Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

భవితను కన్న బాల్యం (కథ )

$
0
0

శిల్ప ట్యూషన్ ముగిసిన తర్వాత తొరగా ఇంటికి బయలుథేరింది. కూతురు కోసం తల్లి ఎదురు చూస్తోంది. కూతురిని వీధి చివరకు రావడం చూసి కప్పు వేడి పాలలో చక్కెర కలిపింది. ఇంట్లో అడుగుపెట్టిన శిల్ప ‘మమీ, మమీ! ఎక్కడున్నావ్... నేనొచ్చేశాను’ అంటూ పిలిచింది.
‘ఆ... వస్తున్నాను... ఏంటి సంగతి... మంచి హుషారుగా ఉన్నావు’ తల్లి కాత్యాయని ఎదురురెళ్లింది పాల కప్పుతో.
‘ఈ రోజు ఏ పాఠాలు చదివావు’ తల నిమిరి చేతిలోని కప్పు తీసుకుని దగ్గరున్న బల్లపై పెట్టింది.
వీపు మీదున్న స్కూలు బ్యాగ్ తీసి షెల్ప్‌లో పెడుతూ, ‘ఆ విషయం తర్వాత చెప్తా. ముందు మా క్లాసు టీచరు ఏం చెప్పిందో విను’ మనసులోని ఆనందం మొఖంపై తాండవమాడింది.
‘ఏమిటో... ఆ సంగతి’ కూతురి ఆసక్తిని ఆబగా వినటానికి కుర్చి లాక్కుని కూర్చుంది.
‘మా క్లాసు మొత్తం నుంచి ఏడుగురు టీంని ఒక పోటీ కోసం ఎన్నుకొంది మా టీచరు. వాళ్లలో నేనొకదాన్ని’ సంతోషం వెలుగుపోతూ చెప్పింది శిల్ప.
‘అయితే’ ఏమడుగుతుందో ముందే ఊహించి మాటను ముందుకు నెట్టింది కాత్యాయని.
‘అది కాదమ్మా! ఫస్ట్ ప్లేస్ రావటానికి నీ హెల్ప్ కావాలి!’ ‘అసలు విషయం చెప్పి బల్లమీదున్న పాల కప్పు తీసుకుని ఇష్టంగా తాగేసింది.’
కాత్యాయని మృదువుగా శిల్పను దగ్గరకు తీసుకుని ‘బహుమతికోసం పోటీపడే ఏడుగురిలో నువ్వుండటం నాకు గర్వంగా ఉంది. నా పెంపకం వృథా కాలేదు. ఏ విషయం మీదో పోటీ చెప్పలేదని’ గుర్తు చేసింది తల్లి కాత్యాయని.
కుడి చేత్తో నెత్తిమీద కొట్టుకుని ‘ఓ... అసలు దాని గురించి చెప్పటం మాని ఏదేదో వాగేస్తున్నా. డ్రాయింగ్ పోటీనమ్మా. మూడు అంశాలిచ్చి వాటిలో ఒకదాన్ని ఎన్నుకోమన్నారు’ మడత పెట్టిన కాగితం ముక్కను స్కూలు యూనిఫాం జేబు నుంచి బయటకు తీసి కాత్యాయని చేతికిచ్చింది.
‘కాలుష్య నివారణ, మత్తు పానీయాల అలవాటు, వన్య సంపద సంరక్షణ’ కాగితంలో ఉన్న అంశాలు పైకే చదివింది కాత్యాయని.
తల్లి చేతిలోని కాగితాన్ని తీసుకుంటు ‘దీంట్లో దేన్ని ఎన్నుకోవాలి? దేని గురించి గీయాలి. లేదంటే మరోదాన్ని ఏదైనా’ ప్రశ్నల వర్షం గుప్పించింది శిల్ప. దానికి సమాధానం ఇవ్వకుండా కూతురి కుతూహలాన్ని చూసి మనసులో నవ్వుకుంది కాత్యాయని.
‘సరే కాని, ఇంకా టైముంది కదా ఈ లోపు దాని గురించి ఆలోచిద్దాం. నీకు భోజనం టైమయింది’ అంటూ వంట గదిలోకి వెళ్లింది.
చిత్రలేఖనం అంటే ఎంతిష్టమో మొన్న మార్చి 8న దామెర్ల రామారావు ఆర్ట్స్ గేలరీలో ఆయన జయంతి ఉత్సవానికి వెళ్లినపుడు తెలిసింది. గేలరీలో ఉన్న మరికొంతమంది ఆర్టిస్టుల చిత్రాల్ని తదేకంగా చూస్తుండి పోవడం గమనించింది. నీటి రంగులతో ల్యాండ్ స్కేప్ చిత్రాలు గీచిన భగీరధి, సంజీవ్ దేవ్, దామెర్ల చిత్రాలు బాగా నచ్చాయి. అప్పుడే తన దగ్గరో ప్రామిస్ తీసుకుంది.
డ్రాయింగ్ పోటీలో బహుమతి ఎలా గెలిపొందాలనే తలంపులో ఉన్న శిల్పకు వెంటనే గుర్తొచ్చింది అమ్మిచ్చిన ప్రామిస్. ఆ మాట ప్రకారం మార్కెట్‌కు వెళ్లి బ్రష్‌లు, పెద్ద చార్ట్, మరికొన్ని రంగులు తల్లితో కొనిపించింది శిల్ప.
శిల్పలోని చిత్రకళాభిలాషను గమనించిన తారా నగేష్ అనే ఆర్టిస్టు కొంత తర్ఫీదునివ్వటం, రంగులద్దే ముందు ఎలా స్కెచ్‌లు వేసుకోవాలి లాంటి అంశాలు ఇప్పుడు ప్రాక్టీసు చేసుకోడానికి ఉపయోగపడ్డాయి.
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని తదితర అనర్థాలను తన తరగతి పాఠం బాగా మనసులో నాటుకుంది. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గమనిస్తుంది శిల్ప. ఒక స్పష్టమైన రూపం మనసులో రూపు దాల్చింది.
తల్లి చెప్పే మాటలు, డ్రాయింగ్ సార్ ఇచ్చే గైడెన్స్, క్లాస్ టీచర్ ప్రోత్సాహం పోటీకి అవసరమైన బలాన్నిచ్చాయి శిల్పకు.
తల్లి కాత్యాయనితో బజారుకు వెళ్లటం శిల్పకు ఓ సరదా. అన్నీ చూడొచ్చు. మనుషుల వేషభాషలు వస్తువులు ఒకటేమిటి అన్నీ చూడటం అమ్మతో బాగా అలవాటు అయ్యింది.
ఒకసారి ఒక ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ మార్కెట్‌కు వెళ్లారు. వాళ్లు కొనే ప్రతి వస్తువుకి ఒక కవరు ఇవ్వటం గమనిస్తూనే ఉంది శిల్ప. కేరీ బ్యాగ్‌ల వల్ల జరిగే అనర్థం అంటూ స్కూల్లో టీచరు చెప్పిన మాట గుర్తొచ్చి తల్లిని అడిగింది శిల్ప.
‘అమ్మా! అనర్థం అంటే ఏమిటి?’
‘అవసరాన్ని మించి వాడేయడమే అనర్థం. అవినీతి కావచ్చు, బజారు నుంచి తెచ్చుకునే సంచులు కావచ్చు’ అమ్మ ఎప్పుడు మార్కెట్‌కు వచ్చినా చేతిలో ఓ గుడ్డ సంచి తప్పక ఉంటుంది. అమ్మ చెప్పిన సమాధానం నిజమనిపించింది.
వారంలో ఓ రోజు తారా నగేష్ సార్ దగ్గరకెళ్లటం, సందేహాలు తీర్చుకోవడం శిల్పకు పోటీ మూలంగా అలవాటు అయ్యింది.
‘జాతీయ జెండాలోని మూడు రంగులు’ వాటి పోలికలు నిజమేనా సార్! నగేష్ సార్‌ని అడిగింది శిల్ప.
‘ఏ రంగు దేన్ని సూచిస్తుందో అది నీ భావాన్ని బలపరుస్తుంది’ నిమ్మళంగా చెప్పారు నగేష్ సార్
ఏ రంగు ఎలా మిళితం చెయ్యాలో ఏ రెండు రంగులు కలిపితే మరో రంగు వస్తుందో తెలుసుకున్నది అప్పుడే.
పక్కాగా ప్రాక్టీసు మొదలెట్టాక చక్కని చిత్రాలు ఎలా గీయొచ్చో బాగా అవగతమయ్యింది శిల్పకు. తను బొమ్మలు వేస్తున్నప్పుడల్లా కాస్త సృజనాత్మకతను జోడించమ్మా అనటం గుర్తొచ్చి తన క్లాస్ టీచర్‌ను అదే మాట అడిగింది శిల్ప.
‘చూచిన దానికి, తెలుసుకున్న దానికి నీ తెలివిని జోడిస్తే అదే సృజనాత్మకత’ టీచరు గుచ్చి చెప్పడంతో బాగా అర్థమయ్యింది.
నిత్య జీవితంలో ఎదురైన అనుభవాలు సమస్యలను అధిగమించే ప్రయత్నాలు ఎరుక పరిస్తే బాల్యానికి, జీవితంలో ఎదగటానికి భవిష్యత్తును నిర్మించుకోడానికి దోహదపడతాయి.
చిత్రలేఖన పోటీల్లో శిల్ప ఎన్నుకున్న అంశం కాలుష్య నివారణ. అందులో భాగంగా పర్యావరణ స్పృహతో ఒక చిత్రాన్ని రూపొందించింది. డ్రాయింగ్ షీట్‌లో ఒక పక్క కళకళలాడుతున్న బజారు, మరోపక్క చేతి సంచితో నారతోగాని బట్టతోగాని చేసిన సంచి, అది తల్లి కూతుళ్లు వెళ్తున్న దృశ్యం. బజారులో దుకాణాల ముందు వేలాడదీసిన క్యారీ బ్యాగ్‌లు, మార్కెట్ చేస్తున్న వాళ్ల చేతుల్లో క్యారీ బ్యాగ్‌లు ఎరుపు, నీలం, తెలుపు, పసుపు, అన్నీ రంగుల సంచులు పరచుకుని ఉన్నాయి. ముదురు వర్ణంలోనే కాదు, లేత వర్ణంలోను పేలవంగా పాలిపోయి ఉన్నాయి.
చిత్రంలో అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. కొన్ని పొందికగా కూడా ఉన్నాయి. పరిణతి సాధించిన అంశం చక్కగా ఇమిడిపోయి ఉంది. ఇంకా ఆ చిత్రానికి ఒక టైటిల్ కూడా పెట్టింది. ‘ప్లాస్టిక్‌ను వదిలేద్దాం! పర్యావరణాన్ని కాపాడదాం!’
పోటీలో ఉత్తమ చిత్రంగా ఫ్రైజ్ మనీని గెలుచుకుంది శిల్ప గీసిన చిత్రం. అభినందనలు, ప్రశంసలు క్లాస్ టీచర్‌తోపాటు స్కూల్ ప్రిన్సిపాల్ సహా విద్యార్థులు ముద్దుల వర్షం కురిపించారు. భవితను కన్న బాల్యం ఊహకు దక్కిన గౌరవం, కళాత్మకతను ఛేదించిన సృజనాత్మకత.
పిల్లల ఆలోచనలకు దగ్గరగా మనం వెళ్లటం కాదు. వాళ్లు వెళ్లే ఆలోచనలకు మనం వెళ్లి చూడగలిగితే చాలు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఇట్టే సులువు.

- అనంత్
సెల్: 9494842274

పుస్తక సమీక్ష

సామాజిక స్పృహధార
‘యశోధర’!

ఆధునిక యుగంలో బహుళ జనాదరణ పొందిన ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలోకి వచ్చిన వాంజ్మయ ప్రక్రియ ‘నవల’. సాంఘిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని అనేక మంది నవలా రచయితలు మంచి నవలల్ని రాశారు. సాంఘిక నవలల తర్వాత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించినవి చారిత్రాత్మక నవలలు. చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చినవే ఈ నవలలు. వీటిలో ఊహకి చోటులేదు, సత్యానికే చోటు. ఈ కోవకు చెందిన చారిత్రాత్మక నవలే ‘యశోధర’.
ఈ నవలను 2006లో అక్టోబరు 14న తొలిసారి ఆవిష్కరించారు. యశోధరకు సంబంధించిన చరిత్ర ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఆ లోటును భర్తీచేయటానికా అన్నట్లు యశోధర చరిత్రను తవ్వితీసి, ఒక చారిత్రాత్మక నవలగా అందించారు డా. గూటం స్వామి. యశోధర చరిత్రను నవలగా రూపొందించటంలో డా. స్వామి ముందుచూపు ప్రశంసనీయం. ఆయన కృషికి తార్కాణంగా కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం (2014) పొంది రూ.10వేలు నగదు బహుమతి అందుకొని చరిత్ర సృష్టించింది ‘యశోధర’.
యశోధరను ప్రధాన పాత్రగా చేసుకొని రాసిన నవల ఇది. ప్రతి పురుషుని అభివృద్ధి వెనుక ఒక స్ర్తిమూర్తి త్యాగం ఉంటుందనేది జగద్విదితమే. సిద్ధార్థుడు పరివ్రాజకుడై, జ్ఞానోదయుడై, అఖండ విశ్వానికి జ్ఞానసూర్యుడిగా వెలుగొందటానికి అర్ధాంగిగా యశోధర సహకారం, త్యాగం అసాధారణమైనవి. శాక్యవంశీయుడైన దండపాణి ముద్దుల తనయ యశోధర, స్వయంవరంలో సిద్ధార్థుని భర్తగా పొంది, జీవితం ఆనందంగా సాగుతున్న దశలో సిద్ధార్థుడు వరివ్రాజం స్వీకరించాలని నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని, నిరుత్సాహ పడకుండా సర్వమానవాళి సౌభాగ్యాన్ని, సమాజ సంక్షేమాన్ని ఆశించి, భర్తకు తన నమ్మతిని తెలిపిన వీరపత్ని, ధీరవనిత.
సిద్ధార్థుని నిష్క్రమణం తర్వాత మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి, అతని గుణగుణాలను గుర్తు చేసుకుంటూ చివరికి బుద్ధుని బోధనల ప్రభావంతో మహిళా వరివ్రాజికయై సిద్ధిపొందింది. సిద్ధార్థుని అర్ధాంగిగా, బుద్ధుని అంతేవాసిగా జీవించిన మహోన్నత త్యాగశీలి యశోధర మహిళాలోకానికే ఆదర్శనీయురాలు. బౌద్ధ జగత్తులోనే ఆదర్శ భిక్షుణిగా జీవనం సాగించిన యశోధర త్యాగనిరతిని పఠనీయంగా అక్షరబద్ధం చేశారు డా. గూటం స్వామి. నవల సామాజిక చైతన్యం కలిగించేదిగా ఉండాలనేది జగమెరిగిన సత్యం. ఈ నవలలో కొన్ని సామాజికాంశాలను కవి స్పృశించారు. వివాహ వయస్సు వచ్చింది, వివాహం చేయాలన్న తన తండ్రితో యశోధర ‘నాకింకా బాల్యాన్ని అనుభవించాలని, తండ్రిచాటు బిడ్డగా జీవించాలని ఉంది. వివాహం చేసుకొని మిమ్ముల్ని విడిచి వెళ్లిపోతే మీ ఆలనాపాలనా ఎవరు చూస్తారు? మీ సేవ చేసుకునే భాగ్యం కొనే్నళ్లైనా దయచేయమ’ని ఒక కుమార్తెగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. అలాగే భర్త పట్ల, అత్తమామల పట్ల, చివరికి కుమారుని పట్ల కూడా తన ధర్మాన్ని బాధ్యతనెరిగి సక్రమంగా నిర్వర్తించింది. ఎంతటివారైనా కూతురుని ఒక అయ్యచేతిలో పెట్టడం లోక సహజం. ‘అది సృష్టి ధర్మమని, ఆ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించటం తప్పేకాదు, నేరమవుతుందని, చక్కని వరుణ్ణి వెదికి వివాహం చేస్తానని’ యశోధర తండ్రి తన ధర్మాన్ని తనూ సక్రమంగా నిర్వర్తించాడు. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ- ఈ అయిదుగురినీ ఎవరైతే పూజిస్తారో వారే ఈ భూమీద ధర్మాత్ములని, తండ్రి మాట శిరసా వహించమని సిద్ధార్థునితో పెంచిన తల్లియైన ‘ప్రజాపతి’ చెప్పి తన ధర్మాన్ని నిర్వర్తించింది.
‘పుట్టటం, చావటం చాలా భయానకమైనవి. దాన్నుంచి తప్పించుకునే మార్గం కోసమే నా అనే్వషణ, ఆందోళన’ అని చెబుతాడు బుద్ధుడైన సిద్ధార్థుడు. జీవులను హింసించరాదని ఈ నవల ద్వారా మనకు తెలుస్తుంది. నోరున్న జీవులకే కాదు, నోరులేని మూగజీవాలకు రక్షణ కల్పించాలన్న సిద్ధార్థుని అభిప్రాయంతో యశోధర ఏకీభవిస్తుంది. ‘చంపేవాడిని చంపేవాడు ఇంకొకడు ఉంటాడని, విజేతనూ జయించేవాడు ఇంకొకడు ఉంటాడని, దోచుకొనేవాడిని ఇంకొకడు దోచుకుంటాడ’ని శాక్య సంఘాన్ని ధిక్కరించి సిద్ధార్థుడు శాంతిని కోరాడు. హింసని వ్యతిరేకించి దేశ బహిష్కరణను కోరుకున్నాడు.
బుద్ధుని కరుణరస పూరితమైన చరిత్రను ఎంతోమంది కవులు కావ్యాలుగా రాశారు. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమమూర్తిగా, అత్తమామల పట్ల ఆదరణ - కర్తవ్య నిర్వహణ చేసి, భర్త అడుగుజాడల్లో జీవితాంతం వరకూ నడిచిన భార్యగా, కుమారునికి మంచి తల్లిగా తన జన్మను చరితార్థం చేసుకున్న యశోధర హృదయాన్నీ, జీవితాన్నీ వెలికితీయాలని రచయిత చేసిన ప్రయత్నం, అతనికున్న సామాజిక స్పృహ అనిర్వచనీయం. ఇలాంటి చారిత్రాత్మక నవలను రచించిన డా. గూటం స్వామి జన్మ ధన్యం.
బుద్ధం శరణం గచ్ఛామి/ ధర్మం శరణం గచ్ఛామి / సంఘం శరణం గచ్ఛామి

- డా. చుక్కా యశోద,
చరవాణి : 9440850447

పుస్తక పరిచయం

బౌద్ధాన్ని కళ్లకు కట్టే ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’

కవిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది శైలి. రచనా సంవిధానాన్ని బట్టి ఆ కవి ప్రతిభను ఊహించవచ్చు. రచయిత తన శైలికి ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో తన రచనలో దిశా నిర్దేశం చేసిన నల్లి ధర్మారావు తన దృక్పథాన్ని ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’ అనే అనువాద రచన ద్వారా తెలియజేశారు. ధర్మారావు అనువాదకుడు, కవి, రచయిత, విశే్లషకుడు. రచన చిన్నదైనా ఉన్నంతలో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే వరకు పొందిన క్రమ పరిణామ వికాసాన్ని చర్చించారు. జీసస్ నుండి బుద్ధుని వరకు తెలిపారు. సంక్షిప్తంగా గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడో తెలియజేశారు. బౌద్ధ్భిక్షువుగా మారిన ‘శ్రావస్తి ధమ్మిక’ రచించిన ‘గుడ్ క్వశ్చన్... గుడ్ ఆన్సర్’ అనే పుస్తకాన్ని బండారు ఉత్తమ బుద్ధిస్టు సొసైటీ, ఇంగ్లండ్‌లో ప్రచురణ జరిగి సంచలనం సృష్టించింది. దీనిని 12 భాషల్లో అనువాదాలు చేశారు. ఒక బౌద్ధ ప్రార్థనా మందిరం (స్థలం)లో ఉచితంగా పంపిణీ చేయగా దాన్ని తెలుగులో అనువాదం చేయాలనే ఉద్దేశ్యంతో బౌద్ధ మతాన్ని గౌరవించే రచయితగా నల్లి ధర్మారావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. విదేశాలకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజాలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషమని రచయిత నల్లి ధర్మారావు అంటారు. ఈ రచన శంకరంబాడి సుందరాచారి రచించిన ‘బుద్ధగీతి’ అనే ఖండకావ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథంలో నల్లి ధర్మారావు బౌద్ధం ఎలా విస్తరించింది అనే విషయాన్ని కాకుండా అత్యున్నత తత్వశాస్త్రంగా తెలిపారు. ఆయన బోధనలు ఎన్నో లక్షల మంది జీవితాల్లో పరివర్తన తెచ్చి మార్చగలిగిందని తెలిపారు. మతపరమైన అసహనం, గర్వం, స్వార్ధం అనే అంశాలపై కచ్చితంగా అధ్యయనం చేయాలని, బౌద్ధంలోని నాలుగు ప్రధాన సూత్రాలు, నాలుగు సత్యాల ద్వారా కచ్చితమైన శాస్ర్తియ విధానాన్ని రచయిత నల్లి ధర్మారావు తెలిపారు. ఈ గ్రంథంలో వర్ణనలు, సన్నివేశాలు సందర్భోచితంగా కనిపిస్తాయి. సిద్ధార్థుడి తపస్సు వర్ణన, అతని బోధనలు, నుడికారాలు, భావుకత, సరళశైలి అలంకారాలు ఈ చిన్న కావ్యాన్ని అద్భుత గ్రంథంగా మలిచాయి. ఈ కావ్యం తేటగీతి పద్యాలతో రూపుదిద్దుకుని బుద్ధుడి జననం నుండి జ్ఞానోదయం వరకు ఉన్న అన్ని అంశాలతో అలరిస్తుంది. అలాగే ఏ తరహాలో బుద్ధుని ఆరాధనం చేయాలో, ఎక్కడెక్కడ బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉన్నారో ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి మనిషిలో తలెత్తే అనేక ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. పునర్జన్మలో లక్ష్యాలను కూడా సాధించవచ్చునని అభివర్ణించడం జరిగింది. బుద్ధుడి బోధనల్లో ఇదొక అద్భుతమైనదని తెలిపారు. ఒక భాషకు చెందిన భావం, సాహిత్యం మరే ఇతర భాషలతో సంబంధం లేకుండా మనజాలదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా భావించిన గాంధీ మహాత్ముడికీ బుద్ధుడే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆనాటి ప్రజలు బుద్ధుడిని ఎలా అనుసరించారు. ఆయన బోధనలను ఎలా విన్నారని తెలియజేస్తూ సరళమైన భాషలో, ఆకట్టుకున్న శైలిలో ఈ గ్రంధాన్ని రచయిత రాశారు.

- శృంగారం ప్రసాద్, సెల్ : 9985828323.

మనోగీతికలు

స్మృతులు
ఆకాశం వైపు చూశాను
మేఘాల మధ్య నుండి
చూస్తున్నాడు చంద్రుడు
మేఘాల చర నుండి బయటపడటానికి
వసంత కాలంలో చల్లగాలి
నా మీదుగా వెళ్తూ
మేఘాలను పలకరించి
తనకు తోడుగా
వర్షాన్ని తెచ్చుకుంది
చినుకులు ఒక్కొక్కటిగా
నా మేనుని తాకుతుంటే
ఆ స్పర్శ నాకు బాల్య స్మృతులను
గుర్తు చేశాయి...
జోరు వర్షంలో
మిత్రులతో కలిసి కాగితపు
పడవల పోటీలు
కోతికొమ్మచ్చుల ఆటలో
చెట్టుకొమ్మలు పట్టుకొని గాలిలో ఊగటం
పరుగు పందాలు...
గోళీల ఆటలు..
బడి సెలవు వస్తే చేనుగట్లపై షికార్లు
ఒకటేమిటి ఇలా ఎన్నో స్మృతులు
తళుక్కున మెరిసిన మెరుపు
నన్ను బాల్యం నుండి బయటకు పడేసింది
మరలా ఆకాశం వైపు
చూశాను
చంద్రుడు నన్ను చూసి
మేఘాల మధ్య దాగుంటున్నాడు
వర్షాన్ని ఆహ్వానిస్తూ...

- చింతా రాంబాబు
కాట్రేనికోన, చరవాణి: 9948178092

శిక్ష
చూపులు కలుపుకొని
చెట్టా పట్టాలు వేసుకొని
పార్కుల వెంట తిరిగావు
క్షణ కాలంలో
తనువు అర్పించావు
ఆనందకరమైన అందమైన
ఊహల్లో విహరించావు
పార్కుల వెంట తిప్పినవాడు
పారిపోయాడు
వాడి రూపాన్ని నీ కడుపున
ఉంచి
వాడిని మరిచావు
నన్ను వికసించకుండా
‘అబార్షన్’ అనే శిక్ష వేసి
నశింప జేశావు
ప్రేమ ముసుగులో మీకు (నీకు)
తెలిసిన ప్రేమ ఇదేనా...?
(నీవు) మీరు చేసిన తప్పుకు
నాకు ‘శిక్ష’ వేస్తావా (రా)...?

- చింతా రాంబాబు
కాట్రేనికోన
చరవాణి: 9948178092

కవితనా సంబరం సాగరం
నేను చూశాను కాకినాడలో
అద్భుత ఆటపాటల సంబరాలు!
గులాబి పరిమళం వీచిన
విద్యార్థుల స్నేహ సంబంధాలు!
నాటకాలు, నృత్యాలు, క్రీడలు
మరెన్నో వేడుకలు!
అంతరించిపోతున్న మానవ సంబంధాలకు
ఆదికావ్యం ఈ సంబరాలు!
ప్రభుత్వపు ప్రేమాభిమానాలకు
కొలతలు ఈ నెలతలు!
అందాల విన్యాసాలకు
మా విద్యార్థుల మమతలు!
ఎంత చదువు చదివినా
ఆహ్లాదం లేనిదే ఏముంది జీవితం!
మనసు, మమత ఆనందించనిదే లేదు జీవనం!
అందుకే మన ఎనె్నసెస్ చేస్తుంది
సేవా పోరాటం!
అభ్యుదయంతో ఆరాటపడుతుంది !
విద్యార్థులకు ఈ సంస్థ
నిరంతర కాపరి!
వారి ఎదుగుదలకు, కృషికి ఊపిరి!
అందుకే గగనాన్ని తాకిన
ఈ సాగర సంబరాలు!
మా విద్యార్థుల హృదయాలకు
సాంత్వన పరిమళాలు!

