Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సంక్షోభంలో చేనేత రంగం

$
0
0

భూదాన్‌పోచంపల్లి, మే 5: దేశంలో వ్యవసాయం తర్వాత కోట్లాది మందికి చేనేత పరిశ్రమ జీవనాధారంగా ఉండేది. చేనేత రంగం నేడు తిరోగమన దిశగా పయనిస్తోంది. జిల్లాలో 66 చేనేత సంఘాలు, సుమారు 13వేల మగ్గాలు ఉండగా 20వేల చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేనేత వృత్తియే ఆధారం నేడు మగ్గం వౌనంగా రోదిస్తోంది. చేతి నిండా పని దొరకకా చేనేత కార్మికులు కుమిలి పోతు వారి బతుకులు భారంగా దొర్లుతున్నాయి. అద్భుతమైన వస్త్రాలు నేసి ఖండాతర ఖ్యాతి గడించిన కార్మికులను పాలకులు కనికరించడం లేదు. చేతి నిండా పనిలేక నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేక నేతన్నలు వలసబాట పడుతున్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 20శాతం సబ్సిడీని కూడా నిధుల కొరత సాకుతో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న 20వేల మంది చేనేత కార్మికులకు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. చేనేత రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. బడ్జెట్‌లో 18కోట్లు మాత్రమే కేటాయించారు. తమిళనాడు రాష్ట్రంలో చేనేతకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. చేనేతలను రక్షించాలని పాలకులు చేనేత రిజర్వేషన్ చట్టాలు రూపొందించారు. 22రకాల చేనేత వస్త్రాలను చేనేత మగ్గాలపై తయారు చేసేందుకు అనుమతించారు. తర్వాత వాటిని 11కు కుదించారు. బడా పారిశ్రామిక వేత్తలు పెద్ద పెద్ద మిల్లులలో, టై అండ్ డై మిల్లుల్లో టై అండ్ డై డిజన్లను యథాతథంగా కంప్యూటర్ల సాయంతో కాపీ కొడుతున్నారు. ప్రిటింగ్ వస్త్రాలను మార్కెట్‌లో తక్కువ ధరలకు విక్రయించడం వల్ల చేనేత రంగం సంక్షోభంలో నెట్టబడింది. నూలు రంగుల ధరలు విపరీతంగా పెరగడం నేసిన వస్త్రాలకు మార్కెట్ లేక గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలై కార్మికులు ఇతర వృత్తులకు వలసలు వెళ్తున్నారు. నేతన్నలు తాపీ కార్మికులుగా, సెక్యురిటీ గార్డులుగా దుకాణాల్లో గుమస్తాలుగా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
పరిష్కార మార్గాలు
కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వమే ఏర్పాటు చేసి నిర్వహించాలి, మార్కెట్‌ను ప్రభుత్వమే కల్పించాలి. సిరిసిల్ల తరహ ప్యాకేజీని నేత కార్మికులకు అందించాలి. నూలు రసాయన రంగుల ధరలు స్థిరీకరించాలి, తమిళనాడు వల్లే బడ్జెట్‌లో చేనేతకు జనాభా ప్రాతిపదికన వెయ్యికోట్ల నిదులను కేటాయించి సకాలంలో ఖర్చు చేయాలి, మరమొగ్గాలకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించాలి. నేత కార్మికులకు బ్యాంకులు రుణాలు అందించాలి. ఆప్కొ సిబ్బందికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించి ఉత్పత్తి దారుడు అమ్మిన ధరకే ప్రజలకు అందించాలి. ప్రభుత్వ సిబ్బంది తమ యూనిఫామ్ చేనేత వస్త్రాలనే వాడేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. సహకార సంఘాలను బలోపేతం చేసి నిధులను కేటాయించాలి. చేనేత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పథకాలను చేనేత కార్మికులకు వర్తింపజేయాలి. వర్క్‌షెడ్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టి కార్మికులకు అందించాలి. కార్మికులకు కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా కనీస వేతనం అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఆధారం కోల్పోతున్న నేత కార్మికులు
english title: 
chenetha

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

$
0
0

ఆమనగల్లు, మే 5: కల్వకుర్తి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వడగళ్లవాన, గాలీవానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చరికొండ, ముద్వీన్, శెట్టిపల్లి, పల్లెసుక్కా తండాలను ఆయన సందర్శించాఅరు. ఆయా గ్రామాలలో 410 ఎకరాలలో వరి పంటకు తీవ్ర దెబ్బతిన్నదని, వందలాది ఎకరాల మామిడితోట రైతులకు అపార నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించిరైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి కష్టపడ్డ రైతులకు అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన తీవ్ర నష్టం చేకూర్చిందని తెలిపారు. అధికారులు వెంకటే గ్రామాలలో పర్యటించి పంటనష్టం అంచనాలు వేయాలని జైపాల్‌యాదవ్ కోరారు. మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి, చరికొండ సర్పంచ్ నర్సింహ్మా, టిఆర్‌ఎస్ నాయకులు వీరయ్య, సుమన్, జంగయ్య పాల్గొన్నారు.

* మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
english title: 
p

నీటిపాలు - ఆందోళనలో రైతులు

$
0
0

వనపర్తి, మే 5: ఆరుగాలం కష్టపడి ఎండకు, వానకు తడిసి చాలి చాలని నీటితో అష్టకష్టాలు పడి పండించిన వరిధాన్యం విక్రయం కోసం వనపర్తి మార్కెట్‌కు వస్తే సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో నీటిపాలు కావడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటిలానే వనపర్తి మార్కెట్‌కు తెచ్చిన రైతుల వరిధాన్యం వ్యాపారస్తులు టెండర్లు పాడి తూకాలు చేసుకోకముందే ఒక్కసారిగా గాలి, వాన కురియడంతో కళ్లముందే కష్టపడి పండించిన వరిధాన్యం వర్షపు నీటిలో కొట్టుకొని పోయి డ్రైనేజీల ద్వారా వెళ్తుంటే రైతు గుండే తరుక్కుపోయింది. మహిళా రైతుల రోదనలు వరుణుడి మనస్సును కరిగించలేకపోయాయి. ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడం, వెనువెంటనే వర్షం రావడతో కనీసం ధాన్యంపై టార్పాలీన్లు కప్పె సమయం కూడా ఇవ్వకుండా వర్షం కురియడంతో రైతులు బిక్క మొకాలు వేసుకొని చూస్తూ ఉండిపోయారు. మార్కెట్‌లోని పై కప్పు రేకులు ఊడి మీదపడుతాయన్నంతగా వేగంతో గాలులు వీయడంతో రైతులు ఆందోళన చెందారు. వర్షం కొద్దిసేపే కురిసినప్పటికి మార్కెట్‌కు వచ్చిన సుమారు 5వేల బస్తాల వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఆరబోసిన వరిధాన్యం వర్షపు నీటిలో కొట్టుకొని పోతుండగా వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి కళ్లముందే ధాన్యం నీటిపాలు అవడం చూసి రైతులు తట్టుకోలేకపోయారు.
అప్పటికి కొందరు రైతులు టార్పాలీన్లు కప్పుకున్నప్పటికి గాలికి అవి కొట్టుకొని పోగా ధాన్యం అంతా తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంట విక్రయించి చేసిన అప్పులను తీర్చి మిగిలిన డబ్బుతో తిరిగి పెట్టుబడులు పెట్టుకోవచ్చునన్న ఆశతో వచ్చిన రైతులకు కన్నీరే మిగిలింది. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని మార్కెట్ ధర ప్రకారం కొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

* వనపర్తి మార్కెట్‌లో తడిసి ముద్దైన ధాన్యం * పండించిన పంట
english title: 
b

కుదిపేసిన గాలిదుమారం

$
0
0

సంగారెడ్డి, మే 5: ప్రతి రోజు ఎక్కడో ఒక ప్రాంతంలో పెనుగాలులతో కురుస్తున్న అకాలవర్షాలు అన్నదాత ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. చేతికివచ్చిన ధాన్యం, ఉల్లి పంటలకు తీరని నష్టం కల్గిస్తుండగా, కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలిపోతుండటంతో వ్యాపారులను నష్టాల్లో కొట్టుమిట్టాడు తున్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో పెనుగాలులు దుమ్మెత్తిపోశాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సంగారెడ్డిలో విద్యుత్ సరఫరా మెరుగుపడలేదంటే గాలుల ప్రభావం ఏమేరకుందో స్పష్టమవుతోంది. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం మొత్తం తడిసిపోవడంతో రైతులను ఆందోళనకు గురి చేసింది. సదాశివపేట మార్కెట్ యార్డులో ఉల్లి కుప్పలన్నీ నీటి పాలయ్యాయి. భూమిలో ఉన్నప్పుడే కురిసిన వర్షాలకు కుళ్లిపోతున్న ఉల్లిని రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్ముకునే ప్రయత్నంచేస్తుండగా ఇక్కడ కూడా అకాల వర్షాలు వ్యవసాయదారుల పాలిటశాపంగా మారింది. గజ్వేల్‌లో కూడా భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. మెదక్, అందోల్, నర్సాపూర్, పటన్‌చెరు తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసి నష్టాన్ని కలిగించింది. వర్గల్ మండలంలో కూరగాలు, మామిడి కాయలు నేలరాలాయ.

* అన్నదాత ఆశలపై అకాల వర్షాల దాడి * విద్యుత్ సరఫరాకు విఘాతం * తడిసిన ధాన్యం, ఉల్లి - నేలరాలిన మామిడి
english title: 
k

