Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నేర్చుకుందాం

$
0
0

కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీదికి నె్నగయుజుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండు గృపణత్వమునన్

భావము:బంతి క్రిందపడి మళ్లీ పైకి ఎగిరిన మాదిరిగా దైవాన్ని నమ్ముకున్న వాడు హీనస్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నత స్థితిని పొందుతాడు. కాని దైవాన్ని నమ్మనివాడు మట్టిముద్ద క్రింద పడి అట్లే ఉండిపోయినట్లుగా హీనస్థితిని పొంది అట్లే వుంటాడు. కానీ మళ్లీ ఉచ్ఛస్థితిని పొందడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ


ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 39

$
0
0

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
కాని.. కాని.. మనుష్యులపైన ఉండే నమ్మకం వమ్మైపోవడం లేదా! నమ్మకాన్ని తుంగలో తొక్కిన ట్రాజడీ కాదా ఇది.. నమ్మకాన్ని తెంచే ఒక ప్రయత్నం.. సరాసరి మృత్యువు.. ప్చ్.. ఎత్తుకు పైఎత్తులు.. మానవత్వం మంటకలిసిపోతోంది. హింస.. రక్తపాతం.. నలువైపులా చావుకేకలు..
ఆర్మీకి ఈ సంఘటన పెద్ద పెన్నిధిలా అనిపించవచ్చు. కాని మానవ సమాజానికి ఇది ఒక దుర్ఘటన కాదా! స్నేహితుడి చేత కపటంగా స్నేహితుడిని హతమార్చడం.. ప్చ్.. ఉఫ్.. కాని యూనిట్ అంతా తను ఆలోచించినట్లుగా ఆలోచించదు కదా! యూనిట్‌కి ఇది తప్పుగా అనిపించడం లేదు కదా! తనెందుకు ఈ దుర్ఘటన మానవతా విలువలు చచ్చిపోతున్న ఈ సమాజానికి ఒక ఉదాహరణగా ఆలోచిస్తున్నాడు? తను ఈ ఆర్మీ సత్యాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు? ఆర్మీతో పూర్తిగా మమేకం ఎందుకు కాలేకపోతున్నాడు?
ఆలోచనా తరంగాలు సందీప్‌ని ముంచెత్తుతున్నాయి. మనస్సులోని ఉదాశీనత్వం సాయంత్రం వ్యాపించే ఉదాశీనత్వంతో కలిసి ఇంకా చిక్కగా అయిపోతోంది. నేడు హింస అనే వరదలో తను శవమై ప్రవహిస్తున్నాడు. తనే కాదు.. మొత్తం మానవ సమాజం అంతా.. అందువల్లే కాశ్మీర్ నదులు ఎండిపోవడం లేదూ? ఎండ నల్లబడటం లేదూ?
ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగితే ఎన్నో ప్రశ్నలు పురుగుల్లా అతని మైండ్‌లో పాకుతూ ఉంటాయి. అసలు వీటిని గురించి అతడు బాహాటంగా ఎవరికీ చెప్పనూ చెప్పలేడు. తన పైఆఫీసర్లకి ఏ మాత్రం చెప్పలేడు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ మాత్రమే పనిచేస్తుంది. అసలు చర్చలు జరపడానికి అవకాశమే లేదు. తన ఆత్మీయుడు మిత్రుడు అయిన మేజర్ రాథోర్ తనను ఇటువంటి సమయాలలో తను చెప్పింది వింటాడు. తనను సంభాళిస్తాడు. తన ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. సందీప్! నువ్వు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు. ఈ ఆర్మీలో ఆలోచించడం అంటే క్రమశిక్షణని, సంప్రదాయాన్ని కాదనడమే..’ అని అతడిని ఈ ఆలోచనలనుండి బయటపడేశాడు.
అందుకేగా తను ఈ ఆర్మీలోకి వచ్చాడు. తన తండ్రిది పెద్ద వ్యాపారం. అయినా తను వద్దనుకున్నాడు. తను మంచి ఆలోచనలకి, విలువలకి మాత్రమే ఇమ్‌పార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే తన ఉద్దేశ్యంలో నాగరిక సమాజం సాగించిన ఈ సుదీర్ఘమైన యాత్రలో మనిషి పోగుచేసుకున్నది విలువలను, మంచి ఆలోచనలని మాత్రమే.
‘‘మరైతే తెలుసుకో నా హీరో! నీలాంటివాళ్ళు భారతదేశాన్ని ఇంకా ఉన్నతమైన విలువలతో వృద్ధి చేయాలని, మంచి నాగరికతను పెంపొందించాలి అన్న ఉద్దేశ్యంతో ఇందులో చేరుతారు. ఇట్లాంటివాళ్లకు ఏం భవిష్యత్తు ఉంటుంది? అసలు మిమ్మల్ని దీనికోసం రమ్మనలేదు. ఇంకొకళ్ళ భారం మనం ఎందుకు వహించాలి? ఇక్కడికి పిలిపించింది ఉగ్రవాదులని మట్టుపెట్టడానికి. మీరు నమ్మకంగా ఈ పని చేయాలి. ఎట్లా చేయాలి? కపటంగానా? మోసంచేసా? నైతికంగానా? అనైతికంగానా, ధర్మంగానా? అధర్మంగానా? వీటి గురించి మాకు ఆలోచించాల్సిన పనిలేదు. మేం ఏం చేయగలుగుతాం. మా ఆలోచన అందరి భవిష్యత్తు కోసమే. మేం కొంతవరకు బంధితులం. ఇక్కడి నీతి నియమాలకు. కేవలం సిస్టమ్ నడుస్తుంది- కాని మనసులో ఉండే ఈ భావుకత అనే పిట్టను ఏం చేయను చెప్పు? అది ప్రతి సంఘటన తరువాత తన ముక్కుతో నన్ను పొడుస్తూనే ఉంటుంది- బాధగా ప్రశ్నించాడు సందీప్. మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు- ‘ఇది నా పోస్టింగ్. అందువలన ఇంకా నాలో భావుకత, మనస్సు అనేవి నన్ను పట్టుకుని వేళ్లాడుతున్నాయి. తరువాత ఇవన్నీ నా జీవితంలో రొటీన్ అయిపోతాయి. వీటికి అలవాటుపడిపోతాను. ఒక సంఘటన గురించి చెబుతాను. ఇంతక్రితం నా పోస్టింగ్ సరిహద్దు దగ్గర ఉన్న చౌకీ దగ్గర ఉంది. రాత్రి చీకట్లో నేను ఎవరి గొంతో విన్నాను. ఎవరో సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తున్నారని అనిపించింది. మూడుసార్లు వార్నింగ్ ఇచ్చాము. ఆగమని అన్నాము. ఆ వ్యక్తి భయంతో ఆగలేదు. చిమ్మ చీకటి. అతడిని ఉగ్రవాది అని అనుకుని మేము పిస్తోలు పేల్చామని అతడు అనుకున్నాడు. ప్రొద్దునే్న చూసాను. ఎవరినైతే మేము ఉగ్రవాది అని అనుకున్నామో ఆ వ్యక్తి చిన్న దొంగ. బీదవాడు. వాడి మూటలో మూడు నాలుగు కిలోల బియ్యం ఉన్నాయి. వాడు సరిహద్దుకవతల ఎక్కువ ధరకు అమ్ముదామని అనుకున్నాడు. వాడు భయం వలన ఏమీ మాట్లాడలేకపోయాడు. కాని పిస్తోలు మాట్లాడింది. ఈ విధంగానే మేము మరో పిల్లవాడిని పట్టుకున్నాము. అప్పుడు పగలు. అందుకే వాడు బతికిపోయాడు. అదే రాత్రయితే ప్రాణాలు పోయి ఉండేవి. వాడి దగ్గర ఒక కోటి రూపాయల విలువ గల చరస్ దొరికింది. వాడికి తెలియను కూడా తెలియదు. వాడికి కేవలం 100 రూపాయలు సరిహద్దుకిటువైపు నుండి అటువైపు తీసుకెళ్ళడానికి ఇస్తారు. ఆ రోజు ఆ బీద దొంగ శవాన్ని చూసాక నేను ఏడ్చేసాను. ఇక్కడినుండి పారిపోవాలని అనిపించింది. కాని ఎక్కడికి పారిపోను? నన్ను పారిపోయినవాడిగా లెక్కిస్తారు. ఒకవేళ నేను పిస్తోలు పేల్చలేదే అనుకో. ఎవడైనా చొరబడితే? అప్పడు వాడు నన్ను వదిలేస్తాడా? మేము ఇక్కడ అస్తిత్వానికి పోరాటం చేస్తున్నాము. ఇంకోమాట, లోకం నుండి పారిపోతే ఇది మారుతుందా? సమాజాన్ని ఎదిరించాలి.
అప్పుడే ఈ సమాజం మారుతుంది- నేను అసలు ఈ చట్రంలో ఇమడలేకపోతున్నాను. ఇవన్నీ మూసల బతుకులు. ఆర్మీని వదిలివేయాలంటే అనుమతి లేదు. ఉండాలంటే ఏ పశుత్వం ఉండాలో అది నాలో లేదు. ఏ మంచి మనస్తత్వంతో, ఆర్మీ పట్ల ఎంత భక్తి భావంతో ఇక్కడ అడుగుపెట్టానో వీటికి అసలు విలువే లేదు. పోనీ విలువ లేకపోతే లేకపోయింది. నేను బాహాటంగా నా భావాలని వ్యక్తం చేయగలను.

