Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

‘చల్లా’ ప్రతిపాదనల మేరకే నిధులు

$
0
0

పరకాల, ఆగస్టు 10: ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రతిపాదనల మేరకే ఆయా వార్డులకు నిధులు కేటాయించినట్లు పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత పోస్టుమార్టం రోడ్డు అధ్వానంగా ఉందని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశం లో రైతులు, స్థానికులు రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి దృష్టికి తీసు కవచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే రైతులకు, స్థానికులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని దానిలో భాగంగానే అధ్వానంగా ఉన్న రోడ్డు కు ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని అనడం సరైన పద్దతి కాదన్నారు. పార్టీల కతీతంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకు నిధులు కేటాయించడం తప్ప అని ప్రశ్నించా రు. తనపై ఆరోపణలు చేసిన వారి వార్డులకు రూ.20 లక్షల వరకు నిధు లు కేటాయించానని తెలిపారు. పరకాల అభివృద్ధిలో అందరు భాగస్వా మ్యం కావాలని అందరి సహకారం తో ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పా రు. కలెక్టర్ ఇచ్చిన నిధులు కాబట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు అంశాలను ఆమోదించి కలెక్టర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ దేవునూరి రమ్యక్రిష్ణ మాట్లాడుతూ చైర్‌పర్సన్ రాజభద్రయ్యపై అసభ్య పరిచే విధం గా మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. అసభ్య పరిచే విధంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, కొయ్యడ మల్లికాంబ, ఆకు ల లక్ష్మీ, బండారి కవిత, దేవునూరి మేఘనాధ్, ఆకుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులను ఆదుకుంటాం: డీఆర్వో
మల్హర్, ఆగస్టు 10: తాడిచెర్ల, కాపు రం గ్రామాలలో ఏర్పాటుచేసిన ఏఎమ్మార్ కంపెనీ భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని జిల్లా రెవె న్యూ అధికారి మోహన్‌లాల్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కాపురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టారు. పరిహారం పొం దిన ఇండ్లను, పరిహారం పొందని ఇం డ్లను పరిశీలించి వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. 2010 సంవత్సరంలో అంచనా ప్రకా రం వచ్చిన నిధులను కొత్త చట్టం 2011లో వచ్చిన పరిహారానికి రెట్టింపుగా పరిహారం చెల్లించే విధంగా తాము సిద్ధంగా ఉన్నామని భూనిర్వాసితులకు భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ అధికారుల సర్వే ప్రకారం వత్యాసం ఏర్పడిందని అధిక మొత్తం వచ్చిన పరిహారం నుంచి రికవరీ చేసి, పరిహారం రాని వారికి అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ గిరిజనులమైన తమకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ కృషి వల్ల తమకు కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇప్పించేందుకు అంగీకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరబ్రహ్మచారీ, తహాశీల్ధారు మామిడి అశోక్ కుమార్, పంచాయతీ రాజ్ అధికారి కిరణ్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


కెనాల్ నీటితో రైతులను ఆదుకోవాలి

$
0
0

ఎల్కతుర్తి, ఆగస్టు 10: కెనాల్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని, మాయ మాటలతో రైతుబంధు, రైతుబీమా రెండూ ఎన్నికల స్టంటేనని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెనాల్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతులు వర్షాలు లేక ఇప్పటివరకు వరినాట్లు కూడా వేయకుండా ఇబ్బంది పడుతుంటే కెనాల్‌లో నీరు ఉన్నా రైతులకు నీటిని విడుదల చేయకుండా మాయ మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతాజి, పాక రమేష్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి
కురవి, ఆగస్టు 10: శతాధిక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెద్దబోయిన సాయమ్మ(115) అనే వృద్ధురాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం మృతిచెందింది. మృతురాలికి నలుగురు కుమారులు ఉన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి

$
0
0

తిరుపతి, ఆగస్టు 10: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్‌కు ఓట్లు వేయాలని బహిరంగంగా కోరిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆవుల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంపారుూస్ యూనియన్ ఘన విజయం సాధించిందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మజ్దూర్ యూనియన్ అక్రమాలకు కార్మికులు చరమ గీతం పాడి ఆర్టీసీకి స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మజ్దూర్ యూనియన్‌కు మద్దతు ఇచ్చారని, ఆ యూనియన్‌ను కార్మికులు ఓడించిన కారణంగా మంత్రి సైతం నైతిక బాధ్యతతో తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఈ.ఆర్.కుమార్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, డీ.గురునాథం, శివప్రసాద్, ఎస్‌డబ్ల్యుఎఫ్ జోనల్ ప్రెసిడెంట్ కె.పరుశురామ్, భాస్కర్, కార్మిక పరిషత్ నాయకుడు జి.రవి, వైకాపా ఆర్టీసీ యూనియన్ నాయకులు పి.సి.బాబు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కోర్ కమిటీ సభ్యురాలిగా శాంతారెడ్డి
తిరుపతి, ఆగస్టు 10: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా నియమితులైన శాంతారెడ్డిని శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడలోని పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రోత్సాహంతోనే తాను ఆనేక సమస్యలను ఎదుర్కొంటు వచ్చానన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యితిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, జిల్లాకార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కోశాధికారి అక్కిపల్లి మునికృష్ణయ్య, బిజేవైఎం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్, జిల్లాప్రధాన కార్యదర్శి మంకుల దాము రాయల్, బీజేపీ నగర అధ్యక్షుడు వరప్రసాద్, జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ విష్ణువర్థన్, జిల్లాప్రచార కార్యదర్శి గుండాల గోపీనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాలి ధనంజయ నాయుడు, సుబ్రమణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు, నేసనూరి మోహన్, వెంకటముని, వల్లేపల్లి ప్రసాద్, నాగినేని చంద్రయ్య, పార్థసారథి, ఆనంద్, రమేష్,ప్రేం కుమార్, పృధ్వీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

$
0
0

చిత్తూరు, ఆగస్టు 10: ఆర్టీసీ కార్మికుల సంఘం గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. గురువారం చిత్తూరు 1, 2 డిపోల్లో ఎన్నికలను నిర్వహించారు. అనంతరం రాత్రి 10గంటల వరకు ఓట్లలెక్కింపు చేపట్టారు. ఈక్రమంలో 1వ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించగా, రెండవ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు విజయం వరించింది. రాష్ట్ర సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు రావడం గమనార్హం.
ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల సంబరాలు
ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో చిత్తూరు 1వ డిపోతో పాటు రాష్ట్ర స్థాయి సంఘం ఎన్నికల్లో విజయఢంకా మోగించటంతో ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన కార్మికులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈక్రమంలో 1, 2వ డిపోకు చెందిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు, అధికారులు, 2వ డిపో వద్దకు చేరుకుని పెద్దఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రెండవ డిపో మెనేజర్ కిరణ్‌కుమార్‌ను గౌరవ పూర్వకంగా కలుసుకుని స్వీట్లు అందచేసారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన మేనేజర్‌కు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మణి, రాధాకృష్ణ, పెద్దఎత్తున యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎర్రచందనం తరలించిన కేసుల్లో ఐదుగురు అరెస్ట్
నాగలాపురం, ఆగస్టు 10: నాగలాపురం మండల పరిధిలోని నందనం గ్రామం సమీపాన ఈ ఏడాది జూన్ 28న టీఎన్ 07- బివై 002 అనే వాహనంలో 90 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి, ఆ సమయంలో కారుడ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ మట్లాడుతూ ఎర్రచందనం తరలింపునకు సహకరించిన మండలంలోని ఈసంగాడు గ్రామానికి చెందిన మురుగేష్ (27), తుపాకుల మురళి (35), మోహన్‌బాబు (30), గోవిందరాజన్ (50), రవి (37) అనే ఐదుగురిని అరెస్ట్‌చేసి రిమాండ్ నిమిత్తం సత్యవేడు కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి పెద్ద డాన్ అయిన చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన సంతోష్‌ను పట్టుకోవడానికి గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

రైల్వేలో, టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన నిందితుడు అరెస్టు