జిల్లాను వీడని ఎన్నికల జాతర జ్వరం

$
0
0

సంగారెడ్డి, మే 5: రంగంలో హేమాహేమీలు, రసవత్తరమైన ప్రచారం, రెండు నెలలుగా గ్రామాలు, పట్టణాలు, గల్లీలు, బస్తీలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఓటరు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి జోరుగా ప్రచారం నిర్వహించి అన్నిరకాల ఎన్నికలను పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఫలితాలకోసం ఎదురుచూస్తుండగా.. జిల్లా ప్రజలను ఎన్నికల జ్వరం వీడలేకపోతుంది. ఎక్కడ ఇద్దరు కనిపించినా వారినోట ఎన్నికలకు సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రసత్తర చర్చ కొనసాగుతుంది. పదేళ్లపాటు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను చూసామని, ఇప్పుడు కొత్తవారికి అవకాశం ఇచ్చామని, మీరు పాతవారికి కొమ్ముకాసరి.. పరస్పర విమర్శలతో గెలుపు, ఓటములపై సమీక్షించుకుంటున్నారు. ఆయా పార్టీలకు మద్దతు తెలిపిన వారు తమ అభ్యర్థి గెలుస్తాడే నమ్మకం ఉన్న వారంతా బెట్టింగులు కట్టేందుకు సైతం వెనుకాడటంలేదు. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు 23 మంది పోటీ పడగా, పది అసెంబ్లీ సెగ్మెంట్లలో 105మంది పోటీచేసి తమ అదృష్టంకోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా, మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జరిగిన మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల గెలుపు ఓటములపై కూడా విస్తృతంగా చర్చలు, వాదనలు కొనసాగుతున్నాయి. ఎవరి ఆర్థిక స్థోమతకు వారు అనుగుణంగా పందెలు కాస్తున్నారు. వందలు మొదలుకుని వేలు, లక్షల వరకు పందెం కాస్తూ భగవంతుడి దయాదాక్షిణ్యాలకై ఎదురుచూస్తున్నారు. ఈనెల 12న మున్సిపల్, 14న ప్రాదేశిక, 16న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానుండటంతో అభ్యర్థులతోపాటు వారి అనుచరుల్లో రోజురోజుకు వత్తిడి పెరుగుతోంది. మున్సిపల్ కౌన్సిలర్లు ఇళ్ల వారిగా ఓటర్లు ఏ మేరకు మద్దతు పలికారనే లెక్కలు కడుతుండగా, ఎంపిటిసి అభ్యర్థులు సైతం కులాల వారీగా, మతాలవారీగా, పార్టీలపైఉన్న ఆయా కుటుంబాలకు ఉన్న అభిమానాన్ని ఆధారంగా చేసుకుని గెలుపు ఓటములను అంచనా వేసుకుంటున్నారు. జడ్పీటిసి అభ్యర్థులు గ్రామాల వారీగా పార్టీలకు ఉన్న పట్టును ఆధారంగా చేసుకుని సమీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులు ఓటరునాడిని అంతసులువుగా పసిగట్టలేక జుట్టు పీక్కునే పరిస్థితులు తలెత్తాయి. పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు అధిక మొత్తంలో రంగంలో ఉండటంతో అంచనా వేయడం గగనమైపోయింది. కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకుపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలుపు కోసం కాచుకూర్చోంది. తొలిసారిగా ఒంటరి పోరాటం చేసిన టిఆర్‌ఎస్ అన్నివర్గాలవారి మద్దతు తమకు లభించిందనే ధీమాతో గెలుపుపై పూర్తి బరోసాతో కనిపిస్తోంది. టిడిపి, బిజెపిలు ఉమ్మడిగా రంగప్రవేశం చేయటమేకాకుండా అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాల కోసం పడిగాపులు కాస్తోంది. గెలుస్తామని అంతా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఓటర్ల అంతర్మథనం తెలియక భయంతోనే ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా వారి మద్దతుదారులు సైతం నమ్ముకున్న దేవతల ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన మాజీమంత్రి నాలుగవ విజయం కోసం పోటీపడగా ఆమెను దీవించాలంటూ మద్దతుదారులు శనివారం గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. మొత్తంమీద జిల్లాలో ఎవరి భుజం తట్టిన ఎన్నికలపై ఆసక్తిగా మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితాలు వెల్లడైన మరో పక్షంరోజుల వరకు అవే చర్చలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

* గెలుపు ఓటములపై చర్చలే చర్చలు * బెట్టింగులకు సై అంటే సై * ఫలితాల కోసం ఎదురుచూపులు
english title: 
k

.రాజీవ్ రహదారిపై రోడ్డుప్రమాదం ఇద్దరు మృతి

$
0
0

ములుగు, మే 5: వంటిమామిడి రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన అయ్యూరి గంగరాజం (45), అయ్యూరి వినోద్ (22), అయ్యూరి లక్ష్మిలు శంషాబాద్ నుండి కారులో ధర్మపురికి వస్తుండగా, మార్గమధ్యమైన వంటిమామిడిలోని పెట్రోల్‌బంక్ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి కారును రోడ్డుప్రక్కన నిలిపి దిగుతుండగా, వెనుక నుండి వేగంగా వస్తున్న వ్యాన్ కారును ఢీకొట్టడంతో రంగరాజం, వినోద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అయ్యూరి లక్ష్మికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు ములుగు ఎస్‌ఐ కమలాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.

అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం
* వరదల్లో కొట్టుకుపోయిన వైనం
* ఈదురు గాలులు, వడగండ్లతో నేలరాలిన మామిడి, వరి
* ఆందోళనలో రైతన్నలు
సిద్దిపేట/తొగుట, మే 5: ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులకు భారీ నష్టం మిగిల్చింది. మామిడి, వరి, కూరగాయల పంటలకు అపారనష్టం వాటిల్లింది. భారీ వర్షానికి తొగుట ఎఎంసి, తుక్కాపూర్ కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. వరదలకు ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారు. కొనుగోలుకేంద్రాలకు రైతులు పెద్దఎత్తున ధాన్యం మండలంలోని వివిధ గ్రామాల నుంచి కొన్నిరోజుల కిందే తీసుకొచ్చారు. కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం అక్కడే భద్రపరిచారు. తడిగా ఉన్న ధాన్యం రోడ్ల మీద నేర్పి ఆరపెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంపడడంతో ధాన్యం తడిసి ముద్దై మోరిల్లో కొట్టుకుపోయింది. కుప్పలు చేసి కవర్లు కప్పుదామనుకున్న రైతుల ప్రయత్నం వృధా ఐంది. సకాలంలో కేంద్రాలు ప్రారంభిస్తే తమ ధాన్యం తడిసి ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట తడిసి ముద్దై నీటిపాలు కావడంతో తాము ఎంతో నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కాగా మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి, వెంకట్రావ్‌పేట, కాన్గల్, లింగంపేట, తొగుట తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన నష్టాన్ని కలిగించింది. పలు చోట్ల ఇండ్లు, పౌల్ట్ఫ్రీం రేకులు గాలికి లేచిపోయాయి. చెట్లువిరిగి నేలకొరిగాయి. కోయని వరి పంట నేలరాలి పోగా పలుచోట్ల నేలకొరిగింది. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని చేయూతనివ్వాలని ప్రజలు కోరుతున్నారు.
* మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం
* ఆందోళనలో రైతాంగం
* కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
సిద్దిపేట: ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంట అమ్మకానికి యార్డుకు తీసుకొస్తే సోమవారం కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిద్దిపేట మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని రైతులు పెద్దఎత్తున తెచ్చారు. యార్డులో షెడ్‌లు, ప్రాంగణంలో ధాన్యం కుప్పలుగా పోశారు.యార్డులోని వ్యాపారులు మార్కెట్ ప్రాంగణంలో ఆరబోసిన ధాన్యం కుప్పలను సెలక్ట్ చేసిన ధాన్యం లిఫ్టింగ్ చేయలేదు. సోమవారం సాయంత్రంపడ్డ వానకు యార్డులో పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం కొనాలని మార్కెటింగ్ అధికారుల దృష్టికి తీసుకపోయారు. అందుబాటులో ఉన్న కవర్లతో కుప్పలపై కప్పారు. ఐనా కొంతవరకు ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు.

