
మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే కొంతమందికి ఆ అవకాశాలు అయాచితంగా వరిస్తూనే ఉంటాయి. ఆ కోవలోకే బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ వస్తుంది. ఆమె తొలి చిత్రం ‘ఇద్దరు’ సినిమా మణిరత్నం దర్శకత్వంలోనే నటించింది. ప్రపంచ సుందరాంగిగా ఎంపికయ్యాక తొలిసారిగా నార్త్ లేక సౌత్ సినిమా చేయాలా అని తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో మణిరత్నం నేతృత్వంలో నటించడానికే అప్పట్లో ఐష్ మొగ్గుచూపింది. అదేవిధంగా ఆ సినిమా విజయఢంకా మోగించి ఐష్కు మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల కేన్స్ అంతర్జాతీయ చలనచిత్ర వేడుల్లో పాల్గొని ఐదు నెలలపాటు విరామం తీసుకున్నానని, ప్రస్తుతం మంచి కథలు వింటున్నానని చెప్పింది. ఇప్పటికైతే మణిరత్నం సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ కథనాలు వినిపిస్తున్నాయి. సో.. త్వరలో మణి దర్శకత్వంలో ఐష్ను చూడబోతున్నాం.