- డి ప్రశాంతి
ఫస్ట్ బిసిఎ

కొబ్బరాకు
వెనె్నల్లో ఆకాశం
కొబ్బరాకు మాటున
చిరునవ్వు నవ్వే కనె్నపిల్లలా ఉంది
రాత్రంతా
సీతాకోక నిశీధి
ఇంద్రధనస్సులా గుండెలో నింపుకొని
వెచ్చని ప్రకృతి వడిలో
కలలుకంటూ నిద్రపోతోంది
కొబ్బరాకు నీడన
గాలి మాటలకు
వౌనంగా అటూ ఇటూ ఊయలలా
ఊగుతూనే ఉంటుంది మేఘాల మధ్యన
కొబ్బరాకు
చెట్టు హృదయాన్ని చెప్పటానికి
మనసు వెనుక నుండి
గాలి చూరుకు పట్టిన గబ్బిలంలా
వేలాడుతూ ఆకాశం చెవిలో
చెపుతుంది వౌనంగా
రెండు పెదాలు
రెండు కళ్లు పలకలేని భావాలకు
కొబ్బరాకు
నీలి మేఘం ముసుగులో పైటేసింది
జీవిత రంగస్థలంపై
మనిషి నాటకం
ముగిసిన క్షణాన
నీవే కాటికి దారవుతావు
చివరి క్షణాన
గుండెకు తాకే మిత్రుడవుతావు

- నల్లా నరసింహమూర్తి అమలాపురం
చరవాణి - 9247577501

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net


గడుసు కాకికి గడిచిన గండం! (బాలల కథ )

$
0
0

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక ఇల్లు. దానిని ఇల్లు అనేకంటే తోట అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి నిండా రంగు రంగుల పూలు. రకరకాల పండ్లు, పిచ్చుకలు, కాకులు, చిలుకలు, గోరువంకలు, ఇంకా రకరకాల పక్షులు ఆ చెట్లకొమ్మల్లో గూళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పక్షులే కాదు ఉడుతలు కూడా సందడి చేస్తుంటాయి. సీతాకోకచిలుకల సంగతి వేరే చెప్పాలా!
ఆ ఇంట్లో, అదే ఆ తోటలో పసి అనే ఓ చిన్న అమ్మాయి ఉంది. రోజూ పొద్దునే్న ఆ పక్షుల కూతలు, అరుపులతోనే పసి నిద్రలేస్తుంది. నిద్రలేచి పక్షుల సందడి వింటూ, ఆనందిస్తూనే కొద్దిసేపు బడిలో చెప్పిన పాఠాలు వల్లెవేస్తుంది. తన పనులన్నీ పూర్తి చేసుకుని బడికి తయారవుతుంది. ఇంతలో పసి నాయనమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుంది. పసి దానిని ప్లేటులో పెట్టుకుని ఇంటి పంచలోకి చేరుతుంది. అంతే! ఠంచనుగా రెండు కాకులు వచ్చి పసికి దగ్గరలో వాలతాయి. అప్పుడప్పుడు అతిథిలా మూడో కాకి కూడా వస్తూంటుంది.
పసి తను తినేది ఏదైనా సరే చిన్నచిన్న ముక్కలు చేసి కొన్ని ముక్కల్ని కాకులకు వేస్తుంది. ఇలా చాలాకాలంగా జరుగుతోంది. రెండు కాకుల్లో ఒకటి తనకు అందినది తిని తృప్తిపడేది. రెండో కాకి గడుసుది, ఆశపోతుది. పసి వేసిన ఆహారంలో అధిక భాగం గడుసు కాకి గబుక్కున ముక్కున కరుచుకుని ఎగిరి వెళ్లి అవతల ఎడంగా వాలేది. పసి మరో ముక్క విసరగానే మళ్లీ రివ్వున వచ్చి తన నేస్తం అందుకోబోయే ముక్కనూ టక్కున తానే తన్నుకుపోయేది. పాపం! మొదటి కాకి ఉసూరుమని చూసేది. గోలచేసేది కాదు. పసికి జాలేసి దానికి దగ్గరగా పడేలా మరికొన్ని ముక్కల్ని విసిరేది.
ఇది చూసి పసివాళ్లీ నాయనమ్మ ‘నీకు పెట్టేదే కాస్త. బతిమాలగా బతిమాలగా అందులో నువ్వు తినేది కొద్ది. కాకులకూ, పిట్టలకూ పందేరం జాస్తి’ అని పసిని అరిచేది. ఆమె అరుపులకి పసి పకపక నవ్వేది. వీళ్ల గోలకి బెదిరిన కాకులు ఏ చెట్టు కొమ్మలమీదనో వాలి ఇంకో ముక్క ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవి.
ఇలా జరుగుతుండగా, ఒకరోజు అల్పాహారంలోకి క్యారెట్ కూర చేసింది పసి నాయనమ్మ. అలవాటు ప్రకారం పసి చపాతీ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలు కూడా కాకులకు వేసింది.
ఎప్పటిలాగే గడుసు ఆశపోతు కాకి హడావుడి చేస్తూ ఆ ముక్కల్ని ఆత్రంగా గబగబా ముక్కున కరుచుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ తొందరలో క్యారెట్ ముక్కలు గొంతులోకి జారాయి. గొంతులో అడ్డం పడ్డాయి. అంతే! ఆశపోతు కాకి అయోమయంలో పడిపోయింది. కక్కలేదు, మింగలేదు, అరవలేదు, అటు గెంతింది, ఇటు గెంతింది. మెడ సాచి అరవబోయింది. ఏమిచేసినా ఆ ముక్కలు దాని గొంతులోంచి బయట పడలేదు. లోపలికి పోలేదు. దాని నోరు మూత పడలేదు. గిలగిలలాడిపోతోంది.
నేస్తపు కాకి దాని బాధను చూసి తల్లడిల్లిపోయింది. నిలువునా కరిగిపోయింది. దాని చుట్టూ చుట్టూనే తిరుగుతోంది. వాటి భాషలో ఏదేదో చెపుతోంది. పసి కూడా కంగారుగా, ఏమవుతుందోననే ఆందోళనతో వాటినే చూస్తోంది. ‘స్కూల్ టైమ్ అయింది. నీ టిఫిన్ ఎంతసేపు? కానీ తొందరగా. తినకుండా అలా దిక్కులు చూస్తావేం?’ అని గట్టిగా అరుస్తోంది పసి నాయనమ్మ.
‘ఉండమ్మా!’ అన్నదే గాని, పసి చూపుల్ని కాకుల నుండి తిప్పలేదు. ఆ కాకికి ఏమవుతుందోననే పసి ఆందోళన. వాటినే చూస్తోంది.
మొదటి కాకికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. చుట్టూ చూసింది. చివర్న చిన్న వంపు తిరిగిన పొడుగాటి గట్టిపుల్ల ఒకదాన్ని తెచ్చి కాలి కింద పెట్టుకుంది. గడుసు కాకి ఇదేం పట్టించుకునే స్థితిలో లేదు. మొదటి కాకి గడుసు కాకితో గొడవ పెట్టుకుంది. ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్నబోతోంది. అమాయకంగా మెత్తగా ఉండే దీని చేష్టలకి గడుసు కాకి ఆశ్చర్యపోయింది. అసలే కిందా మీదా పడుతూ తలకిందులవుతున్న దానికి అంతలోనే బాగా కోపం వచ్చింది. పెద్దగా అరిచేందుకు ప్రయత్నిస్తూ నోరు బాగా తెరచి మొదటి కాకి మీదకు ఎగబడింది. మొదటి కాకి సరైన అదను చూసి కర్రపుల్లను గడుసు కాకి నోట్లోపెట్టి మెల్లిగా నెట్టింది. దాంతో క్యారెట్ ముక్కలు గొంతులోంచి దాని పొట్టలోనికి జారిపోయాయి. అంతే! గడుసు కాకి బాధ చటుక్కున మాయమయింది. మెడ అటూ ఇటూ తిప్పింది. హాయిగా రెక్కలు ఆడించింది. ‘కావ్.. కావ్..’ అని అరిచింది.
అంతవరకూ ఊపిరి బిగపట్టుకొని చూస్తున్న పసి ‘హమ్మయ్య!’.. అంటూ గబగబా తన అల్పాహారం తినడం పూర్తిచేసి స్కూలుకు వెళ్లిపోయింది. తన గడుసుదనం, దురాశ వలన కలిగిన ముప్పును, స్నేహితుని మంచితనం వలన కలిగిన మేలును ఆశపోతు కాకి తెలుసుకుని తన బుద్ధిని మార్చుకుంది. అప్పటి నుండి ఏ ఆహారాన్ని అయినా చెరిసగంగా పంచుకుని హాయిగా, ఆనందంగా తినేవి ఆ రెండు కాకులు.

కె శరచ్చంద్ర జ్యోతిశ్రీ,
పెదకూరపాడు, గుంటూరు జిల్లా.
చరవాణి : 9491128554

ఆధ్యాత్మికం

ధర్మ రక్షకుడు.. ఆదర్శ లోకపాలకుడు

రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ప్రతిరూపం సాక్షాత్తూ శ్రీరాముడు అని అర్థం. ఈ మాట అన్నది ఎవరో కాదు, క్రూర రాక్షసుడైన మారీచుడు రాక్షసరాజైన దశకంఠునితో అన్న మాటలివి. రాముడు ధర్మ రక్షకుడు. పితృవాక్య పరిపాలకుడు. సకల సద్గుణాలు కలిగినవాడు కావటం వల్లనే శ్రీరాముణ్ని సకల గుణాభిరాముడు అన్నారు. రామాయణ మహాకావ్యం బహు రమ్యమైనది అయినా రాముని పాత్ర ఆదర్శవంతమైనది కావటం వల్ల నేటికీ రామాయణం ప్రజల గుండెల్లో స్థిరంగా ఉంది. సీతారాములు ప్రజల మధ్యనే ఉన్నారు!
రామాయణ మహాకావ్యాన్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే రాముడు, సీత, లక్ష్మణ పాత్రలన్నీ దేవీ దేవతల రూపాలతో కనిపిస్తాయి. అదే రామాయణాన్ని సాధారణ దృష్టితో చూస్తే అందులోని పాత్రలన్నీ నిత్యజీవితంలో మనచుట్టూ తిరిగే సంఘటనలను గుర్తుచేస్తాయి. అందుకే రాముడు అవతార పురుషుడయ్యాడు. దశావతారాల్లో ఒక అవతారమైన మానవ జన్మలోని విశిష్టతను ప్రపంచానికి చూపించాడు. మానవుడిగా పుట్టినవాడు ఏదైనా సాధించగలడన్న మాటకు రాముడిని నిదర్శనంగా చూపవచ్చు. శ్రీరాముడు మనకు ఒక పుత్రునిగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక మంచి మిత్రునిగా, ఒక పరాక్రమవంతునిగా.. ఇలా అనేక కోణాల్లో కనబడతాడు. ఇన్ని విశేష గుణాలున్న పురుషుడు ఆ యుగం నుండి ఈ యుగం వరకు మరెవరూ పుట్టలేదు. ఇక పుట్టబోరు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
రాముడు పుట్టిన రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. ఆ మహావిష్ణువు స్వయంగా మానవ రూపంలో అవతరించినది చైత్రమాసంలోని శుక్లపక్ష నవమినాడు. ఆనాడు ఎవరైతే శ్రీరాముని పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా దేశమంతటా జరుపుకుంటాము. ఆరోజు భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతా రాముల వివాహాన్ని వైభవంగా జరుపుతారు. శ్రీరామనవమి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి భద్రాచల క్షేత్రానికి ఎవరైతే వస్తారో.. వారు అశ్వమేథ యాగం చేసిన ఫలాన్ని పొందుతారని బ్రహ్మ పురాణం చెబుతోంది. భద్రాచల క్షేత్ర మహత్మ్యమూ దీన్ని తేటతెల్లం చేస్తోంది.
ఈ భూమిపై ఆదర్శ దంపతులు ఎవరు? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం సీతారాములు. సీత వంటి సహనవతి, రాముని వంటి గుణవంతుడు ఈలోకంలో మరెవరూ లేరు. సీతను రావణుడు అపహరించి లంకలో ఉంచినా.. సీత ఆలోచనలన్నీ రాముడి చుట్టూ తిరిగేవి. రాముని మనస్సులో సీత మాత్రమే ఉండేది. రాముడు ఏకపత్నీ వ్రతంతో బ్రహ్మచర్య విశిష్టతను తెలియజేస్తే, సీత ఎలాంటి వ్యామోహాలకు లొంగక తన ప్రాతివత్యాన్ని లోకానికి చాటింది. అందుకే ఆమె స్ర్తిజాతి గర్వించదగిన స్ర్తిమూర్తిగా నిలిచింది.
సీతారాముల కల్యాణాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే అది మన హిందూ వ్యవస్థలోని పటిష్టతను, విశిష్టతను తెలియజేస్తుంది. హిందూ వివాహంలో నూతన దంపతులను సీతారాముల్లా అన్యోన్యంగా ఉండమని దీవిస్తారు మన పెద్దలు. తల్లిదండ్రులైతే రాముని వంటి పుత్రుడు, సీత వంటి కుమార్తె కలగాలని దేవుని ప్రార్థిస్తారు. యుక్తవయస్సు వచ్చిన యువకులు సీత వంటి సహనవతి, అందగత్తె భార్యగా లభించాలని, యువతులు రాముని వంటి గుణగణాలు కలిగినవాడు, ఏకపత్నీవ్రతుడు భర్తగా లభించాలని కలలుగంటారు.
సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని మనం రామాయణం చదివి బాగా అర్థం చేసుకుంటే భార్యభర్తల మధ్య విబేధాలు ఏర్పడవు. విడిపోవటం అనే మాటే రాదు. వివాహ జీవితంలో దంపతులు ఎలా ఉండాలి? జీవనం ఏవిధంగా సాగించాలి? వంటివి మనకు తెలుస్తాయి. ఒకప్పుడు మనదేశంలో విడిపోవటం, విడాకులు తీసుకోవటం అనేవి చాలా అరుదుగా కనిపించేవి. భార్యభర్తల మధ్య తేడాలు వచ్చినా పెద్దలు కలుగజేసుకుని సరిచేసేవారు. నేడు విదేశీ సంస్కృతి, సంప్రదాయాల పుణ్యమాని పెళ్లయిన మూడు నెలలకే విడాకులు తీసుకునే సౌకర్యం ‘విడాకుల చట్టం’ ద్వారా లభించింది. ఇది మన వివాహ వ్యవస్థను, దంపతుల జీవితాలను ఛిద్రం చేస్తోంది.
శ్రీరామనవమిలో మరో విశిష్టత ఉంది. సీతారాముల కల్యాణం అనంతరం స్వామికి బెల్లం, మిరియాల పొడి, నీరు కలిపి తయారుచేసిన పానకం, పెసరపప్పును నీటిలో నానపెట్టి తయారుచేసిన వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తాం. ఇలా ఎందుకు చేయాలి? అని ఆలోచిస్తే ఇందులో ఒక ఆరోగ్యసూత్రం దాగి ఉంది.
శ్రీరామనవమి మంచి ఎండాకాలంలో వస్తుంది. ఎండ వేడికి శరీరంలో శక్తి తగ్గిపోయి, చెమట వల్ల అధిక నీరు బయటకు పోతుంది. ఫలితంగా సోడియం, పొటాషియం, లవణాలు వంటివి తగ్గిపోతాయి. శ్రీరామనవమి నాడు బెల్లం పానకాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల శరీరానికి చల్లదనం కలిగించటమే కాక ఆకలిని పెంచుతుంది. బెల్లంలోని కాల్షియం ఎముకుల బలానికి తోడ్పడుతుంది. అలాగే పెసరపప్పు కూడా చల్లదనాన్ని ఇవ్వటంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్యపరమైన రహస్యాలు ఈ పండుగలో దాగి ఉన్నాయి.
శ్రీరామ నవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించినా లేక తిలకించినా ఎంతో పుణ్యం వస్తుంది. అంతేకాదు శ్రీరామనవమి పండుగలోని పరమార్థాన్ని, సీతారాముల దాంపత్య జీవనాన్ని నేటితరం యువ దంపతులు తెలుసుకొని తమ జీవితాలకు అన్వయించుకోవాలి. సీతారాముల కల్యాణం చేశాం, ప్రసాదం తిన్నాం, పండుగ జరుపుకున్నాం.. అనుకుంటే ఈ పండుగలో విశిష్టత ఏమీ ఉండదు. ప్రతిఒక్కరూ శ్రీరామనవమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ, రామాయణంలో సీతారాముల పాత్రలను ఆదర్శంగా తీసుకొని జీవితాలను చక్కని మార్గం వైపు నడుపుకుంటారని ఆశిద్దాం.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

నివాళి

విశ్వయశస్వికి జేజేలు!

సామాన్య కుటుంబంలో
జర్మనీలో జన్మించి
వినూత్న హోమియో వైద్యాన్ని
ఈ జగతికి ప్రసాదించి
జగద్బంధువైతివయా
ఓ హానిమన్ మహాశయా!

ఔషధ ధర్మాల్ని పరిశోధించేందుకు
మీ ప్రాణాలే ఫణంగా పెట్టి
మీరే వాటిని సేవించి
అవి మీపై చూపిన సకల
మానసిక, శారీరక లక్షణాల
‘మెటీరియా మెడికా ప్యూరా’
గ్రంథంలో మాకందించిన
త్యాగధనులు మీరు!

సోరా, సైకోసిస్, సిఫిలిస్‌లను
మూడు తత్వాలే
బహువ్యాధులుగా రూపుచెంది
మానవాళిని బాధిస్తున్నాయని
రోగి అన్ని లక్షణాల్ని గ్రహించి
ఒక్కొక్కసారి ఒక్కొక్క
ఔషధానే్న ఇవ్వాలని
హోమియో తత్వశాస్త్ర
‘ఆర్గనాను’ గ్రంథరాజంలో
లోకానికి తెలిపినారు

మానవులను ఒదలక
మరలమరల తిరగబెట్టే
దీర్ఘవ్యాధుల్ని నయం చేయాలని
విజ్ఞానవంతులు కావాలని సాహసించి,
పనె్నండేళ్లు పరిశోధించి
‘క్రానిక్ డిసీజెస్’ గ్రంథాన్ని
వైద్యప్రపంచానికి అందించిన
ప్రతిభామూర్తులు మీరు

తరుణ, దీర్ఘ వ్యాధులకు
తీయనైన మందులతో
తక్కువ మోతాదుల్లో
తీర్చే మార్గాన్ని చూపిన
ఆచంద్రతారార్క యశస్వీ
మధుర హృదయ.. మీకు జేజేలు!

- దేశం పాపిరెడ్డి,
గుంటూరు.
చరవాణి : 9849048242

మనోగీతికలు

పక్షపాత పర్వాలు
ఉ॥ పర్వము రాదు మా ముఱికి వాడల వంకకు! మాదు దుర్గతుల్
సర్వమెఱుంగు గాన నొక సారయినన్ మముజూడ రాదు! మా
చేర్వకు వచ్చి మేల్కలుగ జేయు సమర్థత లేక మమ్ము మా
దుర్విధి చేతికే వదలి దూరముగా నడయాడు నిత్యమున్!

ఉ॥ కుత్సిత బుద్ధిదాల్చి ధనికున్ సుఖబెట్టుచు, పేదనెప్డు బీ
భత్సములైన దుఃఖముల పాతఱలో పడవైచు ఉత్సవం
బుత్సవవౌనె బూటకపు బుద్ధులు జూపెడి బూచిగాక? నే
ఉత్సవమైన నెల్లరికి నుల్లసమందగ జేయగావలెన్!

ఉ॥ పర్వతరాజు మా బ్రతుకు బాధలకొండల యెత్తుజూచి ‘నా
గర్వమడంగెనింక’ ననె, ‘కంధి’యు మా ప్రజశోక నీరధుల్
పర్వులు వెట్టు తీరుగని పల్లటిలెన్! విను మింక పర్వమా!
ఉర్వియు మాదు ఓర్పుగని ‘ఒప్పగు ఓరిమి మీదెలే’ యనెన్!

చ॥ గుడికొని యున్న కష్టముల గూడులు మావి! నిరాశలన్నియున్
జడిగొనుచున్న దుస్థితుల జడ్డలు మావి! విషాదవీచికల్
వడిగొను పాఱు వేదనల వాడలు మావిటుయెట్టి వేడుకల్
అడుగిడవమ్మ పర్వమ! యథార్థమిదే నను విశ్వసింపుమా!

ఉ॥ చూడుము, చూడుచూడు పొగజూరిన గోడల పూరిపాకలన్
జూడుము ఱొచ్చు రోతలకు జోడుగ నుండెడి కీటకమ్ములన్
వాడిన బీద మోములను, వంతలు నిండిన సందుగొందులన్
జూడు, దరిద్రదేవికి ప్రసూతి గృహమ్ముగ మారినట్టి మా
వాడను చూడు, దుఃఖితుల వంశజులియ్యడ పుట్టిగిట్టు ఆ
పోడిమి చూడు, మిద్దరికి పొత్తు కుదుర్చునె ఇట్టి భేద మే
డేడకొ పోయి నీవు సుఖియించుము పర్వమ! రాకు రాకిటన్!

ఉ॥ లచ్చిమి దేవి గజ్జెల ఘలంఘలలుండెడి భర్మహర్మ్యముల్
జొచ్చిన - నీకు కీర్తనలు, చొక్కపు సేవలు, గొప్ప సందడుల్,
వెచ్చని వంటకమ్ములు లభించును పర్వమ! మమ్ము జేరినన్
నొచ్చును నీ మనమ్మిట వినోదము నొక్కటి కానకెయ్యడన్!

ఉ॥ మాయును నీ అలంకరణ, మాయును నీ శుచి, నీదు మంగళ
చ్ఛాయలు మాయు, గౌరవము సన్నగిలున్, మది క్లేశమొందు, - నీ
సోయగమంత శోభచెడి స్రుక్కును గాన మిటారి పర్వమా!
చేయకు సాహసమ్ము మము జేరుటకెన్నడు స్వప్నమందునున్!

చ॥ పనివడగా ఎకాఎకిన పర్వులు వెట్టుచు పర్యటించి మా
జనులను ఉద్ధరింతుమని చాటు ప్రతిజ్ఞులు చాల జేసి, ఆ
పని ముగియంగ చాటుపడు పాలకులుండెడి రాజ్యమందునన్
అణగి మణంగి తల్లడిలు అల్పుల దుర్దశ మారదక్కటా!

- గోపీనాథరావు ఎరుకలపూడి,
విజయవాడ,
చరవాణి : 98482 93119

కల్యాణ భోగం - రామద్వయం
నిరాకార, నిర్ణురూపా, లింగాకార, అర్ధనారీశ్వర!
అవతారపురుష, శ్రీ వెంకటేశ! శ్రీనివాస!
నాడు శివపార్వతుల కల్యాణుడిగా, జ్ఞానేశ్వర!
శ్రీ పద్మావతి ప్రియ, కల్యాణ స్వరూప శ్రీ వెంకటేశ! పాహిమాం!!
నేడు తిరుమల కొండ దిగివచ్చిన ఒంటిమిట్ట రామా!
శ్రీరామా, ఆదర్శ పురుష, అవతార పురుష శ్రీనివాస!
సంకటయోచన, ఒంటిమిట్ట రామా! కల్యాణ భోగా!
నేడు నీ కల్యాణ చూడముచ్చట పడ! తరంబ్రాలు
తలనిండా నిన్ను చూడ వచ్చెనయ్య శేషసాయిడు!
ఆనందమాయే, ఒంటిమిట్ట రామ, తరింప నా మోము
చూడ! భక్తులంతా భక్తితో మురిసేనయ్య! ఓ రామయ్య!!
కొండలలోని కోనేటి రాయుడు, కోరికలు తీర్చ
కల్యాణ రామ, కోదండరామ, సీతారామ, భద్రాచల రామ
ఒంటిమిట్ట రామ, అయోధ్య రామయ్య అవతార మూర్తివయ్య!
తిరుమలేశా! చిద్విలాసా! శ్రీ వేంకటేశా! పాహిమాం!!
‘రామద్వయం, కల్యాణ భోగం, నేటి పరమానందం’!
‘రామదాసు, తిరుమల దాసు అన్నమాచార్యులు!
ముకుళిత హస్తాలతో నేడు స్వాగత గీతాలు!!’

- జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం.

ఓ దుర్ముఖీ..
కావాలి మాకు సన్ముఖి!
ఓ.. దుర్ముఖి నామ వత్సరమా!
నీకు అక్షర జోతలు
తెలుగు వెలుగు ముఖ మండపాన
కవితా చూత పర్ణ తోరణాలు కట్టి
సాదర స్వాగతం పలుకున్నాను

నీ ముఖారవిందం బాగోలేదని
మానసిక క్లేశంతో
అంతర్ముఖిగా మారి
ఊరి పొలిమేరల్లో ఆగిపోకు!

తెలుగుతల్లిని ప్రాంతీయ
వాటాలు వేసుకున్నాక
తెలుగువారి కోట్ల వదనాలు
హఠాత్తుగా వివర్ణమైపోయాయి!

పాలకుల కుటిల హామీలను నమ్మి
అందలమెక్కించిన ప్రజలకు
నేతల అరచేతిలో వైకుంఠాలు చూసి
సిగ్గుతో తెలుగు ప్రజల ముఖాలు
దుర్ముఖంగా మారాయి!
ప్రకృతి వికృత చేష్టలకు
కరువుల చీడలతో
అరుపుల పీడలతో
మా పరువుప్రతిష్ఠలు పోయి
మా ముఖారవిందాలు కన్పించకుండ
బురఖా వేసుకుని తిరుగుతున్నాం
ఓ దుర్ముఖీ! నీ పేరే దుర్ముఖీ!!
నీ తీరు మాకు సన్ముఖం కావాలి!
అరవదేండ్లకు ఒకసారి వచ్చే
నీ దివ్యమంగళ రూపాన్ని
మరోసారి మాకు చూపించు
తెలుగు జగతికి ఉగాది పచ్చడిని
గోముగా తినిపించు
ఆరు రుచుల్లో
ఆమని కోయిలను పలికించు!

- జి సూర్యనారాయణ,
బందలాయి చెరువు.
చరవాణి : 970478 4744

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

వదినా! నీకు వందనం (కథానిక)

$
0
0

ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది.
‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లిపోయి మనల్ని ఒంటరివాళ్లని చేసింది’’ గద్గదస్వరంతో చెప్పాడు నవీన్.
అది విని జగదీష్ కాళ్లు వణికాయి.
‘‘అన్నయ్యా! అసలు ఏమయిందో చెప్పు అన్నయ్యా’’ అంటూ ఆందోళనగా అడిగాడు.
‘‘రాత్రి వదినకి గుండెపోటు రావడంతో హాస్పటల్‌కి తీసుకెళ్లాను. అయినా ఫలితం దక్కలేదు’’ అంటూ ఫోనులోనే ఏడ్వడం ప్రారంభించాడు నవీన్.
‘‘అన్నయ్యా! ఇప్పుడే నేనూ, సిరి బయలుదేరి వస్తున్నాం’’ అని చెప్పి ఫోన్ కట్ చేసాడు జగదీష్.
ఇంట్లో వంట చేస్తున్న సిరికి విషయం చెప్పాడు.
‘‘అయ్యో! ఎప్పుడండీ?’’ బాధగా అడిగింది సిరి.
చెప్పాడు జగదీష్.
ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు.
కాంప్లెక్స్‌కి చేరుకుని వైజాగ్‌కి నాన్‌స్టాప్ బస్సు ఎక్కారు.
కొద్ది సేపటికి బస్సు బయలుదేరింది.
బస్సు ముందుకు వెళుతుంటే ఆలోచనల్లోకి జారుకున్న జగదీష్ గతంలోకి జారుకున్నాడు.
నవీన్‌కి, జగదీష్‌కి మధ్య పదేళ్లు తేడా. వారిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే వారి తండ్రి మరణించడంతో పెద్దవాడైన నవీన్ మీదే బరువు బాధ్యతలు పడ్డాయి. ఉన్న భూమితో వ్యవసాయం చేస్తూ తమ్ముడు జగదీష్‌ను చదివించాడు. పదవ తరగతి అత్తెసరు మార్కులతో పాసయ్యాడు జగదీష్. అయినా తమ్ముడిని ఏమీ అనలేదు నవీన్.
ఇంటర్ చదువు కోసం తమ్ముడిని ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్చాడు. ఇది జరిగిన అయిదు నెలల తర్వాత వారి తల్లి మరణించింది.
ఊళ్లో వాళ్లందరూ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడంతో దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నవీన్.
జగదీష్ ఎప్పట్లాగే చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలదాలతో కాలం గడపసాగాడు. ఫలితంగా ఇంటర్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు.
అయినా నవీన్ అతన్ని ఏమీ అనలేదు.
‘‘మీ తమ్ముడి గురించి ఆలోచించండి! తను అస్సలు చదవడంలేదు’’ అని భర్తతో చెప్పింది.
దానికి నవీన్ మాట్లాడుతూ ‘‘వాడింకా చిన్నపిల్లాడు’’ అంటూ వెనకేసుకొచ్చాడు.
ఒకరోజు రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత జగదీష్ సెల్‌ఫోన్‌లో నగ్నదృశ్యాలు చూడసాగాడు. అప్పుడు పనె్నండు గంటలు దాటింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవి ఆ దృశ్యం చూసి జగదీష్ చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి వెళ్లిపోయింది.
ఈ పరిణామంతో జగదీష్ సిగ్గుపడ్డాడు. ఆ క్షణంలో ఏం చేయాలో అతనికి అర్ధం కాలేదు. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో అతనికి అవగతం కాలేదు. వదినకి అలా దొరికిపోవడంతో అతనికి తల కొట్టేసినట్లు అయిపోయింది. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే... ఛీ వెధవ బతుకు. రేపటి నుండి తలెత్తుకుని తిరగలేను’ అనుకున్నాడు.
ఆ రోజు నిద్రపట్టకుండానే తెల్లారిపోయింది.
రాత్రంగా ఆలోచనలతో నిద్రకు దూరం అవడంతో కళ్లు ఎర్రబడ్డాయి. తెల్లవారితే అన్నయ్య కొడతాడేమోనని భయం కూడా పట్టుకుంది. కానీ దేవి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
ఆ రోజు ఉదయం పొలానికి బయలుదేరాడు నవీన్.
అతన్ని చూసి ‘‘అన్నయ్యా! నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను’’ అంటూ చెప్పాడు జగదీష్.
అది విని ఆశ్చర్యపోయాడు నవీన్.
‘‘ ఏం నీకిక్కడ బాగాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు నవీన్.
‘‘బాగానే ఉంది అన్నయ్యా! కానీ నాకెందుకో హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని ఉంది. వదినతో కూడా ఈ విషయం చెప్పు’’
‘‘సరే! నీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడే ఉండు’’ అన్నాడు నవీన్.
‘‘హాస్టల్‌లో ఉండి బాగా చదివి మీకు తెస్తాడు మీ తమ్ముడు’’ అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అంది.
ఆ మాటలు జగదీష్‌కి ఎక్కడో గుచ్చుకున్నాయి.
ఇక బాగా చదవాలని అనుకున్నాడు.
అలా అన్నయ్య, వదినలను ఒప్పించి హాస్టల్‌లో చేరిన జగదీష్ అనుకున్నట్లుగానే బాగా చదవసాగాడు. ఇంటర్, డిగ్రీ కూడా హాస్టల్‌లోనే ఉండి పూర్తి చేశాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినా పుస్తకం వదిలేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఊరు ఊరంతా ఆమె అడుగు పెట్టగానే మరిదిని తరిమేసిందని, ఎవరూ లేని అనాథలా హాస్టల్‌లో చేర్పించిందని దేవిని తూలనాడారు.
అయితే నవీన్ గానీ, దేవి గానే ఎవరిని ఖండించలేదు.
జగదీష్ బాగా చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు.
అన్నయ్య, వదిన చూపించిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లిలో కూడా వదినతో మాట్లాడలేదు.
కొన్నాళ్లకు అతనికి ఏలూరుకి బదిలీ అయింది.
అక్కడే పదేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య పెద్దగా రాకపోకలు కూడా లేవు.
ఒక్క కుదుపుతో బస్ ఆగడంతో జగదీష్ ఆలోచనలు చెదిరిపోయాయి.
అప్పటికే బస్ విశాఖపట్నం కాంప్లెక్స్‌కి చేరుకుంది.
అందరితో పాటు జగదీష్, సిరి కూడా దిగారు. ఆటో బేరమాడుకుని అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి ముందు టెండు వేసి ఉంది. జనం కిక్కిరిసిపోయి కనిపించారు. జగదీష్, సిరి ఆటో దిగారు. తమ్ముడిని చూడగానే నవీన్‌కి దు:ఖం ఆగలేదు. వదిన శవాన్ని చూసి జగదీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సంవత్సరాలుగా మాట్లాడని వదినని అలా చూస్తుండిపోయాడు.
‘వదినా! ఒక్కసారి లే... నీతో మాట్లాడాలి. వదినా నీకు వందనం. నువ్వే గనుక ఆ రోజు జరిగింది చెప్పి ఉంటే అన్నయ్య ఏం చేసేవాడో, ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడో...’ అనుకున్నాడు. తర్వాతి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి.
పది రోజుల తర్వాత ఒంటరిగా కనిపించిన నవీన్‌తో మాట్లాడాడు జగదీష్.
‘‘అన్నయ్యా! నీకో విషయం చెప్పాలి’’ అన్నాడు జగదీష్.
‘‘నువ్వే ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆరోజు రాత్రే వదిన నాకు జరిగిందంతా చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకుంది. నిన్ను హాస్టల్‌లో వేసి చదివిద్దామని అంది. నువ్వు కూడా హాస్టల్‌లో ఉండి చదువుకుంటానని మంచి నిర్ణయం తీసుకున్నావు’’ అన్నాడు.
అది విన్న జగదీష్ మనసు ఆర్ధ్రతాభావంతో కొట్టుకులాడింది. ‘వదినా నీకు వందనం’ మనసులోనే తల్లిలాంటి వదనకి ప్రణామాలు అర్పించాడు జగదీష్.