వంటిమామిడి రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి
english title: 
v

24 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

$
0
0

సిద్దిపేట, మే 5: రైతులకు మద్దతు కల్పించేందుకు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు సివిల్ సప్లై కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తాలు, పొల్లు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. మార్కెట్‌యార్డులో సోమవారం ధాన్యం కొనుగోలు తీరును హరీష్‌రావు పరి శీలించారు. సిద్దిపేట మండలపరిధిలో ఇర్కోడ్, తోర్నాల, చింతమడక, నారాయణరావుపేట, పుల్లూరు, బక్రిచెప్యాల, మాచాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి, గుర్రాలగొంది, జక్కాపూర్, అల్లీపూర్, రామంచ, గోనేపల్లి, మైలారం, ఇబ్రహింనగర్, చిన్నకోడూరు, నంగునూరు, ఖాతా, పాలమాకుల ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండలంలో గుర్రాలగొంది, చౌడారం, సిద్దిపేట మండలంలో రాఘవాపూర్, మిట్టపల్లి, నంగునూరు మండలం బద్దిపడగ ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మూడు గ్రామాలకు ఒక్కో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఏ మండలాలకు చెందిన రైతులు ఆ మండలంలోని కేంద్రాలకు ధాన్యం తెచ్చి ప్రభుత్వం నిర్ణయంచిన రూ.1,345 మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రపరిచేందుకు ప్యాడీ మిషన్లు, కవర్లు, కాంటాలు అందుబాటులో ఉంచారన్నారు. రైతులు సిద్దిపేట మార్కెట్ యార్డుకు తీసుకొస్తే వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని, సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలన్నారు. మార్కెట్ యార్డులో పౌరసరఫరాశాఖ, ఐకెపి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మద్దతు ధరపై అధికారులపై ఆగ్రహం
యార్డులోని ధాన్యం కుప్పలను పరిశీలించిన హరీష్‌రావు అక్కడ ఉన్న రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యార్డులోని రైతులు తాము నాణ్యమైన ధాన్యానికి తీసుకొచ్చినా తమకు వ్యాపారులు మద్దతు ధర చెల్లించటంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారంరోజులుగా యార్డుకు వచ్చి పడిగాపులు కాస్తున్నట్లుచెప్పారు. యార్డులో సివిల్ సప్లయ్, ఐకెపి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటుచేయకపోవటంవల్ల వ్యాపారులు కుమ్మక్కై ఇష్టాను సారంగా ధర నిర్ణయస్తున్నారన్నారు. నాణ్యమైన ధాన్యానికి రూ.1300 సైతం సక్రమంగా చెల్లించటంలేదని హరీష్‌రావు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆగ్రహించిన హరీష్‌రావు మార్కెట్ కార్యదర్శులు సంగయ్య, శ్రీనివాస్‌లను మద్దతు ధర కల్పించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మార్కెట్ యార్డులో రైతులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరాఅని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. వారంరోజుల యార్డుల క్రయవిక్రయాల రికార్డులను పరిశీలించారు. ఆనంతరం జాయింట్ కలెక్టర్ శరత్‌తో ఫోన్‌లో మాట్లాడి మార్కెట్ యార్డు సమస్యల వివరించారు. యార్డులో సివిల్ సప్లయ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించగా, జెసి సానుకూలంగా స్పందించారు. మార్కెటింగ్ శాఖ ఎడితో హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడి సిద్దిపేట యార్డులో మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని, వారంలో మూడు రోజులు యార్డులోనే రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు అధికారులకు సూచించారు. హరీష్ వెంట టిఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, గాంధీ, మల్లేశం, శేషుకుమార్, కాంగ్రెస్ నేత నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

* ఐకెపి కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి * నాణ్యమైన ధాన్యానే్న రైతులు తేవాలి * మాజీమంత్రి హరీష్‌రావు
english title: 
v

