటిల్ అయిన ‘ఏరాడ’ కుటుంబాలు అధికంగా ఉన్నాయి. అటు తర్వాత రైల్వే శాఖ తరపున కుస్తీ పోటీలకు వెళ్లిన రెజిలింగ్ యువకుడు గంగా పహిల్వాన్ ఈ వీధి కుర్రాడే. అదే వీధిలో కుడివైపు వో మునగచెట్టు, పెంకుటిల్లు - దాని ముందు రెండు లాగుడు బండ్లు అందులో వో పెద్దామె - ఇలా ఎవరెవరో వుండేవారు.
నేను బుద్ధిగా, తిన్నగా పోతూనే అన్నీ గమనించేవాణ్ని - నాక్కూడా తెలియకుండానే. అదీ, లోకల్‌గా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతోనూ వన్‌టౌన్ హమాలీల, చూసిన అనుభవంతోనూ ఓ కథ అల్లేను. మా పాల కోటయ్యను చూస్తూ వుంటే నాకు మునగచెట్టులోని రాజయ్య పాత్రకి సరిపోతాడనిపించింది. రాశాను. ఎప్పుడనుకున్నారు? నేను వాల్తేరు నుంచి తిరిగొచ్చాకా. 1960లో అది వీక్లీలో వస్తూనే పండిత పామర జనరంజకం అయింది. అయితే, పత్రిక వీక్లీకి దెయ్యం వూసులేని సీరియస్ కథ రాశాను - ‘ఉదాత్తత’ ప్లస్ మా విశాలాంధ్ర పెద్దలు చెప్పే ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ దెబ్బతింటాయని - కానీ ఇప్పుడు చెబుతున్నాను. మరోసారి విజయ సాహితి పెద్దలు దీన్ని నవల చెయ్యమన్నారు. చేశాను. కానీ దాన్ని మద్రాసుకు తీసుకుపోలేదు. తమ్ముడికిచ్చాను. ముఖచిత్రం కూడా వెయ్యడం పని కూడా అప్పగించాను. కొన్ని అయిడియాలు డిస్కస్ చేసి అప్పగించాను. పబ్లిసిటీ ఆర్టిస్టు కార్టూనిస్టుగా బాగా అందుకుంటున్నవాడు - కవర్‌పేజీలు కూడా వెయ్యాలి - అది మా వాడితోనే మొదలు అవాలి అనిపించింది నాకు.
నేను పోయి, మద్రాసుకి - ఆంధ్రపత్రికలో పడ్డాను. 1961, సెప్టెంబర్ 18. డిసెంబర్ 18న తమ్ముడు బెజవాడ నించి లెటర్ రాశాడు. దేశికవితా మండలి - బొందలపాటి శివరామకృష్ణగారు ‘ఈ నవల నిడివి వంద పుటలు దాటడం లేదు అన్నాడు. కవర్‌పేజీ ‘వోకే’ చేశాడనీ - వోన్లీ ట్వంటీఫైవ్ రుపీసే ఇచ్చాడని - కవర్‌కి.
‘సరే.. నవలని సాగదియ్యటానికి ససేమిరా అని నేను పెద్దల ముందే ప్రకటించాను. ‘అందులో పాత్రలు పెద్దపెద్ద డైలాగులు చెప్పలేవు. అదే పనిగా సీన్‌లు - సీన్‌లు ఆలోచించనూ లేవు’ అని. అంచేత మరి మూడు కథలు చేర్చి - మునగచెట్టు మరియు కొన్ని కథలు’ అని ప్రచురించారు.
ఆ విధంగా ఆ దెయ్యం ఇప్పటిదాకా స్మృతిగర్భంలోనే వుండిపోయింది. డిసెంబర్ 18, 2018న దీనికి విముక్తి ఇలా లభించింది - అనే చెప్పాలి.
సరే, 1960లోకి వెళ్లాం మళ్లీ. ఆనందవాణి కాళిదాసుగారి ఆహ్వానం అలాగే వుంది. నాన్నగారు ఉంటున్న ఆఫీసు తంబుచెట్టి స్ట్రీట్ చివరి భవనం - నెంబర్ 337. ఈ ఆనందవాణి వీధికి ఎదుటి వరుసలో ఉంది. కాకపోతే ఆంధ్రపత్రిక రాధాకృష్ణగారిని కలుసుకోవడం తేలిక. సరిగ్గా ఆంధ్రా ఇన్‌సూరెన్స్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ముందు బాల్కనీలోకి వస్తే, చూస్తే. అక్కడ నుంచి సిక్స్ అండ్ సెవెన్ తంబుచెట్టి స్ట్రీట్ ఆంధ్రపత్రిక కార్యాలయం కనపడుతుంది. రాధాకృష్ణగారి రూము కిటికీలో నుంచి - ఆయన వచ్చిందీ లేందీ తెలుస్తుంది కదలికల వల్ల.
