ఉంగుటూరు, డిసెంబర్ 12: భవిష్యత్ అంతా మహిళలదేనని, రాష్ట్రంలో ప్రభుత్వపరంగా చేపట్టే అన్నీ కార్యక్రమాలను భవిష్యత్లో మహిళలకే అప్పగించి మహిళల ఆర్ధికాభివృద్ధికి పాటుపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంచి ఫలితాలనిస్తున్నాయని, ఇప్పటికే వందకోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి ఎస్హెచ్జి మహిళలు కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ఇసుక వ్యాపారాన్ని కూడా మహిళలకే అప్పగించామని, భవిష్యత్లో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహించే అధికారాన్ని మహిళా సంఘాలకే అప్పగిస్తామని చంద్రబాబు చెప్పారు. జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు ధాన్యం కొనుగోలు తీరును చంద్రబాబుకు వివరించారు. ఎస్హెచ్జి మహిళలు ఏవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారో, రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
english title:
s
Date:
Saturday, December 13, 2014