వర్షాల భయంతో ఆందోళనలో రైతన్న

$
0
0

మెదక్, మే 5: అకాల వర్షాలతో మార్కెట్ యార్డులో ధాన్యం నిలువ చేసుకున్న రైతులు, మరోప్రక్క పొల్లాల్లో ధాన్యం రాలిపోయి రైతులు నష్టాలకు గురవుతున్నారు. గత వారం రోజులుగా మెదక్ మార్కెట్ యార్డులో నిలువ చేసుకున్న ధాన్యంను ప్రభుత్వపరంగా ధాన్యం కరీదు చేసే వారు లేక రైతులు ఎదురుచుపులు చుస్తున్నారు. మార్కెట్ యార్డులో నిలువ చేసుకున్న ధాన్యంను గాడిదలు, పందులు, గోదలు, కోతులు నష్టం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మార్కెట్ యార్డు అధికారులు అసలు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. టాపర్లు కూడా కిరాయికి ఖరీదు చేసుకొని ధాన్యం కుప్పలపై కప్పుకుంటున్నామని వారు తెలిపారు. పిల్లికొట్టాలకు చెందిన ప్రమీల, రాణి, నిర్మల, మెదక్ నవాబ్‌పేటకు చెందిన దుర్గయ్య, బంచపల్లి బీరయ్య, ముకిరి కిష్టయ్య 8 రోజులుగా ధాన్యం నిలువ చేసుకున్న కోరె ఎల్లయ్య, ముకిరె మల్లయ్య, పెరిక రాజు, లక్ష్మయ్య, నారాయణ, చెన్నపు మల్లయ్య, పెరిక వెంకటేశం, బొప్పని దుర్గయ్య తదితర రైతులు సుమారు 30 మంది మార్కెట్ యార్డులో ధాన్యం నిలువ చేసుకున్నవారున్నారు. మెదక్ పట్టణం నవాబ్‌పేటకు చెందిన రైతు గట్టయ్య, మరో ఇద్దరు మహిళా రైతులు మాట్లాడుతూ ఆకాల వర్షంతో పండిన పంట పొలంలోనే కొంకులు నుంచి ధాన్యం సగం రాలిపోతుండగా చుడలేక వరి కోత మిషన్‌ను అశ్రయిస్తే గంటకు 1850 రుపాయలతోపాటు మరో 50 రుపాయల బత్తా, పొలం నుండి మార్కెట్ యార్డుకు ధాన్యం తరలించడానికి ట్రాక్టర్‌కు మరో 300 రుపాయలు కిరాయి పడుతుందని వారు తెలిపారు. నారు మడి నుండి వరికోత వరకు ఒక ఎకరాకు 6 వేల రుపాయలు ఖర్చు వస్తుందని వారు తెలిపారు. 10 వేల రూపాయలు వ్యయం చేసి పండిన పంటకు 6 వేల రూపాయలు కాదు కదా అందులో సగం 3 వేల రుపాయలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వెలిబుచ్చారు. పిల్లికొట్లాలకు చెందిన పెరిక వెంకటేశం మాట్లాడుతూ గత ఆరు రోజులుగా పిల్లికోట్లాకు చెందిన 10 మంది రైతులు మార్కెట్ యార్డుకు ధాన్యం తరలించినా ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక్కడ నిలువ చేసుకున్న ధాన్యంను గాడిదలు, పందులు, గోదలు తింటున్నాయని ఆరోపించారు. బొప్పని దుర్గయ్య మార్కెట్ యార్డులో నిలువ చేసుకున్న ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆ ధాన్యంను విలేఖరులకు చుపించారు. మెదక్ మార్కెట్ యార్డులో సెక్రటరీ పోస్ట్, సూపర్‌వైజర్ పోస్ట్, సీనియర్ అసిస్టేంట్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో 4వ తరగతి ఉద్యోగులు, ఓక మహిళ జూనియర్ అసిస్టేంట్ మాత్రమే దర్శనమిస్తారు. తమను ఎవరు పట్టించుకోవడం లేదని రైతులను కోరె లక్ష్మయ్య, దుర్గయ్య తెలిపారు. ఈనెల 8 వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదని ఎయంసి చైర్మన్ చంద్రపాల్ తెలిపారు.
* ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
* సొసైటీ చైర్మన్ సత్యవర్ధన్‌రావు
మెదక్ సొసైటీ ఆధ్వర్యంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని మెదక్ సొసైటీ చైర్మన్ సత్యవర్ధన్‌రావు సోమవారం నాడు మాట్లాడుతూ తెలిపారు. రవాణా సౌకర్యం కోసం సివిల్ సప్లయ్ అనుమతి కోరామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం రశీదు పుస్తకాలు కూడా వచ్చాయన్నారు. సర్ధనలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నాడు ప్రారంభించామని ఆయన తెలిపారు. పిల్లికొట్టాల చాముండేశ్వరి రైస్ మిల్ ధాన్యం గానుగాడించేందుకు అలాట్‌మెంట్ చేసినట్లు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు తొడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ తెలిపారు. ఈ సంవత్సరం 2 లక్షల బాయిడ్ల్ ధాన్యంను గానుగ ఆడించనున్నట్లు ఆయన తెలిపారు.

* ధాన్యంను ఖరీదు చేసే అధికారులు కరువయ్యారు * ధాన్యం ప్రారంభ క్రార్యక్రమాలకు కోడ్ అడ్డం * మార్కెట్ యార్డులో ఎదురు చూపుల్లో రైతులు
english title: 
v

కాంగ్రెస్ భావినేతగా ప్రియాంక ..