- ఇంకా ఉంది

రాశిఫలం 6-2-2017

$
0
0
తిథి: 
శుద్ధ దశమి మ.3.03
నక్షత్రం: 
రోహిణి మ.2.43
వర్జ్యం: 
ఉ.7.16 నుండి 8.45 వరకు, తిరిగి రా.7.57 నుండి 9.26 వరకు
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్ర్తిలు మనోలాసాన్ని పొందెదరు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసికాందోళన తప్పదు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
Date: 
Monday, February 6, 2017
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

mataata

$
0
0
Cross Image: 
Date: 
Monday, February 6, 2017

త్యాగమే మహోన్నతం

$
0
0

భారతదేశం కర్మభూమి. పుణ్యభూమి. సనాతన ధర్మానికి వేదిక. అమృతత్వోపాసనయే మనిషి ధర్మం అని చెప్పే దివ్యభూమి ఇది. మనిషి పుట్టగానే సరిగాదు పుట్టినందుకు జన్మ సాఫల్యానికి త్యాగమే మహోన్నతం అని తెలుసుకోవాలంటుంది భారతీయం. అటువంటి భారతదేశానికి యయాతి ఒక మహారాజు. ఆ మహారాజుకు ఇద్దరు భార్యలు. ఒకరు ధర్మానే్న శాసించే నేర్పు ఒడిసిపట్టిన శుక్రాచార్యుని కూతురు దేవయాని. మరొకరు ధర్మపరుడు ప్రజలను కన్నబిడ్డలవలె చూస్తాడన్న కీర్తిపొందిన వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఒకసారి యయాతి శర్మిష్ఠ విషయంలో దేవయాని కోపానికి గురైనాడు. పుత్రికావాత్సల్యంతో శుక్రాచార్యుడు యయాతిని ముదిమితనం ప్రాప్తించేటట్లుగా శపించాడు. యయాతి వేడుకోలుకు కరిగిన శుక్రాచార్యుడు తిరిగి ఈ యయాతి వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఎవరైనా ధరిస్తే వారి యవ్వనం నీకు సంప్రాప్తించేటట్లు చేస్తానని చెప్పాడు.
యయాతి చింతించాడు. కొడుకులంటే యువకులు. వారు యవ్వనాన్ని నాకెందుకు ఇస్తారు అట్లా తీసుకోవడం కూడా తప్పే కదా అని ఆలోచించాడు. కాని తన కుమారుల మనస్సు తెలుసుకొందామని దేవయాని వల్ల తనకు కలిగిన యదువు, తుర్వసుడు శర్మిష్ఠ వల్ల కలిగిన ద్రుహ్యుడు అనువు, పూరుడు అను వారిని పిలిచి తన శాపాన్ని ఆ శాపవృత్తాంతాన్ని తెలియబర్చాడు. ఆ తరువాత తనకు ఎవరు యవ్వనాన్ని ధారపోస్తారని అడిగాడు. మీ యవ్వనాన్ని నాకివ్వడమే కాదు తిరిగి నా వృద్ధాప్యాన్ని మీరు ధరించవలసి కూడా ఉంటుందని వారిని హెచ్చరించాడు.
అందరూ మాకు అంగీకారం కాదు అని నిర్మొహమాటంగా చెప్పారు. కాని పూరుడు తన తండ్రి పడే ఆవేదనను చూచాడు. అతని మనసు ద్రవించింది. తన తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘తండ్రీ! మీరు దేనికోసం చింతించకండి మీ వృద్ధాప్యాన్ని నేను ధరిస్తాను. నా యవ్వనాన్ని మీరు తీసుకోండి’’ అని ఎంతో సంతోషంతో చెప్పాడు. యయాతికి చాలా ఆనందం కలిగింది. ఆ పూరునితో ‘‘ఓపూరుడా! నా గురువైన శుక్రాచార్యుడు ఎవరైతే ఈ నా వృద్ధాప్యాన్ని గ్రహిస్తారో వారికే నా తదనంతరం రాజ్యం ప్రాప్తిస్తుందని వారే రాజ్యానికి వారసులని కూడా తెలిపారు.’’ దాని వలన నీవే ఈ రాజ్యానికిరాజువు అవుతావు. అంతేకాదు నీవు చేసిన ఈ త్యాగం వల్ల గార్హస్థాశ్రమపు గొప్పతనం తెలిసింది. త్యాగేనైక అమృతత్వ మానశుఃఅనే వేదసూక్తికి నీవే మచ్చుతున్కవు. నీ వల్ల నా వంశ చరిత్ర అజారామరం అవుతుంది. గృహస్థాశ్రమంలో ఎవరికి వారు కాక అందరూ అందరికోసం జీవించాలనే నేర్పును కలిగి ఉండాలని చెప్పే నీ నడవడిక భావి భారత పౌరులకు మార్గదర్శి కాగలుతుందని యయాతి పూరుణ్ణి ఆశీర్వదించాడు. శరీరం ముఖ్యమనుకొనేవారు రాక్షస ప్రవృత్తిగలవారుగాను, మనస్సే ముఖ్యమనుకొనేవారు మానవులుగాను మానవత్వాన్ని పుణికి పుచ్చుకుని పరోపకారం మిదం శరీరం అన్న నానుడికి ప్రతిరూపంగా జీవించ గలగడమే మనిషి కర్తవ్యం అని చెప్పే ఈపూరుని కథ నేటి పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిందే. ఆచరించవలసిందే.

కల్కి అవతారదర్శనం ఎప్పుడు?

$
0
0

* శ్రీరాముడు తండ్రి ఆజ వల్ల వనవాసానికి వెళ్లవలసి వస్తే వెళ్లుగాక! లక్ష్మణుడు అలాంటి ఆజ్ఞ ఏదీ లేకుండానే భార్యను వదిలి అన్నతో అడవికి వెళ్లటం న్యాయమా?
రావుల లలితమ్మ, సూళ్లూరు పేట
కలియుగ జీవులకు భ్రాతృభక్తి శిఖరాయమాణంగా వుండే త్రేతాయుగానికి చెందినవాడు లక్ష్మణుడు. అందుకే ఆయన తండ్రి అనుమతితోనే అన్నగారి సేవకు బయలుదేరినాడు. పతివ్రత అయిన ఊర్మిళ ఈ విషయంలో భర్తకు నిండు హృదయంతో సహకారం అందించింది. కనుక లక్ష్మణ స్వామి చర్యలో అధర్మం ఏమీ లేదు.
* మహాభారత యుద్ధం ముగిసినాక శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం దిగమని ఆదేశించాడు. అర్జునుడు రథం దిగగానే రథం భస్మమై పోయింది. దీనికి కారణం ఏమిటి అన్న అర్జునుడికి భీష్మ, ద్రోణ, కర్ణాదుల అస్త్ర ప్రభావాలు శ్రీకృష్ణుని వలన నిలబడిపోయి వున్నాయని శ్రీకృష్ణుడు తన ప్రభావాన్ని ఉపసంహరించగానే అవి రథాన్ని భస్మం చేశాయని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇదేమిటి? అర్జునుడు వీరుడుకాడా? ఎదుటి వీరుల అస్త్రాలను నివారించే శక్తి అర్జునునికి లేదా? వివరించగలరు
- టి. ఎస్. ప్రకాశరావు, విజయవాడ
భీష్మ ద్రోణాదులు సామాన్యులు కారు. వాళ్లు అస్తవ్రిద్యలలో అర్జునుణ్ణి మించినవారు. ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. అందుకే కోరి శ్రీకృష్ణుని తెచ్చి తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. అర్జునుడు నర మహర్షి అవతారం. మానవ శక్తికి సంకేతం. శ్రీకృష్ణుడు నారాయణమహర్షి అవతారం. ఇతడు దైవశక్తికి సంకేతం. దైవశక్తి కలసి వచ్చినప్పుడే మానవ శక్తికి రక్షణ ఉంటుందని నిరూపించట కోసమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున రథ దహన ఘట్టాన్ని ప్రదర్శించాడని మనం గ్రహించాలి.
* త్రేతాయుగంలోను, ద్వాపర యుగంలోను ఎపుడు రాముడి, కృషుడి అవతారాలు వచ్చాయ? అదేవిధంగా కలియుగంలో ఏ అవతారం రాబోతోంది? ఎప్పుడు వస్తుంది?
త్రేతా ద్వాపర యుగాలలో కూడా భగవత్ అవతారాలు యుగాంతాలలోనే వచ్చాయి. కలియుగాంతంలోగూడా కల్కి అనే పేరుతో దశమావతారం రాబోతోందని మన పురాణాలు చెబుతున్నాయి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org