- నల్లపాటి సురేంద్ర,
గాజువాక, విశాఖ
సెల్ : 9490792553.

పుస్తక సమీక్ష

పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో తెలియజెప్పే రచన
విద్యార్థులకు సైకాలజీ అవసరమా?

విద్యార్థులకు సైకాలజీ అవసరమా? అనే పుస్తకం చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ తమ జీవితంలో గతంలో జరిగిన తప్పులను ఏ విధంగా సరిదిద్దు కోవాలో, అలాగే విద్యార్థులను ఏ విధంగా చక్కదిద్దాలో చక్కని సరళమైన భాషలో స్మృతుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా రాసిన డాక్టర్ ఎం.వి.ఆర్. కృష్ణాజీ శైలి ఎంతో అభినందనీయం. అలాగే ఈ పుస్తకంలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశం నేటితరం తల్లిదండ్రులకి ఎంతో ఉపయుక్తంగా ఉండేలా తమ రచనలో మలిచారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఉన్నా వారి వారి పరిస్థితులు వారిని ఏ విధంగా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయనే విషయాలను వారి వయస్సులోకి రచయిత వెళ్లడమే కాకుండా తన స్వీయ అనుభవాలను కూడా అందులో పొందుపర్చడం హర్షించదగిన విషయం. అలాగే తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి... వారిలో ఉన్న సృజనాత్మకతను కనిపెట్టడంలో పాటించాల్సిన జాగ్రత్తలు, విద్యార్థుల మనోభావాలకు దెబ్బ తగలకుండా వారిని విద్య పట్ల ఆసక్తి కలిగేలా ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై రచయిత తన రచనా నైపుణ్యాన్ని ప్రతి అక్షరంలో పాఠకుడికి కనపడే రీతిలో రాయగలగడం నిజంగా ఆయన కలం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి.
అదే విధంగా విద్యార్థులపై సమాజ ప్రభావం, పరిస్థితుల అనుకూలత, సానుకూలతలు వారి మనస్సులపై ఎటువంటి ముద్ర వేస్తాయనే అంశాలను ఆయన సరళమైన భాషలో అందించారు. ప్రతి విద్యార్థి ఆకాశంలో మెరిసే తార అనే విషయాన్ని ఉపాధ్యాయుడే తెలుసుకుంటాడనే దానిని ఆయన చాలా కచ్చితంగా రాయడమే కాకుండా దానిని తెలుసుకోలేక పోవడం ఉపాధ్యాయుడి పొరపాటే అని వెలువరించడం కూడా ఆమోదించదగిన విషయంగానే భావించాలి. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంపైన ఆసక్తి ఉండడమే కాకుండా వారి తెలివితేటలు ఆ అంశాల్లో కనపడినప్పుడు వాటికి పదును పెట్టడమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కనీస కర్తవ్యం అనే విషయాన్ని చాలా కచ్చితంగా తన పుస్తకంలో రచయిత ప్రకటించారనే చెప్పవచ్చు.
ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క పాఠకుడు చదవడమే కాకుండా రచయిత ఇచ్చిన సూచనలు, సలహాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆచరించి సత్ప్రవర్తన కలిగిన భావిపౌరులను దేశానికి అందించడమే ఈ పుస్తక రచయిత అయిన కృష్ణాజీ ఆశయంగా మనం భావించాలి.

- వి.వి.ఎన్. వసుంధర,
విశాఖపట్నం.సెల్ : 9642208871.

పుస్తక పరిచయం

సమాజానికి అద్దం పట్టిన తేలు కుట్టిన దొంగ

దూరి వెంకటరావు రచయితగా లబ్దప్రతిష్టులు. కథలు, బాలల కథలు, నవలలు, బాలల నవలలు, నాటకాలు, వ్యాసాలు రాయడంలో దిట్ట. ఆకాశవాణిలో పలు రచనలు ప్రసారమయ్యాయి. ‘చింతన’ శీర్షికన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. వృత్తిరీత్యా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరుగా ఉన్నత బాధ్యతను నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. ప్రవృత్తిరీత్యా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల ‘తేలుకుట్టిన దొంగ’ అనే బాలల కథల సంపుటిని బొమ్మలతో సహా పాఠక ప్రపంచానికి అందించారు. ఇందులో 18 కథలు ఉన్నాయి. భాషలో సరళతత్వం, శైలిలో సహజత్వం, భావవ్యక్తీకరణలో సున్నితత్వం తొంగిచూస్తాయి. ప్రతి కథలోనూ సందేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ అనుభవాల నేపథ్య భావాల కలబోతను ఒకసారి విశే్లషణాత్మకంగా తడిమి చూద్దాం.
మూఢ నమ్మకాలతో ప్రతి అపశకునానికీ మండిపడుతూ కార్యసిద్ధికి తరచూ విఘాతం కలిగించే కనకాంబరానికి కొన్ని దుశ్శకునాల మధ్య ఎదురెళ్లి తన కూతురు పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకుని రావడంతో కలిగిన మార్పు కథే ‘బావకు తగ్గ మరిది’. పాతకాలపు ఆలోచనలకు తెర దించుతూ హేతువాద దృక్పథానికి పెద్దపీట వేస్తారు రచయిత. ‘మంత్రాలకు చింతకాయలు’ కథలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మూఢనమ్మకాల పేరుతో దొంగ సాధువులు, బాబాజీలు చేసే గారడీ విద్య మోసాల్ని తన చేతి ప్రయోగంతో బట్టబయలు చేసి, నిజాన్ని నిరూపిస్తారు రామం మాస్టారు పాత్రలో రచయిత. సమయోచితంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో అందె వేసిన తనం కనిపిస్తుంది. ‘సత్యమేవ జయతే’ కథలో సింగయ్య కొడుకు లింగయ్య వ్యవసనాలకు బానిసైపోతాడు. ఓ స్వామీజీని శరణు వేడుకోవడంతో అబద్ధాలు చెప్పే అలవాటుని అతను మానిపిస్తాడు. పర్యవసానంగా దుర్వ్యసనాలకు లింగయ్య దూరం కావల్సి వస్తుంది. డబ్బు కోసం రాజుగారి కోట రాజప్రాకారం ముందు తచ్చాడుతూ దొరికిపోతాడు. దొంగతనం చెయ్యాలనే నిజాయితీ బుద్ధిని రాజుగారి ముంగిట ఒప్పుకోవడంతో లింగయ్యని ఖజానా లెక్కల అధికారిగా ఉద్యోగంలో నియమిస్తారు. అప్పుడు అబద్ధమనే దురలవాటుని మానిపించడానికి కొడుకు దగ్గర స్వామీజీ ఎందుకు మాట తీసుకున్నాడో సింగయ్యకు అర్ధమవుతుదం. ఈ ప్రయోజనానికి సత్యం పలకడానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది ఈ కథ.
అడవి జంతువుల్ని వేటాడి అమ్మగా వచ్చే డబ్బుతో పొట్ట పోసుకుంటాడు కొండయ్య. దారి తప్పి వచ్చిన నెమలి పిల్లను మచ్చికతో చేరదీసి పెంచి, చంపి తినాలనే దుర్బుద్ధితో ఉన్న కొండయ్యను ఒకసారి పాము బారి నుండి అది కాపాడుతుంది. దాంతో కనువిప్పు కలిగి జీవహింసకు దూరంగా బతుకుతాడు అతను. అపకారికి ఉపకారం చేసే నీతిని బోధించే కథ ‘అపకారానికి పోతే’. ‘సమయస్ఫూర్తి’ కథలో మాళవిక రాజ్యం రాజు మన్మథసేనుడు యువరాజుని పట్ట్భాషిక్తుడిని చెయ్యాలనుకుంటాడు. అందుకు అలిగిన చిన్నరాణి చాముండేశ్వరీదేవి తన కొడుకు రఘువర్మకి పట్ట్భాషేకం చెయ్యాలని మంకుపట్టు పడుతుంది. ఈలోగా పొరుగు రాజు దండయాత్ర చేస్తున్న విషయాన్ని వేగుల ద్వారా చిన్నరాణికి వార్త అందుతుంది. రఘువర్మకి పట్ట్భాషేకం చేస్తే పొంచి ఉన్న యుద్ధ ప్రమాదాన్ని పసిగట్టి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఈ ఎత్తును ఎంతో యుక్తితో పన్ని నాటకమాడించిన మంత్రి సమయస్ఫూర్తికి దర్పణంగా ఈ కథ నిలుస్తుంది. అపాయాన్ని ఉపాయం ద్వారా తరిమికొట్టవచ్చుననే అంతర్లీన సందేశాన్ని ఇది అందిస్తుంది. ‘పందెం’ కథలో ఉమాపతిది పిల్లికి కూడా బిచ్చం పెట్టని మనస్తత్వం. పేదవారంటే అతనికి చులకనభావం. తన కుమారుడు రాజా జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చిపోయే వాల్ల సంఖ్య కోసం మిత్రునతో పందెం కాస్తాడు సీతాపతి. ఆ రోజున వచ్చిన జనాలకు తలా ఓ వెండి నాణెం కానుకగా ఎరవేసి రప్పిస్తాడు. కానీ అది కూడా వెండి మెరుగు పెట్టిన నకిలీదని తెలిసి ఉమాపతి బుద్ధిని, మనస్తత్వాన్ని చీదరించుకుంటాడు సీతాపతి. స్వతహాగా అబ్బిన మాన సహజ ప్రవృత్తికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కథ.
మధుకి ఇతరుల వస్తువుల్ని పాడు చేసి ఆనందించే అలవాటు. ఓసారి పిక్నిక్‌లో ఓ వృద్ధురాలు చెప్పుని దాచి అల్లరిపెట్టి సంతోషిస్తాడు. ఆ రెండవ చెప్పును కూడా పట్టుకెళ్లలేదని బాధతో తెగ ఏడుస్తుందామె. ఆమె పరోపకార బుద్ధి ముందు తన పాడు బుద్ధికి సిగ్గుపడి క్షమాపణ వేడుకుని మంచివాడిగా మారిపోతాడు మధు. కొడుకులో వచ్చిన ఈ మార్పుకి సంతోషిస్తుంది అతని తల్లి. చెడ్డవాడిని కూడా మంచివాడిగా మార్చవచ్చుననే నీతిని ఇది ఉద్బోధిస్తుంది. అవసరానికి మించి దానధర్మాలు చేసే జమీందారురు కాంతయ్య కట్టెలు కొట్టే ఓ వృద్ధుడికి రెండు వేల రూపాయలు ఇచ్చి హాయిగా బతకమంటాడు. కొన్నాళ్లకు అతను మళ్లీ అదే స్థితిలో కనిపించి, ఇచ్చిన సొమ్మును దాచుకుని వెనకేసుకునే ప్రయత్నం చెయ్యడంతో పూర్తిగా జ్ఞానోదయం కలుగుతుంది జమీందారుకి. ఈ నాటకాన్ని ఆడించి రక్తికట్టించిన శివయ్య, కాంతయ్యలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తాడు. ‘కనువిప్పు’ కథలో. వృథా ఖర్చును అదుపులో ఉంచగల పరిస్థితిని ఈ కథ అనివార్యంగా నొక్కి చెబుతుంది. ‘మంత్రం’ కథ విలక్షణమైంది. సైన్సు టీచర్ సత్యం పిల్లలకు పాఠాలు బోధించడంలో ఎప్పుడూ వెనకంజలో ఉండేవాడు. కొత్తగా వచ్చిన హెడ్మాస్టర్ అతనిలో పరివర్తన తీసుకురావడానికి ఆల్‌బిరుని అతని మిత్రుడు మధ్య జరిగిన సంభాషణతో ‘జిజ్ఞాస’ విలువను చాటి చెబుతాడు. పర్యవసానంగా ఊహించని మార్పు చోటు చేసుకుని సత్ఫలితాన్ని సాధిస్తాడు హెడ్మాస్టర్. విశిష్ట వ్యక్తుల అనుభవాల ప్రభావం సామాన్యులపై ఎలాంటి ముద్రను వేస్తుందో తెలియజెప్పే కథ ఇది.
గతంలో దొంగతనం చేసి ‘దొంగ’గా చెరగని మచ్చని వేసుకున్న రవిని ఓసారి మతిమరుపు కారణంగా డ్రాయర్‌లో దాచిన పెన్నును తీశాడనే అనుమానంతో బెత్తంతో చితకబాది, ఆ తర్వాత నిజం తెలుసుకుని పశ్చాత్తామపడతాడు మాస్టారు. ఒకసారి జీవితంలో పడిన ముద్రను ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియజెప్పే కథ ‘అనుమానం’. ‘వ్యాపారదృష్టి’ కథలో బట్టల వ్యాపారి బంగారయ్య అస్వస్థత కారణంగా బిడ్డలకు వ్యాపార లక్షణాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి తీర్థయాత్రలకు వెళుతూ జేబు ఖర్చుల కోసం లా వెయ్యి రూపాయలిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు వేస్తాడు. వ్యాపార దృష్టి కలిగిన ఆఖరి కొడుకుకి తన బాధ్యతలను అప్పగించి తృప్తి పొందుతాడు. సమర్థుడైన వాడికి తగిన స్థానంలో కూర్చోబెట్టాలన్న సారాంశం ఈ కథలో వ్యక్తమవుతుంది. ఇలాగే చాలా కథలు ఈ సంపుటిలో మనల్ని చదివింపజేస్తాయి. కథా వస్తువులో వైవిధ్యపూరితమైన ముగింపులు, ఆకట్టుకునే వాక్య నిర్మాణ రీతి రచయితలోని చెయ్యి తిరిగిన తనానాన్ని గుర్తు చేస్తుంది. నిజానికి ఈ కథలు ఒక్క బాలలకే కాదు వక్రబుద్ధితో వెర్రితలలు వేసే ప్రతి ఒక్కరికీ గుణపాఠాలు నేర్పుతాయి. ప్రయోజనాత్మకంగా ఈ కథల్ని తీర్చిదిద్ది అందించిన రచయిత దూరి వెంకటరావుకి అభినందించకుండా ఉండలేం.

మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 944059390.

మనోగీతికలు

ఇది ఉగాదని కాబోలు పులకించింది నా మది
హృదయాన భావాలు పొంగిపొరలాయి
ప్రకృతి కాంత పచ్చని చీర కట్టుకుంది
మల్లెమొగ్గ కనె్నపిల్లలా
సిగ్గుతో తల దించుకుంది
మనసును పులకింపజేస్తున్నాయి
కొత్తకొత్త మావిపిందెలు అందెల సవ్వడి చేస్తున్నాయి
తుమ్మెదలు ఝాంకారాలు చేస్తూ
కమ్మనైన పూల మధువును గ్రోలుతున్నాయి
చెరకు వింటి వేలుపు వత్సరం
తత్వరత్వరగా తరలింది
చేదు, తీపి, వగరులను చవిచూపింది
దుర్ముఖి నామ సంవత్సరం ఏ ముఖం పెట్టుకొచ్చిందో?
ఆనందాలు అందిస్తుందో
విషాదాలు మిగులుస్తుందో
ఇప్పుడే చెప్పలేం
కారణం ప్రతి ఏటా ఏవో కలతలు
మరేవో గందరగోళాలు
క్యాలండరు మార్పు కాదు
మనిషి హృదయాన మార్పు రావాలి
మనిషిలో కర్కశత్వం తొలగి
మానవత్వం నిండాలి
దుర్ముఖి నామంలో ఏ ముఖం పుడుతుందో
అరిషడ్వార్గాలు మాత్రం అదుపులో లేవు
అమ్మాయిలపై యాసిడ్ వేయడం
పాత ఫ్యాషనైతే
కిరోసిన్ పోసి చంపడం నేటి ఫ్యాషన్
ఆకాశంలో సగం అంటున్నారు
ఏటేటా ఎందరినో చంపుతున్నారు
రావణుడికి పది తలలే దుర్ముఖాలు
నేటి రావణులకు అన్నీ దుర్ముఖాలే
ఏ ముఖం పెట్టుకొస్తుందో దుర్ముఖి
అయినా సరే
ఆశావాదంతో జీవిద్దాం
అంతరిక్షాన్ని సాధిద్దాం!

- పురిజాల సుధాకర్,
నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా - 532421.
సెల్ : 7702956929.

సంస్కృతికి ప్రతీక
కాలచక్రం క్రమం తప్పక
మరో ఆవృతాన్ని పూర్తి చేసింది
శిశిరంలో మోడువారిన చెట్లు
వసంతాగమనంతో మైమరచి
కొత్త చిగుళ్లు తొడుక్కున్నాయి
మావిచివుళ్లను కోయిలలు ఆరగించి
కుహుకుహుమంటూ మధురగీతాల
వసంతాగమనాన్ని స్వాగతిస్తున్నాయి
ప్రకృతి పరవశంతో పులకరించగా
జన హృదయాలు
హర్షంతో ఉప్పొంగాయి
తరువులన్నీ చిగురించిన వేళ
కొమ్మల పువ్వులు
సుగంధాలను పంచినవేళ
ఆధ్యాత్మిక మనసులు వికసించినవేళ
ప్రకృతి సుగంధాల తానమాడిన వేళ
కోయిల పాటలు విందు చేసిన వేళ
జీవాత్మా పరమాత్మ ఏకమైందీ వేళ
పుడమి వసంత శోభను నింపుకున్నది
కాలగమనంలో ఈ మహత్తర ఘట్టమే
తెలుగు సంస్కృతికి ప్రతీక ‘ ఉగాది’

ఎ. సీతారామారావు,
లక్కపందిరివీధి, విజయనగరం-2.
ఫోన్ : 08922 237122.

సత్కరిస్తా
‘దుర్ముఖి’ నామ వసంతానికి
దుశ్శాలువతో సత్కరిస్తా
మన్మథబాణాల వత్సరం నుండి
బయటపడ్డ నేను
శిష్టుల పాలిట షణ్ముఖివై
దుష్టుల పాలిట దుర్ముఖివై
విశ్వరూపం ప్రదర్శించు
దుష్టశిక్షణ, శిష్టరక్షణలో
విజయ దుందుభి మోగించు
ఆనందాల హరివిల్లులా
అమృతం కురిసిన రాత్రిలా
పున్నమి వెలుగులు ప్రసరించేలా
నవ వసంతానికి నగిషీలు దిద్దు
నీ పేరును చూసి హడలిపోతున్న మాకు
సుఖ సంతోషాల పల్లకీలో
విహరింపజేయ
ధర్మ సంస్థాపనకు నీవు సైతం
ముందుండి నడిపించు
శాంతి, ప్రశాంతులను ప్రసాదించు
నీకు దుశ్శాలువతో సత్కరిస్తా
పుష్పగుచ్ఛంతో సన్మానిస్తా
వందనం! ఇక సెలవా మరి!!

- వాండ్రంగి కొండలరావు,
పొందూరు, శ్రీకాకుళం జిల్లా
సెల్ : 9490528730.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.netఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

సొంత ఇల్లు (కథ)

$
0
0

ఉంటున్నది అద్దె ఇల్లయినా..సొంత ఇంటి కన్నా.. ఎక్కువగా చూసుకునే శంకరయ్య గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యాడు. గట్టిగా ఏడుపులు విన్న ఇంటి యజమాని రామారావు ఖంగారు పడుతూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఆదుర్ధాగా ‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది! చెట్టంత మనిషిని కాలం పొట్టన పెట్టుకుందని’ బాధపడుతూ పార్వతమ్మకు ధైర్యం చెప్పారు. అన్నీ అయ్యాక ‘శవాన్ని మాత్రం ఇక్కడ వుంచకండి! మా ఆచారం ఒప్పుకోదు. ఏ సత్రానికో తీసుకెళ్లండి’ అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ్నుంచి కదిలారు.
‘అదేంటండీ! నిన్నటి దాకా ఇక్కడ తిరిగిన మనిషే కదా! శవంలా మారాక కొన్ని గంటలు కూడా ఈ నేలమీద పడుకునే అర్హత లేదా! ఇప్పుడే కదా! దేవుడిలాంటి మనిషని అన్నారు. దేవుడు ఇక్కడ వుండ కూడదా? కొడుకు ప్రసాద్ అడిగేశాడు కళ్లు తుడుచుకుంటూ! ‘నీకు తెలియదు ప్రసాద్! మా ఇంట్లో ఇలా శవానికి ఏర్పాట్లు అవీ చెయ్యకూడదు అంతే’ ఖచ్చితంగా చెప్పాడు రామారావు.
‘మరి మీ ఇంట్లో ఎవరైనా పోతే!’ అన్నాడు చిన్న కొడుకు కృష్ణ కోపంగా.
‘ఇది మా సొంత ఇల్లు. మేము ఏదైనా చేసకునే హక్కు మాకుంది’. అనవసరంగా వాదించక బాడీని ముందు తరలించండి అన్నాడు రామారావు కోపంగా.
చేసేదేం లేక అందరూ వౌనం వహించారు. అందరి మనసుల్లో బాధ. ఆవేశం పెల్లుబుకుతున్నా ఏం చేయలేని పరిస్థితి. కారణం వాళ్లు ఉండేది అద్దె ఇల్లు కనుక.
చివరికి శవాన్ని ఓ సత్రానికి తరలించారు. ఇంట్లో వాళ్లు, బంధువులు, కావలసిన వాళ్లు అందరూ సత్రానికి బయల్దేరారు.
పదేళ్ల నుండి ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు శంకరయ్య కుటుంబం. కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి రిటైరయ్యాడు శంకరయ్య. ఆయన సంపాదనతోనే పిల్లలకి మంచి చదువులు చెప్పించాడు. పెళ్లిళ్లు జరిపించాడు. ఇవన్నీ చెయ్యగలిగాడు కానీ తను ఉండేందుకు, తనకంటూ ఒక సొంత ఇంటిని అమర్చుకోలేకపోయాడు. వచ్చినదంతా కుటుంబ ఖర్చులకే సరిపోయేది. పిల్లలు వృద్ధిలోకి వస్తే చాలు! అంటూ సంపాదించినదంతా పిల్లల చదువులకీ, వాళ్ల పెళ్లిళ్లకీ ఖర్చు పెట్టేశాడు.
‘పార్వతీ మన పిల్లలు కడతారు లేవే సొంత ఇల్లు. అప్పుడు మనిద్దరం హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుందాం’ అంటూ గల గల నవ్వేసేవాడు శంకరయ్య.
పిల్లలకు మంచి వుద్యోగాలు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నాన్న కోరిక తీర్చాలని కొడుకులకూ ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడమంటే మాటల్లో పనికాదు. అపార్ట్‌మెంట్ తీసుకోవాలన్నా లక్షలతో పని. ఎంత లోన్ తీసుకున్నా స్వంత డబ్బు చేతిలో కొంతైనా వుంటే మంచిదని వాళ్ల వుద్ధేశం. అందుకే ఆగారు. దాన్ని శంకరయ్య కూడా సమర్థించాడు.
ఇప్పుడు మనిషి పోయాక ప్రాణం లేని శరీరంపైన ఈ ఆంక్షలు, ఆచారాలు, కట్టుబాట్లు, వాటిని వదిలించడం చాలా కష్టం అని అర్థమయింది పిల్లలకి.
ఇదంతా చూస్తున్న పార్వతమ్మా కుళ్లి కుళ్లి ఏడుస్తున్నది. ‘మీకు ఈ విధంగా జరగాలని రాసి వున్నదండీ. అంటూ కన్నీరు మున్నీరవుతున్నది.
తతంగాలన్నీ పూర్తి చేశాక..పాడెను లేవనెత్తారు. హరోం హర మహదేవ, శంభోశంకర అంటూ కొడుకులు, కొంత మంది బంధువులు, మిత్రులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
అప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్లు కానీ, ఆడవాళ్లు కానీ అంతిమయాత్రలో పాల్గొనకూడదని ఆంక్షలు పెట్టారు.
దహన కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చాక స్నానాలు చేసి దీపం చూశారు. తరువాత భోజనాలు మొదలయ్యాయి. ఇంతలో ఇంటియజమాని రామారావు నుండి ప్రసాద్ మేనమామకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతుంటేనే ఆయన మొహం వివర్ణమయింది.
‘ఏమయింది మామయ్యా!’ అంటూ ఆదుర్ధాగా ప్రసాద్, కృష్ణ అడిగారు.
‘ప్రసాదూ! మీ ఇంటి యజమాని ఫోన్ చేశాడు. అమ్మను వాళ్ల ఇంటికి తీసుకెళ్ల కూడదట. ఈ పది రోజులు పూర్తయి కర్మకాండలయ్యేంతవరకు ఆవిడను మీరే ఎవరైనా తీసుకెళ్లండి అన్నాడు రా’ అన్నాడు గోపాల రావు.
‘మామయ్యా! మనుషులు మరీ ఇంత దారుణంగా వుంటారా? అన్నారు. అన్నదమ్ములిద్దరూ బాధపడుతూ. అవునురా కొంత మంది మనుషుల కన్నా, ప్రాణాల కన్నా ఆచారలకే విలువనిస్తారు. ఆ విషయాలలో వాళ్లు రాజీపడరు. తమ ఇంటికి అరిష్టం చుట్టుకోకూడదు అని అనుకుంటారు వాళ్లు బాగుండాలి అనుకుంటారే కానీ ఎదుటి వాళ్ల ఇబ్బందులను పట్టించుకోరు’ అన్నాడు గోపాల రావు అనుభవాలతో పండిన వయసుతో. మనుషులకన్నా పశువులూ పక్షులే నయం’! వాటిల్లో ఏదైనా చనిపోతే అరచి గోలపెట్టి అన్నింటినీ పిలుచుకుంటాయి. వాటి భాషలో ఏడుస్తాయి. వాటికన్నా హీనంగా తయారయ్యాడు మనిషి.
సరే మామయ్యా! ఇప్పుడేం చేద్దాం! అన్నాడు ప్రసాద్. ‘ఏం చెద్దాంరా! మీ అమ్మను ఎవరింటికైనా తీసుకెళ్లమని అడగడం, వాళ్లు కాదేనలేక ఇబ్బంది పడడం, మనం అడిగి లేదనిపించుకోవడం కంటే వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు’ ఆయన.
చివరికి ఆవిడని ఆ సత్రంలోనే ఓ రూం తీసుకుని అక్కడే ఉంచడానికి నిర్ణయించారు.
ఏ రోజూ భర్తను వదిలి పరాయి ఇంటికి కూడా వెళ్లని పార్వతమ్మ మొట్టమొదటిసారిగా బయట ఉండాల్సి వచ్చింది.
‘పచ్చని చెట్టులా వుంటావమ్మా! పొద్దున లేస్తే నీ మొహం చూస్తే అంతా మంచే జరుగుతుందని’ పొగిడిన నోళ్లే ఇప్పుడు వౌనం వహించాయి. ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు.
శుభకార్యాలకు నాలుగు రోజులు ముందుగా వచ్చి నాలుగు రోజుల తర్వాత వెళ్లే వాళ్లు. మనిషి కష్టాలలో వున్నప్పుడు ఒంటరిని చేసి వదిలి వెళ్తారు.
వారం రోజులకే పార్వతమ్మ జీవచ్ఛవంలా తయారయింది. ‘అమ్మా! ఇలా అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది’ అంటూ తల్లిని దగ్గరకు తీసుకుంది మాధవి.
ఈ పరిస్థితులలో ఉన్న అమ్మను చూశాక సొంత ఇల్లు అనేది ఎంత అవసరమో కొడుకులిద్దరికే అర్థం అయింది. అమ్మ పరిస్థితి నాన్నలా కాకూడదని గట్టి నిర్ణయానికొచ్చారు!