$
0
0

సిబిఐకి స్వేచ్ఛ

$
0
0

న్యూఢిల్లీ, మే 6: అవినీతి కేసుల దర్యాప్తులో సిబిఐకి విస్తృత స్వేచ్ఛ కల్పిస్తూ సుప్రీం కోర్టు మంగళవారం చారిత్రక తీర్పు వెలువరించింది. అధికారులు ఏ స్థాయిలో ఉన్నా అవినీతికి పాల్పడితే ప్రభుత్వ అనుమతి లేకుండానే వారిని ప్రాసిక్యూట్ చేసే అధికార స్వేచ్ఛను సిబిఐకి కల్పించింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంటే తప్ప ఉన్నతస్థాయి అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించే అలాగే ప్రాసిక్యూట్ చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉండేది కాదు. ఇప్పుడు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచి వెలువరించిన తీర్పుతో దర్యాప్తుపరంగా సిబిఐకి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. అవినీతికి పాల్పడే వ్యక్తులు ఎగువ స్థానంలో ఉన్నా, దిగువ స్థాయిలో ఉన్నా కూడా ఒకే గూటి పక్షులని, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ విషయంలో వీరి పట్ల ఎలాంటి తారతమ్యాన్ని పాటించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎమ్.లోధా సారధ్యంలోని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. సంయుక్త కార్యదర్శి లేదా ఆ పైస్థాయి అధికారిపై దర్యాప్తు జరపాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ చట్టంలోని 6ఎ సెక్షన్ ప్రకారం సిబిఐ అధికారులు ముందుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రతిబంధక చట్టాన్ని తన విస్తృత స్థాయి తీర్పులో భాగంగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్ వల్ల నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఉండదని, అలాగే నేరాలకు పాల్పడే వారికి ఇది రక్షణ కవచంగా పని చేస్తోందని కూడా సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అనుమతి లేని కారణంగా ఉన్నత స్థాయి అధికారుల అవినీతి కేసుల దర్యాప్తు విషయంలో ఇప్పటి వరకూ సిబిఐ అనేక ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన అవినీతి అధికారులు అవినీతిపరులు కాకుండా పోతారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. స్థాయి, హోదా ఏదైనా అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు అవినీతి పరులేనని ఇందులో ఎలాంటి మినహాయింపునకు ఆస్కారమే లేదని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు అధికారుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థే భ్రష్టుపట్టిపోతుందని తెలిపింది. 1988నాటి అవినీతి నిరోధక చట్ట ప్రకారం నిందితులైన వ్యక్తులు ఎవరైనా సరే ఎలాంటి తేడా లేకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాల్సిందేనని, ఈ విషయంలో 6ఎ సెక్షన్ తీవ్ర ప్రతిబంధకమే అవుతోందని తెలిపింది. అంతే కాకుండా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని నిర్మూలించాలన్న లక్ష్యానికే ఇది విఘాతకంగా పరిణమిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతే కాకుండా చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్న 14వ అధికరణ ముందు ఈ సెక్షన్ ఎంత మాత్రం నిలువదని న్యాయమూర్తులు ఎకె పట్నాయక్,ఎస్‌జె ముఖోపాధ్యాయ,దీపక్ మిశ్రా, కలిఫుల్లాలతో కూడిన సుప్రీం బెంచి విస్పష్టంగా తెలియజేసింది. పైగా ఈ సెక్షన్ వల్ల అధికారులకు కలుగుతున్న రక్షణ ఉన్నత స్థాయిలో అవినీతి మరింతగా పెంచుతోందని, దీన్ని కొనసాగించడం వల్ల చట్ట పరంగా ఉద్దేశించిన అవినీతి నిర్మూలన గానీ, ప్రజాహితంగానీ ఎంత మాత్రం నెరవేరే అవకాశం లేదని సుప్రీం బెంచి వ్యాఖ్యానించింది.

ఉన్నతాధికారులపై దర్యాప్తునకు సర్కారు అనుమతి అనవసరం ‘్ఢల్లీ’ చట్టంలోని సెక్షన్ 6ఎ కొట్టివేత సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం రూలింగ్
english title: 
cbi