ఫ్రాణిసేవ.. పరాత్పరుని భజన

$
0
0

భారతీయ జీవనంలో వేదాలకు, ఉపనిషత్తులకున్న ప్రాధాన్యత వేటికీ లేదు. జాతిలో చేతనత్వాన్ని నింపేందుకు సత్యానే్వషణ చాలా వరకూ ఉపకరిస్తుంది. వేదవిహితమైన హైందవ ధర్మం సూర్యచంద్రులున్నంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. నిజాన్ని నమ్మి, వాస్తవాన్ని ప్రేమించే హైందవ సంస్కృతి నిత్య శోధనతో సశాస్ర్తియమైన అంశాలను ఆవిష్కరించింది. హైందవ ధర్మ పరిరక్షణ, భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మహనీయులు చేసిన, చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది. మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి ఉన్న హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ఇటీవల కాలంలో ముప్పు వాటిల్లుతోంది. ఆ ముప్పును తప్పించి, తిరిగి హిందూ ధర్మ, సంస్కృతులను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు వేద పండితులు ఇప్పటికీ శక్తివంచన లేకుండా కృషి సల్పుతూనే ఉన్నారు. అందులో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఒకరు. చిన్ననాడే సన్యాసం స్వీకరించారు. యుక్త వయసులోనే ప్రాంపచిక వ్యామోహాలను పక్కనపెట్టి, సత్యానే్వషణకు హిమాలయాలకు బయల్దేరారు. ఎందరో మునులను, మహర్షులను, సత్పురుషులను, ఆధ్యాత్మికవేత్తలను కలిసి, అనేక విషయాలను గ్రహించిన స్వరూపానందేంద్ర స్వామి విశాఖ జిల్లా పెందుర్తికి సమీపంలోని చినముషిడివాడలో శారదా పీఠాన్ని స్థాపించి, హిందూ ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవని తాను నమ్మిన సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. హైందవ పవిత్రతను దెబ్బతీసే శక్తులను ఆధ్యాత్మిక ప్రబోధంతో మతాచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు.
1964 నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని దేరసాం గ్రామంలో నాగుల చవితి రోజున కళ్యాణి, చిన్నయ్యపంతులు దంపతులకు జన్మించిన బిడ్డే స్వరూపానందేంద్ర. స్వామి అసలుపేరు వరాహలక్ష్మీ నరసింహం. అన్నప్రాసన రోజున నరసింహం భగవద్గీతను తాకి, అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మిక చింతనను కనబర్చిన నరసింహం మృత్యువు నుంచి అమృతత్వం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే హిందూ ధర్మ పతాకాన్ని చేతబూని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. మనువులు, వైవసత్వ మనువులు, యోగులు, సద్గురువులు, సాధుపుంగవులు మన నేలమీదనే జన్మిస్తారేంటో మన దేశం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. ఈ ఆలోచనలతో విశాఖ చేరుకున్న నరసింహానికి రాఘవేంద్రస్వామి మఠం ఆశ్రయమిచ్చింది. మంత్రశాస్త్రంలో అందెవేసిన రామచంద్రభట్ వద్ద శిష్యరికం చేశారు. ఆయన చేతుల మీదుగానే బ్రహ్మోపదేశం పొందారు. ఆ తరువాత సన్యాసాన్ని స్వీకరించారు. నరసింహం సన్యాస నామం స్వరూపానందేంద్ర. వెనువెంటనే నరసింహం హరిద్వార్ వెళ్లి, సాధువులు, సన్యాసులు, మహిమాన్వితుల నుంచి భగవత్‌తత్వాన్ని తెలుసుకున్నారు.
అక్కడి నుంచి తిరిగి విశాఖ చేరుకున్న నరసింహం ఒక ఆశ్రమాన్ని స్థాపించేందుకు సిద్ధపడ్డారు. భగవదనుగ్రహంతో అంచెలంచెలుగా నిధులు సమకూరుతూ వచ్చాయి. పీఠాధిపతి స్థానంలో కూర్చున్న స్వరూపానందేంద్ర సకల విద్యా స్వరూపిణిని ఆ పీఠంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వాములు తమ ప్రియ శిష్యులైన అద్వైతానందేంద్రకు ఆ జ్ఞానసరస్వతి స్ఫూర్తిని అందచేస్తే, ఆయన ద్వారా స్వరూపానందేంద్ర సరస్వతిగా రూపాంతరం చెందింది. శారదా సిద్ధాంతాన్ని ఆది శంకరుల వారి నుంచి మొదలుపెడితే, దాన్ని అనుసరిస్తున్న నాలుగో మహాస్వామి స్వరూపానందేంద్రగా మనకు తెలుస్తుంది. విశాఖలోని శారదా పీఠానికి 1998 మే మూడున శంకుస్థాపన జరిగింది. చిన్నపాటి సన్యాసి కుటీరమైన ఈ ఉపనిషద్విహార్ ప్రాంతంగా అనతికాలంలోనే ప్రపంచస్థాయి శంకరపీఠంగా ఎదిగింది. 1999 జనవరి 27న పీఠంలో దాసాంజనేయ, వల్లీ దేవసహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తదితర అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిత్యం వేద నాదం ఆలపించే ఈ పీఠం ఇక్కడికి వచ్చిన వారికే కాక చుట్టుపక్కల వారికి కూడా ఆసక్తిని కలిగిస్తుందంటారు. నిత్యం హోమం నిర్వర్తిస్తారు. వేద మంత్రాలు మరుగున పడుతున్న ఈ సమయంలో వాటిని పరిరక్షించేందుకు స్వరూపానందేంద్ర కంకణబద్ధులయ్యారు. వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. నాలుగు వేదాల్లో పిల్లలను నిష్ణాతులను చేసేందుకు ఘనాపాటీలను ఇక్కడ నియమించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఇక్కడ కొదవ లేదు. ముఖ్యంగా హిందూ మత ప్రచారం, హిందూ మతవ్యాప్తికి స్వరూపానందేంద్ర మహాస్వామి చేస్తున్న ప్రయత్నాలు అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. భారతీయ సంపదైన గోవులను రక్షించాలన్న ధ్యేయంతో గోపూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను అన్య మతస్తులు ప్రలోభపెట్టి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి ఏజెన్సీలో హిందూ దేవాలయాలను నిర్మిస్తున్నారు. అలాగే వందలాది మంది గిరిజనులను తిరుమలకు పంపించి వెంకన్న దర్శనం చేయిస్తున్నారు. గిరిజనులకు, పేదలకు వారికి కావలసిన నిత్యావ సరాలైన దుప్పట్లు పంచిపెడుతున్నారు. పర్వదినాల్లో పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు, అనేక అంశాల్లో నిష్ణాతులైన పండితులను రప్పించి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏటా చాతుర్మాస దీక్షలు రుషికేష్‌లో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హిమాలయాల్లోని సాధువులు, సంత్‌లను కలిసి చర్చాగోష్ఠి నిర్వహిస్తూ వస్తున్నారు.

ఫ్రాణిసేవ.. పరాత్పరుని భజన

$
0
0

భారతీయ జీవనంలో వేదాలకు, ఉపనిషత్తులకున్న ప్రాధాన్యత వేటికీ లేదు. జాతిలో చేతనత్వాన్ని నింపేందుకు సత్యానే్వషణ చాలా వరకూ ఉపకరిస్తుంది. వేదవిహితమైన హైందవ ధర్మం సూర్యచంద్రులున్నంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. నిజాన్ని నమ్మి, వాస్తవాన్ని ప్రేమించే హైందవ సంస్కృతి నిత్య శోధనతో సశాస్ర్తియమైన అంశాలను ఆవిష్కరించింది. హైందవ ధర్మ పరిరక్షణ, భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మహనీయులు చేసిన, చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది. మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి ఉన్న హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ఇటీవల కాలంలో ముప్పు వాటిల్లుతోంది. ఆ ముప్పును తప్పించి, తిరిగి హిందూ ధర్మ, సంస్కృతులను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు వేద పండితులు ఇప్పటికీ శక్తివంచన లేకుండా కృషి సల్పుతూనే ఉన్నారు. అందులో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఒకరు. చిన్ననాడే సన్యాసం స్వీకరించారు. యుక్త వయసులోనే ప్రాంపచిక వ్యామోహాలను పక్కనపెట్టి, సత్యానే్వషణకు హిమాలయాలకు బయల్దేరారు. ఎందరో మునులను, మహర్షులను, సత్పురుషులను, ఆధ్యాత్మికవేత్తలను కలిసి, అనేక విషయాలను గ్రహించిన స్వరూపానందేంద్ర స్వామి విశాఖ జిల్లా పెందుర్తికి సమీపంలోని చినముషిడివాడలో శారదా పీఠాన్ని స్థాపించి, హిందూ ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవని తాను నమ్మిన సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. హైందవ పవిత్రతను దెబ్బతీసే శక్తులను ఆధ్యాత్మిక ప్రబోధంతో మతాచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు.
1964 నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని దేరసాం గ్రామంలో నాగుల చవితి రోజున కళ్యాణి, చిన్నయ్యపంతులు దంపతులకు జన్మించిన బిడ్డే స్వరూపానందేంద్ర. స్వామి అసలుపేరు వరాహలక్ష్మీ నరసింహం. అన్నప్రాసన రోజున నరసింహం భగవద్గీతను తాకి, అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మిక చింతనను కనబర్చిన నరసింహం మృత్యువు నుంచి అమృతత్వం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే హిందూ ధర్మ పతాకాన్ని చేతబూని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. మనువులు, వైవసత్వ మనువులు, యోగులు, సద్గురువులు, సాధుపుంగవులు మన నేలమీదనే జన్మిస్తారేంటో మన దేశం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. ఈ ఆలోచనలతో విశాఖ చేరుకున్న నరసింహానికి రాఘవేంద్రస్వామి మఠం ఆశ్రయమిచ్చింది. మంత్రశాస్త్రంలో అందెవేసిన రామచంద్రభట్ వద్ద శిష్యరికం చేశారు. ఆయన చేతుల మీదుగానే బ్రహ్మోపదేశం పొందారు. ఆ తరువాత సన్యాసాన్ని స్వీకరించారు. నరసింహం సన్యాస నామం స్వరూపానందేంద్ర. వెనువెంటనే నరసింహం హరిద్వార్ వెళ్లి, సాధువులు, సన్యాసులు, మహిమాన్వితుల నుంచి భగవత్‌తత్వాన్ని తెలుసుకున్నారు.
అక్కడి నుంచి తిరిగి విశాఖ చేరుకున్న నరసింహం ఒక ఆశ్రమాన్ని స్థాపించేందుకు సిద్ధపడ్డారు. భగవదనుగ్రహంతో అంచెలంచెలుగా నిధులు సమకూరుతూ వచ్చాయి. పీఠాధిపతి స్థానంలో కూర్చున్న స్వరూపానందేంద్ర సకల విద్యా స్వరూపిణిని ఆ పీఠంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వాములు తమ ప్రియ శిష్యులైన అద్వైతానందేంద్రకు ఆ జ్ఞానసరస్వతి స్ఫూర్తిని అందచేస్తే, ఆయన ద్వారా స్వరూపానందేంద్ర సరస్వతిగా రూపాంతరం చెందింది. శారదా సిద్ధాంతాన్ని ఆది శంకరుల వారి నుంచి మొదలుపెడితే, దాన్ని అనుసరిస్తున్న నాలుగో మహాస్వామి స్వరూపానందేంద్రగా మనకు తెలుస్తుంది. విశాఖలోని శారదా పీఠానికి 1998 మే మూడున శంకుస్థాపన జరిగింది. చిన్నపాటి సన్యాసి కుటీరమైన ఈ ఉపనిషద్విహార్ ప్రాంతంగా అనతికాలంలోనే ప్రపంచస్థాయి శంకరపీఠంగా ఎదిగింది. 1999 జనవరి 27న పీఠంలో దాసాంజనేయ, వల్లీ దేవసహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తదితర అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిత్యం వేద నాదం ఆలపించే ఈ పీఠం ఇక్కడికి వచ్చిన వారికే కాక చుట్టుపక్కల వారికి కూడా ఆసక్తిని కలిగిస్తుందంటారు. నిత్యం హోమం నిర్వర్తిస్తారు. వేద మంత్రాలు మరుగున పడుతున్న ఈ సమయంలో వాటిని పరిరక్షించేందుకు స్వరూపానందేంద్ర కంకణబద్ధులయ్యారు. వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. నాలుగు వేదాల్లో పిల్లలను నిష్ణాతులను చేసేందుకు ఘనాపాటీలను ఇక్కడ నియమించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఇక్కడ కొదవ లేదు. ముఖ్యంగా హిందూ మత ప్రచారం, హిందూ మతవ్యాప్తికి స్వరూపానందేంద్ర మహాస్వామి చేస్తున్న ప్రయత్నాలు అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. భారతీయ సంపదైన గోవులను రక్షించాలన్న ధ్యేయంతో గోపూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను అన్య మతస్తులు ప్రలోభపెట్టి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి ఏజెన్సీలో హిందూ దేవాలయాలను నిర్మిస్తున్నారు. అలాగే వందలాది మంది గిరిజనులను తిరుమలకు పంపించి వెంకన్న దర్శనం చేయిస్తున్నారు. గిరిజనులకు, పేదలకు వారికి కావలసిన నిత్యావ సరాలైన దుప్పట్లు పంచిపెడుతున్నారు. పర్వదినాల్లో పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు, అనేక అంశాల్లో నిష్ణాతులైన పండితులను రప్పించి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏటా చాతుర్మాస దీక్షలు రుషికేష్‌లో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హిమాలయాల్లోని సాధువులు, సంత్‌లను కలిసి చర్చాగోష్ఠి నిర్వహిస్తూ వస్తున్నారు.


ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఆనందవనం

$
0
0

మహా విశిష్టత, పవిత్రత, శక్తితత్వం ఈ మూడు కలసి ఉన్న తావే ఆనందవనం. నడిచే దైవంగా ప్రజల పూజలందుకున్న పరమ పూజ్య సద్గురు శివానందమూర్తి నిర్మించిన వనమే ఆనందవనం. ఇక్కడ యోగ మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవార్ల దర్శనానికి విశేష ప్రాముఖ్యముంది.
భీమిలి ఆనందవనంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక విశేషాలే. ఏ వైపు చూచినా భక్తితత్వం ఉట్టిపడుతుంటుంది. అందులోను సద్గురు నివసించిన ప్రదేశం.. ప్రజలు సుఖ, సంతోషాలతో విరాజిల్లాలన్న సత్ సంకల్పంతో సద్గురు శ్రీ శ్రీ శ్రీ శివానంద మూర్తిగారు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ప్రజలకు భగవదనుగ్రహం కల్పించాలనీ వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించి వారిని సత్యధర్మాలకు ప్రతీకలుగా చేయాలన్న దృఢ సంకల్పంతో పరమ పూజ్య గురువుగారు విశేషమైన ఆలయాలను ఇదే ఆశ్రమంలో నిర్మించారు.
1978లో భక్తులకు, శిష్యులకు దూరంగా ఒక ప్రదేశంలో ఏకాంతంగా తపస్సు చేసుకోవాలనే ఆలోచనతో సద్గురు కందుకూరి శివానందమూర్తి భీమిలి ప్రాంతానికి విచ్చేశారు. భీమిలి బ్యాంకు కాలనీ వద్ద ఐదెకరాల స్థలం తీసుకొని దానికి ఆనందవనంగా పేరుపెట్టి 2001లో మాఘశుద్ధ సప్తమి (రథసప్తమి) పుణ్య దినాన యోగ మహాగణపతి విగ్రహాన్ని సద్గురు స్వయంగా ప్రవేశ ద్వారం దగ్గరే ప్రతిష్ఠించారు. ఈ మహాయోగ గణపతి ఆలయం ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గరే కనబడుతూ సాధకులలో ఏకాగ్రతను పెంచుతోంది. నాటినుంచి నేటివరకు ఆ పార్వతీ తనయుడు సద్గురు ఆశ్రమంలో నిత్య పూజలు అందుకుంటూ భక్తులను కరుణిస్తున్నారు. ఆనందవన క్షేత్రంలో 1979లో గురూజీ పరమగురు స్థానాన్ని స్థాపించారు. ‘సుబ్రహ్మణ్యేశ్వర శ్రీకృష్ణ’ అంశంతో ఉన్న మహాయోగినిని పరమగురువు అంటుంటారు. వీరు ఐదు వేల సంవత్సరాలుగా హిమాలయాల్లో తపస్సులో ఉన్నారని భక్తుల నమ్మకం. వీరి ప్రాభవాన్ని పరమగురు స్థానంలో సద్గురు ప్రతిష్ఠించారు.
యోగ మహాగణపతి విగ్రహానికి అరుణాచల కొండ నుండి రాయిని తెప్పించి నైపుణ్యశాలియైన శిల్పి దండపాణి స్థపతిచే చెన్నైలో సద్గురు తయారు చేయించారు.
కాశీకి సమానమైన క్షేత్రంగా ఆనందవనం
ఈ ఆనందవనాన్ని కాశీకి సమానమైన క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నది సద్గురు సంకల్పం. కాశీలో మాదిరి సాక్షిగణపతి, డుంఠి గణపతి, అన్నపూర్ణ అమ్మవారు, విశ్వనాథుడు ఏవిధంగా దర్శనమిస్తారో సరిగ్గా అలాగే ఇక్కడ భక్తులకు ఆయా దేవతల దర్శన భాగ్యం కల్పించాలని పూజ్య శివానందమూర్తి ఎల్లప్పుడూ ఆలోచించేవారని ఆశ్రమ నిర్వాహకులు రాఘవేంద్రన్ అన్నారు.
ఈ ఆశ్రమానికి విచ్చేసిన భక్తులు మొట్టమొదట సాక్షి గణపతిని దర్శించుకుంటారు. ఇక్కడ సాక్షి గణపతి అంటే సర్వ జగత్తుకు సాక్షి అని అర్ధం. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కాశీలో అన్నపూర్ణగా దర్శనమిస్తే ఇక్కడ ఈ అనందవనం ప్రాంతంలో మహలక్ష్మి అమ్మవారుగా కూడా భక్తులకు దర్శనం ఇవ్వాలని సద్గురు ఆకాంక్ష. భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలాగా తూర్పు ప్రాంతం సుభిక్షం కాలేదు. అక్కడంతా దారిద్య్రం తాండవిస్తోంది. ఈస్టిండియా కంపెనీ వారు తూర్పు ప్రాంతంలో లాభార్జనే ధ్యేయం గా ప్రజలకు మేలు లేకుండా చేశారు. అయితే పశ్చిమ ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి కారణం అక్కడ మహాలక్ష్మి ఆలయ ప్రభావమేనని తలచిన సద్గురు ఆనందవనంలో కూడా మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి ఆ అమ్మ ఆలయాన్ని నిర్మిస్తే, ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉంటారని పూజ్య శివానందమూర్తి భావించారు.
ఆలయ ప్రాముఖ్యత
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పద్మవిభూషణ్ బిరుదాంకితుడు, ఒడిశాకు చెందిన రఘునాథ్ మహాపాత్రో అనే మహాశిల్పి ఒడిశాలోని ఆలయాల మాదిరి ఆనందవనంలో మహాలక్ష్మి ఆలయాన్ని మలిచారు. దీని శిఖరం నేల నుండి ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారి విగ్రహం మరకత రాయితో తయారు చేశారు. మయూర్‌గంజ్ వద్ద గల ఏకశిల గ్రీన్‌స్టోన్ దొరికింది. ఆ శిలనే మహాలక్ష్మీ దేవి విగ్రహంగా మలిచారు. ఇటువంటి ఆలయం దక్షిణ భారత దేశంలోనే రెండోది. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ప్రతిష్ఠించారు. మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో హుండీలేదు. కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరి నుంచి విరాళాలు వసూలు చేయరు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పక్కన ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సద్గురు శివానందమూర్తి జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ మందిరాలదర్శనంతో జనుల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని ఇక్కడి భక్తుల భావన.

జనం కన్నీళ్లకు సిద్ధాంతం ఉంది ( స్పందన)

$
0
0

జనం కన్నీళ్లకు సిద్ధాంతముందా?’ అని 23-1-2017 సోమవారం ఆంధ్రభూమి ‘సాహితి’లో సిహెచ్ మధుగారు ప్రశ్నించారు. ఇంతవరకు ఏ సిద్ధాంతమూ జనం కన్నీళ్లను తుడవడానికి పనికి రాలేదన్నారు. సిద్ధాంతాల వెంట పరుగులు తీసి తీసి అక్షరం అలసిపోయి ఓడిపోయిందన్నారు. ఏ సిద్ధాంతమూ ప్రపంచాన్ని మార్చలేదన్నారు. ప్రజల ఆకల్ని తీర్చలేదన్నారు. మార్క్సిజం వాస్తవిక సిద్దాంతమైనా, ఆచరణాత్మక సిద్ధాంతం కాలేకపోయిందన్నారు.
సిద్ధాంతాల గురించి ఇంత గందరగోళ స్థితిలో మధుగారు వుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మధుగారు ప్రపంచ పరిణామాన్ని పరిశీలించే తీరులో ఏదో తేడా వుంది. ప్రపంచ పరిణామాన్ని పరిశీలించే తీరులో రెండు అంశాల్ని గుర్తుపెట్టుకోవాలి.
పశువులుగా బతికి, పశువునుండి వేరుపడిపోయి, మనిషిగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునేంత వరకు మానవుడు ఎదుగుతునే వున్నాడు. తనకు కావలసిన అన్నిరకాల సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. ఆహార సేకరణతో తృప్తిపడక తనకు అవసరమైన ఆహార పదార్ధాన్ని తయారుచేసుకున్నాడు. అంతరిక్షంలో దూసుకుపోయి ఇతర గ్రహాలను సైతం అందుకున్నాడు. ఇది ఒక అంశం. ఇంతవరకు సామాజిక సిద్ధాంతంతో సంబంధం లేకుండా ఈ అభివృద్ధి జరిగింది.
ఇక రెండో అంశం. మానవుడిలో రోజురోజుకు స్వార్ధం పెరిగిపోతోంది. ఒకడు మరొకడ్ని దోచుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. అధికార దాహంతో, స్వలాభాపేక్షతో, ఆధిపత్య స్వభావంతో ప్రపంచాన్ని సర్వనాశనం చేసే అణుబాంబుల్ని సైతం సిద్ధం చేసుకోగలిగాడు. పర్యావరణాన్ని దెబ్బతీసి మానవ జాతి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విధంగా కూడా మానవుడు తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
మానవుడి తెలివితేటలలోని అభివృద్ధి దీనిక్కూడా దారితీస్తోంది. ఇది రెండో కోణం. ఈ రెండో కోణంలోని లోపాల్ని సవరించడానికి వచ్చినవే అనేక రకాల సామాజిక సిద్ధాంతాలు. అయితే ఇంతవరకు ఈ సిద్ధాంతాలేవీ జనం కన్నీళ్లను తుడవలేపోయాయనీ, జనం ఆకల్ని తీర్చలేకపోయాయనీ మధు అంటున్నారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే.
దోపిడీ దారులపై పీడిత ప్రజల ఎర్రజెండాని పారిస్ కమ్యూన్‌లో ఎగరేసింది. 1917లో సోవియట్ యూనియన్‌లో విప్లవం వచ్చి సోషలిస్టు వ్యవస్థకు పునాది వేసింది. అలాగే 1948లో చైనాలో ప్రజారిపబ్లిక్ అవతరించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మార్క్సిజం ప్రభావం చూపింది. మార్క్స్ ఊహించినట్టు బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల తర్వాత సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థలు ఏర్పడడానికి ఒక మార్గం దొరికింది. రష్యా, చైనాలలోని ప్రజలు కొన్ని దశాబ్దాల పాటైనా సోషలిస్టు వ్యవస్థ రుచిని చూసారు. సోషలిస్టు వ్యవస్థ తాత్కాలిక వైఫల్యం ముందు ముందు రాబోయే కమ్యూనిస్టు వ్యవస్థ విజయానికి తొలిమెట్టుమాత్రమే. ప్రతి ఒక్కరికి పని కల్పించడం, పనికి తగ్గ ఫలితాన్ని అందించడం సోషలిస్టు వ్యవస్థ లక్ష్యం. దీన్ని రష్యా, చైనాలు కొంతకాలమైనా సాధించాయి. ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయడం, తనకు అవసరమైన మేరకు అనుభవించడం అనే మహోన్నత లక్ష్యం కమ్యూనిస్టు వ్యవస్థది. సుదీర్ఘమైన మానవ జాతి చరిత్రలో సోషలిస్టు వ్యవస్థ ఒక మైలురాయి. ప్రపంచంలో వ్యక్తిగత ఆస్తి వున్నంతవరకు మధుగారు చెప్పిన జనం కన్నీళ్లు ఎవ్వరూ తుడవలేరు. ఏ సిద్ధాంతమూ ఆకలిని తీర్చలేదు. ఈ అవగాహన వున్న సిద్ధాంతం ఇంతవరకు మార్క్సిజం ఒక్కటే. కొన్ని దేశాల్లో అయినా కొంత కాలమే అయినా జనం కన్నీళ్లు తుడిచి, వారి ఆకలిని తీర్చగలిగింది మార్క్సిజం మాత్రమే. ఇది ఆచరణలో రుజువైన సత్యం. ఇంతవరకు ఏ ఇతర సిద్ధాంతమూ ఆచరణలో ఇలా రుజువు చేసుకోలేకపోయింది. కారణం వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలన్న దృష్టి ఆ సిద్ధాంతాలకు లేకపోవడమే.
వ్యక్తిగత ఆస్తిని ఏ మేరకు అదుపు చేయగలిగితే ఆ మేరకు శ్రమదోపిడీని అరికట్టగలం. వర్గపోరాటం ద్వారా, శ్రామిక వర్గ నియంతృత్వం ద్వారా సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థల్ని సాధించుకోగలమని మార్క్స్ చెప్పాడు. ఇదొక పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒడిదుడుకులుంటాయి. గెలుపోటములుంటాయి. అంతిమ విజయం పీడిత ప్రజలదే. సిద్ధాంతాలపట్ల అలసిపోయేట్టు పరుగులు తియ్యక్కరలేదు. సక్రమంగా ప్రపంచ చరిత్రను చదువుకున్నా ఈ విషయం అర్దం అవుతుంది.
అన్ని సిద్ధాంతాలు విఫలమైనాయని చెప్పి, మధుగారు చెప్పిందేమిటి? ‘ప్రపంచంలోని వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా అందితే దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, అంతా శాంతియే’ అని. వనరులన్నీ ప్రజలకు సమంగా ఎలా అందుతాయో మధుగారు చెప్పలేదు. ఈ విషయం చెప్పింది మార్క్సిజం మాత్రమే. తత్వవేత్తలందరు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ, అసలు విషయం దాన్ని మార్చడం ఎలా అన్నదే అని ప్రశ్నించుకున్నాడు మార్క్స్. ఈ ప్రశ్న వేసుకున్నాడు కాబట్టే ప్రపంచాన్ని మార్చగలిగిన సిద్ధాంతాన్ని చెప్పగలిగాడు మార్క్స్.