$
0
0

తిరుపతి, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన ఐదు మంది నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిసానని, రూ. 27.50లక్షలు, తిరుపతికి చెందిన ముగ్గురుకి టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.23.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన బాలిశెట్టి రెడ్డిప్రసాద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బాలిశెట్టి రెడ్డిప్రసాద్ (37) స్థానికంగా ఉన్న ఒక న్యూస్ చానల్‌లోను ఆ తరువాత వివిధ పత్రికలకు తిరుమలలో ప్రోటోకాల్ అటెండర్ అంటూ కొత్తవారికి పరిచయం చేసుకునేవాడు. తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న ఇతనిని చానల్, పత్రికల యాజమాన్యాలు తమ తమ సంస్థల నుంచి తొలగించాయని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ బాలిశెట్టి రెడ్డిప్రసాద్ తానే నకిలీ అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకుని అక్రమాలకు పాల్పడేవాడన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పలువురు వ్యాపారులకు వారిపేరు మీద లైసెన్సులు ఇప్పిస్తానని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి జల్సాలకు ఖర్చు పెట్టుకున్నాడని చెప్పారు. తిరుమలేశుని దర్శనార్థం తిరుమలకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నల్గొండకు చెందిన గార్లపాటి సుధాకర్ రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, వెంకటేష్ రెడ్డి, శంతన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తాను కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులకు, రాజకీయ నాయకులకు ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన వీరు ఒక్కో ఉద్యాగానికి రూ. 10 లక్షలు చొప్పున ఇవ్వడానికి సిద్ధపడి, ఐదుమంది రూ. 27.50లక్షలు రెడ్డిప్రసాద్‌కు ఇచ్చారు. డబ్బు తీసుకుని వారిని మోసం చేసిన రెడ్డి ప్రసాద్ ఆడబ్బుతో క్రికెట్ బెట్టింగ్‌లు కడుతూ జల్సాలు చేశాడు. తిరుపతికి చెందిన కె.రవితేజ, ఎస్.కృష్ణ, ఆర్.గోపాల్ అనేవారికి టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓక్కో ఉద్యోగానికి రూ. 15లక్షలు డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మిన వీరు రూ. 23.50లక్షలు ఇచ్చారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో తిరుపతి క్రైం ఎస్‌ఐ ఈ.వి.వెంకటనరసింహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడుని గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు.

డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటనపై సీఎంకు వివరించిన కలెక్టర్

$
0
0

తిరుపతి, ఆగస్టు 10: డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సవివరంగా తెలియజేశారు. తిరుపతిలో స్మార్ట్ ఎలివేట్ కారిడార్ (ఫ్లై ఓవర్) నిర్మాణం అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడానికి కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం ఉదయం అమరావతికి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ శిల్ప ఆత్మహత్య, జూడాలు, ప్రజాసంఘాల ఆందోళన, మీడియాలో వచ్చిన వార్తా కథనాల గురించి వివరించారు. అటు తరువాత తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, జేసీ 2 చంద్రవౌళి జిల్లా యంత్రాంగం తరపున జూడాతో కలిసి చర్చించిన అంశాలు, వారి డిమాండ్లు, హైపవర్ కమిటీ విచారణ, జూడాల డిమాండ్లపై జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించిన తీరు, శిల్ప తల్లిదండ్రులు తనను కలిసి కోరిన డిమాండ్లను వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వ డాక్టర్లు తీసుకున్న నిర్ణయం, సీఐడీ విచారణ తదితర అంశాలను సీఎంకు వివరించారు. ప్రధానంగా సీఐడీ విచారణను వేగవంతం చేసి తన కుమార్తె మరణానికి కారణమైన వారిని శిక్షించాలని తల్లిదండ్రులు, జూడాలు, ప్రజా సంఘాలు, డాక్టర్లు కోరారని సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఐడీ విచారణ వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సీఎంను కోరారు. దీనిపై స్పందించిన సీఎం విచారణ వేగవంతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తొందరపడకండి... రోగులకు ఇబ్బందులు కలిగించకండి
* డాక్టర్లకు.. జూడాలకు కలెక్టర్ విజ్ఞప్తి
డాక్టర్ శిల్ప మరణంపై ఇప్పటికే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుని విచారణను వేగవంతం చేసిందని, ఈ క్రమంలో త్వరలోనే తాను జూడాలు, ప్రభుత్వ డాక్టర్లతో ఎస్వీమెడికల్ కళాశాలలో సమావేశం నిర్వహిస్తానని, ఈలోపు తొందరపడి రోగులకు ఇబ్బంది కలిగించే చర్యలకు దిగవద్దని కలెక్టర్ కోరినట్లు రాష్ట్ర సమాచార శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. నిరుపేద రోగుల వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని జూడాలు, ప్రభుత్వ డాక్టర్లు తొందర పడవద్దని సంయమనం పాటించాలని ఆ ప్రకటనలో కోరారు. వైద్యులు విధులకు, విద్యార్థులకు క్లాసుల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రకటనలో కోరారు.