‘స్నూప్‌గేట్’ కొత్తమలుపు

$
0
0

న్యూఢిల్లీ, మే 6: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని రాజకీయంగా వేధిస్తోన్న స్నూప్‌గేట్ వ్యవహారం మంగళవారం అనూహ్యమలుపు తిరిగింది. ఏ యువతిపైన అయితే మోదీ ఈ నిఘాకు ఆదేశించారని ఆరోపణలు వచ్చాయో ఆ యువతే తన తండ్రి సహా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్నూప్‌గేట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏరకమైన దర్యాప్తు కమిషన్లు వేయకుండా నిరోధించాలని కోరింది. తండ్రి కుమార్తెలు ఇద్దరూ సంయుక్తంగా ఈ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు రంజానా ప్రకాష్ దేశాయ్, ఎన్వీ రమణల బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, సంబంధిత వ్యక్తులను విచారించకుండా తాము వ్యాజ్యాలపై ఏరకంగానూ తాత్కాలిక స్టే ఉత్తర్వులు మంజూరు చేయలేమని సుప్రీం బెంచ్ తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారానికల్లా సమాధానం చెప్పాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. కాగా తమ ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని వ్యక్తిగత జీవితానికి ఏరకంగానూ భంగం కలగకుండా ఊడాలని, హూందాగా జీవించే హక్కునూ పరిరక్షించాలని పిటీషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో ఈ మహిళ పేరును ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదని సుప్రీం కోర్టు మీడియాను ఆదేశించింది. గత ఏడాది ఈ స్నూప్‌గేట్ వ్యవహారాన్ని రెండు మీడియా సంస్థలు వెలుగులోకి తెచ్చినప్పటి నుంచీ జాతీయస్థాయిలో ఇది దుమారాన్ని రేపుతూనే ఉంది. నరేంద్రమోదీ, అమిత్ షాల మధ్య జరిగిన సంభాషణల సీడీలను ఆ వార్తా పోర్టళ్లు విడుదల చేయడంతో బిజెపి వ్యతిరేక పార్టీలకు ఇది రాజకీయ ఆయుధంగా మారింది. 2000లో ఓ మహిళపై నిఘా పెట్టాలంటూ అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా ఇద్దరు ఉన్నతస్థాయి పోలీసు అధికార్లను ఆదేశించినట్టుగా ఈ సీడీలు స్పష్టం చేశాయి. 2009 ఆగస్టు -సెప్టెంబర్ మధ్యకాలంలో జరిగినట్టుగా చెప్తోన్న ఈ సంభాషణల్లో ఎక్కడాకూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీ పేరు ప్రస్తావన లేదు. అయితే, అందులో సాహెబ్ అన్న మాటను వాడటం వల్ల అది మోదీని ఉద్దేశించి వాడిందేనన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. దాంతో గుజరాత్ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే సదరు మహిళా ఆర్కిటెక్ట్‌పై నిఘా పెట్టారన్న ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిషన్ వేస్తామని గత వారం రోజులుగా చెప్తూ వస్తోన్న కేంద్రం, ఆ బాధ్యతను కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వానికే అప్పగిస్తామని చేతులెత్తేసింది. ఈనేపథ్యంలో బాధిత మహిళే స్వయంగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం, ఏరకమైన దర్యాప్తులూ వద్దని కోరటం కొసమెరుపు.

ఏ దర్యాప్తూ వద్దు సుప్రీంను ఆశ్రయించిన బాధితురాలు కేంద్రం, గుజరాత్‌కు నోటీసులు
english title: 
s

వాద్రాపై దర్యాప్తు రాజె సర్కారు ఆదేశం

$
0
0

జైపూర్, మే 6: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూలావాదేవీలకు సంబంధించి నిజానిజాలు కూపీ లాగేందుకు రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం దర్యాప్తునకు ఆదేశించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వాద్రా తన పలుకుబడి ఉపయోగించి భూఅక్రమాలకు పల్పడ్డారన్న ఆరోపణలపై వసుంధర రాజె ప్రభుత్వం తాజా దర్యాప్తును చేపట్టింది. జోధ్‌పూర్, బార్మెర్, బైకనీర్ జిల్లా కలెక్టర్లను వాద్రా భూలావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, ఈ వ్యవహారాలకు సంబంధించి వాస్తవ వివరాలతో ఓ ముసాయిదా నివేదిక కూడా అందించాలని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈనెల ద్వితీయార్థానికల్లా వివరాలు అందించాలని కలెక్టర్లను స్పష్టంగా ఆదేశించినట్టు తెలిపింది. గత కొంతకాలంలో సిఎంవో అధికార్లు సంబంధిత జిల్లా కలెక్టర్లతో అనుసంధానపై పని చేస్తున్నారని, ఎప్పటికప్పుడు వివరాల సేకరణను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వాద్రాకు వాటాలున్నట్టుగా భావిస్తోన్న కంపెనీలు బైకనీర్, జోధ్‌పూర్, బార్మెర్లలో వేలాది ఎకరాల మేర భూములు సేకరించాయని, 2009-12 సంవత్సరాల మధ్య ఈ వ్యవహారం చోటు చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భూములను కేటాయించే పథకాన్ని చేపట్టింది. ఎప్పుడైతే భూముల కేటాయింపు ప్రకటన జరిగిందో, వాటిని సదరు కంపెనీలు భారీ లాభాలకు విక్రయించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని బిజెపి ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, రాజె సర్కార్ ఈ విచారణకు ఆదేశించింది. కాగా, వాద్రాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ కొట్టివేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూలావాదేవీలకు సంబంధించి నిజానిజాలు కూపీ లాగేందుకు
english title: 
v

ఇద్దరికీ.. చావోరేవో!