ఉగాది పద్య, గేయ రచనా పోటీలు

$
0
0

హేవళంబి నామ ఉగాది సందర్భంగా గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పద్య, గేయ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్. రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది సందర్భంగా నిర్వహించే సాహితీ వసంతోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలలో ఒకదానిపై స్వేచ్ఛా ఛందస్సులో ఐదు పద్యాలు వ్రాసి పంపాలి. గేయం కూడా సమకాలీన అంశాల్లోనే ఒక పేజీకి మించకుండా వుండాలి. రచయతలు, స్వీయ రచన అనీ, అనువాదం కాదని రచయతలు హామీ పత్రం జతచేయాలి. రెండు విభాగాల్లో వేర్వేరుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రం ఇవ్వబడతాయ. రచనలను మార్చి 10వ తేదీలోగా సాహితీ సమాఖ్య కార్యాలయం, ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్, 4/19, బ్రాడీపేట, గుంటూరు (్ఫన్ 0863-2233291) కార్యాలయానికి పంపించాలని ప్రకటనలో కోరారు.
**

దేవరాజు మహారాజుకు
వుప్పల లక్ష్మణరావు అవార్డు
ఆధునిక సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన అభ్యుదయ రచయిత, హేతువాది, మానవతావాది డా.వుప్పల లక్ష్మణరావు వర్ధంతిని పురస్కరించుకుని విశాఖ రచయితల సంఘం ప్రప్రథమ స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారానికి ప్రఖ్యాత కవి, కథకులు, నాటక కర్త, అనువాదకులు, సైన్స్ రచయిత డా.దేవరాజు మహారాజును ఎంపిక చేయడం జరిగిందని సంస్థ ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 22న విశాఖ పౌర గ్రంథాలయంలో డా.దేవరాజు మహారాజుకు పురస్కారంతోపాటు నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో సత్కరించబడును.
**

‘శతాధిక కవుల’
ఏకదిన కవి సమ్మేళనము
రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలకు సంబంధించి కవిత్వం రాస్తోన్న వారికి, రాసిన వారికి, రాయాలనుకుంటున్న వారికి సాంస్కృతీ సమాఖ్య (యువ సాహితీ వికాస వేదిక) ఆహ్వానం పలుకుతోంది. వారు రాసిన మంచి కవితలను ఎంపిక చేసి, అవి రాసిన కవులతో ‘శతాధిక కవుల ఏకదిన కవి సమ్మేళనం’ విజయవాడలో ఏర్పాటుచేసే సంకల్పం వుంది. కవితల్లో సమకాలీన పరిణామాలు, పరిస్థితుల నేపథ్యం వుండాలి. ప్రగతిశీల చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కవితలు మానవీయ కోణంలో వ్రాసినవి మూడు విభిన్న కవితలు పంపాలి. ‘ఏకదిన కవి సమ్మేళనము’లో పాల్గొనాలనే అభిలాష వున్న కవులు వివరాలకోసం సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ వి.శిరీష్‌కుమార్, సాంస్కృతీ సమాఖ్య, నున్న- 521 212 (వయా) విజయవాడ చిరునామాకు పోస్టుకార్డు వ్రాయండి.

మేరక.కామ్

$
0
0

ఇది యవన రాజ్యం
వనల రాజ్యం
ఎవ్వరైనా ఇక్కడ యవ్వనులే
ఇక్కడి వినోదాలపై బ్రతుకుతోంది ప్రపంచమో సగం
ఇక్కడి వినోదంకోసం తన్నుకుఛస్తోంది ఇంకో సగం
ఇక్కడ చావుకూ వినోదానికి పెద్ద తేడా లేదు
ఆడుకోటానికి వాల్‌మార్టుల్లో
దొరుకుతాయ్ స్టెన్ గన్నులు
తెలుపు నలుపు కుర్రకారుకు
అవే అంతులేని ఫన్నులు
అసహనం, అహంకృతి కలిసి ఆడుకొంటుంటాయి
అంతర్జాతీయ వేదికపై ‘తొక్కుడు’ బిళ్లలాటలు
ఆకాశమంత ఎతె్తైనది దీని ప్రాభవం
అవనీ, అంతరిక్షంపై తనదే ఆధిపత్యం
ఇది అ-మేరక
‘మేర’లు దేనికో తెలియని ప్రహేళిక
ఉడత కూడా ఇక్కడ కుందేలంత
అడుగడుగున కనువిందు చేసే వింత
రెండొందలేళ్ల గొప్పని గొప్పగా చెప్పే ఘనత
బాల యవ్వనులు, నవ వనలు,
ప్రౌఢ వనలు, పెద్ద యవ్వనులు,
మాట తేడానే; మనసు తేడా లేదు
వయసడుగుట తగదు; సంస్కారం కాదు..
ఇది నిరతోత్సాహ వన ప్రదర్శనశాల
బహనాగరకతల సంగమ కేళీ విలోల..
ఇది అన్ని జాతిమొక్కల సుందరోద్యానవనం
అంటుగట్టుట ఇక్కడి స్వాభావిక హృదయ ధర్మం
ఇక్కడ ప్రేమా, స్వాతిశయం పక్కపక్కనుంటాయ్
నిరాడంబరత, నార్సిజం ముడిపడుతుంటాయ్
అమాయకత్వం, చురుకుదనం జతకడుతుంటాయ్
వ్యక్తినవ్యక్తిత్వం చదరంగం ఆడుకొంటుంటాయ్
సగటు ప్రజకు ఇక్కడ వినోదమే తారక మంత్రం
ప్రపంచమే ఓ వినోద విలాస విహార క్షేత్రం..
అణచివేత, ఐశ్వర్య సాధనల మహచ్చరిత్ర
వాణిజ్య ప్రతిభ సృష్టించిన సంస్కృతి ‘జాత్ర’..
ఇది ఆదిమత, ఆధునికతలు సమసించినచోటు
ఆదర్శం, అధికారం చెట్టాపట్టాలేసుకొన్న చోటు
ప్రజాస్వామ్యానికి పెట్టని కోటలా మారిన చోటు
ఇది అ-మేరక
అవకాశాలకు మెరక
అతి నాజూకుల చిలక..
పట్టపగలు ఇక్కడ వీధులు
అర్థరాత్రి దొంగలు పడ్డట్లుంటాయ్
మనుష్యుల్ని కార్లు దోచుకుపోతుంటాయ్..
ఇక్కడ ప్రతి ఇల్లూ ఒక ద్వీపం
ప్రతిమనిషీ ఒక ద్వీపకల్పం
అదృష్టం!.. ఓ వైపైనా
పలకరింపు చోటుంది!!