రాధాకృష్ణగారు తిరిగి ఆఫీసుని ప్రొద్దున్న పదకొండున్నర ప్రాంతంలో, వదిలే వేళకి, నేను నాన్నగారికి చెప్పి లిఫ్ట్‌లో దిగిపోయేవాణ్ని. రాధాకృష్ణగారి కారులోకి దూరిపోయేవాణ్ని. ఆయన కారుని స్వయంగా డ్రయివ్ చేసుకునేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ మైలాపూర్ అమృతాంజనం ఆఫీసు చేరుకునేవాళ్లం. అప్పుడాయన అమృతాంజనం మానేజింగ్ డైరెక్టర్ కూడా. పెద్ద హాలు అంతటి ఆయన ఆఫీసు రూము. అటెండర్ పర్‌కొరేటర్‌లో కాఫీ చేసేవాడు. తన ఆఫీస్ పని చూసుకుంటూనే - ఎన్ని కబుర్లు సాగేవి.
ఈలోగా, ఒక్కోరోజు, శ్రీరంగం నారాయణ బాబుగారు అక్కడికి చేరుకునేవారు. వెంటనే కబుర్లు ‘సిగార్’ మీదికి - అంటే ‘చుట్టలు’ మీదికి మళ్లేవి. నారాయణ బాబుగారు - శ్రీశ్రీ, ఆరుద్రలకు సమీప బంధువు మాత్రమే కాదు - ఇంచుమించు అంత ‘వెయిట్’ అంటే ప్రాముఖ్యతగల అభ్యుదయ కవి. ‘సర్రియలిజా’న్ని కాచి వడబోసినవాడు. గ్రేట్!!
అయితే రాధాకృష్ణగారికి మా ‘ద్రావిళ్ల శాఖ’ అంటే చాలా ఇష్టం. ఆయనకి ‘సూరి’ అని ఒక ప్రాణమిత్రుడుండే వాడు. చాలా మంచివాడు. ససృదయుడూ. కోనసీమ ద్రావిళ్లు. దాంతో రుూయన అంటే ‘శి.రా.’గారు (శివలెంకరా.కృ) మా ‘శాఖ’ మీద మొత్తం అటు బరంపురం దాకా వున్న ఏరియాను కలుపుకొని ఒక ‘రీసెర్చ్’ చేశారు. ఏ సబ్జెక్టు అయినా ‘శి.రా.’గారు లోతుగా అధ్యయనం చేస్తేగానీ వదిలేవాడు కాదు. ‘శిరా’ అని పెట్టుకోండి ‘నిశానీ’ ‘శిరా’క్షరాలుగా రాణించాలి మీ రాతలు’ అనేవాణ్ని.
రాధాకృష్ణగారు దరిమిలా ‘శిరా’ అనే కలంపేరు వాడేవాడు ఒక్కోసారి. పొగ త్రాగటం కూడా మానేశాడు ఆనక.
శ్రీరంగం నారాయణబాబు గారు అంటే -‘రుధిరజ్యోతి’ అని చెప్పాలి. నారాయణబాబు గారు, శ్రీశ్రీ గారూ కూడా మాకు తాత వరస - చుట్టరికం బీరకాయపీచు. మా నాయనమ్మని వాళ్లు బాగా ఎరుగుదురు కూడా.
నేననేవాణ్ని ‘పొలైట్’గా ‘వద్దు సార్! నేను బాల్యంలోనే కవినైనాను. చుట్టూ బీడీ సిగరెట్‌లతో నాకు పని పడలేదు... మీ సురకత్తుల లాంటి మాటల పొందిక వారసత్వంగా నాకివ్వండి’ అని. ఎందుకంటే నారాయణ బాబుగారి కవిత్వం ఒక అనితర సాధ్యం అయిన అక్షరాయుధం. ‘గడ్డిపరకను నేను గడ్డిపరకను’ అంటూ పాడేవాణ్ని (ఆయన పద్యమే) శ్రీశ్రీగారి - పదండి ముందుకు పదండి పదండి త్రోసుకు’ అని పాడుకున్నట్లుగానే యిది కూడా..
ఆయన ‘ఒక బ్యాచులర్స్ లాడ్జ్ (పెద్ద అపార్ట్‌మెంట్‌ల మాన్షన్ అది)లో వుండేవారు. రాధాకృష్ణగారు అప్పుడు సైన్సు ఫిక్షన్ తెగ చదివేస్తూ వుండేవాడు. (పాకెట్ బుక్సుగా ఎన్నో వచ్చేవి) నేను జార్జ్‌గారు ‘ఒన్ టు త్రీ ఇన్‌ఫినిటీ’ అభిమానిని. మాకు రకరకాలుగా ‘వేవ్‌లెంగ్త్’ కలిసింది నాకు రా.కృ.గారికి.
అసలింతకీ అప్పుడు నేనెందుకు మద్రాసు నాన్నగారి దగ్గరికి వెళ్లి వున్నానూ అంటే ఆనందవాణి కాళిదాసుగారు పిలిచారు కనుక. ఆ సంగతులు చెప్పాలి మరి. ఇంకా ఆంధ్రపత్రిక కొలువు లేదు...
(ఇంకా బోలెడుంది)

Viewing all 69482 articles
Browse latest View live