- పాతూరి అన్నపూర్ణ
నెల్లూరు, సెల్.నం.9490230939

కథ

పురస్కారమా.. నీకో నమస్కారం

జంబులింగం, బోడిలింగం బాల్యమిత్రులు, బాల్య మిత్రులు. ఏదో తంటాలు పడి పట్ట్భద్రులయ్యారు. బతుకు దెరువుకోసం ఆఫీసుల మెట్లు లెక్కపెట్టలేక విసిగివేసారి అరిగిన చెప్పులను ముందేసుకొని లబోదిబోమని సొంతంగా ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో ఓ నిర్ణయానికి వచ్చారు. ధనవేటలో వారు వాడిన తూటా నెంబరు -1 డింగ్‌డాంగ్ సాహితీ సంస్థ. అధ్యక్షుడుగా జంబులింగం, ప్రధాన కార్యదర్శిగా బోడిలింగం. సాహిత్యాభిమానం తక్కువైనా బిల్డప్పులేమి తక్కువకాదు. ఫలితంగా ప్రతిభ అనే ఎలక్ట్రిసిటి తక్కువైనా కీర్తి అనే పబ్లిసిటి పెరిగిపోయింది. డింగ్‌డాంగ్ సాహితీ పురస్కారాలకు ఆహ్వానము పలుకుతూ ప్రముఖ దినపత్రికలలో వార్త వెలువడింది. మరుసటి రోజుకల్లా కవికాకులు వీరి ముందు వాలిపోయాయి. జంబులింగం వారి వివరాలను నోట్ చేసుకొంటున్నాడు.
ఒక కవి గారితో
‘‘అయ్యా తమరి నామధేయం’’ అడిగాడు జంబులింగం.
‘‘అ ఆ లు రావు’’
‘‘సర్లే నీకు అ ఆ లు రాకపోతే మాకేంటి లకారం ఉంది కదా. మాకది చాలులే.
అన్నాడు’’ జంబులింగం.
‘‘అయ్యా తమరు పొరబడ్డారు. నాపేరే అ ఆ లరావు’’.
‘‘అదేం పేరు విడ్డూరంగా’’ అన్నాడు బోడిలింగం.
నాపేరు అరటిపండు ఆంజనేయులు రావు. షార్ట్ కట్‌లో అందరూ అలా పిలుస్తారు.
‘‘సర్లే మీరు ఏమి రాసారు’’ అడిగాడు జంబులింగం.
‘‘ఓ పది రాసా’’ గొప్పగా చెప్పాడు ఆరావు.
‘‘ఏంటి పుస్తకాలా (అరకొర పుస్తకాలు రాసిన కవులను సత్కరించే వీరికి పది పుస్తకాల రచయిత దొరికాడన్న సంబ్రమంతో)’’ అడిగాడు బోడిలింగం.
‘‘కాదు కవితలు అన్నాడు’’ అ ఆలురావు.
‘‘అబ్బో చాలా ఎక్కువ రాసారే!
ఇప్పటికి మీకు చాలా ఆలస్యమైనది పురస్కారము అందుకోవడానికి’’ అన్నాడు జంబులింగం. ‘‘అవును అండి నాకు చాలా ఆలస్యముగా తెలిసింది దిగులుగా’’ అన్నాడు అ ఆలురావు. 10 కవితలకే పెద్ద రైటరు అయిపోయినట్లు ఆ ఫోజు చూడు అని మనసులో అనుకొని జంబులింగం... అయ్యా తమరి కవితలు పేర్లు చెబుతారా అన్నాడు.
నీ మొహం మండా
రాఎట్టికోడతా
తంతాజాగ్రత్త
‘‘అదేమిటండి బాబు మిమ్మల్ని నేనేమన్నానని (మనసులో అనుకొన్నది గ్రహించే విద్య వీడికేమన్నా తెలుసా అని మనసులో భయపడుతూ)’’ అన్నాడు జంబులింగం.
‘‘అపార్ధం చేసుకోబోకండి. అవి నా కవితలు పేర్లు అన్నాడు’’ అ ఆలురావు.
‘‘అమ్మయ్యా బతికించారు. భయపడి చచ్చాను. సర్లే మీ రచనతో మాకేమి పనిగాని మీకే పురస్కారం కావాలి.
ఎన్ని రకాలు ఉన్నాయి ఆశ్చర్యంగా అడిగాడు’’ అ ఆలురావు.
‘‘పిండికొద్దీ రొట్టె’’ అన్నాడు మర్మగర్బంగా జంబులింగం.
‘‘వివరంగా చెబుతారా’’ అన్నాడు అ ఆలురావు.
‘‘మేమున్నదే అందుకు అంటూ ఓ లిస్టు తీసాడు’’ బోడిలింగం.
5వేలుకు ఇచ్చే పురస్కారాలు
కవికాకి, కవిజంబులింగం, కవిజీమ్బుతం, కవిగార్ధబం, కవిపాషణం
‘‘ఆగండాగండి నాకు కవి బోషాణం కావాలి’’ అన్నాడు అ ఆలురావు.
‘‘కవిబోషాణమా ఎందుకు ఇది కావాలనుకుంటున్నారు’’ అడిగాడు జంబులింగం.
‘‘కవిబోషాణమ్ లాంటివాడు, కవితారత్నాలను తీసి పంచిపెడతాడు’’ అన్నాడు అ ఆలురావు.
ఒకరి మొఖం ఒకరు చూసుకొన్నారు జంబులింగం, బోడిలింగం. ఇందులో ఇంత అర్ధముందా అన్నట్లుగా.
‘‘అయ్యా ఆ బిరుదుకి 10వేలు’’ అన్నాడు బోడిలింగం.
‘‘మరీ ఎక్కువగా అడుగుతున్నారు’’ అన్నాడు అ ఆలురావు.
‘‘ఆ బిరుదుకి ఎంత విలువో మాకన్నా మీకే బాగా తెలుసు’’ అన్నాడు బోడిలింగం.
డబ్బుకట్టి రసీదు తీసుకొని వెళ్ళిపోయాడు అ ఆలురావు.
సాయంత్రంలోపు ఓ 50మంది వచ్చారు.
రాత్రి ఇరువురు డబ్బులెక్కపుడుతూ ఇక ఈ ఉగాది నుంచి దసరా వరకూ మన జీవనానికి తిరుగులేదు అనుకొన్నారు.
‘‘ఈమధ్య సాహిత్య సభలకు జనం పెద్దగా రావడంలేదు’’ అన్నాడు జంబులింగం.
‘‘రాజకీయ నాయకుల మీటింగులకు తోలినట్లు లారీలలో జనాలను తెచ్చి సారా, బిర్యానీ పొట్లాలను ఇద్దామా’’ అన్నాడు బోడిలింగం.
‘‘ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రార్ధనా గీతానికి బదులు ఐటం సాంగ్ పెడితే చాలు జనాలకు కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండదు’’ అన్నాడు జంబులింగం.
శాలువాలకి, పూలమాలలకి, సన్మాన పత్రానికి ఇలా ఓ రెండుముడు వేలు ఖర్చుపెట్టి మిగిలింది గుటకాయస్వాహా చేశారు.
ఇలా అడ్డదారిలో పేరుకు పాకులడే కవికాకులున్నంతకాలం ఇలాంటి డింగ్ డాంగ్ సంస్థలు ఎన్నో బ్రతికిపోతాయ్.

- ఘాలి లలిత
చరవాణి : 7386362476

పుస్తక సమీక్ష

‘కోట్ల’ కవిత్వం..
స్వాభిమాన భరితం!
పేజీలు: 183, వెల : 150/-
ప్రతులకు: కోట్ల వెంకటేశ్వర రెడ్డి
4-31/1/2, భగీరథ కాలనీ
మహబూబ్‌నగర్
సెల్.నం.9440233261

‘గుండె కింద తడి’ గ్రంథంతో సాహితీ లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి. తన ఎనిమిదో పుస్తకంగా ‘బ్రేకింగ్ వ్యూస్’ను పాఠకులకు అందించారు. తెలంగాణ మట్టి వాసనల గుబాళింపుతో రాసిన కవితలు వలసలకు నెలవైన పాలమూరు జిల్లా కార్మికుల వ్యథలను, ప్రతిబింభించే కవితలు, ప్రపంచీకణ వెతలను ఏకరువుపెట్టే కవితలు ఇందులో ఉన్నాయి..మనుషులను కలపడం, మేల్కొల్పడం, చైతన్యపరచడం వంటి కవితలూ వున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..ఉద్యమ ఫలితాన్ని కీర్తిస్తూ రాసిన రచనలు కూడా ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి.
ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదు..పువ్వై వికసించాలని, పరిమళమై విస్తరించాలన్న కోట్ల గారి కవిత్వపు సంతకాలు ఈ గ్రంథంలో కన్పిస్తాయి.
ఆధునిక, సాంకేతిక ప్రగతి పుణ్యమా అని..ముట్టీమే దునియా మునిగిపోయిందనీ..కొత్త కోడలులా స్మార్ట్ ఫోనొచ్చి..టివి ఆధిపత్యానికి గండికొట్టిన వైనాన్ని కవిత్వీకరించారు.
‘ఇది తెలంగాణ మట్టి’ కవితలో కవి తెలంగాణ మట్టిని అభివర్ణించడంలో స్వాభిమానం తొణికిసలాడింది..మల్లెపువ్వుల్నే కాదు..తంగేడు పూలనైనా..తలకెత్తుకునే ఆత్మీయ అచ్చ తెనుగు మట్టిగా..ఆవిష్కరించిన తీరు బాగుంది.
‘వేరుపడిన తర్వాత కూడా..ఏమిటీ వెన్నుపోటు చతురత?’ అంటూ ‘పాత కాపు కన్నీళ్లు’లో ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ..ఎగిసి పడుతున్న చైతన్య కెరటమనీ..హైదరాబాద్..ఓ పురాతన సౌందర్య రాశి అనీ..నీ నీడే దాని వైభవానికి అంటిన చెరగని మకిలి అనీ..నీతులు వల్లిస్తూ గోతులు తీయొద్దని రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వలస పాలకులు పెత్తనం చెలాయించడంపై ధ్వజమెత్తారు. ట్యాంకుబండ్‌పై కొలువుదీరిన పెద్దల విగ్రహాలకు దండం పెట్టి..పుట్టింటికి వెంటనే సాగనంపుదామని ‘ఖాళీ చేయాల్సిందే’ కవితలో కవి పిలుపునిచ్చారు. మా నగరానికి మీ హైటెక్ నగలొద్దు.. మీ ఒగలొద్దు.. మా మొగలాయి నగరం మాకు చాలంటూ ఇంకో కవితలో నినదించారు.
ప్రేమ ఎవరిదైతేనేమి..అది రెండు హృదయాల నిశ్శబ్ధ సంభాషణ అనీ..ప్రేమ ఒక అవ్యక్త అనుభూతి అనీ..దాన్ని అక్షరాలతో వాచ్యం చెయ్యొద్దని హితవు పలికారు.
‘పరమార్థం’ కవితలో..కష్ట్ఫేలి! శ్రమయేవజయతే! ఇవే సుఖ జీవన సూత్రాలని తేల్చిచెప్పారు.
గాయమొక జీవితానుభమమనీ.. కాలానిదేముంది.. తన దారిన తాను కరిగిపోతనే ఉంటది! జీవించాలంటే..మనం కాలానికెదురీదాలని సూచించారు.
అతను రూపంలో నరుడు..ఈనాటి కవులకు ఇంకా స్పూర్తినిచ్చే నారాయణుడని సినారెను ఒక కవితలో అభివర్ణించారు.
‘దుఃఖమొక ఊబి’ కవితలో కవి వెలుబుచ్చిన భావాలు తాత్త్వికతను మోసుకొచ్చాయి. మాటకూ చేతకూ అభేదం పాటించి జీవితాంతం లోకంతో గొడవపడిన మనిషి కాళోజీకి ఓ కవితలో నివాళి ప్రకటించారు.
పాలమూరు కార్మికుల కష్టాలను ఏకరువు పెడుతూ..పాలమూరింట..కరువు మొండి సుట్టమై కూసుందని వాపోయారు. తిరుపతి ప్రపంచ తెలుగు మహా సభలకు వెళ్లిన తెలంగాణ కవులు, రచయితలపై తమ కలాన్ని ఎక్కు పెడుతూ ‘సప్తగిరుల సభల నానీల’ శీర్షికన నానీలు రాశారు.
శాలువాకూ..మెమొంటోకే..తెలంగాణ తాకట్టా..ఏడు కొండల వాడా! అంటూ వ్యాఖ్యానించారు.
‘దేశమంటే మనిషి కాదోయ్’ కవితలో కవి కోట్ల భావోద్వేగంతో రాసిన పంక్తులు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. స్వపరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథాన పరుగులు తీయడానికి..బంగారు తెలంగాణ కోసం పాలకులు మరింత సమర్థంగా పని చేసేందుకు.. జనాన్ని చైతన్యపరిచేలా కోట్ల తమ కవిత్వాన్ని పండించాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

సాహిత్య సమాచారం

ఆచార్య కడారు వీరారెడ్డి గ్రంథావిష్కరణ 11న
తేజ ఆర్ట్ క్రియేషన్స్ నిర్వహణలో ఆచార్య కడారు వీరారెడ్డి దీర్ఘకవిత ‘అందమా... నిను వర్ణింపతరమా!’ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 11న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరగనుంది. ఈ గ్రంథాన్ని డా. సి.నారాయణరెడ్డి ఆవిష్కరిస్తారు. ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా ఎం.వి.నరసింహారెడ్డి, బైస దేవదాసు, దాస్యం సేనాధిపతి, గిరిజా మనోహర్ బాబు, కడారి అనంతరెడ్డిలకు విశిష్ట పురస్కారాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

మనోగీతికలు

తెలుగు మాధుర్యం
పలుకు రాగమధురం నా తెలుగు భాష వైనము
తేనెలూరు తియ్యదనం నాదు తెలుగు మాధుర్యం
అన్నయయ్య గొంతులోన భక్తి భావ యుక్తమై
త్యాగయ్యా గళములోన తారాడు నాదమై
నన్నయ్య కలములోన ఆదికావ్య కిరణమై
శ్రీనాథుని కలము నందు శృంగార నైషధమై
వేమన్న పలుకు నీటి తేట తెలుగు పదములై
తిక్కన్న కలము నందు తీపి సుధా ఝరులై
పోతన్న కవితలోన మధుర మధుర భావనలై
ముక్కు తిమ్మనార్యు నోట ముద్దు ముద్దు పలుకులై
పాల్కూరికి సోమనాథ పదగతుల లాహిరి
విశ్వనాథ కవితలతా విరిసిన పుతావి
అల్లసాని అల్లికలా పదకవితల వేణి
కందుకూరి గురజాడ గద్యరచన ప్రవాహినీ
ఆయని కోయిల కూసే కమ్మని మృదుగానము
నింగిలోన విరిసిన శశికాంతుల వైనము
దేశ భాషలందు లెస్స తేట తెలుగు భాష
లలిత లలిత మృదు పదముల పదకోమల మీ భాష

- దాసరి శ్రీనివాస్ గౌడ్
మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9701781696

రూపాలు వేరైనా..
ప్రతి ఇంటి గోడలపై
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ
ఆఫీసు ఆవరణలలో
అందరి చేతి మణికట్టుపై
అలంకారమై భాసిల్లుతూ..
రూపాలు వేరైనా..
నీ కర్తవ్యం ఒక్కటే అన్పిస్తూ..
నిమిషాలను గంటలుగా
గంటలను రోజులుగా
రోజులను యుగాలుగా
మారుస్తూ.. మలుస్తూ..
మూడు ముళ్లనూ ఒక దాని వెనుక ఒకటిగా
అంకెలపై నడిపిస్తూ.. పగలు రేయిలను తెలుపుతూ
కాలాన్ని పరుగులెత్తిస్తూ..
లోకాన్ని పరుగులు తీయిస్తూ..
వారి వారి విధి నిర్వహణలు
సమయానుకూలంగా తెలియజేస్తూ..
సక్రమంగా నిర్వర్తించేట్టు చేయిస్తూ..
సమయపాలన నేర్పుతూ నడిపించగలవు..
కానీ.. గడిచిన కాలం తిరిగి పొందలేము
మానవునికి హృదయం ఎంత ముఖ్యమో?
జగానికి, కాలానికి నీ పాత్ర అంత ముఖ్యమే!
గుండె ఆగిననాడు మనిషి మనుగడ ఆగినట్లే..
నువ్వు ఆగిననాడు లోకమూ స్తంభించినట్లే!!

- పోపూరి మాధవీలత
హైదరాబాద్, సెల్.నం.8125115667

మా నాన్న
నాన్నంటే నాకిష్టం
ఎందుకంటే
నాన్నంటే ఆకాశం
అన్నివేళల్లో రక్షణ గొడుగై
నా జీవితమంతా ఆవరించి ఉన్నాడు
వేల తారకలనయనాలతో
అనుక్షణం నావైపే శ్రద్ధగా చూస్తున్నాడు
నేను తనను చూస్తున్నా చూడకున్నా
తన చూపుల్ని నాపై నుండి తిప్పుకోవడం లేదు
నానడకను, నడతను ఎంత నిశితంగా గమనిస్తున్నాడో!
నేనెక్కడికి వెళ్లినా తను నావెంటే
నేనలా నిద్రలేవగానే
నాకోసం బాల భాస్కరున్ని పంపించి
నాలోని ఉత్సాహానికూపిరులూదడం
అంతకంటే ఎంతో ముందుగానే
కర్తవ్యాన్ని మరవొద్దనే సందేశాన్ని
కర్మ సాక్షితో పంపించడం
నాన్నకే సాధ్యమయ్యింది
చందమామను నా కోసం పంపిస్తూ
చల్లని వెనె్నలను ప్రేమగా నాపై కురిపించడం
అంతకంటే ఎంతో ముందుగానే
వెనె్నలలోని అమృతాన్ని ఆస్వాదించే
అంతరంగాన్ని ఆప్యాయంగా అనుగ్రహించడం
నాన్నకే చెల్లింది
అంతెందుకు
సంతోషాల ‘చిరుజల్లు’లతో పలకరించినా
అంతులేని ఆశీస్సులను నిరంతరంగా వర్షించినా
ఆనంద‘వాహని’లో అనునిత్యం ఓలలాడించినా
జీవితాన్ని సప్తవర్ణాల ‘హరివిల్లు’లతో ఆవిష్కరించినా
అదంతా ‘మానాన్న’ చలవే
నా వ్యక్తిత్వానికి వనె్నలు దిద్దడం
మనస్తత్వానికి మమతల సుగంధాల్ని అద్దడం
నాన్న కెంతిష్టమో!
జీవితానికి నిజమైన సార్థకత
నాన్నతీర్చిన శిల్పంగా నిలిచినప్పుడే కదా!

- ఎస్.ఎస్.రాజు
సెల్.నం.9963499137

ఓ నేస్తమా!

ఓ..నేస్తమా
నా..స్నేహమా!
పరిమళాలు వెదజల్లే..
రంగు రంగుల
అందమైన
పూవ్వులనిచ్చిన
పూల రెమ్మలు రాలాలి
నేల తల్లిని చేరాలి
పూల చెట్టును
వీడాలి..
ఓ..బంధమా
నా..ప్రాణమా!
నీలాకాశమున
కదిలె మేఘం
ఎంత ఉరికినా..
కరగాల్సిందే
చివరికి వర్షపు
చినుకులై
కురవాల్సిందే
పంట పొలాలని
తాకాల్సిందే
పచ్చదనాన్ని
పెంచాల్సిందే!!

- కె.శ్యామ్
ఆరుగొండ
సెల్. 9000011435

చెల్లీ..!

ఎక్కడ చెల్లీ నీ ప్రాణం
ఎక్కడుంది నీ ఆయువు?
ఏ వూరి పొలిమేరలో
ఏ రోడ్డు ప్రయాణంలో
ఏ రథసారథి చేతిలో
నీ మరణ రహస్యం?
ఆడపిల్లలా
ఎందుకు పుట్టానని
బాధపడుతున్నావా?
కుళ్లు కుతంత్రము తెలియని
ఓ కుసుమ కోమలీ..!
అడుగడుగునా
పల్లేర్లుంటాయి
కంటపడకు తల్లీ!
పువ్వులని భ్రమచెందకు
సుకుమారపు చేతులతో
తడుమకు సుమా!
పువ్వులు కావవి
ప్లాస్టిక్ పరిమళాలు
నవ్వకు తల్లీ!
కనె్నత్తి చూడకు మళ్లీ!
కనబడే నవ్వుల్లో విషం దాగుంది చెల్లీ!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి
ఆదిలాబాద్ జిల్లా

email : merupuknr@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం కృషి

$
0
0

నిర్మల్, ఏప్రిల్ 9: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం సారంగాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల జగదాంబదేవి, సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మంత్రి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది కోసం ఐటిడి ఎల ద్వారా కోట్లాది రూపాయలను విడుదల చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే గిరిజన గ్రామాల్లో రోడ్లు, ఇతర వౌళిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందన్నారు. గిరిజన విద్యార్థులు చదువుపట్ల ఆసక్తిని పెంచుకోవాలని, ఉన్నత చదువులతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉన్నత చదువులు చదివిన గిరిజన విద్యార్థులకు సునాయాసంగా మంచి ఉద్యోగాలు పొందేఅవకాశం ఉంటుందని తెలిపారు. గిరిజనతాండల్లో సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గ్రామంలో ప్రతిష్టించిన జగదాంబదేవి, సేవాలాల్ ఆలయాల అభివృద్దికి అవసరమైన నిదులను మంజూరుచేస్తామని ఈసందర్భంగా మంత్రి హామీనిచ్చారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, రాజ్‌మహ్మద్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వంజరి శ్రీనివాస్‌రెడ్డి, మాధవరావు, పోడెల్లి గణేష్, మేడారం ప్రదీప్, అయ్యన్నగారి రాజేందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం
* బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఇచ్చోడ, ఏప్రిల్ 9: కేశవపట్నంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఒకొక్కరికి రూ.15వేల చొప్పున పరిహారం అందించగా ఆయన సొంత డబ్బుల నుండి ఒక్కొక్కరికి రూ.2వేల నగదును అందజేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదించి బాధితులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన ఆర్థిక సాయం అందించడాని ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గాడ్గె సుభాష్, గుండాల పిఏసిహెచ్ చైర్మెన్ అబ్దుల్ రషీద్, ఇచ్చోడ ఉప సర్పంచ్ కృష్ణరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణకుమార్, మిరాజ్ ఆహ్మాద్, రషీద్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల సమస్యల సాధనే ప్రభుత్వ లక్ష్యం
* ఎమ్మెల్యే రేఖానాయక్
జన్నారం, ఏప్రిల్ 9: గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికై టీ ఆర్ ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖానాయక్ అన్నారు. శనివారం మండలంలోని రాతూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి కెసి ఆర్ మన ఊరు మన ప్రణాళిక, గ్రామజ్యోతి వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అదే విధంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించి సాగునీటితో పాటు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న మూడేళ్లలో ఇంటింటికి కుళాయిలా ద్వారా తాగునీటిని అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తాళ్లపేట నుండి రాతూర్ గ్రామం వరకు బీటి రోడ్డు, తాగునీటి సమస్య, కమ్యూనిటీ హాల్‌ను మంజూరి చేయాలని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వెంటనే నిధుల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి సిహెచ్ రాజేశ్వరి సత్యం, గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎంపిటీసీ లక్ష్మి, పొన్కల్ సహకార సంఘం చైర్మన్ బి.రాజవౌళి, టీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్, టీఆర్‌ఎస్ నాయకులు రవి, వినయ్‌కుమార్, మున్వర్, గ్రామ కార్యదర్శి సత్తయ్య, ప్రజలు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం
* మండలంలోని ప్రతీ గ్రామానికి బీటి రోడ్లు
* పగటిపూట రైతులకు 9 గంటల విద్యుత్
మామడ, ఏప్రిల్ 9: మండలంలోని కొరిటికల్ గ్రామంలో రెండవ విడత మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా శనివారం రోజు అన్నవరపు చెరువు పనులను రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మొదటి విడతలో 13 చెరువులకు పనులు జరగగా అవి తుది దశకు చేరుకున్నాయన్నారు. రెండవ విడతలో 9 చెరువులకు 9 టెండర్లు పిలిచామన్నారు. మొదటి విడతలో భాగంగా చెరువుల పునరుద్దరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకున్నాయన్నారు. దీంతో చెరువుల యొక్క రూపరేఖలు మారిపోయాయన్నారు. చెరువులలో పూడిక మట్టిని తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయకట్టు రైతులు చెరువులోని మట్టిని తమ చేనులోకి వేసుకోవడం వల్ల భూమి సారవంతమై అధిక పంటలు పండే అవకాశం ఉందన్నారు. చెరువులో మట్టిని తీయడం వల్ల గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులకు, కూలీలకు, నిరుద్యోగులకు ఉపాధి కలిగిందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన పనులతో కూడిన పనులుచేసి ఇచ్చిన గడువులోగా పనులను పూర్తిచేయాలన్నారు. మన రాష్ట్రప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ను ఇస్తుందన్నారు. దీంతో రైతుల కష్టాలు ఇక తీరనున్నాయన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్, నీళ్లను దోచుకున్నాయన్నారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. మండలంలోని ప్రతీ గ్రామానికి బీటి రోడ్లు వేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీంబాయి, మండల ఉపాధ్యక్షులు పడాల శ్రీనివాస్, ఎంపిటిసి లక్ష్మి ప్రియ, తహసిల్దార్ రామస్వామి, ఎంపిడివొ కమలాకర్, నీటి పారుదలశాఖ ఈ ఈ రమణరెడ్డి, డి ఈ కృష్ణశంకర్, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, నాయకులు నవీన్‌రావు, గంగారెడ్డి, చిన్నారెడ్డి, రాందాస్, మోహన్, హన్మాగౌడ్, రమేష్‌రెడ్డి, నర్సారెడ్డి, భీమలింగం, అతిక్ అహ్మద్, శివయ్య, గ్రామస్తులు ఉన్నారు.

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
మంచిర్యాల శాసన సభ్యుడు దివాకర్‌రావు
దండేపల్లి, ఏప్రిల్ 9: బలహీనవర్గాల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ద్యేయమని మంచిర్యాల శాసన సభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మండలంలోని రెబ్బన్‌పెల్లి, చింతపెల్లి గ్రామాలలో బిసి కార్పోరేషన్ నిధులతో నిర్మించిన దోభీఘాట్లను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో కాలువలు, చెరువులు, కుంటలు ఏండిపోవడంతో రజకుల సౌకర్యార్ధం ప్రభుత్వం దోభీఘాట్ల నిర్మాణాకి నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవస్థితిగతులు మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలుచేకుర్చాడని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో మేరుగైన సౌకర్యల కోసం రోడ్లు వేయడంతో పాటుగా వౌళిక వసతులు కల్పిస్తుందన్నారు. గ్రామాల్లో ఏప్పుడో నిర్మించిన ఊర చెరువుల మరమ్మత్తుల కోసం మీషన్ కాకతీయ పథకం ప్రవేశ పేట్టి చెరువుల మరమ్మత్తు చేపట్టిందని, అలాగే గ్రామాల్లో రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వాటర్ గ్రీడ్‌ను ఏర్పాటు చేసి తాగు నీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పేట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గోళ్ళ మంజుల, జడ్పిటిసి సభ్యుడు భూక్య యశ్వంత్ నాయక్, సహకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఆకుల రాజేందర్, చింతపెల్లి, రెబ్బన్‌పెల్లి సర్పంచులు లింగంపెల్లి రాజవ్వబాపు, కొట్టేరాజేశ్వరిసత్తయ్య, ఉప సర్పంచ్ గోర్ల మధుకర్, మాజి ఎంపిపిలు మోటపలుకుల గురవయ్య, బండారు మల్లేష్, కో-ఆప్షన్ సభ్యుడు యండి ఫయాజ్, తెరాస యూత్ మండల అధ్యక్షుడు పడిగెల శంకర్ రావు, నాయకులు వెంగల్ రావు, సత్యంరావు, నక్క తిరుపతి, మీర్‌అప్సర్ బేగ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

పది మూల్యాంకనం షురూ
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఏప్రిల్ 9: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన పదవ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం శనివారం ఆదిలాబాద్‌లో ప్రారంభమైంది. మొత్తం తెలంగాణ తొమ్మిది జిల్లాకు సంబంధించి 5లక్షల 80వేల జవాబు పత్రాలు జిల్లాకు చేరుకోగా, 2200 మంది ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరయ్యారు. చీఫ్ ఎగ్జామీనర్లు, అసిస్టెంట్ ఎగ్జామీనర్లు, స్పెషల్ అసిస్టెంట్‌లు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాలుపంచుకున్నారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం ఉంటుందని, విధులు కేటాయించిన ఉపాధ్యాయులంతా రిపోర్టు చేయాలని డిఈవో సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

అధికారికంగా పూలె జయంతి వేడుకలు
నిర్వహణ కమిటీని ప్రకటించిన కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఏప్రిల్ 9: సమాజంలో వర్ణవివక్ష, అసమానతలను పారదోలి, సామాజిక సంఘసంస్కర్తగా బడుగువర్గాలకు అశాజ్యోతిగా నిలిచిన మహాత్మా జ్యోతిబా పూలె 190వ జయంతి వేడుకలను ఈనెల 11న జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. శనివారం పూలె జయంతి వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్‌లో బిసి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జాతి మహానుభావుల్లో ఒకరైన జ్యోతిబాపూలె ఆశయాలను విద్యార్థులకు, సమాజానికి వివరించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులు, బిసి సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నావన్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్ర కోసం భోజన, తాగునీటి వసతి కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో సుధాకర్ రెడ్డి, బిసి సంక్షేమాధికారి మేఘనాథ్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్, బిసి సంఘం నాయకులు పి.కిష్టు, ఎస్‌టివో నీలకంఠం, ఎస్‌డబ్ల్యూవో రాజేశ్వర్, పర్యవేక్షకులు రాజలింగు, వివిధ బిసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జయంతి ఉత్సవ కమిటీ నియామకం
పూలె జయంతి ఏర్పాట్ల కోసం కలెక్టర్ జగన్మోహన్ సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఉత్సవాలకు చైర్మన్‌గా ఈర్ల సత్యం, కన్వీనర్‌గా జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి మేఘనాథ్, కో-కన్వీనర్‌గా కె.పార్థసారథి, వైస్ చైర్మన్‌గా సుకుమార్ పెట్కులే, ముఖ్య సలహాదారులుగా ఎస్.అశోక్‌తో పాటు వివిధ బిసి సంఘాలకు చెందిన 11మంది సభ్యులను ఎన్నుకున్నారు.