వలస కూలీల జీవన పోరాటం

$
0
0

‘‘కుంభమేళా’’, ‘‘అస్తిత్వానికి అటూ ఇటూ....’’అనే రెండు కథా సంపుటాల ద్వారా పాఠకుల, విమర్శకుల ప్రశంసలనందుకున్న మధురాంతకం నరేంద్రను ఇవ్వాళ కొత్తగా మంచి రచయితగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథాకథనాలతో వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యభరితమైన కథలు రాయడం ఆయన ప్రత్యేకత. వీరి కథలు ఎక్కువగా అస్తిత్వవాద ధోరణిలో తాత్త్విక ధోరణిని సంతరించుకుని వుంటాయి. వీటికి భిన్నంగా సామాజిక సమస్యగా మారిన వలస కూలీల దుర్భర జీవితాలను చిత్రిస్తూ ‘‘రెండేళ్ళు పద్నాలుగు’’అనే కథల సంపుటిని వెలువరించారు.
ఇవన్నీ కూలీలు, పనివాళ్ళ కథలు. ముఖ్యంగా వలస వచ్చిన కూలీల కథలు. వీళ్ళంతా ఉన్న ఊర్లో బతకలేక పట్నం వచ్చి ఏదో ఒక పని చేసుకుని బతకడానికి వచ్చినవారే. రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమా అని భవన నిర్మాణాలు పుంజుకోవడంవల్ల వలసొచ్చిన వారికి ఏదో ఒక రకంగా పని దొరుకుతుంది. ముఖ్యంగా రాయలసీమ కరువుబాధితులకు ముందుగా కనిపించేది తిరుపతి. రాయలసీమలో తిరుపతి ముఖ్యపట్టణంగా విస్తరించడం, తమ ఊళ్ళకు అందుబాటులో ఉండటంవల్ల వారి చూపంతా తిరుపతి మీదే వుంటుంది.
ఊళ్ళలో వర్షాలు లేక, వ్యవసాయం సాగక చాలామంది కూలీ పనులకోసం తిరుపతికి వస్తుంటారు. కొత్తగా వలస వచ్చిన వాళ్ళకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసి అద్దెకివ్వడం, భవిష్యత్తులో ఆ స్థలం ఇప్పిస్తామని చెప్పి రాజకీయ సభలకు వాళ్ళను తోలుకుపోవడం, ఒకవేళ ఆ స్థలం వాళ్ళకు వస్తే ఏలాగూ స్వాధీనం చేసుకోక తప్పదు. ఈ గేమ్‌లో రాజకీయ పార్టీల మధ్యవున్న వైరం, తగాదాలకు దారితీయడం మామూలే. పనివాళ్ళను తమ కబ్జాలో ఉంచుకోవడానికి మేస్ర్తిల మధ్యవున్న పోటీని ‘హరేరామ హరేకృష్ణ రోడ్డు’లో చూడవచ్చు. పల్లెల్లో వ్యవసాయం గిట్టుబాటుకాక పెద్ద రైతులు కూడా దగ్గరనున్న పట్నానికి వచ్చేస్తున్నారు. అలా తిరుపతికి వచ్చి ట్రాక్టర్లను బాడుగకు తిప్పుకుంటూ, పోటీల మధ్య బతికేస్తున్నారు. వీరమరెడ్డి కానీ, విశ్వనాథనాయుడు కానీ అలా పల్లెల్లోనుంచి బ్రతకడానికి వచ్చినవారే. ఎప్పటికప్పుడు పనులకోసం వెతుక్కుంటూ, ఆ పోటీల్లో నిలదొక్కుకోవడానికి పడరాని పాట్లు పడతారు. అయినా వారి కులాహంకారం ఎక్కడకుబోదు. లేని గొప్పలకుపోయి, పంతాలు పెంచుకుని డబ్బు పోగొట్టుకుని ఏడ్వటమొక్కటే ‘‘ప్రత్యర్థి’’లో మిగులుతుంది. వానలు లేక పొలాలు వదిలేసి మగాళ్ళు కూలీ పనులకు వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉద్యోగాల పేరిట వ్యభిచారంచేసి ఇంటికి డబ్బు పంపిస్తున్నారు. ఉద్యోగస్తులైన స్ర్తిపురుషులు చాలీచాలని జీతాలతో ఇంటికి డబ్బు పంపించలేక, తమ బాగోగులు చూసుకోలేక సతమతమైపోతుంటారు. అలాంటి బాధితుల్లో ఒకరైన శేషాద్రి, సులోచనలు ఒక రాత్రి గడపడానికి వ్యభిచార కొంపకు వచ్చి పోలీసులకు దొరికిపోతారు. పదిహేను ఎకరాల రైతు అన్నీ పోగొట్టుకుని పిల్లలందరూ రెక్కలొచ్చి ఎగిరిపోతే, అన్నీ మరిచి భార్య నడిపే వ్యభిచార గృహానికొచ్చి ఆమె నీడలో వుండాల్సి రావడం మరింత విషాదం. ఈ విషాదం ‘‘హింస రచన’’లో కనిపించి హృదయాన్ని కదిలిస్తుంది.
గృహ నిర్మాణ రంగం పుంజుకోవడంతో పనివాళ్ళ కొరత ఏర్పడింది. మేస్ర్తిలు, వడ్రంగులు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్ ఎక్కువ కావడంతో, వాళ్ళు ఒకేసారి ఎక్కువ పనులకు ఒప్పుకుంటారు. ఒకేసారి నాలుగయిదు ఇళ్ళ పని చేపట్టడంతో ఏ ఒక్కదానికి సరియైన న్యాయం చేయలేకపోతారు. ఎవరు వచ్చి ఒత్తిడిచేస్తే వారి పనే ముందుచేసి మిగతా వారితో తిట్లు తినాల్సి వస్తుంది. వీరి చుట్టూ తిరిగి వీరిని పట్టుకోలేక, వీరితో సరిగా పనిచేయించుకోలేక ఇళ్ళుకట్టించుకునేవారు పడే బాధలు వేరు. ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళను తీసివేసి కొత్తవాళ్ళను పెట్టుకుందామంటే, ఒకరు మొదలుపెట్టి వదిలేసిన పని ఇంకొకడు చేపట్టడు. అదొక కట్టుబాటు. దాంతో చచ్చినట్టు ఆ పాత పనివాడినే పట్టుకుని వాడితో పనిచేయించుకోవాలి. ఇలా పనివారు వేసే వేషాలు, మోసాలు వారి అవకాశవాదాలను రచయిత చక్కగా పట్టుకోగలిగారు. ‘‘అబద్దం’’కథలో, పనికి ఒప్పుకుని డబ్బులన్నీ ముందే లాక్కుని పనిచేయకుండా ఇంటి యజమానులను తమ చుట్టూ తిప్పుకోవడం, అబద్దాలు చెప్తూ పనులెగ్గొట్టడం, కుటుంబ సంబంధాలలో కూడా ఇలా అడ్డదిడ్డంగా వ్యవహరించి అబద్దాలు చెప్పడం, మోసాలుచేయడం ఎలా మామూలయిపోతుందో వివరించారు. ‘‘నిషా’’కథలో చెక్కపని బాగాచేసే పరమేశాచారి పని చేయక, డబ్బులు మింగేసి యజమానులకు దొరక్కుండా తిరుగుతుంటాడు. పోలీసులనుండి కూడా తప్పించుకుని, ఇక ఆ వూర్లో వుండలేమని గ్రహించి, ఆ రాత్రికిరాత్రే ఇళ్ళు ఖాళీచేసి కదిరికి వెళ్ళిపోతాడు. వీడు, వీని కింద పనిచేసే వాళ్ళంతా దొంగలేనని యజమానుల అభిప్రాయం. దొంగ వేషాలు, దబాయింపులు, తాగుడు వీళ్ళ నిత్యకృత్యాలుగా మారిపోతాయి. అందుకే ఇళ్ళ యజమానులకు పనివాళ్ళంతా దొంగలన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది. ఉత్తరాదినుంచి వచ్చిన వాళ్ళు ఒళ్ళొంచి పనిచేస్తారని మేస్ర్తి రంగులెయ్యడానికి నలుగురు కుర్రాళ్ళని పెడతాడు. అందులో ఒకడు కనిపించకపోతే ఇల్లుగలవాళ్ళు వాడు ఏమెత్తుకుపోయాడోనని గలభా చేస్తారు. తీరా వాడ్ని వెతికి పట్టుకుని చూసేసరికి ఖాళీ రంగుడబ్బా వాడి సామాన్లలో వుంటుంది. అదికూడా వదులుకోవడానికి ఆ ఇంటి వాళ్ళు ఇష్టపడరు. అలా ఇల్లుగలవాళ్ళ అతి జాగ్రత్తను, లోభాన్ని ‘దొంగతనం’ కథ చిత్రీకరిస్తుంది. ఎక్కడో ఉత్తరాది నుండి బతుకుతెరువుకు వచ్చిన పనివాళ్ళకు ఎప్పుడూ వాళ్ళ ఊరు, ఆ పరిసరాలు జ్ఞాపకం వస్తుంటాయి. నాలుగు డబ్బులు చేతిలో పడగానే ఊరికి వెళ్ళాలని తెగ తాపత్రయపడుతుంటారు. వాళ్ళను ఎవరూ ఆపలేరు. ఆపాలని ప్రయత్నిస్తే చంపడానికి కూడా వెనుతీయరని ‘మెరెగావ్‌కో జానా’ కథ తెలియజేస్తుంది.
పెయింటర్ దగ్గర పనిచేసే ఏకాంబరం మంచి పనివాడే కాని మేధకుడు కట్టెలకని ఫారెస్టుకుపోయి తిరిగిరాకపోతే పులి ఎత్తుకుపోయిందని బాధపడిన భార్య కిట్టమ్మ, మేస్ర్తి బాబాసామి ఇది ఫారెస్టోల్లకు, పోలీసులకు తెలిస్తే కేసవుతుందని భాయపడతారు. బాబాసామి తనకు తెలిసిన ఒక పోలీసోడిని పిలిపిస్తే వాడు వీళ్ళనే అనుమానించి రకరకాలుగా విసిగిస్తాడు. చివరకు వాడి చావుకు నష్టపరిహారం వస్తుందని చెప్పడంతో బోలెడన్ని ఆశలతో, కోరికలతో ఇంటికిపోయి చూసేసరికి హాయిగా ఏకాంబరం తన పని తాను చేసుకోవడం చూసి బిత్తరపోతారు. అన్నింటికి ‘మూల కారణం’ డబ్బేనని అన్యాపదేశంగా ఈ కథ ద్వారా తెలియజేస్తారు. ఊళ్ళో తక్కువ కులంగా చూడటం ఇష్టంలేక పంచరత్న భర్తను తీసుకుని తిరుపతికి వస్తుంది. భర్త రాజయ్య ముందు వైరింగు పని, తర్వాత మేస్ర్తిదగ్గర కూలీ పనిచేసి, చివరకు వాచ్‌మెన్‌గా కుదురుతాడు. ఆ కొత్త ఇంటివాళ్ళ ఆధిపత్యాన్ని నిరసించిన పంచరత్న వాళ్ళ పని వదిలేసి కొత్త పనికి మొగుడితో కలిసి బయలుదేరుతుంది. ఇందులో పంచరత్న ధైర్యంగల స్ర్తి. ఊళ్ళో రెడ్డి చేయి పట్టుకుంటే వా కర్రతోనే వాడి ఒళ్ళు వాయగొడుతుంది. ఆ ఊళ్ళో చులకనగా వుండలేక చాకలి వృత్తిని వదిలేసి భర్త రాజయ్యతో తిరుపతికి వస్తుంది. మొగుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా ఎక్కడా తన అభిజాత్యాన్ని పోగొట్టుకోదు. పిల్లలకోసం తెగించి పామును చంపడంలోనే ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం కనబడతాయి. ‘న్యాయం’కోసం చేసే ఆమె పోరాట పటిమ పాఠకులను ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.
ఈ కథల్లోని జీవితాలన్నీ రాయలసీమ వలస కూలీలవిగా రచయిత చిత్రీకరించినా, ఇలాంటి జీవితాలు అన్ని ప్రధాన నగరాలను ఆశ్రయించుకుని కనిపిస్తాయి. దారిద్య్రం, కరువు మనుషులను పల్లెల్లోనుండి తరిమేస్తే, దగ్గర్లోవున్న పట్టణాలకు వలసపోక తప్పదు. చేతివనరు వున్నవాడు ఎలాగో బతికేస్తే, అదిలేనివారు దినసరి కూలీలుగా అడ్డాలను ఆశ్రయించుకుని బతకాలి. దినసరి కూలీలకు దొరికినరోజు పని. లేనివాడు పస్తే. పని రెగ్యులర్‌గా దొరుకుతుందని ముఠామేస్ర్తిల అండన చేరితే, వాడు వేరుపురుగులా తొలుస్తునే వుంటాడు. డబ్బున్న వాళ్ళు, అగ్రవర్ణాలవారే కాకుండా మధ్యతరగతి వాళ్ళకు కూడా వీళ్లు బిచ్చగాళ్ళు, దొంగలుగానే కనిపించడం విచిత్రం.
పల్లెల్లో కనిపించేంత కులాహంకారం పట్టణాలకు కనిపించదు. ఒకప్పుడు ఊళ్ళలో మోతుబర్లుగా వెలిగిన వీరమరెడ్డి, విశ్వనాథనాయుడు బతకడంకోసం పట్టణానికి వస్తారు. అక్కడ వాళ్ళ కులాధిపత్యం చెల్లకుండాపోయిందే అని బాధపడతారు. ఊళ్ళో కుల ధాష్టికం భరించలేని చాకలి పంచరత్న ఆపాటి చాకిరి పట్టణంలో చేసుకుని హాయిగా బతకవచ్చని మొగుడ్ని తీసుకుని పట్టణం వచ్చేస్తుంది. పట్టణాలలో కులాన్ని ఎవడు పట్టించుకుంటాడు. పని ముఖ్యంకదా! శివారు ప్రాంతాలన్నీ పట్టణాలలో కలిసిపోతుంటే, పంట పొలాలన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అక్కడ ఇల్లుకట్టుకునే వాళ్ళు పురుగుపుట్రా భయంతో రక్షణకోసం యానాది వాళ్ళను వాచ్‌మెన్‌లుగా పెట్టుకుంటున్నారు. ఇక్కడ పనికి కులం అడ్డురాలేదు. ఈ కథలన్నీ ఒక ఎత్తు. ‘‘ప్రార్థన’’ కథ మరో ఎత్తు. మతం మారిన క్రైస్తవులలో అడుగడుగునా కనిపించే కుల స్పృహను వ్యంగ్యంగా, అత్యంత ప్రతిభావంతంగా ఈ కథలో చిత్రీకరించారు.
పల్లెలలోనుండి పట్టణాలకు వలస వచ్చినవారు, పట్టణాలలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను, ఆ ఇబ్బందులు వాళ్ళ అస్తిత్వాన్ని అతలాకుతలం చేస్తున్న తీరును, కుటుంబ సంబంధాలలోనే కాదు- మానవ సంబంధాలలో అవి తెస్తున్న మార్పును ఈ కథలు వివరిస్తాయి. ఇందులో వున్న పాత్రలన్నీ సజీవంగా, అత్యంత సహజంగా చిత్రీకరించబడ్డాయి. ఆ పాత్రల మానసిక చిత్రణ ఈ కథలలో ప్రధానంగా కనిపిస్తుంది. తాము, తమ స్వార్థం తప్ప మిగతావేవీ పట్టించుకోని మనస్తత్వాన్ని ‘‘క్లోజ్ ది డోర్స్’’ వాయిస్ నేపథ్యంలో చిత్రీకరించిన ‘‘చిత్రలేఖ’’ కథ శిల్పపరంగా ఎన్నదగినది. మనముందే వున్నా మనం పట్టించుకోని, మనకు తెలియని వలస కూలీల జీవన పోరాటాన్ని ఈ కథలు తెలియజేస్తాయి. ఈ కథలు చదివిన పాఠకులు వలస కూలీల గురించి ఆలోచిస్తారనీ, వారి పట్ల సానుభూతిని- మానవత్వాన్ని కనబరుస్తారని ఆశిద్దాం.