ఆలయంలో నేడు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు అంకురార్పణ

$
0
0

తిరుపతి, ఆగస్టు 10: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణకు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఆరు రోజులపాటు నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ వైదిక కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఆరు రోజుల పాటు సమయాభావాన్ని బట్టి రోజుకొక విధంగా పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. తొలి రోజు 50వేల మంది భక్తులను అనుమతిస్తే చివరి రోజైన 16వ తేదీన 18వేల మందికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాక్రతువుకు శనివారం రాత్రి 7 నుంచి 10గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవ దేవాలయాల్లో లోకసంక్షేమం, ఆలయంలోని మరమ్మతులను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం పాఠకులకు విధతమే. ఇందుకోసం శ్రీవారి ఆలయంలో 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్విక్కులు, 100 మంది వేదపండితులు, ధర్మగిరి వేదపాఠశాల నుంచి 20మంది వేద విద్యార్థులు ఈ మహాక్రతువులో పాల్గొంటారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీతను పారాయణం చేస్తారు.
శనివారం అంకురార్పణ
మహాసంప్రోక్షణకు శ్రీకారం చుట్టేవిధంగా శనివారం అంకురార్పణ కార్యక్రమాన్ని చేపడతారు. ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. దీనినే ఆచార్య వరణం లేదా రుత్విక్ వరణం అంటారు. రాత్రి 7 నుంచి 9గంటల వరకు స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు ఆలయం నుంచి బలుదేరి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.
ఆదివారం నాడు దేవతా శక్తుల కుంభావాహన
బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 6గంటల తరువాత యాగశాలలోని ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9గంటల తరువాత నిర్వహించే కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉపాలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం (కలశం)లోనికి ఆవాహనం చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరి దేవతల ఉత్సవ మూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. 18 వేదికలపై కుంభాలను కొలువు దీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలతోపాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు వెలిగిస్తారు.
సోమ, మంగళ వారాల్లో విశేష హోమాలు
ఇక మహాసంప్రోక్షణలో మూడవ రోజైన సోమవారం, నాల్గవ రోజైన మంగళవారం 13 విశేష హోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారు చేస్తారు. ఇందులో అరటిపండ్లు, దూది, కరక్కాయ వంటి 8 పదార్థాలతో కూడుకున్న మిశ్రమ లేపనాన్ని తయారు చేస్తారు. దీనినే అష్టబంధన ద్రవ్యం అంటారు. రెండు రోజులపాటు గర్భాలయంతోపాటు ఉపాలయాల్లోనూ అష్టబంధన ద్రవ్యంను సమర్పిస్తారు. ఈ అష్టబంధన కార్యక్రమాన్ని గురించి భృగుప్రకీర్థ్ధాకారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో తెలియజేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి పాదాలు, పద్మపీఠం మధ్య ఏర్పడిన వ్యత్యాసాలను భర్తీ చేస్తూ ఈ లేపనాన్ని తాపడం చేస్తారు. 12 సంవత్సరాల తరువాత ఈ లేపనం పటుత్వం తరుగుతుంది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బుధవారం.. హోమాలు, అభిషేకాలు
మహాసంప్రోక్షణలో ఐదవరోజైన బుధవారం ఉదయం కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవ మూర్తులకు యాగశాలలోనే అభిషేకం నిర్వహిస్తారు.
గురువారం.. కళావాహన
మహా సంప్రోక్షణలో ఆరవ రోజైన గురువారం ఉదయం 10.16 నుంచి 12 గంటల్లోపు కళావాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉపాలయంలోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు కుంభంలోని శక్తిని తిరిగి ఆవాహన చేస్తారు. అటు తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షితారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. దీంతో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. దీంతో గురువారం సాయంత్రం మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు గరుడ పంచమి కూడా కావడంతో స్వామివారు గురువారం రాత్రి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి ఆలయంలో తొలి మహాసంప్రోక్షణ 1958లో
శ్రీవారి ఆలయంలో తొలి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం 1958 విళంబి నామ సంవత్సరం, ఆగస్టు మాసంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణ కవచ తాపడం జరిగింది. 60 ఏళ్ల తరువాత తిరిగి అదే విళంబి నామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అటు తరువాత 1970, 1982, 1994, 2006 అటు తరువాత 12 సంవత్సరాలు తరువాత 2018 ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది.
అన్ని రకాల దర్శనాలు రద్దు
ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి గురువారం వరకు రూ.300 టోకెన్లు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా పూర్తిగా రద్దయ్యాయి.

జలదిగ్బంధనంలో కేరళ

$
0
0

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం జలదిగ్బంధనంలోనే ఉన్నది. ఎడతెరపి లేకుండా కరుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళలో కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 29మంది చనిపోయారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 54,000 మంది ఇళ్లను కోల్పోయారు. రహదారులు కొట్టుకుపోయాయి. ఆనకట్టల గేట్లు తెరచి వరద నీటిని కిందికి వదలివేస్తున్నారు. శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేపట్టారు. మరోవైపు మున్నూర్‌లోని ఫ్లమ్ జూడీ రిసార్ట్‌లో చిక్కుకుపోయిన 54మంది పర్యాటకులను సురక్షితంగా తరలించారు.


ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు

$
0
0

ఖమ్మం: ఖమ్మం, భద్రాది, కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇల్లందు, మణుగురు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు రాయగూడెం ప్రాంతం నదిలో చిక్కుకుపోయారు.

నిర్మాణంలో ఉన్న వంతెన కూలి నలుగురికి గాయాలు

$
0
0

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి నలుగురు కార్మికులు గాయపడ్డారు. బస్తీ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వంతెనపై నుంచి బస్సు బోల్తా

$
0
0

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు కూలటంతో పదిమందికి గాయాలు అయ్యాయి. ఇక్కడ భారీ వర్షాలు విస్తత్రంగా కురుస్తున్నాయి. బస్సులో 45మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కినె్నరసాని గేట్లు ఎత్తివేత

$
0
0

ఖమ్మం: జిల్లాను వర్షాలు ముంచెత్తటంతో కినె్నరసాని ప్రాజెక్టుల గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దిగువకు 50వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయ నీటిమట్టం 407 అడుగులు కాగా ఇప్పటివరకు 406.8 అడుగులకు చేరుకుంది. దీంతో తొమ్మిది గేట్లును ఎత్తివేశారు.

కుప్పకూలిన భవనం

$
0
0

వడోదర: గుజరాత్‌లోని వడోదరలో మూడంతస్తుల భవనం కుప్పకూలి ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో నెలల వయసు ఉన్న చిన్నారిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగతావారిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు తీసుకున్నారు.

కేట్రాన్ దీవుల్లో కూలిన విమానం

$
0
0

సియటెల్: సియటెల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కెట్రాన్ దీవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం నడిపిన మృతిచెందాడు. విమానంలో ప్రయాణీకులు లేరు. విమానాశ్రయంలో పనిచేసే మెకానిక్ ఈ విమానాన్ని దొంగిలించి ఆకాశంలో విన్యాసాలు చేశాడు. చివరకు నియంత్రించే సామర్థ్యం లేకపోవటంతో ఈ విమానం కెట్రాన్ దీవుల్లో కుప్పకూలింది.

భారతీయ మత్స్యకారులు అరెస్టు

$
0
0

శ్రీలంక: తమ దీవుల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నౌకాదళం 27మంది మత్స్యకారులను అరెస్టుచేసింది. మత్స్యకారుల నుంచి నాలుగు పడవలను స్వాధీనం చేసుకుంది.


నాసా ప్రయోగం వాయిదా

$
0
0

ఫ్లోరిడా: సూర్యుడికి చేరువుగా వెళ్లేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టిన పార్కర్ సోలార్ ప్రోబో రోబోటిక్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో వాయిదా వేశారు. శనివారం ఉదయం 4.28 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో ఆదివారానికి వాయిదా వేశారు.

అమిత్‌షా కోల్‌కతా పర్యటనలో ఉద్రిక్తత

$
0
0

కోల్‌కతా: అమిత్‌షా కోల్‌కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా ‘బీజేపీ గో బ్యాక్’ వంటి నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ గూండారాజ్యం నెలకొన్నదని అన్నారు. తాము బెంగాల్‌కు వ్యతిరేకం కాదని, మమత బెనర్జీకి మాత్రమే వ్యతిరేకమని అన్నారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కూటమి ఇక్కడ ఉండకూడదని, మోదీకి ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు.

దేశ నిర్మాణంలో ఐఐటీల కీలక పాత్ర

$
0
0

ముంబయి: దేశ నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయటంలో ఐఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఐఐటీ-బీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ..ఐఐటీలు సాధించిన ఘనతను చూసి దేశం గర్విస్తుందని అన్నారు. ఇక్కడ విద్యార్థులు భారతదేశ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తారని అన్నారు.

బజాజ్ ఎలక్ట్రికల్ ఎండీ అనంత్ బజాజ్ కన్నుమూత

$
0
0

ముంబయి: బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఎకైక కుమారుడు, వ్యాపారవేత్త అనంత్ బజాజ్(41) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. రెండు నెలల క్రితమే అనంత్ బజాజ్ ఎండీగా నియమితులయ్యారు.

ఏరియల్ సర్వే నిర్వహించిన విజయన్

$
0
0

కేరళ: కేరళలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రాంతాల్లో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, ఇళ్లు, పొలాలు ముంపునకు గురైన బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. కాగా ఈ వరదల్లో 30 మంది చనిపోయారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>