మెడిసిన్ ఫలితాల్లో సత్తాచాటిన
రిమ్స్ విద్యార్థులు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఏప్రిల్ 9: రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు మెడిసిన్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రిమ్స్‌కు వనె్నతెచ్చారు. మొత్తం 102 మంది విద్యార్థులు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో 91మంది ఉత్తీర్ణత సాధించారని డైరెక్టర్ అశోక్ తెలిపారు. శనివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు ఫలితాలతోపాటు ప్రమాణాల్లోనూ ప్రతిభచాటుతుందన్నారు. ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ కళాశాలలోఉన్న అనేక సమస్యలను అధిగమించి విద్యార్థులుకష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్యసేవలు
రిమ్స్‌లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రభుత్వం అత్యవసర విభాగాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని డైరెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు. రిమ్స్‌లో నెలకు రెండుసార్లు నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగంలో సంబంధిత వైద్యులు సేవలందిస్తారన్నారు. అదేవిధంగా ఆసుపత్రిల్లో వివిధ శస్తచ్రికిత్సలు జరుపుకునే వారికి వచ్చే నెలలో ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకోసం రూ.50లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా రిమ్స్‌లో లెప్రొస్కోపి సర్జరీ నిర్వహించడం జరుగుతుందని, ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమంగా వైద్య సేవలు మెరుగుపర్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మూడేళ్లలో రైతులకు 24 గంటల విద్యుత్
* తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
* మిషన్ కాకతీయతో భూముల సస్యశ్యామలం
* గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, ఏప్రిల్ 9: తొలి తెలంగాణలో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తున్నారని, ఇందులో భాగంగానే మిషన్ కాకతీయతోపాటు ఇతర కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ,న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామశివారులో గల పెద్ద చెరువులో రూ.49 లక్షల నిధులు వెచ్చించి మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న చెరువు పునరుద్దరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుండి వ్యవసాయానికి 9 గంటల కరెంటును పగటిపూట అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, చెప్పిన విధంగానే దాన్ని అమలుచేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయానికి కరెంటును ఇవ్వడం వల్ల తరచూ అనేక ప్రమాదాలు జరుగుతుండడాన్ని గుర్తించి పగటిపూటనే రెండు విడతలుగా 9 గంటల కరెంటును అందజేస్తున్నామన్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రెండవ విడత చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని, రాష్టవ్య్రాప్తంగా మొత్తం 45 వేల చెరువులను రెండవ విడతలో ప్రభుత్వం ఎంపికచేసిందన్నారు. ఆయా చెరువులను వచ్చే వర్షాకాలం నాటికి అభివృద్ది చేసి రైతులకు సాగునీరు అందించాలనే అక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఊరి చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్న నినాదంతో ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని గుర్తుచేశారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలను సబ్సీడిపై అందజేస్తూనే, పండిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందేలా అండగా నిలుస్తోందన్నారు. మార్కెట్‌లో ఆశించిన ధర లేకుంటే రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఉచితంగా గోదాముల సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ మండలాల వారీగా గోదాముల నిర్మాణం చేపట్టిందన్నారు. చాలాచోట్ల ఇప్పటికే పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి ప్రతీ మండలంలో రైతులకు గోదాములను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇదిలా ఉంటే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఉన్నచోట ట్యాంకుల ద్వారా నీటిని అందజేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామాలను నియోజకవర్గ కేంద్రానికి అనుసంధానం చేస్తూ ఎక్కడికక్కడ బీటి రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు మంత్రి పలుగు, పార చేతబట్టి చెరువులోని మట్టిని తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కాసేపు జేసిబి నడిపి హల్‌చల్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ రమణరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్.నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజ్ మహ్మద్, మాజీ జడ్పిటిసి పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి ఛైర్మెన్ నల్ల వెంకట్‌రాంరెడ్డి, నాయకులు వంజరి శ్రీనివాస్‌రెడ్డి, మాధవరావులతోపాటు నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు పోడెల్లి గణేష్, అయ్యన్నగారి రాజేంధర్, తదితరులు పాల్గొన్నారు.

చార్జీల పెంపుసరే.. సేవలేవి?

$
0
0

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 9: తామనుభవించేవి రాజభోగాలు..వినియోగదారులకందించేవి నాసిరకం సేవలు...వీటికితోడు పైసలివ్వనిదే ఫైలు ముందుకు కదలదు..ప్రజలకోసం ప్రభుత్వం సరఫరాచేస్తున్న పరికరాలు నల్లబజారుకు తరలిస్తారు..వాటినే తిరిగి వినియోగదారులచే కొనుగోలు చేయిస్తూ, అవినీతికి తోడు తమ అక్రమాల చిట్టాను రోజురోజుకు పెంచుతూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఓవైపు డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమవుతుండగా, మరోవైపు విద్యుత్ సిబ్బంది మాత్రం తమకు పైవిధంగా సేవలందిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి క్రాస్ సబ్సీడీ సర్‌చార్జీలు, అదనపు సర్‌చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏర్పాటుచేసిన బహిరంగ విచారణలో వినియోగదారులు తీవ్రస్థాయిలో గళమెత్తారు. గ్రామాల్లో పనిచేస్తున్న హెల్పర్ నుంచి మొదలు ఎస్ ఈ స్దాయివరకు ఇబ్బందులు పెడుతున్న వైనంపై ఈఆర్‌సి చైర్మన్, డైరెక్టర్‌లకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. విచారణలో పాల్గొన్న 90శాతం మంది క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆగడాలను పూసగుచ్చినట్లు చెప్పటంతో సర్‌చార్జీల పెంపుపై కొనసాగుతున్న చర్చ కాస్త, విద్యుత్ శాఖలోని సిబ్బంది, అధికారుల అవినీతి,అక్రమాలవైపు మళ్ళింది. వరంగల్ జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నవీన్‌రావు మాట్లాడుతూ, మద్యతరగతి పరిశ్రమలపై సర్‌చార్జీ భారం మోపటంతో ఇప్పటికే ఆర్దికసంక్షోభంలో కూరుకుపోయిన మిల్లులు, ఇకముందు శాశ్వతంగా ఖాయిలాపడే పరిశ్రమల జాబితాలో చేరుతాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫెర్రో అల్లాయిడ్ పరిశ్రమకిచ్చిన ప్రోత్సాహం కూడా రైస్‌మిల్లర్లకు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. వ్యవసాయరంగానికి నిరంతరంగా 6గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబితే, ఇందుకు భిన్నంగా డిస్కంలు వ్యవహరిస్తున్నాయని పలువురు రైతులు మండిపడ్డారు. పగటిపూట పరిశ్రమలకు సరఫరాచేస్తూ, రాత్రిపూట వ్యవసాయానికి విద్యుత్ సరఫరాచేయటం ఏమేరకు సమంజసమని వరంగల్ జిల్లా బిజెపి నేత నరహరి వేణుగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. అటు వ్యవసాయశాఖ సూర్యోదయం, సూర్యాస్తమయం అనంతరమే పంటలకు నీటితడులందించాలని స్పష్టంచేస్తుంటే, విద్యుత్‌శాఖ మాత్రం పట్టపగలే విద్యుత్ సరఫరాచేస్తామంటూ భీష్మించటం వ్యవసాయరంగాన్ని పరోక్షంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్రేనని తేటతెల్లమవుతుందన్నారు. వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాతో నష్టంరావటంలేదని, అర్భన్ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమవిద్యుత్ వాడకంతోనే డిస్కంలకు నష్టాలు వస్తున్నాయని, ఈలోటును పూడ్చుకునేందుకు సర్‌చార్జీలు పెంచి రైతులపై భారం వేసేందుకు యత్నించటం దారుణమని అన్నారు. విద్యుత్ సరఫరాలో నిబద్దత పాటించని యంత్రాంగం దానిని వినియోగించుకునేవారిపై పలు ఆంక్షలు విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఆటోమెటిక్ స్టార్టర్లు బిగించుకోవటంపై డిస్కంల ప్రకటన హేయనీయమని దుయ్యబట్టారు. ఉదయం,సాయంత్రం వేళల్లో మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరాచేస్తే రైతులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. బిల్లుల వసూళ్ళలో ఉన్న శ్రద్ద విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన రైతులకు పరిహారమందించటంలో ఎందుకు కనబర్చటంలేదని అఖిలభారత కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి ప్రశ్నించారు. ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపు, మరమ్మత్తుల కోసం రైతులనుంచి వసూళ్ళకు పాల్పడుతున్న సిబ్బంది అవినీతికి అంతమెప్పుడో కమీషన్ సభ్యులు చెప్పాలని పట్టుబట్టారు. ట్రాన్స్‌కోలో కొనసాగుతున్న అసమర్ద అధికారుల మూలంగానే విద్యుత్‌రంగంలోకి ప్రైవేట్ డిస్కంలు రాబోతున్నాయని, ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఎదుర్కొంటున్న పరిస్థితే ట్రాన్స్‌కో సిబ్బందికి కూడా రావటం తథ్యమని జోష్యం చెప్పారు. రాబోయే రెండేళ్ళలో విద్యుత్ మీటర్లు బుట్టలో పెట్టుకుని వీధుల్లో అమ్ముకునే దయనీయస్థితికి చేరుకోవటం ఖాయమన్నారు.
నెలనెలా లక్షల రూపాయల వేతనాలు పొందుతున్న అధికారులు సిబ్బందిపై కనీస పర్యవేక్షణ కూడా జరపకపోవటమే అవినీతి,అక్రమాలకు ఊతమిస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వరంగ సంస్థలనుంచి విద్యుత్ కొనుగోళ్ళు నిలిపేసి, ప్రైవేట్ సంస్థలనుంచి ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ, సర్‌చార్జీల పెంపును డిస్కంలు అనివార్యం చేస్తున్నాయని దుమ్మెత్తారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపిన అనంతరమే ప్రభుత్వానికి పెంపునివేదిక అందించాలని సూచించారు. ఈబహిరంగ విచారణలో విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, డైరెక్టర్లు ఎ.మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎన్‌పిడిసి ఎల్ సి ఎండి వెంకటనారాయణ, ట్రాన్స్‌కో ఎస్ ఈ రంగారావుతో పాటు 5జిల్లాలనుంచి వచ్చిన వినియోగదారులు, రైతులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
కరవు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం
* బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి
రామడుగు, ఏప్రిల్ 9: కరవు నివారణ చర్యలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని షానగర్ గ్రామంలో పర్యటించి పంటపొలాలు, బావులను ఆయన పరిశీలించారు. ఎండిపోయిన పంటలను చూసి చలించిపోయారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలకు తన వాటాగా లక్షా 50వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 25శాతం అందించి రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వమే నేరుగా రైతులను ఆదుకుంటుందని రాంచంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పి.సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావు, యాదవ్, ఉప్పు రాంకిషన్, లింగంపల్లి శంకర్, కట్ల రవీందర్, రమణారెడ్డి, గాజుల స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా మిషన్ కాకతీయ
గంభీరావుపేట, ఏప్రిల్ 9: రెండవ విడతలో భాగంగా గంభీరావుపేట మండలంలోని మూడు గ్రామాల్లోని మిషన్ కాకతీయ పనులను ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభించారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోని ఊరచెరురవుకు రూ. 56.15లక్షలు, పటేల్ చెరువుకు రూ. 19.19లక్షలు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన పెద్దచెరువుకు రూ. 39,8లక్షలు, నర్సంచెరువుకు రూ. 21.8లక్షలు, నాగంపేటకు చెందిన అందేరికుంటకు రూ. 20.38లక్షలు మంజూరు కాగా, అట్టి పనులను ఎంపిపి కమ్మరి గంగసాయవ్వ, జడ్పీటీసీ సభ్యురాలు మల్లుగారి పద్మలు పనులను ప్రారంభించారు.
పూడికతీత ద్వారా చెరువులలో తొలగించిన మట్టిని రైతులు తమ పంటపొలాలకు తరలించి దిగుబడులను పెంచుకోవాలని సూచించారు. వివిధ కార్యక్రమాలలో సెస్ డైరెక్టర్ కొక్కు దేవెందర్‌యాదవ్, ఆయా గ్రామ సర్పంచ్‌లు నాగపురి నాగరాజగౌడ్, ఈరవేని వనిత, దోమకొండ ఎల్లం, ఎంపీటీసీ సభ్యులు బీనవేణి చంద్రకళ, సాయిని సుగుణ, శనిగరం లింగం, ఐబి ఎఇ నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు మహబూబ్‌అలి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు చెవుల మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు మల్లుగారి నర్సాగౌడ్, దయాకర్‌రావు, కమ్మరి రాజరాం, బీనవేణి దేవయ్యలతో పాటు వర్క్‌ఇన్స్‌పెక్టర్ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మూడేళ్లలోనే.. అరవై ఏళ్ళ అభివృద్ధి
* నా జీవితం చొప్పదండి ప్రజలకంకితం * రాష్ట్రంలో ఏ పార్టీకి అడ్రసుండదు
* తలదించుకునే పని చేయను * పార్టీలో పలువురు చేరిక * ఎమ్మెల్యే శోభ
చొప్పదండి, ఏప్రిల్ 9: ప్రజలకు అండగా ఉంటానని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాంటి ప్రజలకు అండగా ఉండేందుకే తాను రోజుకు 24గంటలు కష్టపడి నియోజవర్గంలోని 161 గ్రామాల ప్రజల కన్నీళ్ళు తుడవడమే లక్ష్యంగా ముందకు సాగుతున్నానని, అందుకే తాను నియోజగకవర్గానికి భారీ నిధులను తీసుకు రావటానికి అవకాశం కలుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని వైశ్యాభవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరే కార్యక్రమం జరిగింది. ఈ మేరకు చొప్పదండి మాజీ ఎంపిపి వెల్మ మల్లారెడ్డి తన అనుచరులతో చేరగా ఎంపిటిసిలు ఎలిగేటి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, మాజీ సర్పంచ్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్, జిల్లా పెరక సంఘం అధ్యక్షులు కర్రె సురెందర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చీకట్ల లచ్చన్న, ఆర్నకొండ ఎంపిటిసి కోమల్ల రాజేశ్వరి-రాజేశం తన అనుచరులతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 5వందల మందికి పైగా పలు పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అభివృద్ధి తప్ప తనకు ఏదీ కనిపించడం లేదని అందుకే ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సంవత్సరం ఆగితే ఇక ప్రతిపక్షమే ఉండదని, కేవలం అధికార పక్షం మాత్రమే అది కెసిఆర్ టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని అరవై ఏళ్ళ దూరం చేశారని, కానీ తాను అరవై ఏళ్ళ అభివృద్ధిని కేవలం మూడేళ్ళలో చేశానని అన్నారు. అభివృద్ధి అంటే తానే చేయాలని, అది తానే చేసి చూపిస్తానని అన్నారు. నాకు పదవీ భిక్ష పెట్టింది మీరేనని అలాంటిది తాను మీకోసం నిస్వార్థంగా పని చేస్తానని, గ్రామీణ నీటి వనరులైన చెరువులు నేడు పిల్లలకు ఆట మైదానాలు అయ్యాయని, అలాంటి వాటికి మిషన్ కాకతీయను తీసుకువచ్చి ప్రపంచ మన్ననలు కెసిఆర్ పొందారని అన్నారు. చొప్పదండి మార్కెట్ నిధులు శ్రీ్ధర్‌బాబు, జీవన్‌రెడ్డిలు చెరో కోటి రూపాయలు కొట్టుకు పోతే వాటిని తిరిగి తీసుకు వచ్చి మార్కెట్ పరిధిలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. మల్లారెడ్డికి మండలంలో మంచి పేరుందని, అలాంటి వ్యక్తి మా పార్టీలోకి రావటంతో మరింత బలపడ్డామన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతు పదవికీ గౌరవం తనంతట తానే రాదని, అలాంటి పదవికి గౌరవం పని చేసే తీరును బట్టి వస్తుందని, దానికి నిదరనం ఎమ్మెల్యే శోభ మాత్రమే అన్నారు. తాను నియోజకవర్గంలో కళ్ళలో కళ్ళలా, కాళ్ళలో కాళ్ళలా ఉంటు ముందుకు సాగుతుందని, నిజంగా నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. పార్టీలో చేరే వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొడిగ గాలన్న, ఎంపిపి గుర్రం భూంరెడ్డి, జడ్‌పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, ఎంపిటిసిలు స్వప్న, భీమాశ్యాం, సర్పంచ్‌లు కర్రె శ్రీనివాస్, శంకర్, పంతంగి ప్రభాకర్, గన్ను శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, మంద నర్సయ్య, నలుమాచు రామక్రిష్ణ, సీపెల్లి గంగయ్య, బందారపు అజయ్‌కుమార్, మాచర్ల వినయ్‌కుమార్, గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, బత్తిని బుచ్చన్న, కొత్త గంగారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, జహీర్, దామెర విద్యాసాగర్ రెడ్డి, రాపెల్లి ఐలయ్యయాదవ్, గడ్డం చుక్కారెడ్డి, లోక రాజేశ్వర్ రెడ్డి, ఎన్నం మనోహర్, రఫీక్, మల్లిఖార్జున్ రెడ్డి, వడ్లకొండ శ్రీను తదితరులున్నారు.
అర్బన్ బ్యాంక్ పాలక మండలి
పదవీ కాలం ఆరు నెలలు పెంపు
* ఉత్తర్వులు జారీ చేసిన డిసివో * రూ.40 కోట్లకు వాటాధనం పెంచాం
* 524 మందికి రుణ మాఫీ వర్తింపచేశాం : బ్యాంక్ చైర్మన్ దార్నం

సిరిసిల్ల, ఏప్రిల్ 9: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ పాలక మండలి పదవీ కాలాన్ని పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలక మండలి అయిదు సంవత్సరాల పదవీ కాలం ఏప్రిల్ 10వ తేదీతో ముగిసిపోతున్నది. అయితే ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు పోకుండా ఇదే పాలకవర్గం పదవీకాలన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఆర్‌సి.నెం.153/2016-సి, తేది:2-4-2016 ద్వారా డిసివో అంబయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ప్రస్తుత పాలకవర్గం ఆదివారం తిరిగి పదవీ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.16 కోట్ల మేర ఉన్న వాటాధనంను ప్రస్తుతం రూ.40 కోట్లకు పెంచామన్నారు. ఇప్పడు 6336 మంది ప్రాధమిక సభ్యులతో కొనసాగుతున్న బ్యాంకు రూ.64 మేర వ్యాపారం చేసిందన్నారు. తాజాగా బ్యాంకు భవనంను విస్తరించడానికి డిసిఎంఎస్ నుండి పక్కనే ఉన్న 360 గజాల ఖాళీ స్థలంను ఖరీదు చేసి, ఇటీవల మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారన్నారు. ప్రస్తుత బ్యాంక్ భవనం రోడ్డు విస్తరణలో భాగంగా 15 అడుగులు కూల్చి వేయాల్సి వస్తుందని, దీనితో మిగితా భవనంను కలుపుకుని కొత్త భవనం నిర్మాణం చేస్తామన్నారు. పవర్‌లూం కార్మికుల రుణ మాఫీ 524 మందికి వర్తిస్తున్నదని, ఇందులో మాఫీ జరిగే మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి జమ కానున్నదన్నారు. ఈ డబ్బులు జమ అయితే తమ బ్యాంకు ఎన్‌పిఎ నుండి బయటపడుతుందని, దీనితో ఎటిఎంల ఏర్పాటు సాకారం కాలగలదన్నారు. కొత్త భవనంలో ఎటిఎం ఏర్పాటు చేసేలా భవనం నిర్మినిస్తున్నట్టు తెలిపారు. స్థలం కొనుగోలులో సహకరించిన డిసిఎంఎస్ చైర్మన్, పాలకవర్గంకు, తమ పాలకవర్గం పదవీ కాలం పొడిగింపునకు సహకరించిన మంత్రి కె.తారకరామారావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు బ్యాంక్ చైర్మన్ లక్ష్మినారాయణ వెల్లడించారు.

ఏదీ పంట నష్టపరిహారం?

$
0
0

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9: తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని అతలకుతలం చేశాయి. తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వాలు అందించాల్సిన కరువు సహయక చర్యలు ఇంకా అందకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గత ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలు చేతికిరాక నెలపాలై జిల్లాలో దాదాపు నాలుగున్నర లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో పడ్డారు. వాస్తవానికి కేంద్ర కరువు బృందం గత ఐదు నెలల క్రితమే జిల్లాలో పర్యటించి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యాయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇందుకు స్పందించిన కేంద్రం దాదాపు 780 కోట్లకుపైగా నష్టపరిహారం అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో మహబూబ్‌నగర్ జిల్లాకు అంచనాల ప్రకారం 300 కోట్లకు పైగానే పరిహారం అందాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆసలు కేంద్రం ప్రకటించిన పంట నష్టపరిహారం నిధులు విడుదల అయ్యాయా లేక ఉత్త ప్రకటనలకే పరిమితం అయ్యాయో రైతాంగానికి అర్థం కాక నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పంట నష్టపరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలల వ్యవధిలో ఈ ఏడాది ఖరీఫ్ సిజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత సంవత్సరం నష్టపరిహార ఇంకా రైతులకు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా జిల్లాలో మొక్కజోన్న 2.4లక్షల హెక్టార్లలో ఎండిపోవడం పత్తి1.80 లక్షల హెక్టార్లలో ఎండిపోయి రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. పత్తి రైతులు ఎన్నడులేని విధంగా తీవ్రనష్టానికి గురయ్యారు. వాస్తవంగా జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఉంటే జిల్లా రైతాంగానికి పంటనష్టం దాదాపు రూ.450కోట్లకుపైగానే వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి. కానీ తుదకు రూ.320కోట్లకుపైగానే పంటనష్టం జరిగిందని అంచనాలు ఓ కొలిక్క వచ్చినట్లు తెలుస్తుంది. అయితే జిల్లాలో రైతులు మాత్రం పంట నష్ట పరిహారం కోసం గత నాలుగు ఐదు నెలల నుండి ఎదురుచూస్తున్నారు. ఓ పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటికే బోరు బావుల్లో భూగర్భజలాలు పడిపోయి రభీలో కూడా వేసిన పంటలు చేతికి అందని పరిస్థితి నెలకొన్నాయి. అటు ఖరీఫ్, ఇటు రబీ సిజన్ జిల్లా రైతాంగాన్ని నట్టెటముంచింది. ఈ తరుణంలో రైతులు తీవ్రమైన దుర్భిక్షంలో కరువుకొరల్లో చిక్కుకుని తల్లిల్లుతున్నారు. పంటలు పండక ఇంట్లో తిండి గింజలు లేక రైతులు వలస బాట పట్టారు. వేలాది రుపాయల విలువ చేసే కాడెద్దులు తక్కువ ధరలకే సంతల్లో అమ్మకానికి పెడుతున్నారు. జిల్లా అధికారులు రైతులు పశువులను అమ్మకానికి పెట్టవద్దని గోశాలలకు తరలించాలని సూచించినప్పటికిని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావంతో వేలాది రుపాలయ విలువ చేసే కాడెద్దులను, ఆవులను, గెదేలను కబేలాలకు వచ్చిన కాడికి విక్రయించుకుని దుఖాన్ని దిగమింగుకుని వలస బాట పడుతున్నారు. ఓపక్క చెరువులు కుంటలు గుక్కెడు నీళ్లు లేక పశువులకు తాగడానికి కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క పశువులకు గ్రాసం లేక బక్కచిక్కిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతాంగం పశువులను అమ్ముకుంటున్నారు. అయితే ప్రభుత్వం లక్ష రుపాయల రుణమాఫీ పథకం వర్తింపజేసినప్పటికిని ఇప్పటి వరకు రెండు దఫాలుగా విడుదల చేసి రైతు ఖాతాల్లో జమ చేసినప్పటికిని బ్యాంకర్ల మూలంగా ఆసలు రైతుకు రుణమాఫీ పథకం ఏ విధంగా ఆమలు అవుతుందో అర్థం కాక తికమకపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఏడాది ఖరీఫ్ సిజన్ ప్రారంభం కానుండడంతో బ్యాంకర్లు తిరిగి రుణాలు ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ముఖ్యంగా గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎండిపోయిన పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం అందకపోవడం దురదృష్టకరం ఈ విషయంపైనే సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు చైతన్య యాత్రలు చేపడుతూ ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించాలనే డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది ఎమైన పంట నష్టపరిహారం కోసం మాత్రం జిల్లా రైతాంగం మాత్రం వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

టిడిపికి పలువురు నేతల గుడ్‌బై
* మంత్రి హారీశ్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక
జడ్చర్ల, ఏప్రిల్ 9: తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా వెలిగిన జడ్చర్ల నియోజకవర్గం ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు అధికార తెరాసలోకి వలసల బాట పట్టడంతో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది. పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీని అటిపెట్టుకొని ఉన్న నాయకులు గత కొంత కాలంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణాల వల్ల పార్టీని అంటి పెట్టుకొని ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు హాఫీజ్ ఉర్ రహామాన్ సహాముఖ్య నాయకులందరు శనివారం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి నాయకత్వంలో హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి టి.హారీశ్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 30వావానాలలో 300 మంది నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. జడ్చర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని ప్రభుత్వం చేపడ్తున్న పథకాలే అందుకు కారణమని పార్టీలో చేరిన నాయకులు వెల్లడిస్తున్నారు. గత కొంత కాలంగా టిడిపిలో స్తబ్ధతగా ఉన్న మరో ముఖ్య నాయకుడు అధికార పార్టీలోకి చేరడం ఖాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే టిడిపిలో పటిష్టంగా ఉన్న కేడర్ చేజారిపోవడంతో జడ్చర్లలో నియోజకవర్గంలో టిడిపి కోలుకుని పరిస్థితి ఇప్పట్లో కనబడేలా కనిపించడం లేదని రాజకీయ విశే్లషకులు బావిస్తున్నారు.
వడదెబ్బకు మహిళ మృతి
పెబ్బేరు, ఏప్రిల్ 9: మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన బోయ శేషమ్మ(63) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రెండురోజుల క్రితం పెంచికల పాడు వెళ్లి వస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన అమెను చికిత్స నిమిత్తం హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నుండి సహకారం అందించాలని సర్పంచ్ రామన్‌గౌడ్ కోరారు.

పకడ్బందీగా టెన్త్ పరీక్ష పత్రాల ముల్యాంకనం

* డిఇఒ విజయలక్ష్మీబాయి
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 9: జిల్లా కేంద్రంలోని పంచవటి పాఠశాలలో పదవ తరగతి పరీక్ష పత్రాల ముల్యాంకనాన్ని శనివారం ప్రారంభించినట్లు డి ఇ ఓ విజయలక్ష్మీబాయి తెలిపారు. ముల్యాంకనం కోరకు సుమారు 5,87000 జవాబు పత్రాలను విద్యాశాఖ జిల్లాకు పంపించడం జరిగిందని, జవాబు పత్రాలన్నింటిని అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భద్రపర్చడం జరిగిందని ఆమె పెర్కోన్నారు. ముల్యాంకనం కొరకు 2000 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని ఇప్పటికే వారంత డి ఇ ఓ కార్యాలయంలో రిపోర్టు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ముల్యాంకనంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జవాబు పత్రాల ముల్యాంకనం సకాలంలో పూర్తి చేసి నివేదికలను విద్యాశాఖకు పంపించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలనుండి జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయని వాటిని సక్రమంగా ముల్యాంకనం చేసి విద్యాశాఖకు సమర్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ముల్యాంకనం చేయడానికి వచ్చిన ఉపాధ్యాయులకు పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

దాహార్తి తీరిస్తే పుణ్యం

* కలెక్టర్ మాతృమూర్తి ఇందిర
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9: చలివేంద్రాలు బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి మాతృమూర్తి ఇందిర తెలిపారు. శనివారం కలెక్టర్ బంగ్లా చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆమే ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన ఇందిర బాటసారులకు మంచినీటిని అందించారు. చిన్నారులకు సైతం తాగునీరు అందించి వారి తల్లులకు పిల్లల జాగ్రత్తల గురించి వేసివిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పిల్లలు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలని ఆమే సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాతృమూర్తి ఇందిర మాట్లాడుతూ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సిబ్బంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో ముందుకెళ్తే సమాజంలో సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచినీటిని వృథా చేయకుండా ప్రతి నీటి బొట్టు విలువైందిగా గుర్తుంచుకోలని అన్నారు. ఉద్యోగులు సేవా కార్యక్రమాలు చేపడితే సమాజంలో మంచికి మార్గమం సుగమం అవుతుందన్నారు. ఎండాకాలంలో చలివేంద్రాలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సిసి దేవేందర్, భాస్కర్, వరప్రసాద్, సిబ్బంది తతిదరులు పాల్గొన్నారు.