ఆత్మశోధన

$
0
0

తెలియని ఆత్మ సంగతి ఎవరికి తెలుసు
తెలిసే శ్వాసకంటే
దగ్గరేముంటుంది శరీరానికి

ఆత్మన్నది ఉంటే
శరీరాల్ని ఆత్మ వెతుక్కుంటుందా
ఆత్మని శరీరమా
ఎవరికీ కనిపించకుండా
ఆత్మ శరీరంలోనే ఎందుకు దాక్కోవాలి
రహస్యంగా వచ్చి
తీరాలు అలలూ లేని
ఏ నిశ్శబ్ద సముద్రంలో
ఈ ఆత్మల నదులన్నీ కలుస్తాయో

ఆత్మ బహుశా
మరణం లాంటి మర్మం
శరీరానికి-
రక్తప్రాణం లాంటి సహచర్యం

ఎన్నారైలు

$
0
0

అదో పెద్ద చెరువు
పట్నానికి తాగునీరందించే నీటి వనరు
చుట్టూ చెట్టూచేమా
సీజనల్‌గా ఎన్నారై పక్షులూనూ
పట్నం సిటీగా మారింది
గుడారంలో తల ఉంచిన ఒంటె, ముందు తన కాళ్ళనూ
నెమ్మదిగా శరీరాన్నీ, తదుపరి గుడారం
మొత్తాన్నీ ఆక్రమించి బేహారుని బయటికి నెట్టింది
చెరువు అంచుల చుట్టూ
కబ్జా ప్రహరీలూ, ఇళ్ళూనూ,
చెరువు ‘తమ’ని కబ్జాచెయ్యకుండా!!
చెరువులో గుర్రపుడెక్క పుష్కలంగా పెరిగి
నీటిని కూడా కనపడనివ్వలేదు
సిటీని గ్రీన్ చేయాలనే కమిటీలకి
ఈ చెరువు కనపడదు
వంది మాగధుల ఇళ్ళకి ఇబ్బందని
కబ్జాదారులందరూ ఏదో ఒక
పక్షి జంతు రక్షణ సంస్థల్లో సభ్యులే!
సీజన్ రాగానే వలస వచ్చిన ఎన్నారై పక్షులు
చెరువును మింగిన విధానానికి బిత్తరపోయి
మరోచోటు వెతుక్కోడానికి వెళ్ళిపోయాయి
వాటి పిచ్చి గానీ అక్కడ ఉన్నది మాత్రం
మనుష్యులు కాదూ???


మార్గదర్శి

$
0
0

నల్లదుప్పటి ముసుగు తీసి
ఎరుపు చూపుల కన్ను తెరచి
పరుచుకున్న పచ్చనేలపై
వేడి వెలుగులు విస్తరిస్తూ
పచ్చి పువ్వుల విచ్చదీస్తూ
నిదుర మొద్దుకు చురక పెడుతూ
అవని మీద అందాలను
ఒక్కటొక్కటిగా పలకరిస్తూ
జడ జీవులకు చైతన్యమిస్తూ
సాగిపోయే సొగసులయ్య
ఎవరిమెప్పునూ ఆశించడు
తన దిన చర్య తప్పడు
ఆ సూరీడు బాటలో నడుద్దాం
ఎవరుమెచ్చినా మెచ్చకున్నా
మంచి పనులు చేస్తూ పోదాం
మమతలు పంచుతూ ముందుకెళదాం

ప్రత్యేక హోదాపై ఉద్యమం తీవ్రతరం

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ప్రత్యేక హోదాపై నిర్వహిస్తున్న ఉద్యమాలు తీవ్రతరమవుతున్నాయి. ఆగ్రహించిన యువత ఇపుడు రోడ్డెక్కి మరీ నిరసన తెలియజేస్తుండగా వివిధ రూపాల్లో దీనిని తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించిన జనసేన ఆంధ్రా యువత పేరిట గత నెల 26న బీచ్ వద్ద ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గణతంత్ర వేడుకులున్నందున ఇటువంటి ప్రదర్శనలకు నగర పోలీసులు అనుమతినివ్వలేదు. ఆంధ్రా యువత సారధ్యంలో అనేక రూపాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆలోచన చేస్తున్నారు.

శారదాపీఠంలో ఆధ్యాత్మిక శోభ

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 5 : చినముషిడివాడ శ్రీ శారదా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న చతుర్వేద సంహిత శ్రీ వనదుర్గ అమ్మవారి మహాయాగం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ స్వయంగా ప్రదోపకాల పీఠ పూజ నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా పీఠంలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం చతుర్వేద సంహిత శ్రీ వనదుర్గ అమ్మవారి మహాయాగాన్ని స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రుత్వికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ఏలినాటి శని ప్రభావం నుంచి ప్రజలను రక్షించడంతో పాటు వారి సుఖ సంతోషాల కోసం గ్రహాధిపతి శ్రీ వనదుర్గ అమ్మవారికి మహాయాగం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పాలకులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజలకు మేలు చేకూర్చాల, అందుకు భగవంతుని అనుగ్రహం తప్పనిసరని అన్నారు. పాలకులు కూడా దైవానుగ్రహం కోసం యజ్ఞ,యాగాదుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మూడవ రోజు పీఠంలో జరుగుతున్న వనదుర్గ అమ్మవారి యాగంలో ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, బ్యాడ్ మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ దంపతులు, బ్యాడ్‌మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, హైకోర్టు న్యాయమూర్తులు సీతారామమూర్తి, దుర్గా ప్రసాద్ దంపతులు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్, ఎమ్మెల్యే గణబాబు తదితరులు వనదుర్గ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ ఆధ్యాత్మికత అలరారుతున్న శారదాపీఠాన్ని సందర్శించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ముఖ్యంగా వనదుర్గ యాగంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సీతారామమూర్తి, దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో భగవంతునికి ఇటువంటి యాగాలు నిర్వహించడం మంచిదన్నారు. కష్టాలు నియంత్రించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పీఠంలోని శ్రీ వల్లీదేవసేన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం సినీ నేపథ్య గాయకుడు పార్ధసారధి ఆధ్వర్యంలో మాళవిక, పాడుతా తీయగా విజేతలతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే..