వారంలో పాలమూరు-రంగారెడ్డి
ఎత్తిపోతల పనులు ప్రారంభం
* మంత్రి జూపల్లి
కొల్లాపూర్, ఏప్రిల్ 9: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వారంరోజుల లోపల ప్రారంభిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఎన్‌జి ఎల్ ఐ గెస్టహౌజ్ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కావడంతో పాటు మిషన్ భగీరథ రెండో విడతా పనుల కోసం నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కాకతీయ పనులలో నోటిఫైల్ చెరువులు, కుంటలలో పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. తాగునీటి సమస్యకోసం ట్యాంకర్లు వివిధ పద్దతుల ద్వారా( బోర్లు, బావులు లీజ్‌కు తీసుకోవడం) నీటిని సరఫరా చేస్తామని అదే విధంగా కొల్లాపూర్ పట్టణంలో రూ. 70లక్షల గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తయిందని మార్కెట్ యార్డు అడిటోరియం పనులతో పాటు నూతనంగా నగర పంచాయతీ, తహశీల్దార్ కార్యాలయ భవనాల పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో అన్ని రహాదారులు సీసీ రహాదారులుగా మార్చాడం జరిగిందని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి నిరంజన్‌రావు, జడ్పీటిసి హన్మంత్‌నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు రఘుపతిరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కాషాయ దళపతి ఎవరో?
* బిజెపి శ్రేణుల్లో టెన్షన్...టెన్షన్ * నేడు నారాయణపేటలో జిల్లా కార్యవర్గ సమావేశం
* మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాక * నూతన జిల్లా అధ్యక్షుడి నియమాకంపై చర్చ జరిగే అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9: బిజెపి జిల్లా రథసారథి ఎవరనే టెన్షన్.. కాషాయపు దళపతిని ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందోనని జోరుగా బిజెపి శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఆదివారం జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం నారాయణపేట పట్టణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఆధ్వర్యంలో నేడు జరిగే ఇదే చివరి జిల్లా కార్యవర్గ సమావేశం అన్ని చెప్పవచ్చు. మరి కొన్ని రోజుల్లో బిజెపి జిల్లా నూతన అధ్యక్షుడిని నియమించడానికి రంగం సిద్దమయింది.
అయితే పార్టీ నియమ నిబందనల మేరకు జిల్లాలో 75 కమీటీలు ఉండగా అందులో 50 శాతంకు పైగా కమిటీలు పూర్తి అయితే నూతన అధ్యక్షుడి నియమాకానికి మార్గం సుగమమం కానుంది. కానీ ఎన్నడులేని విధంగా జిల్లాలో బిజెపి ఇంకా జాతీయ పార్టీ నియమాకాల ల ప్రకారం పూర్తి స్థాయి కమిటీలు నియమించలేకపోయిందని తెలుస్తుంది. కాగా కమిటీల సంగతి ఎలా ఉన్నా జిల్లా బిజెపి రథసారథి నూతనంగా ఎవరని రాష్ట్ర పార్టీ నియమిస్తుందనే చర్చ మాత్రం బిజెపి శ్రెణుల్లో జోరుగా చర్చ జరగుతుంది. నేడు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులు నారాయణపేటలో నిర్వహించే జిల్లా కార్యవర్గ సమావేశానికి రానుడండంతో అందరి దృష్టి ఈ సమావేశంపైనే పడింది. ఈ సమావేశంలో పార్టీ నూతన రథసారథిపై ఓ చర్చ కూడా జరిగే అవకాశం లేకపోలేదని, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిని నియమించకపోయిన కొంత అభిప్రాయం మాత్రం సేకరించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. కాగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఈ పరిస్థితుల్లో ముళ్ల కిరిటమేనని కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మాత్రం తెలంగాణలో మరోలా ఉండడం దాంతో వాటి ప్రభావం సైతం జిల్లాపై పడడంతో పార్టీని భుజస్కందాలపై నడిపించే నాయకులు అవసరమని కొందరు నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న పరిస్థితులు మాత్రం మరింత క్లిష్టమైన పరిస్థితులు ఉండడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్ని రకాలుగా బలమైన నాయకుడు, కావాలని మంచివాగ్దాటి, ప్రజాకర్షన నాయకుడు, సిద్ధ్దాంత పరంగా అన్ని రకాలుగా పార్టీని ముందుకు నడిపించే సత్తా కలిగిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పితే ముఖ్యంగా జిల్లాలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసే నాయకుడు జిల్లా పార్టీ పగ్గాలు చేపడితే పార్టీ మరింత బలంగా పుంజుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న నాయకులను సైతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిలో దింపిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
జిల్లా పార్టీ పదవుల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదివిపై కనె్నసినట్లు తెలుస్తుంది. పార్టీ పదవి దక్కించుకునేందుకు ఇప్పటికే ఆ నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే సంఘ్‌పరివార్ ఆశ్సీస్సులు ఎవరికి ఉంటే వారికి అధ్యక్ష పదవి వరించవచ్చని మరో ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం రాష్ట్ర స్థాయి పార్టీ పదవిలో కొనసాగుతున్న ఇద్దరు నాయకుల పేర్లను మాత్రం రాష్ట్ర, జిల్లాకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పార్టీ పెదల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తుంది. అదే జరిగితే రాష్ట్ర స్థాయి నాయకులను పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించి వారి సేవలు పార్టీ బలోపేతం కోసం జిల్లాలో ఉపయోగపడేలా ఉంటాయి. నారాయణపేటలో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ జరుగుతుందనే విషయంపై బిజెపి శ్రేణుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది.

రేషన్ దుకాణాలు సీజ్
మల్దకల్, ఏప్రిల్ 9: మండల పరిధిలోని తాటికుంట గ్రామంలో రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేసినట్లు మండల గిర్ధావర్ గోవిందు తెలిపారు. శనివారం జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు జ్యోతి, వనజాతలు గ్రామాన్ని సందర్శించి రేషన్ షాపులలో ప్రజలకు అందించాల్సిన నీలి కిరోసిన్ పక్కదారి పట్టించడంతో అధికారులు రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేశారు. ఎలాంటి నోటీసులు డీలర్ల వద్ద లేకుండా అక్రమంగా కిరోసిన్‌ను డీలర్‌కు అందించడంతో అధికారులు విచారణ చేసి నిజాలు తేలడంతో షాపులను సీజ్ చేశారు. మండలంలోని దాదాపు ఏడు మంది డీలర్లపై ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు విచారణ చేశారు. కేవలం తాటికుంట గ్రామంలోని డీలర్‌పైనే అవినీతి బయటపడడంతో అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధ్దం చేశారు.

చికున్‌గున్యాతో గ్రామస్థుల ఆందోళన
* మూడు రోజులు గడుస్తున్నా స్పందించని వైద్యసిబ్బంది
అడ్డాకుల, ఏప్రిల్ 9: మండల పరిధిలోని తుంకినిపూర్ గ్రామంలో గత మూడు రోజులలో దాదాపుగా 60 మందికి పైగా చికెన్ గున్యా భారిపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇంత జరుగుతున్న వైద్య సిబ్బంది మాత్రం గ్రామానికి వచ్చిన చికిత్సలు నిర్వహించిన దఖలాలు లేవు. అయితే చికెన్‌గున్యా బారిన పడిన రోగులు సమీపంలో ఉన్న ముసాపేట గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజురోజుకు గున్యా బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆసలే వేసవికాలం, అందులో చికెన్‌గున్యా బారిన పడి వృద్ద్ధులు, మహిళలు, చిన్నారులు, పెద్దలు ఎలా తట్టుకుంటారోనని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. కనీసం మండల ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు కూడా స్పందించకపోవడం విడ్డురం. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది స్పందించి గ్రామంలో వైద్యశిభిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్సలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అంబలి కేంద్రం ప్రారంభం
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 9: జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ సమీపంలో దివంగత గొరోట్ల కొండారెడ్డి జ్ఞాపకార్థం అంబలికేంద్రం మరియు చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఎండతాపానికి ఉపశమనం పొందేందుకు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అంబలిని పంపిణీ చేయడం పట్ల పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అంబలి కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసి ఉచితంగా రాగుల, సజ్జల అంబలిని సేవించడం వల్ల కడుపులో చల్లదనం కలిగి వడగాల్పులు, ఎండ వల్ల ఉపశమనం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.పి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్‌రెడ్డి, మాజి మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, కౌన్సిలర్లు షౌకత్ అలీ, పాండురంగారెడ్డి, శివరాజ్, వివిధ పార్టీలు నేతలు పాల్గొన్నారు.

పథకాలెన్నున్నా పారని నీరు!
శాంతినగర్, ఏప్రిల్ 9: వడ్డేపల్లి మండలంలోని రామాపురం, కొంకల, జూలకల్, కోయిల్‌దినె్న గ్రామాలకు తుంగభద్ర నది నుంచి రాజోళి తాగునీటి పథకం ద్వారా 23 గ్రామాలకు తాగునీరు అందించాలని లక్షల రూపాయలు ఖర్చు చేసి పైపులైన్లు, మినీట్యాంకులు ఏర్పాటు చేశారు. కాని ఏ ఒక్క రోజు పూర్తిస్థాయిలో తాగునీరు అందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ప్రతి నిత్యం తాగునీటి కోసం వాగుల వెంబడి వెళ్లి చెలిమెల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఆ వసతిలేకపోవడం వల్ల బోర్ల ద్వారా ఫ్లోరైడ్ నీటిని సేవిస్తూ రోగాలబారిన పడుతున్నారు. అదేవిధంగా పెద్దతాండ్రపాడు, ముండ్లదినె్న, పైపాడు, వెంకట్రామనగర్ గ్రామాలలో పైపులైన్లు వేశారు. నిత్యం తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికి ఏ ఒక్కరోజు కూడ పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేక పోయారు. వంతుల వారిగా తాగునీరు అందించడంతో ముఖ్యమైన పనులను వదులకొని గంటల తరబడి కుళాయిల వద్ద బిందెలతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అటు అధికారులుకాని, ఇటు ప్రజాప్రతినిధులు కాని పట్టించుకోక పోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యపై దృష్టిసారించి పూర్తిస్థాయిలో తాగునీరు అందించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ వచ్చినా పరిహారం ఇవ్వరా?
* బాధిత రైతు కుటుంబాల ఆక్రందన
వెల్దండ, ఏప్రిల్ 9: ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిన తెలంగాణ రాష్ట్రంలోనైనా న్యాయం జరిగి పరిహారం అందుతుందని అశించగా నేటికి ఒక్క పైసా కూడా అందలేదని అత్మహాత్యలకు పాల్పడిన రైతు కుంటీంభీకులు అక్రందన వెలిబుచ్చారు. శనివారం వెల్దండ అక్షర కానె్సప్ట్ స్కూల్‌లో రైతు స్వరాజ్య వేదిక ఆధ్యక్షుడు పర్వతాలు యాదవ్ అధ్యక్షతన మన భూమి, హోప్స్ ఫర్ నీడి స్వచ్ఛంద సంస్థల సభ్యులు నియోజకవర్గంలో అత్మహత్యలకు పాల్పడ్డ రైతుల భార్యలతో సమావేశమై సాధక బాదకాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అత్మహత్య చేసుకున్న రైతుల భార్యలు వెంకటమ్మ, కిష్టమ్మ, కృష్ణమ్మ, సాలీ, వసంత, పద్మలు మాట్లాడుతూ అప్పు సప్పు చేసి అరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన వర్షాభావ పరిస్థితులలో పెట్టిన పెడుబడులు వెళ్లాక తమ భర్తలు అత్మహత్యలకు పాల్పడారని తెలిపారు. కుంటుంబ పెద్ద దిక్కును కొల్పోయి అనాథలుగా మారి విధిన పడిన అదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ బతుకులు బాగుపగుతాయని పరిహారం అందుతుందని అశించి చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఒక్క పైసా కూడా రాలేదని అవేదన వ్యక్తం చేశారు. రైతుల అత్మహత్యలపై ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుంది తప్పా పరిహారం మాత్రం ఇవ్వడం లేదని బ్రతకడం కష్టంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు కొండల్ రెడ్డి, విశ్వనాధం, శోభ, నిషా,పర్వతాలుయాదవ్‌లు బాధిత మహిళలకు మనో ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని పిల్లలను చదివించాలని పరిహారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం 15 మంది బాధిత రైతు కుంటుంబాలకు రూ.1.20లక్షల అర్థిక సహాయం కింద అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు అశోక్, సాయిమోహన్, నేతలు కృష్ణముదిరాజ్, అంజయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
* దక్షిణ మధ్య జోనల్ రైల్వే బోర్డు సభ్యుడు కొండయ్య
మాగనూర్, ఏప్రిల్ 9: నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దక్షిణ మధ్య జోనల్ రైల్వే బోర్డు మెంర్ కొండయ్య అన్నారు. శనివారం మాగనూర్ మండలంలోని మురహరిదొడ్డి గ్రామరైతులు వేసిన వరి పంట నష్టపోయిన వాటిని ఆయన పరిశీలించారు. పొలాల రైతుల దగ్గర పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మక్తల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సోమశేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి, సినియర్ నాయకులు కృష్ణయ్య, విద్యాసాగర్, సురేష్, నర్సింహులుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
అడ్డాకుల, ఏప్రిల్ 9: మండల పరిధిలోని ముసాపేట గ్రామానికి చెందిన తిరుపతయ్య (42) అనే వ్యక్తి వడదెబ్బ సోకి శనివారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల కథనం ప్రకారం తిరుపతయ్య కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. స్వగ్రామమైన ముసాపేట గ్రామంలో ప్రతి నెల 10న కులం చిట్టీ ఉండడంతో డబ్బులు చెల్లించేందుకు హైదరాబాద్ నుండి ముసాపేటకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసుకుని డబ్బులు చెల్లించేందుకు వెళ్తుండగా వడదెబ్బతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎన్నాళ్లకు గుర్తొచ్చామే వాన..!

$
0
0

జహీరాబాద్, ఏప్రిల్ 9: భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరవుతున్న స్థానికులకు శనివారం కురిసిన వర్షం ఊరటకలిగించింది. వరుణుడి కరుణతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. సుమారు గంటపాటు ఒక మోస్తరుగా ఈదురుగాలులతో కూడిన వర్షంకురిసింది. ఈదురు గాలులవల్ల అక్కడక్కడ చెట్లు విరిగిపోగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. శుభకార్యాలకు వేసిన టెంట్లు, షామియానాలు కూలిపోయాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. చెరుకు పంటలతోపాటు ఇతర పంటలకు కూడా మేలు జరిగినట్లు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మామిడి రైతులకు కొద్దిపాటి నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో కురిసిన కొద్దిపాటి వర్షంకే రోడ్లన్నీ జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై బాగారెడ్డి విగ్రహంతోపాటు పలు ప్రంతాల్లో నీటి మడుగులు దర్శనమిచ్చాయి. ఏదైమైనా జహీరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షం రైతుల్లో ఆనందాన్ని నింపింది.

ప్రజాప్రతినిధులు వెళితే..
కాంగ్రెస్‌కు నష్టం లేదు
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ టిఆర్‌ఎస్‌లో చేరి
నాకు లాభమే చేకూర్చారు
కాంగ్రెస్ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది
తెరాస కుట్ర రాజకీయాలను తిప్పికొడతాం
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఏప్రిల్ 9: రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటుందని, దీంతో కాంగ్రెస్ పార్టీకి, తనకు ఎంత మాత్రం నష్టం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. 2014లో జరిగిన మున్సిపల్, జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిందన్నారు. అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కేందమైన సంగారెడ్డి మున్సిపాలిటీ, మండలంలో పట్టులేదన్న అపవాదును తొలగించుకోవడానికి ప్రజాప్రతినిధులను లాక్కుంటుందన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకుని గులాబి జెండాను ఎగుర వేసిందన్నారు. కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండల పరిషత్తుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే పాలకవర్గాన్ని నిర్వర్తిస్తున్నారన్నారు. శనివారం సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కొంత మంది కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారని, వారు కాంగ్రెస్ పార్టీని వీడటం వల్ల తనకు, తన పార్టీకి మంచి ప్రయోజనం కలుగుతుందేకానీ ఎంత మాత్రం నష్టం కాదన్నారు. వ్యక్తిగతం తాను ఎవరిని విమర్శించుకోదల్చుకోలేదన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపించిన ప్రజాప్రతినిధులు వెళ్లినంత మాత్రాన కార్యకర్తలు వెళ్లిపోతారనుకోవద్దన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులందరిని నా స్వశక్తితో గెలిపించానని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం బలంగా ఉందన్నారు. బిజెపిలో ఉన్నప్పటి నుంచి 2014లో జరిగిన సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వరకు తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారని గుర్తు చేసారు. ప్రజామద్దతు ఉన్నన్ని రోజులు రాజకీయంగా తనను ఎవరు ఏమి చేయలేరన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడలేదని ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడంతో ఆ వర్గం ఓట్లు వేసిందని, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌తో ఆ వర్గం ఓట్లు లబ్దిపొందారని, ఇంటికో ఉద్యోగం హామితో నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు టిఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపారని, డబుల్ బెడ్ రూం హామితో ఇల్లు లేని పేదవారంతా ఆశలతో ఓట్లు వేసారని, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, లక్ష రుణమాఫీతో రైతులంతా టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందలేదన్నారు. సిఎం కెసిఆర్ మాయమాటలను నమ్మి మోసపోయామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ పతనం ఖాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. స్వంత పార్టీ వారికే న్యాయం చేయలేని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఏం ఒరగబెడుతుందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇతర పార్టీల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం కాదని వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించుకుని సత్తాను నిరూపించాలని సవాల్ చేసారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిషత్ రాజకీయాలను తప్పకుండా శాసిస్తుందని, మంచి క్యాడర్, ఓటు బ్యాంకు తమ పార్టీకే ఉందని గుర్తించి కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని వివరించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లు ఉంటే ఐదుగురు మాత్రమే పార్టీని వీడారని మరో ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారన్నారు. చైర్ పర్సన్ విజయలక్ష్మి భర్త బొంగుల రవిని ముందుగా టిఆర్‌ఎస్ పార్టీలో చేర్పించిన అనంతరం తాను వెళ్లబోతున్నట్లు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. బొంగుల రవి తనకంటే పెద్ద నాయకుడు కాదని, అంతటి అసమర్థతత తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన గత్యంతరం తనకు ఎంత మాత్రం లేదని జగ్గారెడ్డి ఊహాజనిత వార్తలకు తెరదించారు.

మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
సిద్దిపేట, ఏప్రిల్ 9 : తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధికప్రాధాన్యత కల్పిస్త్తూ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తుందని ఎసిబి డిజీ ఎకె.ఖాన్ అన్నారు. విద్యలో వెనుకబడి ఉన్న మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 120 మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం జూన్ నుంచి 71 పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ఎ.కె.ఖాన్ వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్ అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తుందన్నారు. మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంలో బోధించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 నుండి 12 రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాల 5నుంచి 6 ఎకరాల స్థలంలో విశాలంగా అన్ని వౌలిక సదుపాయాలతో రూ.20 కోట్ల తో నిర్మించనున్నట్లు చెప్పారు. పాఠశాల భవనంతోపాటు, హాస్టల్, ఉపాధ్యాయులకు క్వార్టర్స్, ప్లేగ్రౌండ్‌తో కార్పొరేట్ స్థాయికి మించి అన్ని వసతులూ కల్పించనున్నట్లు తెలిపారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించనున్నట్లు తెలిపారు. ప్రతి తరగతి రెండు సెక్షన్లు, ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు గరిష్టంగా ఉంటారన్నారు. ప్రతి పాఠశాలల్లో సగటున 640 విద్యార్థులు చదువుకుంటారన్నారు. ప్రతి యేటా ఈ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 78వేల విద్యార్థులు విద్యను అభ్యసిస్తారన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు వెచ్చించనున్నట్లు తెలిపారు. 75 శాతం మైనార్టీలకు, 25 శాతం ఇతర కమ్యూనిటీలకు ఈ పాఠశాలల్లో అడ్మిషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు సమిష్టిగా కలసి ఉండాలనే లక్ష్యంతో ఇతర వర్గాలకు సైతం అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసంవత్సరం అందుబాటులో ఉన్న భవనాల్లో పాఠశాలల్లో కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరో మూడేండ్లలో పర్మినెంట్‌గా విశాలంగా పక్క భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 11 పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు బాలురు, ఐదు బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట, సదాశివపేట, ఆందోల్, నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్, గజ్వేల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, మెదక్, జహిరబాద్ నియోజక వర్గాల్లో రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థలం అందుబాటులో ఉన్న నియోజక వర్గాల్లో రెండేళ్లలో పర్మినెంట్‌గా పక్క్భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు 5,6,7 తరగతిల్లో అడ్మిషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆహ్లదరకమైన వాతావరణంలో రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు విద్యార్థులపై సూపర్‌విజన్ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల ఆదాయం గలవారు, పట్టణ ప్రంతాల్లో 2లక్షల ఆదాయం ఉన్నవారు ఈ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేట్ సిలబస్‌ను ఆంగ్ల మీడియంలో బోధించనున్నట్లు తెలిపారు. ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, ఉర్దు తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. మైనార్టీ విద్య అభివృద్ధి కోసం రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. జూన్ 15 ఈ విద్యాసంవత్సరం నుండి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం గూర్చి సమాచారం అందుకున్న బీహార్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తుందన్నారు. మంచి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయన్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఈప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ఎసిబి డిజీ ఎకె ఖాన్, మైనార్టీ వేల్పేర్ కార్యదర్శి జలీల్, షఫియుల్లా, జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ సన్మానించారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జలీల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, టిఎంఆర్‌ఇఐఎస్ కార్యదర్శి ఫఫియుల్లా, తంజీమ్ సిద్దిపేట అధ్యక్షుడు గౌస్‌మోహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కారెక్కిన సంగారెడ్డి బల్దియా పాలకవర్గం!

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఏప్రిల్ 9: రాష్ట్రంలో అధికారం, జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ హస్తం ఆధీనంలో ఉండటంతో కొరకరాని కొయ్యగా మారింది. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో రెండు మున్సిపల్ పట్టణాలు, మూడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నాటకీయ పరిణామాల్లో సదాశివపేట పురపాలకసంఘం, సదాశివపేట ఎంపిపి, కొండాపూర్, సంగారెడ్డి మండల పరిషత్తుల్లో గులాబి జెండాను ఎగురవేసి పరువు నిలబెట్టుకున్నారు. అనివార్య కారణాలతో సదాశివపేట మండల పరిషత్ పాలకవర్గంలో 2015 జూలై మాసంలో రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. అప్పట్లో కొంత మంది కాంగ్రెస్, టిడిపి, స్వతంత్ర ఎంపిటిసి సభ్యులు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం వల్ల టిఆర్‌ఎస్ పార్టీ పాలకవర్గాన్ని విస్తరించింది. ఆ పార్టీలో చేరిన ఎంపిటిసి సభ్యులు తిరిగి కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లడంతో జూలై నెలలో కాంగ్రెస్ పార్టీ తన పరువును నిలబెట్టుకుంది. ఇదిలావుండగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సుమారు రెండు సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పుష్కర కాలంగా నమ్మిన బంటుగా ఉన్న చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి భర్త బొంగుల రవి ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో వివాదస్పదంలో ఇరుక్కుపోయారు. అధికార పార్టీ అండదండలు లేకపోవడంతో పాలకవర్గం అధికారులపై అజమాయిషిని ప్రదర్శించకపోతుండటంతో పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనుచరులు బొంగుల రవిపై వత్తిడి తీసుకురావడంతో పాటు మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుందన్న ఆలోచనలు కల్పించిన మేరకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, మరికొంత మంది కౌన్సిలర్లు తుది నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు శనివారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో గులాబి కండువా ధరించి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డిలోని ఐబి నుంచి బయలుదేరిన చైర్ పర్సన్ పాతబస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న విషయం తనకు తెలుసునని త్వరలోనే సంగారెడ్డిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులకు హామి ఇచ్చారు. అధికారంలో ఉన్నామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను కొంత అభద్రతాభావానికి గురి చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంటనే స్పందించి నేతల పార్టీ మారిన తీరును ఖండించారు. అధికార పార్టీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ శ్రేణులు ఎంత మాత్రం బయపడబోవన్నారు. ఓటు బ్యాంకు, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సత్తాను వచ్చే ఎన్నికల ద్వారా చూపిస్తామంటూ శ్రేణుల్లో ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేసారు. కాగా టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టు లభించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కల్పిస్తోంది. ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ వ్యూహరచనలకు చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయకులు తలొగ్గడం గమనార్హం. సిఎం పర్యటిస్తే పట్టణాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరైతే అనేక సమస్యలు తొలగిపోతాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. రెండేళ్ల కాలంగా రసవత్తర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన సంగారెడ్డి నియోజకవర్గంలో మరోమారు నాటకీయ పరిణామాలతో రాజకీయాలు కొనసాగాయని చెప్పవచ్చు. ఎమ్మెల్యే స్వంత పట్టణం, మండలమైన సదాశివపేట ఎంపిపి అధ్యక్ష పీఠాన్ని ఖాళీ చేయించేందుకు చాపకింద నీరులా ఆయన అనుచరులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోమారు పేట ఎంపిపి పీఠంపై లుకలుకలు ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర లేదు.

డిప్యూటీ స్పీకర్ పద్మ సుడిగాలి పర్యటన

* సబ్‌స్టేషన్ ప్రారంభం...మరోదానికి శంకుస్థాపన
* మిషన్ కాకతీయ, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం
మెదక్ రూరల్, ఏప్రిల్ 9: మండలంలో డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండే కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ కాకతీయ-2లో గంగాపూర్ ఊరచెర్వుకు 40.50 లక్షల రూపాయలతో, షమ్నాపూర్ కోమటి చెర్వుకు 22 లక్షలతో చేపట్టే పనులకు శంఖుస్థాపనగావించారు. షమ్నాపూర్‌లో 5 లక్షలతో నిర్మించే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 13 లక్షలతో పాతూర్ పంచాయతీ కార్యాలయానికి, పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బ తండాలో 5 లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ర్యాలమడుగు వద్ద కోటి 59 లక్షల 78 వేల రూపాయలతో నిర్మించే ససబ్‌స్టేషన్, 50 లక్షతలతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి, మాచవరంలో 5 లక్షలతో నిర్మించే మహిళా భవనానికి, హవేళీఘణాపూర్‌లో 13 లక్షలతో నిర్మించే పంచాయతీ కార్యాలయానికి, 6 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణానికి పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. హవేళీఘణాపూర్‌లో కోటి 41 లక్షలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను, 14 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల ప్రహారీగోడ, 15.90 లక్షలతో నిర్మించిన పాఠశాల అధనపు తరగతి గదులను పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. కాగా పాతూర్ పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బ తండాకు రోడ్డు వేయిస్తానని పద్మాదేవేందర్‌రెడ్డి గిరిజనులకు హామినిచ్చారు. అంతకుముందు గిరిజనులు తమ సాంప్రదాయపద్ధతిలో స్వాగతించారు. హవేళీఘణాపూర్ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. హవేళీఘణాపూర్‌లో బిసి కమ్యూనిటీ హాల్ పూర్తికి నిధులు అందజేస్తానన్నారు.
మీ ఇండికేట్ ప్రారంభం
పిల్లికొట్టాల్‌కు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు ‘మీ ఇండికేట్’ అనే వెబ్‌సైట్‌ను తయారుచేయగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హవేళీఘణాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ అన్ని రకాల సమాచారం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని అభనందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మీ, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, ఆర్‌డిఓ నగేశ్, తహశీల్దార్ నజీమొద్దిన్, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు సజావుగా
జరిగేందుకు సహకరించాలి
* అభ్యర్థులు, ఏజెంట్లకు ఎన్నికల అధికారి
రమణాచారి సూచన
* మొత్తం మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడతాయని వెల్లడి
సిద్దిపేట, ఏప్రిల్ 9: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమీషనర్, ఎన్నికల అధికారి రమణాచారి తెలిపారు. స్థానిక ఇందూర్ కళాశాలలో 11న ఉదయం 8గం.కు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. శనివారం ఇందూర్ కళాశాలలో అధికారులకు కౌంటింగ్ పై అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు వార్డుల, పోలింగ్ బూత్‌ల వారీగా నిర్వహిస్తామన్నారు. 10టేబుళ్లు వేసి కౌంటింగ్ చేస్తారన్నారు. మొదటి రౌండ్‌లో 10టేబుళ్లు, పదివార్డుల ఫలితాలు, 2రౌండ్‌లో 11వార్డునుంచి 10వార్డుల లెక్కింపు చేస్తారన్నారు. మొత్తం మున్సిపాల్టీలో 34వార్డులు ఉండగా 6వార్డులు ఏకగ్రీవమైనాయని, 28వార్డులకు ఓటింగ్ నిర్వహించామన్నారు. ఓట్ల లెక్కింపు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలకులుగా పిడి సత్యనారాయణరెడ్డిని నియమించారన్నారు. వారు 10 టేబుళ్లలో లెక్కించిన ఓట్ల వివరాలను ఏదైనా ఒక టేబుల్‌ను రాండమ్‌గా పరిశీలిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు రోజు పోటీలోని అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఓట్ల లెక్కింపు ఏజెంట్ వారికి కేటాయించిన వార్డు సంబంధిత టేబుల్ మీద నిర్వహిస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించవచ్చన్నారు. 11న ఉదయం 6గం.కు ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ టేబుల్ ఎవరికి కేటాయించబడునో కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో రాండమ్ చేసి ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. ఓట్ల లెక్కింపు మొదట 10వార్డులు జరుపుతారని, అ వార్డులకు సంబంధించిన వారినే లోపలికి అనుమతిస్తారని, అనంతరం మిగతావార్డులకు సంబంధించిన వారిని అనుమతిస్తారన్నారు.

అనిశా డీజీ ఉపాధ్యాయుడైన వేళ...!
గజ్వేల్, ఏప్రిల్ 9: రాష్ట్ర అవినీతి నిరోదక శాఖ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ శనివారం గజ్వేల్ పట్టణ శివారులోని సంఘాపూర్ మధర్సాలో కొంత సేపు ఉపాధ్యాయుడుగా అవతారం ఎత్తారు. మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన అనంతరం సమీపంలో ఉన్న మధర్సాను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టగా, అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా విద్యార్థులు భావి భారత పౌరులుగా తయారు అవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మదర్సాలో నెలకొన్న సమస్యలను ఆయన చైర్మన్ హైదర్ పటేల్ నుండి అడిగి తెలుసుకోగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్పందిస్తూ మదర్సా విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కోన్నారు. ఆయన వెంట మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఉమర్ జలీల్, షఫియుల్లా, గఢా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరో రైతు ఆత్మహత్య
మిరుదొడ్డి, ఏప్రిల్ 9; అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో శనివారంనాడు జరిగింది. కుటుంబీకుల, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన పంజా సత్తయ్య(45) 2 ఎకరాల భూమిలో వ్యవసాయం సాగుచేయడానికి, బోర్లు వేయడాకిని, పెట్టుబడి కోసం సమారు రూ.4 లక్షలు అప్పులు చేశాడని కుటుంబీకులు తెలిపారు. అదేవిధంగా వేసిన పంట కళ్ల ముందే ఎండిపోవడంతో నెల రోజుల క్రితం బోరు వేయడంతో నీరు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు తీవ్రంగా అలోచిస్తు అప్పులు తీర్చే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారంనాడు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ బావి వద్ద పక్కన రైతులు చూసి ఉరిని తొలిగించి అసుపత్రికి తరిలించే లోపే మృతి చెందాడని తెలిపారు. మృతునికి కుమార్తె భార్గవి, కుమారుడు నరేశ్, భార్య వెంకటలక్ష్మివున్నారు. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దగాపడుతున్న తెలంగాణపై రాష్ట్ర ‘మేథోమధన సదస్సు’

* తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు
వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 9: దగాపడుతున్న తెలంగాణ అంశంపై రాష్ట్ర తొలి మేధోమదన సదస్సు ఆదివారం గజ్వేల్ పట్టణంలోని టివైఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా ఆంధ్ర వలసవాదుల వారసత్వ భావజాలంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో జరిగిన విధంగానే అనచివేత, దోపిడి కోనసాగుతుండగా యువత, కార్మికులు, నిరుద్యోగులు నిరాశా నిస్పూృహలతో కొట్టు మిట్టాడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు తీవ్ర రూపం దాల్చగా ఆత్మహత్యల నివారణలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతో రూ.లక్షకోట్లు ప్రజాదనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఉద్యమ కారులను వాడుకొని వదిలేసిన క్రమంలో అన్ని వర్గాలు అన్యాయానికి గురవుతున్న సందర్భంగా ప్రజలను చైతన్యం చేసేందుకు సిఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి మేధోమధన సదస్సులు ఆరంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా జస్టీస్ చంద్రకుమార్, గాదె ఇన్నయ్య, డాక్టర్ జి.లచ్చయ్య, గడీల సుధాకర్‌రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, నైనాల గోవర్థన్, కందిమళ్ళ నాగప్రసాద్ గౌడ్, నీరటి రాజన్న, ముత్తన్న గారి రాజేందర్‌రెడ్డి, ఊకే రామకృష్ణ, వెనె్నల విక్రమ్ తదితర వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నేతలు బొల్లారం ఎల్లయ్య, విరాసత్ అలీ, ఆర్‌కె శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, హన్మంతరెడ్డి, మల్యాల భద్రయ్య, కైలాస మహిపాల్, పరచూరి రాజు పాల్గొన్నారు.


అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

$
0
0

బాడంగి, ఏప్రిల్ 10: మండలం డొంకినవలస సమీపంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం బస్తాలను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారని ఆర్‌ఐ సుబ్బారావు చెప్పారు. శ్రీకాకుళం సిఐ దివాకర్‌నాయుడు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌కు తరలిస్తుండగా 54 బియ్యం బస్తాలను పట్టుకొని సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని తెంటువలస డీలర్ జి.వెంకటరమణకు అప్పగించి ఆటోను బాడంగి పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. మరొ ముగ్గురుపై కేసు నమోదు చేశామని అన్నారు.

టేకుతోట దగ్ధం

$
0
0

జామి, ఏప్రిల్ 10: మండలంలోని కొత్త భీమసింగికి చెందిన నలుగురు రైతులకు చెందిన టేకుతోట షార్టు సర్క్యూట్‌తో దగ్ధమైంది. కోరాడ సూరిబాబు, సత్యం, అప్పారావు, పాండ్రంకి అప్పారావులకు చెందిన అర ఎకరం టేకుతోట కాలిపోయింది. సుమారు లక్షన్నర రూపాయలు విలువచేసిన టేకుతోట కాలిపోయింది. కొత్తవలస అగ్నిమాపక కేంద్రం అధికారి తమ సిబ్బందితో వచ్చి మంటలను అదుపుచేసారు
.

కళలతోనే సమాజ నిర్మాణం

$
0
0

బొండపల్లి, ఏప్రిల్ 10: కళలతోనే సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర అన్నారు. మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, చలన చిత్ర టివి, రసజ్ఞ నాటక రంగ సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన మూడవ రాష్ట్ర స్థాయి నాటకోత్సవ కార్యక్రమాన్ని శనివారం రాత్రి డి ఆర్వో జితేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కళలను రసజ్ఞ నాటక పరిషత్ వారు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రేక్షకుల ఆదరణతోనే ఏ కళకైనా జీవం ఉట్టిపడుతుందని చెప్పారు. ఇలాంటి కళలను ప్రజలు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. జబర్ధస్తీ ఫేమ్ తేజామూర్తి, మురళిధరరావు మాట్లాడుతూ కళలు కలకాలం నిలవాలంటే ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతకాలం నాటకాలు చెక్కు చెదరవని అన్నారు. బుల్లితెర, వెండితెర ప్రభావంతో నాటకాలకు ఆదరణ తగ్గినా, మంచినాటకాలను ప్రేక్షకులు ఎపుడూ ఆదరిస్తారని చెప్పారు. కొత్తపాలెం ప్రేక్షకుల లాంటి వారు ఉంటే అజరామరంగా కళలు జీవించి ఉంటాయని అన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ నాటకరంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాకు కళలు, సాహిత్య రంగాలలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులకు కొదవలేదని కితాబునిచ్చారు. మంచినాటకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిచయం చేసిన బొడ్డురామును అభినందించారు. ఈ సందర్భంగా రసజ్ఞ నాటక పరిషత్ నిర్వాహకుడు వేమలి త్రినాథరావును సత్కరించారు. అదేవిధంగా కళాకారులను సన్మానించారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన వారిచే నిర్వహించిన దొంగల నాటిక ఆధ్యంతం ఆకట్టుకున్నది. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ లింగేశ్వరరెడ్డి, జడ్పీటిసి బండారుబాలాజీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొడ్డురాము, గ్రామ సర్పంచ్ బొడ్డు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

సజావుగా టెన్త్ పరీక్షల మూల్యాంకన

$
0
0

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 10: పదవ తరగతి పరీక్షల మూల్యాంకన మహారాజా కోటలోని ప్రాంగణంలో సజావుగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల కంట్రోలర్ సాయిబాబాలు దగ్గరుండి మూల్యాంకనను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహారాజ కోటలో రెండు మూల్యాంకన కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలను ఉపాధ్యాయులు దిద్దుతున్నారు. 14రోజులుపాటు జరిగే మూల్యాంకనంలో రోజుకు కనీసం ఆరువేల పేపర్లను ఉపాధ్యాయులు సరాసరిన మూల్యాంకనం చేయవలసి ఉంటుందని విద్యాశాఖ అధికారి కృష్ణారావు ఆంధ్రభూమికి తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మూల్యాంకనకు 5,30,000 పరీక్షా పేపర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ముందుగానే ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశం కారణంగా రోజూ కనీసం 1500 మంది ఉపాధ్యాయులకు తగ్గకుండా మూల్యాంకనం నిర్ణీత గడువులో పూర్తయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
ఉదయం తొమ్మిదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఒకో ఉపాధ్యాయుడు 40పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేయవలసి ఉంటుందని ఆయన వివరించారు. ఆదివారం పదవ తరగతి పరీక్షల మూల్యాంకనను డిఇఓ కృష్ణారావు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ లింగేశ్వరరెడ్డి పర్యవేక్షించారు.

భావి తరాలు క్షమించవు

$
0
0

గజ్వేల్, ఏప్రిల్ 10: ఆరు దశాబ్దాలుగా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దుర్వినియోగం కొనసాగుతుండగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సైతం అదే తంతు కొనసాగుతోందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలోని పివైఅర్ గార్డెన్స్‌లో ‘దగా పడుతున్న తెలంగాణ అంశం’పై ఆదివారం జరిగిన మేథో మధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాంతియుత పద్ధతుల్లో, ప్రజాస్వామ్య మార్గాన అన్ని వర్గాల పోరాటం ఫలితంగా ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, కార్మికుల ఆకలిపోరాటం వంటి సమస్యలు సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నా రు. ఇప్పటికైనా మేధావి వర్గాలు స్పందించకుంటే భవిష్యత్ తరాలు వారిని క్షమించవని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాల్లో పాలుపంచుకున్న ఉద్యమకారులను పక్కనపెట్టి ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యపడుతుందని ఆయన నిలదీశారు. ముఖ్యంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ప్రజాధనం పక్కదారి పడుతుందే తప్ప రైతులు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చేనాటికి ఉన్న మిగులు బడ్జెట్ ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబి లో కూరుకుపోయి అభివృద్ధిపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగం సైతం నిర్లక్ష్యానికి గురై కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించి ప్రభుత్వమే నడిపించి కార్మికులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. వ్యవసాయరంగానికి పెద్దపేట వేస్తూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రుణమాఫీని ఏకకాలంలో వర్తింపజేయాలని, బ్యాంకర్లు తిరిగి రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేటలలో నిర్మించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌బెడ్రూం ఇళ్ల్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుండగా, ఆటోమేటిక్ స్టార్టర్ల అంశంపై ఒక్క రైతుపైన కేసు చేసినా సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు డు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ టిఅర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో తనను వాడుకుని వదిలేసిన కెసిఆర్ ఉద్యమకారులను వెన్నుపోటు పొడవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శ్రీనివాస్‌యాదవ్, కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటివారిని పక్కన బెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, డాక్టర్ జి.లచ్చ య్య, నాగప్రసాద్‌గౌడ్, శ్రీశైల్‌రెడ్డి, 10 టివి మల్లన్న, నీరుటి రాజన్న, పరందామ్, రాజేందర్‌రెడ్డి, విక్రం సదస్సులో ప్రసంగించారు.

ప్రసంగిస్తున్న రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్

వడదెబ్బతో 10 మంది మృతి
ఆంధ్రభూమిబ్యూరో
నల్లగొండ/కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్/వరంగల్, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆదివారం ఎండల తీవ్రత కారణంగా 10 మంది మరణించారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నూకల రాములు (59), నూతన్‌కల్ మండలం పెదనెమిల ఆవాస గ్రామం భాగ్యతండాకు చెందిన గుగులోతు యలమంద (70), పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్‌నాయక్‌తండాకు చెందిన వ్యక్తి సపావత్ తుల్యానాయక్ (52), వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిధిలోని రాగంపేట గ్రామానికి చెందిన వెల్గటూరు ఎల్లవ్వ (50), కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొబ్బల సమ్మయ్య (45) అనే వ్యవసాయ కూలీ, నిజామా బాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులోని బైపాస్ రోడ్డుపై గైని నాగరాజు (35) అనే వికలాంగుడు, బోధన్ మున్సిపల్ కార్యాలయంలో షానిటరీ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు రవి (35), ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్ష్మిపూర్‌కె గ్రామానికి చెందిన శకుంతల (43) అనే మహిళ, వరంగల్ జిల్లా చేర్యాల మండ లం ఐనాపూర్ గ్రామంలో వేములవాడ కిరణ్(16) అనే విద్యా ర్థి, మానుకోట మండలం మాధవపురం గ్రామానికి చెందిన నక్క ముత్యాలు(65) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు.
నాకు ప్రాణహాని ఉంది..
రక్షణ కల్పించండి!
అత్తింటి ఆరళ్లపై దౌల్తాబాద్ జడ్పీటిసి వీరమణి
దౌల్తాబాద్, ఏప్రిల్ 10 : తన అత్తింటివారితో తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా దౌల్తాబాద్ జడ్పీటిసి సబ్యురాలు వీరమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అంకిరెడ్డిపల్లిలోని ఆమె పుట్టింట్లో విలేఖరులతో మాట్లాడుతూ తనపై గృహహింసకు పాల్పడుతున్న తన భర్తతోపాటు కుటుంబ సభ్యులపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదుచేశానని తెలిపారు. దీంతో తనపై మరింత కక్ష పెంచుకున్న అత్తింటివారు పలువురిని తనపైకి ఉసిగొల్పుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తరచూ తనవద్దకు పలువురు వ్యక్తులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నరని పేర్కొన్నారు. దీంతో తాను భయబ్రాంతులకు గురవుతున్నానని తనకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు విన్నవిస్తానని చెప్పారు.
మావోయిస్టు నేత రవి
అంత్యక్రియలు పూర్తి
చింతపల్లి, ఏప్రిల్ 10: మావోయిస్టు అగ్రనేత కుడుమల వెంకటరమణ అలియాస్ రవి అంత్యక్రియలు ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగిలో పూర్తయ్యాయి. అనారోగ్యంతో రవి మెరుగైన వైద్య సేవలకై విశాఖపట్నం వెళ్తూ మార్గం మధ్యలో శనివారం మృతి చెందిన విష యం తెలిసిందే. శనివారం సాయంత్రం చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి తీసుకువచ్చిన రవి మృతదేహానికి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, జోగమ్మ, అన్నయ్య శేఖర్, కుటుంబ సభ్యులు , స్నేహితుల , బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హాజరయ్యారు.

లొంగిపోయిన
మావో సానుభూతిపరులు
సీలేరు, ఏప్రిల్ 10: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా మత్తి లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం 188 మంది మావోయి స్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహపొదర పంచాయతీకి చెందిన గాలిగూడ, డొగ్రిగూడ గ్రామాలకు చెందిన 25 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, 10 మంది గ్రామ కమిటీ సభ్యులు, 81 మంది మహిళా మావోయిస్టు సానుభూతి పరులు, మరో 72 మంది పురుష మావోయిస్టు సానుభూతిపరు లు మత్తిలి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎదుట ఆదివారం ఉదయం లొం గిపోయారు. వారికి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్య లు తీసుకుంటామని పోలీస్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.
కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయ్!
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 10: భారత రిజర్వు బ్యాంకు ద్వారా కొత్త రూ. 500 నోట్లను విడుదల చేసింది. పాత నోట్ల కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. కొత్త నోట్లలో ఎడమ, కుడి చివర్లలో మొత్తం ఐదు గీతాలను అందరికీ కనపడేలా ముద్రించారు. నోట్ల పైన కరెన్సీ సంఖ్యను ప్రత్యేకంగా ముద్రించారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజులో ఈ సంఖ్యలను ముద్రించారు. చివరి మూడు సంఖ్యలను అతి పెద్దవిగా ముద్రించారు. గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో ఈ రూ.500 నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. అలాగే ఈ నోట్ల వెనుక భాగాన కూడా రూ.500 సంఖ్యను, అక్షరాలను పెద్దవిగా ముద్రించారు. నకిలీ కరెన్సీ చలామణి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు పలు జాగ్రత్తలు తీసుకుని ఈ నోట్లను విడుదల చేసింది.

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఘర్షణలో..
బయటపడ్డ తుపాకులు!

నంగునూరు, ఏప్రిల్ 10: అంతర్రాష్ట్ర ము ఠా సభ్యుల ఘర్షణలో ఒకరికి తీవ్ర గా యా లు కాగా, మూడు తుపాకులు బయటపడ్డ సంఘటన మెదక్ జిల్లా నంగునూరు మం డలం సిద్దిపేట- వరంగల్ రహదారి రాంపూర్ క్రాసింగ్ వద్ద కలకలం రేపింది. దీనికి సంబం ధించిన వివరాలు ఇలా...మండలంలోని బద్దిపడగ మధిర గ్రామమైన జెపి తండాకు చెంది న లంబాడీ శ్రీనివాస్‌కు చెందిన రాం పూర్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇంటిని పూణేకు చెందిన 5గురు వ్యక్తులు పైప్‌లైన్ పనులు ఉన్నాయని కిరాయికి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా బస్వాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇందుకు సహకరించారు. ఈ క్రమం లో శనివారం రాత్రి కిరాయికి ఉంటున్న ఐదుగురిలో శ్యాం సుందర్ అనే వ్యక్తితో గొడవపడి మిగ తా నలుగురు చితకబాదారు. దీం తో దారిన పోయేవారు అక్కడకు వెళ్లి చూసేసరికి శ్యాం సుదర్ అనే వ్యక్తి తీవ్రగాయాల పాలై కనిపించాడు. మిగిలిన నలుగులు వ్యక్తులు పారిపోగా కృష్ణ అనే వ్యక్తి దొరకడంతో చితకబా ది పోలీసులకు అప్పజెప్పారు. పరుగులు తీస్తున్న ఒకతని నుంచి తుపాకీ కిందపడిం ది. పోలీసులు సో దా చేయగా 3తుపాకులు, 11బుల్లెట్లు లభ్యమైనాయి. మగిలిన ముగ్గురు పరారైనారు. వారి కోసం పోలీసు లు గాలిస్తున్నా రు. కరీంనగర్, వరంగల్ జిల్లా సరిహద్దుల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ ప్రసన్నకుమార్, ఎస్‌ఐలు గోపాల్‌రావు, సత్యనారాయణ సందర్శించారు.

కాకతీయ ప్రధాన కాలువకు శరవేగంగా మరమ్మతు

$
0
0

హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 10: కరీంనగర్ జిల్లాలో కాకతీయ ప్రధాన కాలువ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాలువ ఆధునీకరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా ఎల్ ఎండిలోకి వస్తోంది. అలాగే ఎల్‌ఎండి నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగునీరు 3.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతోంది. మొత్తం 280 కిలోమీటర్ల దూరం కాకతీయ కాలువ విస్తరించి ఉంది. గత కొద్ది సంత్సరాలుగా మరమ్మతులు లేక ప్రధాన కాలువ శిధిలావస్థకు చేరుకుంది. కాలువ మొత్తం సిల్టు పేరుకుపోయి, చాలాచోట్ల లైనింగ్ చెదిరిపోయి, గేట్లు, చానళ్లు అధ్వాన్న స్థితికి చేరి ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు లేక, కాకతీయ ప్రధాన కాలువకు కూడా నీటి సరఫరా లేనందున మరమ్మతులకు ఇది సరైన సమయమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి గత రెండు నెలలుగా మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. కాలువలో పేరుకు పోయిన సిల్టును తొలగిస్తూ, లైనింగ్ చెదిరిపోయిన చోట్ల లైనింగ్, మరమ్మతులు చేస్తున్నారు. పలుచోట్ల కాలువ కట్ట ఎత్తును, అప్రోచ్ రోడ్డును ఎత్తును కూడా పెంచుతున్నారు. ఈ పనులు వేసవిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే కాలువకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని రైతులు భావిస్తున్నారు. ప్రతిసారి ఆయకట్టుకు నీరందడం లేదని ఖమ్మం వరంగల్ జిల్లాల ఆయకట్టు రైతులతో పాటు కరీంనగర్ జిల్లా శివారు గ్రామాల రైతులు కూడా వాపోతున్నారు. దీంతో పాటు అక్కడక్కడా యూటీలకు గండ్లు పడి పలుసార్లు నీటి సరఫరా నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తేది. కాకతీయ ప్రధాన కాలువ మరమ్మతు పనుల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు నాణ్యతతో పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భవిష్యత్తులో కాలువ సామర్థ్యాన్ని పెంచే అలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మరి డిస్ట్రిబ్యూటరీల సంగతేంటి?
కాకతీయ ప్రధాన కాలువకు మరమ్మతులు చేయడం మంచిపనే అని, కానీ డిస్ట్రిబ్యూటరీల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాకతీయ ప్రధాన కాలువకు అనుబంధంగా యాభై వరకు డిస్ట్రిబ్యూటరీలు, వీటికి అనుబంధంగా మైనర్లు, సబ్ మైనర్లు ఉన్నాయి. సాగునీటి సరఫరా ఆయకట్టుకు జరిగేందుకు ఇవి కూడా ముఖ్యమే. అయితే వీటి స్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. ఎక్కడికక్కడ మట్టికూరుకుపోయి, లైనింగ్‌లు చెదిరిపోయి పలుచోట్ల చెట్లు కూడా పెరిగి అధ్వాన్నంగా మారాయి. వీటి నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు అవసరమున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున మరమ్మతులకు నోచుకోలేదు. వీటి నిర్వహణ కూడా సరిగా లేక ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడతలో డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు, ఫీడర్ చానళ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

మరుగునపడిన మహాచరిత్ర

$
0
0

సంగారెడ్డి, ఏప్రిల్ 10: రాజుల కాలం నాటి చరిత్రను ఇముడ్చుకున్న మెదక్ జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి మహా చరిత్ర ఉన్నట్లు అక్కడ లభిస్తున్న వివిధ రకాల అద్భుతమైన దేవతా విగ్రహాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పురావస్తు శాఖ అధికారులు రెండు దశాబ్దాల క్రితమే గ్రామంలో లభించిన వివిధ దేవ తామూర్తుల విగ్రహాలను, శిలాశాసనాలను పరిశీలించినా పూర్తి వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేకపోతున్నారు. గ్రామస్థులు మాత్రం ఈ గ్రామాన్ని కుపేంద్రభూపతి రాజు పరిపాలించిన కుబేర పట్టణంగా భావిస్తున్నారు. కుపేంద్ర భూపతిరాజుకు రఘువంశంతో సంబంధం ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు పేర్కొంటున్నా పూర్తి స్థాయిలో నిర్ధారించడం లేదు. ప్రస్తుతం ఉన్న కుప్పానగర్ గ్రామానికి తూర్పు దిక్కున సుమారు 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ తవ్వినా గునపం, పార అవసరం లేకుండా చేతితో మట్టిని తీసుకోవచ్చు. గుట్టగా ఉన్న ప్రాంతంలో మట్టి తేలికగా ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉండడంతో దాదాపు పది మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో శివలింగాలు, అమ్మవారి విగ్రహాలు, కమలం పువ్వు ఆకారంలో మందిరాలకు ఏర్పాటు చేసే కం డాలు బయటపడ్డాయి. స్పష్టంగా కనిపించే విధంగా బయటపడిన రాశి చక్రాన్ని గ్రామానికి ఓ దిక్కున ఉన్న హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించి గ్రామస్థులు భద్రపర్చారు. ఇదే మందిరం లోపల ఒక లింగం, వరండాలో నందితో పాటు మరో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. తవ్వకాలు నిర్వహించిన ప్రాంతంలో పూర్వీకులు ఉపయోగించిన మట్టి పాత్రలు, మట్టి గాజులు, బోకులు లభిస్తున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గతంలో ఇక్కడ ఒక గ్రామం ఉండవచ్చని భూకం పం రావడం వల్ల గ్రామం మొత్తం భూమిలోకి కృంగిపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ఒకేచోట మనుషులకు సంబంధించిన పుర్రెలు, ఎముకలు నలుగురైదుగురివి బయటపడినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. దీంతో భూకంపం వల్ల గ్రామం కనుమరుగైనట్లు అనుమానిస్తున్నారు. రాజుల కాలంలో జరిగే యుద్ధాల్లో మరణించిన వారిని ఒకేచోట కననం చేయడం లేదా దహనం కూడా చేసేవారన్న వాదనలు ఉన్నాయి. వైద్య శాస్త్రం అంతంతగా ఉన్న నాటి రోజుల్లో ప్రబలే అంటురోగాల వల్ల గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయేవారని ఇది ఒక కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక విచిత్రమైన ఇటుకలు లభించాయి. ఒక ఇటుక సైజు రెండు ఫీట్ల పొడవు, ఒక ఫీటు వెడల్పు, తొమ్మిది అంగుళాల ఎత్తులో ఉన్నాయి. వీటి బరువు కేవలం మూడు కిలోలకు మించి ఉండదు. అక్కడ లభించిన ఒక ఇటుకతో ఇప్పుడు తయారఅవుతున్న ఇటుకలు 8తో సరిపోల్చవచ్చు. అప్పటి ఇటుకను గడ్డపారను దింపినా ఇసుమంతైనా చెదరిడం లేదంటే దాని పటిష్టత ఏమిటో స్పష్టమవుతోంది. తవ్వకాల్లో దొరికిన ఇటుకలతో గ్రామస్థులు తిరిగి ఇళ్లు నిర్మించుకున్నారు. శివలింగంపై విచిత్రమైన గీతలు ఉండడంతో నాటి రాజులకు సంబంధించిన రాజముద్రలుగా భావిస్తున్నారు. పొరుగున ఉన్న గ్రామస్థులు మట్టిని తవ్వుకుని వెళ్తుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది. కుప్పానగర్ గ్రామానికి చెందిన మహిళలంతా ఏకమై భవానిమాత విగ్రహంగా భావించి తీసుకువచ్చి కేవలం మహిళలే మందిరాన్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి వెలుపల ఉన్న ఓ శివాలయం వద్ద మరికొన్ని విగ్రహాలను ఆరుబయట వదిలిపెట్టారు. కాగా లింగాకారంలో ఉన్న ఓ ఖండానికి దిగువన అక్షరాలు, పైన కూడా అక్షరాలు, రాజముద్రికలు ఉన్నా యి. గ్రామస్థులు లింగంగా భావిస్తున్నా పాణవట్టం లేకుండా ఎక్కడ కూడా లింగాన్ని నిర్మించిన దాఖలాలు అంతంత మాత్రమే. లింగానికి దిగువున ఎలాంటి అక్షరాలు ఉండకపోగా ఈ లింగాకారానికి మాత్రం అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఒక తలకు రెండు ప్రక్కల స్ర్తిల విగ్రహాలు, కాళ్ల వద్ద ముగ్గురు నిలబడి, ఇద్దరు కూర్చుని ఉన్న విగ్రహాలు ఉన్నాయి. మహిళగా భావిస్తున్నా విశాలమైన నేత్రాలు కలిగివుండడంతో బుద్ధుడి విగ్రహంగా భావిస్తున్నా అది నమ్మశక్యం కాని విషయం. కాలభైరవుడి విగ్రహాన్ని తలపించే మరో దేవతా ప్రతిమ కూడా నిరాదరణకు గురవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న గ్రామానికి కూడా చుట్ట్టూ కోట, మధ్యలో బురుజు, కోటగోడపై పోతుల బండి తిరిగేంత విశాలంగా ఉండడం గమనార్హం. ఇక్కడ లభించిన దేవతా ప్రతిమలు, ఇతర పాత్రలు క్రీస్తుపూర్వమా, క్రీస్తుశకమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశేషమైన చరిత్రను సంతరించుకున్న కుప్పానగర్ గ్రామంపై పురావస్తు శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుప్పానగర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వరస్వామి ఆలయాన్ని కుపేంద్ర భూపతి రాజు నిర్మింపజేసినట్లు స్కంధపురాణం వెల్లడిస్తోంది. పురాణాల్లో ఉన్న ఝరాసంగం ఆలయ చరిత్ర ఉం దంటే కుపేంద్ర భూపతి రాజు కుప్పానగర్ గ్రామాన్ని పాలించి ఉండవచ్చన్న నమ్మకం కలుగుతోంది. పురావస్తు శాఖలో సరియైన నిపుణులు లేకపోవడం, శాసనాలపై ఉన్న భాషలను పరిశోధించేవారు తగ్గిపోతుండటం, శాఖ నిర్వీర్య దశలో ఉండడంతో భావితరాలకు తెలియాల్సిన అనేక గాథలు మరుగున పడుతున్నాయని చెప్పవచ్చు. రకరకాల కథలు వినిపిస్తున్న కుప్పానగర్ గ్రామ చరిత్ర ఏమిటో వెలుగులోకి తీసుకువచ్చి భవిషత్ తరాలకు అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.


12 శాతం ఇవ్వకుంటే ఓట్లు అడగొద్దు

$
0
0

కరీంనగర్, ఏప్రిల్ 10: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి, నిజామాబాద్ మాజీ ఎంపి మధుయాష్కి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజకీయ లబ్ధి, ఆస్తులు పెంచుకునేందుకే రీడిజైన్‌లకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లపై శే్వతపత్రం విడుదల చేయాలని, లేనిపక్షంలో సేవ్ తెలంగాణ, సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ రీడిజైన్‌లపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బంగ్లాలు, కార్లు కొనలేదా ? ఇదంతా అవినీతి సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లపై సమగ్ర నివేదిక తయారుచేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను, ప్రజల సొమ్మును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలంగాణ సాధన కోసం అమరులైన అమరవీరుల కుటుంబాలను ప్రభు త్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎండలు తీవ్రమై వడదెబ్బతో జనం చనిపోతుంటే, కనీసం ప్రజ ల్లో అవగాహన కల్పించి వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు 80 శాతాన్ని తాము ఎంపిలుగా పోరాటం చేసి సైజు తగ్గించామని, టిఆర్‌ఎస్, బిజెపి ఎంపిలు ఈ విషయంలో పట్టించుకోవడం లేదని, ఫలితంగా 80 శా తం పుర్రె గుర్తు అమల్లోకి వస్తుందని మధుయాష్కి తెలిపారు. ఈ కర్ర రాజశేఖర్, ప్రకాష్, జయశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఏకాభిప్రాయ సాధనకు కృషి

$
0
0

విజయవాడ, ఏప్రిల్ 10: భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో మొదటి నుంచి స్ర్తి మూర్తికి ఎంతో గౌరవం ఉంది. అందుకే భారతమాతకి జై... వందేమాతరం అంటున్నాం... దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తోందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఎంతో కాలంగా కాగితాలకే పరిమితమైన చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌లను తీసుకురావటానికి ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. అయితే రాజ్యాధికారంతో సరిపోదు... మహిళలందరూ ఆర్థికంగా బలపడి ఇటు భర్త అటు తండ్రికి చేయూతనిచ్చేలా ఉండాలనేది తమ అభిమతంగా చెప్పారు. మహిళలకు ఇంతకాలం జరిగిన అన్యాయాలు కారణంగానే గర్భంలోనే భ్రూణ హత్యలు జరుగుతున్నాయని దీని ప్రభావం వల్ల నేటి సమాజంలో ఆడ, మగ మధ్య సమతుల్యం లోపిస్తున్నదంటూ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అధిగమించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకురాబోతున్నామని ముందుగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. వందేమాతరం - జండర్ సమానత్వం కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రపెన్యూనర్స్ ‘ఎలిప్’ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన రెండు తెలుగురాష్ట్రాల ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో కేంద్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో తరలివచ్చిన ఈ సదస్సుకు సంస్థ అధ్యక్షురాలు కె రమాదేవి అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయ రంగానికి చెందిన వారే నాయకులు కాదు ఎవరైనా తమ తమ రంగాల్లో ప్రావీణ్యం చూపే ప్రతి ఒక్కరూ నాయకులేనన్నారు. ప్రధానంగా సమయపాలన చూపని వ్యక్తి సరైన నాయకునిగా గుర్తింపు పొందలేరన్నారు. కటిక దారిద్య్రంలో పుట్టిన నరేంద్ర మోదీ ముందుగా పేదరికాన్ని పారద్రోలేందుకై నడుం కట్టారన్నారు. ఒక్క ఏడాదికాలంలోనే దేశ వ్యాప్తంగా 20 కోట్ల, 20 లక్షల బ్యాంక్ ఖాతాలు ప్రారంభం కాగా ఇందులో 10.20 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవేనన్నారు. తాను ఈ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా ఏదో ప్రభుత్వ శాఖ నుంచి ఏదో జీవో తీసుకువస్తూ ఉగాదికి వస్తూ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ నుంచి విజయవాడలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన జీవోను వెంటపెట్టి తీసుకవచ్చానన్నారు. ప్రధాని మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇండియా అని దేశవిదేశ ప్రజలంతా ప్రస్తుతిస్తున్నారని అయినా ఈ దేశాభివృద్ధి ఏ ఒక్కరితోనే సాధ్యం కాదని అందరూ కలిస్తేనే ఉత్తమమైన ఫలితాలు రాగలవన్నారు.
సంస్థ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో 120 కేంద్రాల్లో ఇప్పటి వరకు 12వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం జరిగిందని, వచ్చే రెండేళ్లలో మొత్తం 40వేల మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ మహిళ, పారిశ్రామిక వేత్తలకు అవార్డులు, ప్రశంసాపత్రాలను మంత్రి నాయుడు అందించారు. సభలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితరులు ప్రసంగించారు.

జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న వెంకయ్యనాయుడు

హీరో మోటోకు
600 ఎకరాలు
ౄ చిత్తూరు జిల్లాలో కేటాయింపు
ౄ అనుబంధ పరిశ్రమలకు 200 ఎకరాలు
ౄ ఏపి ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: హీరో మోటో కార్ప్ లిమిటెడ్ (హెచ్‌ఎంసిఎల్)కు చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాల భూమిని ఏపి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ద్విచక్ర వాహనాల తయారీకి మాత్రమే వినియోగించాలని 2015లో ప్రభుత్వం (ఎపిఐఐసి)-హెచ్‌ఎంసిఎల్ మధ్య ఒప్పందం కుదరగా, ఈ భూమిని త్రిచక్రవాహనాలు, విద్యుత్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ పరికరాల తయారీకి ఉపయోగించుకునేందుకు తాజాగా అనుమతించారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎం.గిరిజా శంకర్ పేరుతో ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా, హెచ్‌ఎంసిపికి వాహనాల విడి భాగాలు సరఫరా చేసేందుకు వీలుగా అనుబంధ పరిశ్రమల కోసం ప్రభుత్వం మరో 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఒక్కో ఎకరా భూమికి 10 లక్షల రూపాయల ధరను నిర్ణయించారు. 2018 డిసెంబర్ వరకు మొదటి దశ పరిశ్రమ యూనిట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత దశలవారీగా పూర్తిస్థాయి పరిశ్రమను పూర్తిచేయాలని నిర్ణయించారు.
లండన్‌లో వెల్లివిరిసిన
తెలుగు సంస్కృతి
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఉగాది పర్వదినం సందర్భంగా లండన్‌లో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిశాయి. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు లండన్‌లోని రెడ్‌బ్రిడ్జ్ టౌన్‌హాలులో శనివారం సమావేశమై సాంప్రదాయబద్ధంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నేతృత్వంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు గత పనె్నండు సంవత్సరాల నుండి తాల్ నేతృత్వంలో ఉగాది వేడుకలను లండన్‌లో నిర్వహిస్తున్నామని ఈ సంస్థ చైర్మన్ సత్యేంద్ర పగడాల ఈ సందర్భంగా తెలిపారు.
సంగీతం నేర్చుకుంటున్న చిన్నారి విద్యార్థుల కీర్తనలతో ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక సంబరాలు మిన్నంటాయి.
ప్రతి సంవత్సరం తాల్ ప్రదానం చేసే ‘లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు’ ఈ పర్యాయం ప్రముఖ వైద్యుడు, నటుడు, నాటక రచయిత అయిన డాక్టర్ కడియాల వివేకానంద మూర్తికి అందించారు. ఈ కార్యక్రమంలో తాల్ కన్వీనర్ అనిత నోముల, వైస్ చైర్మన్ బాలాజీ కల్లూరు, ట్రస్టీలు శ్రీధర్ మేడిచెట్టి, మల్లేశ్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, కిరణ్ కప్పెట తదితరులు పాల్గొన్నారు.

త్వరలో
క్రీడా విధానం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 10: త్వరలో రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ పాలసీని రూపొందించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పాఠశాల స్థాయిలో క్రీడలను తప్పనిసరి చేసే యోచనతో పాటు ఉద్యోగ, ఉన్నత విద్యలో వెయిటేజ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. విశాఖలో దాదాపు 1000 ఎకరాల్లో క్రీడా గ్రామం నిర్మించే యోచన కూడా ఉందని చెప్పారు. ఈ నెల 16 నుంచి 19 వరకూ విశాఖలోని ఆర్కే బీచ్‌లో 8వ జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిఫ్ పోటీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరప్రతాన్ని ఆయన లాంఛనంగా ఇక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పంచాయతీరాజ్, క్రీడలు, పురపాలక, వైద్యం సహా ఐదు మంత్రిత్వ శాఖలతో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా స్పోర్ట్స్ పాలసీని రూపొందించనున్నట్లు వెల్లడించారు. పాఠశాల స్థాయిలో క్రీడలు, ఎన్‌సిసి వంటి అంశాల్లో పాల్గొనడాన్ని తప్పనిసరి చేయనున్నామన్నారు. మార్కుల జాబితాతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్‌కు సంబంధించి ఒక షీట్‌ను జారీ చేయనున్నామని, ఇందులో క్రీడలు, ఎన్‌సిసి, జిసిసి వంటి అంశాలపై విద్యార్థికి సంబంధించిన వివరాలు ఉంటాయని తెలిపారు.
ఉద్యోగం, విద్యలో దీనికి వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారికి కూడా వెయిటేజీ ఇచ్చే అంశం కొత్త పాలసీలో ఉంటుందన్నారు. గచ్చిబౌలి స్టేడియం తరహాలో విశాఖ గండిగుండంలో 90 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్సు నిర్మించే ఆలోచన ఉందన్నారు. వికలాంగుల కోసం 100 కోట్ల రూపాయలతో స్పోర్ట్సు స్టేడియం కేంద్రం మంజూరు చేసిందని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. విశాఖలో క్రీడా గ్రామం నిర్మించే ఆలోచన ఉందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1000 ఎకరాలు కేటాయించాల్సిందిగా కోరామని వివరించారు. సాహసక్రీడల నిర్వహణపై కూడా దృష్టి సారించామని మంత్రి వెల్లడించారు.

పండుగనాడూ
పచ్చ కండువాలేనా?

ౄ చంద్రబాబుపై వైకాపా సీనియర్ నేత బొత్స ధ్వజం
ౄ ఫిరాయించినవారు రాజీనామా చేయాలని డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: వైకాపా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టమంటే ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా దిగజారి, అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్నా అనైతిక విధానాలతో విపక్ష సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం దారుణమన్నారు. పండగల రోజు కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. చంద్రబాబు చర్యల వల్లరాజకీయాలంటే ప్రజలకు ఏవగింపు కలుగుతోందన్నారు. వైకాపా నుంచి గెలిచి టిడిపిలోచేరిన ఎమ్మెల్యేలు చిలుక పలుకులు మాని దమ్ముంటే రాజీనామా చేసి నెగ్గాలని సవాలు విసిరారు. చంద్రబాబు అవినీతి, అనైతిక చర్యలను ప్రజలు ఏవగించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఆదివారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చట్ట వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను, పార్టీ ఫిరాయింపులను స్పీకర్ చూస్తూ ఊరికే ఉండడం విచారకరమన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, ఫిరాయింపుదార్లు ఏదో ఒక రోజు తీవ్రమైన పరిణామాలను చట్టం ద్వారా ఎదుర్కొంటారన్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను స్పీకర్ వౌనంగా చూస్తూ ఉండడం తగదన్నారు. పిఆర్‌పి గతంలో మొత్తం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిందన్నారు. అలాగే ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరే వేరే పార్టీలో చేరడాన్ని చట్టం అనుమతించదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడి పుట్టిన రోజుకు అధికార యంత్రాంగం హాజరు కావడం అంటే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లేనన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.

పది రోజుల వేడుకలు

జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా 14నుంచి నిర్వహణ ౄ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 10: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు... గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్న మహాత్మాగాంధీ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన రాజ్యాంగంలోని 73వ అధికరణం అమలుల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా విడుదలచేసే నిధులతో పాటు రాష్ట్రం నుంచి విడుదలయ్యే నిధులతో మరింత పురోభివృద్ధి సాధ్యమవుతోంది. ఈ నెల 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, గ్రామ పంచాయతీల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, ఆదాయ వనరులు పెంపొందించుకోవడం, అన్నదాత ఆర్థిక వనరులు పెంచుకోవడం, సంక్షేమ ప్రణాళికలు తదితర కార్యక్రమాలు ఈ పది రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లాలకు ఈ ఏడాది రెండు విడతలుగా 14వ ఆర్ధిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు ఇప్పటికే గ్రామపంచాయితీలకు విడుదల చేశారు. పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రహదారులు సిద్ధంచేస్తున్నారు. ఇతర పథకాల నిధులు అందుబాటులో ఉన్నాయి.
జిల్లా, మండల కమిటీల ఏర్పాటు
ఈ నెల 14 నుంచి 24 వరకు జాతీయ పంచాయతీ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 338 విడుదలచేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీకి జిల్లా పంచాయతీ అధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 11 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. మండలస్థాయిలో ఎంపిడిఒ చైర్మన్‌గా, పంచాయతీ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మరో అయిదుగురు మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, గ్రామ, మండల, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాల్సివుంటుంది. జాతీయ పంచాయతీ దినోత్సవానికి స్థానిక ఎంపి, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి.
17 నుంచి 20 వరకు గ్రామసభలు నిర్వహించాలి. రైతులకు స్వాంతన చేకూర్చేవిధంగా, వ్యవసాయం లాభదాయకంగా ఉండే విధంగా సలహాలు ఇవ్వాలి. 21వ తేదీ నుంచి 24 వరకు పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, 24న ప్రమాణం చేయించాలి.
గ్రామాల్లో ర్యాలీలు, సంపూర్ణ పారిశుద్ధ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించడం, గ్రామాభివృద్ధికి పాటుపడిన వారిని సత్కరించడం వంటి కార్యక్రమాలుచేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్ధాయిలో ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రద్ధతీసుకోవాలని, సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంబేద్కర్ ఉత్సవాలు చీరాలనుంచే ఆరంభం

తమిళనాడు గవర్నర్ రోశయ్య వెల్లడి
చీరాల, ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14వ తేది నుంచి సంవత్సరంపాటు నిర్వహించనున్న అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు చీరాల నుంచే ప్రారంభమయ్యాయని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లా ప్రాంగణంలో సుమారు రూ.1.9 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రోశయ్య మాట్లాడుతూ దేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని రూపొందించిన వారిలో అంబేద్కర్ ముఖ్యుడన్నారు. అటువంటి వ్యక్తి స్ఫూర్తితో తన చేతుల మీదుగా అంబేద్కర్ భవన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగడం సంతోష దాయకమన్నారు. తాను పుట్టిన ఊరు చీరాల కానప్పటికీ పెరిగిన ఊరని తెలిపారు. గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తున్నప్పటికీ చీరాలపై అభిమానం తగ్గకపోగా పెరుగుతూనే ఉందన్నారు. చీరాల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమైనందున పార్టీలకతీతంగా కలసికట్టుగా వీలైనంత మేర అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఎన్నికలైన తరువాత ప్రజలెన్నుకున్న వ్యక్తికి అందరూ అండగా నిలిచి అభివృద్ధి సాధించుకోవాలన్నారు. స్థానిక నాయకలందరూ ఎమ్మెల్యేకు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, మంత్రి శిద్దా రాఘవరావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త 500 నోట్లు వచ్చేశాయ్!
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 10: భారత రిజర్వు బ్యాంకు ద్వారా కొత్త రూ. 500 నోట్లను విడుదల చేసింది. పాత నోట్ల కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. కొత్త నోట్లలో ఎడమ, కుడి చివర్లలో మొత్తం ఐదు గీతాలను అందరికీ కనపడేలా ముద్రించారు. నోట్ల పైన కరెన్సీ సంఖ్యను ప్రత్యేకంగా ముద్రించారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజులో ఈ సంఖ్యలను ముద్రించారు. చివరి మూడు సంఖ్యలను అతి పెద్దవిగా ముద్రించారు. గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో ఈ రూ.500 నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. అలాగే ఈ నోట్ల వెనుక భాగాన కూడా రూ.500 సంఖ్యను, అక్షరాలను పెద్దవిగా ముద్రించారు. నకిలీ కరెన్సీ చలామణి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు పలు జాగ్రత్తలు తీసుకుని ఈ నోట్లను విడుదల చేసింది.

‘నిరుపేదలందరికీ వైద్యం’
నర్సీపట్నం, ఏప్రిల్ 10: రాష్ట్రంలో అనారోగ్యంతో ఏ నిరుపేద మరణించకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేటలో 95 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య సహాయం పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్‌సిలను పటిష్టం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 1,400 వైద్యులను నియమించామన్నారు. వచ్చే నెలలో మరో 500 మంది వైద్యులను నియమిస్తామన్నారు. ఎన్టీ ఆర్ ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్య పరీక్షలను మరింత పగడ్భందీగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో తల్లీ పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారానే ఇది సాధ్యపడిందన్నారు.

త్వరలో హెల్త్ ఎటిఎంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ రావికమతం, కొత్తకోట, రోలుగుంట పిహెచ్‌సిలను 30 పడకల ఆసుపత్రులుగా స్థాయి పెంచాలని కోరారు. జెడ్పీ చైర్మన్ లాలం భవానీ, జెడ్పి సిఇఓ జయప్రకాష్ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సరోజని, కుసర్లపూడి సర్పంచ్ గండి సింహాద్రి, జెడ్పిటిసి రామలక్ష్మి పాల్గొన్నారు.

ప్రాజెక్టుల రీడిజైన్ విధానాలు వెల్లడించాలి

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైన్ విధివిధానాలను బహిర్గతం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం నాచారంలోని హెచ్‌ఎంటి నగర్‌లో టిజెఎసి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ఇరిగేషన్ తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై శే్వత పత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి ఇతోధికంగా నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ప్రతి ఎకరాకు పదివేల నష్టపరిహారం అందించాలని, నదులకు ఉపనదులను అనుసంధానం చేయాలని, ఓపెన్‌కాస్టు బొగ్గు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, బోధన్‌లోని చక్కెర కర్మాగారాన్ని, సిర్‌పూర్‌లోని పేపర్ మిల్లును తెరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ప్రజావసరాలపై ఉద్యమం చేపడతామని, టిజెఎసిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. కరవుకాటకాల్లో మునిగిపోతున్న తెలంగాణను కాపాడుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు రఘు, రాధాకృష్ణ, శ్రీ్ధర్, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు ప్రసంగించారు.

సమావేశంలో పాల్గొన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇతర నాయకులు

సాంకేతిక పరిజ్ఞానంతో..
సైబర్ నేరాలకు చెక్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల్లో చిక్కుకుంటున్న వారు అధిక శాతం విద్యావంతులే. బయట వ్యక్తులకు అకౌంట్ వివరాలు, ఓటిపి సమాచారం ఇవ్వొద్దని బ్యాంకు అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ డబ్బుపై అత్యాశతో తమ సూచనలు పాటించకుండా పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును మాయగాళ్లు విత్‌డ్రా చేసుకొని దర్జాగా ఖర్చు చేసుకున్నాక బాధపడుతున్నారు. అంది వచ్చిన టెక్నాలజీతో నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో సైబర్ క్రైం పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారనే చెప్పవచ్చు. రాష్ట్ర సరిహద్దులు దాటి ఎన్నో ప్రయాసలకోర్చి నేరస్థులను పట్టుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సైబర్ నేరాల అదుపునకు సరికొత్త టెక్నాలజీని తెప్పించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు మోసగాళ్ల ఆగడాలకు అదే మోసంతో అడ్డుకట్ట వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. సైబర్ నేరాల అదుపునకు సరికొత్త ల్యాప్‌టాప్స్, సాఫ్ట్‌వేర్ సమకూర్చారు. మోసానికి మోసంతోనే సమాధానం అన్నట్టు మాయగాళ్లు ఇచ్చిన మెయిల్ ఐడి, వెబ్‌సైట్‌లను సైబర్ పోలీసులు కొత్త టెక్నాలజీతో హ్యాక్ చేస్తారు. మోసాలకు వారు వేసే ఎత్తులనే పోలీసులు తిరిగి వారిపై ప్రయోగిస్తున్నారు. నేరగాళ్లు ఎక్కడి నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నారో తెలుసుకుంటారు. వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం చేరవేసి నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారు. మహానగరంలో తొలిసారిగా ఇలాంటి టెక్నాలజీని సైబరాబాద్ పోలీసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 24 గంటల్లోపు బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వారి ఖాతాలోని డబ్బు దారిమళ్లకుండా తిరిగి ఖాతాల్లోకి చేరేందుకు అవకాశం ఉందని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు.
చంద్రబాబుకు కంటి పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం తన కంటి వైద్య పరీక్షల నిమిత్తం తాడిగడపలోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు విచ్చేశారు. ముఖ్యమంత్రికి సంస్థ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ప్రతినిధి డాక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యావరణ పరిక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఆయన నేత్ర వైద్య పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రత్యేక వైద్య బృందం సిఎంకు సాధారణ నేత్ర వైద్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ వైద్యులను ఇతర సిబ్బందిని సిఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న వైద్య విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. సిఎం రాక సందర్భంగా తాడిగడప గ్రామంలో పటిష్ఠ బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆయన వ్యక్తిగత కార్యక్రమంగా సాగింది.

లండన్‌లో వెల్లివిరిసిన తెలుగు సంస్కృతి
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఉగాది పర్వదినం సందర్భంగా లండన్‌లో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిశాయి. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు లండన్‌లోని రెడ్‌బ్రిడ్జ్ టౌన్‌హాలులో శనివారం సమావేశమై సాంప్రదాయబద్ధంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నేతృత్వంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు గత పనె్నండు సంవత్సరాల నుండి తాల్ నేతృత్వంలో ఉగాది వేడుకలను లండన్‌లో నిర్వహిస్తున్నామని ఈ సంస్థ చైర్మన్ సత్యేంద్ర పగడాల ఈ సందర్భంగా తెలిపారు. సంగీతం నేర్చుకుంటున్న చిన్నారి విద్యార్థుల కీర్తనలతో ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక సంబరాలు మిన్నంటాయి. ప్రతి సంవత్సరం తాల్ ప్రదానం చేసే ‘లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు’ ఈ పర్యాయం ప్రముఖ వైద్యుడు, నటుడు, నాటక రచయిత అయిన డాక్టర్ కడియాల వివేకానంద మూర్తికి అందించారు. ఈ కార్యక్రమంలో తాల్ కన్వీనర్ అనిత నోముల, వైస్ చైర్మన్ బాలాజీ కల్లూరు, ట్రస్టీలు శ్రీధర్ మేడిచెట్టి, మల్లేశ్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, కిరణ్ కప్పెట తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ చైర్‌పర్సన్లకు
తెరాస తీర్థం

‘చే’జారిన బొంగుల, బొడ్డుపల్లి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఇద్దరు మున్సిపల్ చైర్ పర్సన్లు ఒకే రోజున ‘కారు’ ఎక్కడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్లను, ఇతర ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం ఎలా? అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఆందోళన చెందుతోంది. మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి అనూహ్యంగా తమ పార్టీ అనుచరులను వెంట తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బొంగుల విజయలక్ష్మి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెతో పాటు సంగారెడ్డి మున్సిపల్ వైస్-చైర్మన్ గోవర్ధన్ నాయక్, మరో ఏడుగురు కౌన్సిలర్లను మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకెళ్ళారు. అలాగే నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్య అనుచరునిగా ఉన్నారు. లక్ష్మి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్‌లో కలవరం
తెరాస ‘ఆకర్ష్’ మళ్లీ ‘తెర’పైకి రావడం కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలవరపరుస్తున్నది. చైర్‌పర్సన్లు బొంగుల విజయలక్ష్మి, బొడ్డుపల్లి లక్ష్మిలు ఏ సమయంలోనైనా గులాబీ గూటికి చేరనున్నారన్న వదంతులు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ వారిని కాపాడుకోలేకపోయామన్న బాధ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. బొడ్డుపల్లి లక్ష్మి పార్టీ వీడకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నా, చివరకు ఆమె శనివారం పార్టీని వీడి ‘కారు’ ఎక్కారు. దీంతో తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయితే తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎవరైనా తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఎందుకు కాదంటామని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ముందు వస్తే వద్దన్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని వారు చెబుతున్నారు.

బిజెపి నేత లక్ష్మణ్‌కు
అభినందనల వెల్లువ
వరంగల్ నాయకుల సన్మానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా నాయకులు ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. లక్ష్మణ్‌ను సన్మానించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర రావు, మందాడి సత్యనారాయణరెడ్డి, ఎం.్ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కె.ప్రతాప్‌రెడ్డి, వి.జైపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, వరంగల్ అర్బన్ అధ్యక్షుడు సునీల్, మహిళా నాయకులు విజయలక్ష్మి, కృష్ణవేణి, పద్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపిని ప్రత్యామ్నాయ పార్టీగా తీర్చిదిద్దడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

ఎండిన నీటి ప్రాజెక్టులు

ఫిరాయింపులతో నిండిన తెరాస : టిడిపి నేత రావుల చురక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ‘నీటి పారుదల ప్రాజెక్టులు ఎండిపోయాయి.. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులతో తెరాస నిండిపోయింది’ అని తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు కరవు సమస్యను పట్టించుకోకుండా, పరిపాలనను గాలికి వదిలేశారని, టిడిపి నాయకులను తెరాసలో చేర్చుకోవడానే్న వారు పనిగా పెట్టుకున్నారని ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కోటి ఎకరాలకు నీరు అందిస్తామని ఎన్నికలకు ముందు తెరాస హామీ ఇచ్చిందని, అయితే భారీ, చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 48 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని రావుల తెలిపారు. ఇంకా రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న 32 ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని ఆయన పేర్కొంటూ, వీటిని కలుపుకునే కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారా? లేక తెరాస అధికారం చేపట్టిన తర్వాత నిర్మించే నూతన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారా? అనేది స్పష్టం చేయాలన్నారు.
తెలంగాణలో కోటి 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉండగా, ఇదివరకే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని వివరించారు. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత ప్రాణహిత-చేవెళ్ల బోగస్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అంటున్నారని, అప్పుడు దీనిపై అధ్యయనం చేయకుండా ఎన్నికల ప్రణాళికలో పెట్టారా? అని రావుల ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లోగడ మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఏమి అభివృద్ధి చేయలేదని మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు హయంలోనే బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేయించడం వాస్తవం కాదా? అని రావుల ప్రశ్నించారు.

తెరాస ప్రజాప్రతినిధులకు శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెరాస శిక్షణ శిబిరాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన కార్పొరేటర్లు, మేయర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. అలాగే 13వ తేదీన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లకు శిక్షణ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ శిక్షణలో కెసిఆర్ వివరిస్తారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కార్పొరేటర్లు, శాసన సభ్యులు, మంత్రులు ఏం చేయాలో వివరిస్తారు.

బిసిల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

$
0
0

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రభుత్వం బిసిల సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. జ్యోతిరావు పూలే 190వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ కళ్యాణమండపంలో నిర్వహించిన జయంతి సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు విద్యతోనే సమాజంలో సముచిత గౌరవం లభిస్తుందని ఆనాడే మహాత్మా జ్యోతిరావు పూలే గుర్తించారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా 8800కోట్ల రూపాయిలతో బిసి సబ్‌ప్లాన్‌ను బిసి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.ఈనిధులను ఖర్చు చేయడానికి బిసిల మనోభావాలకు అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వృత్తిదారులు అభివృద్ధి చెందుతారో అభిప్రాయాలు సేకరించి బ్యాంకర్ల సహకారంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో ప్రభు త్వం ఉందని తెలిపారు. బిసిలకు రుణమంజూరులో జాప్యం లేకుండా చూస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో బిసి భవన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం. ఎం.నాయక్ మాట్లాడుతూ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమానికి ఆద్యుడు పూలే అని కొనియాడారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళావిద్య, వికాసానికి పాటుపడ్డారని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్ధికంగా పైకి తీసుకువచ్చేందుకు మహానుభావుల స్ఫూర్తితోనే ప్రభుత్వాలు పధకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులు విద్యలో రాణిస్తూ పోటీ పరీక్షల్లో విజయాలు నమోదుచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే ఆనాడు విద్య ఆవశ్యకతను పూలే గుర్తించడమేనని తెలిపారు. ఈసందర్భంగా బిసి సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు , ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భాస్కరరావు, ప్రసాద్, బిసి సంఘం నాయకులు గొర్లె వెంకటరమణ, మజ్జి అప్పారావు ,విజయలక్ష్మి మాట్లాడుతూ బిసిలను ఆర్ధికంగా సామాజికంగా అభివృద్ధిలోనికి తీసుకురావడానికి ప్రభుత్వ పధకాలు అమలు చేయాలని రుణమంజూరులో బ్యాంకర్ల ఇబ్బందులు తొలిగించాలని కోరారు.బిసి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈసందర్భంగా బిసి వృత్తిదారులకు మంజూరు చేసిన యూనిట్లను పరిశీలించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు కలెక్టరేట్ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి మృణాళిని , కలెక్టర్ ఎం. ఎం.నాయక్, ఏజిసి నాగేశ్వరరావు, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి ,బిసిసంక్షేమాధికారి మనోరమ, బిసి సొసైటి ఇడి నాగరాణి, పలువురు బిసి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

$
0
0

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 11: అధికార పార్టీ సభ్యుల నిరసనలు, ప్రతిపక్ష పార్టీ సభ్యుల వాకౌట్‌ల మధ్య సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. గతంలో ఎన్నడూలేని విధంగా అధికారుల పనితీరుపై అధికార పార్టీ సభ్యులు విరుచుకుపడటంతో సమావేశంలో ఉత్కంఠ నెలకుంది. అధికారులలో చలనం లేదని, ఈ కారణంగా కౌన్సిల్‌కు చెడ్డపేరు వస్తుందని వారు వాపోయారు. ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యులు మండిపడటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు తామెందుకు ఇక్కడ ఉండాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎస్‌వివి రాజేశ్వరరావు, కేదారశెట్టి సీతారామమూర్తి, గాడు అప్పారావు, అవనాపుచిన్నమ్మలు, కోలగట్ల వెంకటరమణి వాకౌట్ చేశారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేనప్పుడు మున్సిపల్ కౌన్సిల్‌ను రద్దు చేస్తే మంచిదని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుఅన్నారు. అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, లోపాలను సవరించుకోవడం లేదని, అనేక సమస్యలు రాజ్యమేలుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని, లోపాలను సవరించుకుని అధికారుల మధ్య సమన్వయం ఎప్పటిలోగా కుదుర్చుతారో సమాధానం చెప్పేవరకూ నిల్చొనే ఉంటానంటూ ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ ఆదుర్తి వాసుదేవ్ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు సమాధానం చెప్పినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ జొక్యం చేసుకోవడంతో ఆయన శాంతించారు. పట్టణంలో ఒకవైపు మంచినీటి ఎద్దడి..మరోవైపు ఆక్రమణలు పెరుగుతున్నాయని , ఇంకోవైపుఅభివృద్ధిపనులు ముందుకు సాగడం లేదని మున్సిపల్ కౌన్సిలర్లు రొంగలి రామారావు, గేదెల ఆదినారాయణ, గాడు అప్పారావు, మేకా అనంతలక్ష్మి, కిల్లాన పార్వతి, కొర్నాన రాజ్యలక్ష్మి, సుంకరి విజయలక్ష్మి, వెలిచేటి మణికుమారి, ఉండ్రాళ్ల వెంకటలక్ష్మి, రౌతు పద్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించలేని సమావేశాలను నిర్వహించడం ఎందుకని వారు నిలదీశారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, ఇష్టం లేనివారు వెళ్లిపోవాలని, మున్సిపల్ కౌన్సిల్‌కు చెడ్డపేరు తీసుకురావద్దని కోరారు. ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు మత్స్యరాజు, ప్రసాద్, మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల జూట్ మిల్లులో భారీగా అగ్ని ప్రమాదం
నెల్లిమర్ల, ఏప్రిల్ 11: నెల్లిమర్ల జూట్‌మిల్లులో సోమవారం తెల్లవారు జాము 1.30గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫిన్షింగ్ డిపార్టుమెంటులోని యంత్రాలు కాలిపోయాయి. అలాగే గోనె బేళ్లుకూడా కాలి బూడిదయ్యాయి. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా. ఫిన్షింగ్ డిపార్టుమెంట్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. యాజమాన్యం అందించిన సమాచారం మేరకు విజయనగరం అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫిన్షింగ్ డిపార్టుమెంట్ పూర్తిగా దగ్దంకావడంతోపాటు యంత్రాలు కాలిపోవడంతో డిమాంట్‌మెంట్ యంత్రాలు తిరగడానికి మరో నాలుగు రోజులు పడుతుందని యాజమాన్య ప్రతినిధులు చెబుతున్నారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>