$
0
0

పటమట, ఫిబ్రవరి 5: మతాలు వేరైనా మానవులంతా ఒక్కటేనని లబ్బీపేట విచారణ కర్తలు ఫాదర్ ఐ.యం. స్వామినాధం అన్నారు. గుణదలమాత మహోత్సవాల నవదిన ప్రార్ధనలు ఆదివారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఫాదర్ స్వామినాధం భక్తులకు సందేశమిస్తూ దేవుని తల్లిగా మరియమాత భక్తులచేత నీరాజనాలు అందుకుంటుందన్నారు. అమె దేవుని తల్లి అయినప్పటికీ ఏసుప్రభువు పట్ల ఎప్పడు వినియ విధేయతలతో మెలిగిందన్నారు. మరియమాత అనేక ప్రాంతాలలో భక్తులకు దర్శనమిచ్చి వేళాంకణీమాతగా, లూర్ధుమాతగా, ఆరోగ్యమాతగా, ఫాతిమామాతగా, గుణదలమాతగా భక్తులచేత గౌరవించబడుతూ తన అనుంగ బిడ్డలుగా ఆశ్రయం కల్పిస్తుందన్నారు. అంతుకుముందు గుణదలమాత ప్రధాన చర్చి నుండి విజయవాడ కతోలిక పీఠం మోన్స్‌గ్నోర్లు ప్రసాద్ మువ్వల, యం.గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫా.యేలేటి విలియం జయరాజు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫా.పసల తోమస్, తదితర గురువులు దివ్యసత్ప్రసాద ఆరాధనతో కొండపై కొలువైన మరియమాత వద్దకు చేరుకున్నారు. అనంతరం మరియమాత పాదాల చెంత ‘సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. వన్‌టౌన్ సెయింట్ పీటర్స్ కథెడ్రల్, అజిత్‌సింగ్‌నగర్, కేసరపల్లి తదితర విచారణల నుండి వచ్చిన భక్తులు అన్ని మతాల, జాతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో వివిధ ప్రాంతాల నుండి వెల్లువ తరలివచ్చిన మరియమాత భక్తులతో గుణదలమాత పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఫా. దామాల విజయకుమార్, ఫా.జి.ప్రతాప్, ఫా.డి.సతీష్, తోట మోజెస్, మందిమాల సుమన్. కోనాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్ర స్థాయి ప్రొహిబిషన్, ఎక్సైజ్ క్రీడా పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: స్థానిక ఆంధ్రా లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. 13 జిల్లాల నుండి ఉద్యోగులు ఈ స్పోర్ట్స్ మీట్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, కిషోర్ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్‌లో శ్రీకాకుళం ప్రథమ, చిత్తూరు ద్వితీయ, తూర్పు గోదావరి తృతీయ స్థానాలను సాధించారు. కబడ్డీలో కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. క్యారమ్స్ పురుషుల విభాగంలో జి సందీప్ (గుంటూరు), జి బాబూరావు (శ్రీకాకుళం), ఎం బాపుజీ నాయుడు (చిత్తూరు), మహిళల విభాగంలో ఆర్ సత్యవతి, వి ఆమల (పశ్చిమ గోదావరి), కె శే్వతరాణి (కర్నూలు)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. టెన్నికాయిట్ సింగిల్స్ విభాగంలో కె ధనలక్ష్మి (విశాఖపట్నం), ఎన్ వెంకటరమణ (గుంటూరు), ఎస్ శ్రావణి (చిత్తూరు)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. డబుల్స్ విభాగంలో ఎస్ ధనలక్ష్మి, జయసుధ (విశాఖపట్నం) ప్రథమ, ఎండి నవీన్, కె ధరతిరాణి (పశ్చిమ గోదావరి) ద్వితీయ, పి కుమారి, ఎస్ శ్రావణి (చిత్తూరు) తృతీయ స్థానం దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్‌లో పి వలీ (అనంతపురం), ఆర్‌వి రమణ (విజయనగరం), జి రాంబాబు (తూర్పు గోదావరి)లు మొదటి మూడు స్థానాలు సాధించారు. 400 మీటర్ల పురుషుల రిలేలో చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, మహిళల విభాగంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురంలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.

నాలెడ్జి హబ్‌గా ఆంధ్రప్రదేశ్

$
0
0

పటమట, ఫిబ్రవరి 5: మీ సమస్యలు నేను పరిష్కరిస్తా.. అయితే మీ సహకారం తనకు సంపూర్ణంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఆదివారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాలలోని ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవవనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారుల, ప్రధానోపాధ్యాయులు సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో 16వేల కోట్లు ఆర్థికలోటు ఉన్నప్పటికీ ఉద్యోగులలకు 43శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగుల వయోపరిమితి 60ఏళ్లకు పెంచానని గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క విద్యకే రూ.21,500 కోట్లు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని ఎక్కువ మొత్తంలో విద్యకు ఖర్చు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చటమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2004 ఎన్నికల్లో ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు తనకు ఓటు వేయకపోవటంతో తమ ప్రభుత్వం ఓటమిపాలైందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంటుందని వారి సంక్షేమకోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు తీర్చిడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అండగా నిలబడాలన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడకుండా ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అధిక జీతాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఏవరికీ లేని యువ సంపద భారతదేశానికే సొంతం అన్నారు. ఇక్కడ యువతీ యువకులు తీర్చిదిద్దితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రప్ పాలనను ఆయన ప్రస్తావిస్తూ ట్రప్ అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచ మొత్తం ఇబ్బందులు పడుతుందని, అమెరికాలో మన తెలుగువాళ్లు కూడా పోరాడుతున్నారని తెలిపారు. అందుకే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. అమెరికాలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారని, కానీ మనం విద్యార్థులను క్లాస్ రూమ్‌లకే పరిమితం చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో అన్ని స్కూల్స్‌లో డిజిటల్ క్లాస్‌లు ప్రవేశపెడతామని, హైస్కూల్స్‌కు కూడా వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి విద్యతోనే సాధ్యమన్నారు. అందుకు సిఎం చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంవత్సరానికి 21,500 కోట్లు విద్యకే ఖర్చుపెడటం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, ఎంఇఓల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, రావెల కిషోర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎమ్మెల్సీలు ఎఎస్.రామకృష్ణ, బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, 13 జిల్లాల ఎంఇఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిరోజూ ఆనందంగా వుండాలి
* ఉత్సాహంగా హ్యాపీ సండే * కమిషనర్ వీరపాండియన్
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: ప్రతినెల మొదటి ఆదివారం ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించుటకు నిర్వహింపబడుతున్న హ్యాపీ సండే కార్యక్రమాలను ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్దనే కాకుండా బిఆర్‌టిఎస్ రోడ్డులో శారద కళాశాల జంక్షన్ వద్ద ఏర్పాటు చేయటం జరిగిందని, ముందుగా బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించుట జరుగుతుందని, ఈ హ్యాపీ సండే కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన మేరకు నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో భాగంగా నేడు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బిఆర్‌టిఎస్ రోడ్డు నందలి ఈ హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ కార్యక్రమం విజయవాడ నగరంలోనే పుట్టిందని, ఇప్పడు రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి నిత్యం ఆనందంగా ఉండేలా ఆలోచన విధానం మార్చుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్ అన్నారు.
తదనంతరం బిఆర్‌టిఎస్ రోడ్డు నందు ఏర్పాటుచేసిన హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇక్కడకు విచ్చేసిన యువకులను, విద్యార్థులను, ప్రజలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ఇలానే అందరూ వారి వారి జీవితాల్లో ప్రతి క్షణం ఎంతో సంతోషంగా ఉండాలని కోరారు. ఎప్పుడు ట్రాఫిక్‌తో నిండిపోయే బిఆర్‌టిఎస్ రోడ్డు డీప్ ట్రస్టు వారు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆనందపరుస్తున్నాయని వారిని అభినందించటంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలను అభినందించారు. ఇదే విధంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్, శాప్ వారిని కూడా అభినందించారు. ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాలను నిర్వహించటానికి నిర్వాహకులకు నగరపాలక సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎవరికి వారు తమ వీధుల్లో ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొనవచ్చునని నగరపాలక సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఎంజి రోడ్డు నందు నిర్వహించిన కార్యక్రమంలో దగ్గరలో నివాసముంటున్న ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని కావున ఈ కార్యక్రమాన్ని వన్‌టౌన్ ప్రాంతంలోని కెటి రోడ్డులో కాని, క్రాంబే రోడ్డులో కాని ఏర్పాటు చేయుటకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ఇక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటలను ఆడుకుంటూ సంతోషంగా ఉండాలని, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి నిర్వహిస్తున్న డీప్ ట్రస్ట్ వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థ కమిషనర్‌కు విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నందున వారికి కృతజ్ఞతగా నలంద విద్యాసంస్థల తరపున నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ పూల మొక్కను అందజేశారు.
కాగా నలంద విద్యాసంస్థ పాఠశాలలు, కళాశాల విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా స్కేటింగ్, షటిల్, త్రోబాల్, వాలీబాల్, యోగ, మెడిటేషన్, ఆయుర్వేద స్టాల్స్, ఇతర ఆట పాటలతో ప్రజలను ఆహ్లాదపరచుట జరిగింది. పై కార్యక్రమంలో కార్పొరేటర్లు కాకు మల్లికార్జున యాదవ్, గండూరి మహేష్, త్రిమూర్తి రాజు, విఏఎస్., సహాయ వైద్యాధికారులు, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, నగరపాలక సంస్థ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>