$
0
0

హైదరాబాద్, మే 6: సీమాంధ్రలో ముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో సంకుల సమరం సాగుతోంది. గెలుపు గుర్రాల అంచనాల్లో ఉన్న తెదేపా, వైకాపాలు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి. వైకాపా నేత జగన్‌కు ఇవి తొలి ఎన్నికలు కాగా, తెదేపా నేత చంద్రబాబుకు దాదాపుగా చివరి ఎన్నికలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. దీంతో విజయం సాధించేందుకు చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావించి జగన్ ప్రచారంలో దూసుకెళ్లారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాల క్రేజీ ముందు తన బలం సరిపోదని భావించిన చంద్రబాబు, ప్రచార వ్యూహాన్ని మార్చుకుని బలం పెంచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రారంభంలో జగన్ హవాకు ఎదురులేదనే అభిప్రాయం కలిగినా, తెదేపా తరఫున నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ ప్రచారం తరువాత ఆ పార్టీ పుంజుకుందనే అభిప్రాయం బలంగా వినిపించింది. 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. విభజన తరువాత తొలి ఎన్నికలు కావడంతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని సీమాంధ్రులు లక్షల మంది పోలింగ్ రోజు కోసం తమ తమ గ్రామాలకు తరలి వెళ్లారు. ఓదార్పు యాత్ర, షర్మిల పాదయాత్ర పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ముందుగానే ప్రచారం ప్రారంభించి జనంలోకి చొచ్చుకెళ్లింది. చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేసినా, అనేక హామీలు కురిపించినా పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రచారం, తెదేపా -్భజపా కూటమికి మద్దతుగా పవన్ కల్యాణ్ సాగించిన ప్రచారంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా తెదేపా పుంజుకుంది. మోదీ క్రేజీని గమనించి పొత్తు కోసం చంద్రబాబే చేయి చాపారు. మోదీ సమక్షంలో పలకరించడానికి సైతం పవన్ కల్యాణ్ ఇష్టపడక పోయినా ఇంటికెళ్లి మద్దతు సాధించారు. జగన్‌కు ఏయే కులాలు, వర్గాల్లో మద్దతు ఉందో గమనించి ఆ వర్గాల నేతలను ఆకట్టుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డారు. క్రైస్తవుల ఓట్ల కోసం కెఎ పాల్ మద్దతు సాధించారు. దళితుల కోసం మందకృష్ణ మాదిగ, సీమాంధ్రలో బీసీల మద్దతు కోసం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆర్ కృష్ణయ్య పేరు ప్రకటించారు. తెదేపాలో నంబర్ 2 అంటూ ఎవరూ ఉండరని ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ప్రకటించడమే కాకుండా ఆచరించి చూపించారు. అలాంటి బాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే బీసీని, కాపును ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. తెదేపా చరిత్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రచార మాధ్యమాల మద్దతు సాధించారు. నాలుగు పదుల వయస్సున్న జగన్‌ను ఆరుపదుల వయసు దాటిన చంద్రబాబు ఢీ కొంటున్నారు.
మరోవైపు బాబు ప్రచారం ఎలా ఉన్నా విజయం తమదే అనే ధీమాతో వైఎస్సార్ కాంగ్రెస్ ఉంది. పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు ఈ నాలుగు పథకాలు వైఎస్సార్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు జగన్‌ను అధికారంలోకి తీసుకు రానున్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త రాష్ట్రం కొత్త రాజధాని కాబట్టి బాబుకు అధికారం ఇవ్వడం ద్వారా సరికొత్త రాజధాని నిర్మించుకోవచ్చని తెదేపా ప్రచారం చేస్తుంటే, కొత్త రాజధాని ఎలా ఉండాలో జగన్ బ్లూప్రింట్ విడుదల చేశారు. సీమాంధ్ర ఎన్నికల్లో ప్రచారం తీరు ఎలా ఉన్నా అంతిమంగా కుల రాజకీయాలు పని చేస్తాయి. ప్రతి కులాన్నీ సంతృప్తిపర్చి అధికారంలోకి రావడానికి బాబు సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. చివరకు బెత్లెహేంకు వెళ్లడానికి క్రైస్తవులకు ఆర్థిక సహాయం కూడా బాబు తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. చివరకు జగన్ సైతం ఇలాంటి హామీలు ఇవ్వలేదు. ఎవరెన్ని హామీలు కురిపించినా సీమాంధ్రలో కులాల కాంబినేషనే విజేతలను నిర్ణయిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. సీమాంధ్రలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, హింసాత్మక సంఘటనలు సైతం చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

సీమాంధ్రలో సంకుల సమరం సర్వశక్తులూ ఒడ్డిన బాబు ‘సంక్షేమం’పై జగన్ ఆశలు ఎదురీదుతున్న మిగతా పార్టీలు
english title: 
i

మళ్లీ.. ‘విభజన రన్’’

$
0
0

హైదరాబాద్, మే 6: రాష్ట్ర విభజన ప్రక్రియ మళ్లీ పరుగందుకుంది. కార్పొరేషన్ల పంపకాలు, ఏపీ భవన్ పంపకం, పోలీసు బలగాలకు సంబంధించిన అంశాలు వంటివాటిపై గవర్నర్ నరసింహన్ నిశితంగా సమీక్షించారు. గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్, ఎఎన్ రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లాం, పివి రమేష్, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, ఏపీ భవన్ కమిషనర్ శశాంక్ గోయల్ తదితరులతో చర్చించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ కూడా 7న ముగుస్తోన్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు అవసరైన ఛాంబర్లు వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. శాసనసభకు సంబంధించిన విభజన పనులను, మరమ్మతులను 20లోగా పూర్తి చేయాలని శాసనసభ కార్యదర్శి రాజా సదారాంను ఆదేశించారు. పోలీసు భవనాల విభజన కూడా జూన్ రెండునుంచి అమల్లోకి వస్తుందని, దీనికోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 179 ప్రభుత్వ శాఖలు ఉన్నాయని, వాటికి సంబంధించి రెండు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. అలాగే సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎ, బి, సి, డి బ్లాకులను, సీమాంధ్ర రాష్ట్రానికి మిగిలిన బ్లాకులను కేటాయించాలని నిర్ణయిస్తూ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అలాగే సీమాంధ్ర ముఖ్యమంత్రికి లేక్‌వ్యూ అతిథి గృహాన్ని క్యాంప్ కార్యాలయంగా సమకూర్చేందుకు కూడా గవర్నర్ అంగీకరించారు. ఇక జూబ్లీ హాలును కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలను నిర్వహించుకునేందుకు కేటాయించారు. ఇలాఉండగా, 20 కార్పొరేషన్లను ఇరు రాష్ట్రాలకు కేటాయించేందుకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్ సమీక్షించారు. ప్రధానంగా ఆర్టీసీ, ఎపి బేవరేజెస్, ఇతర కీలక కార్పొరేషన్ల పంపకాలపై ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్దేశించారు. మరో 22 ప్రభుత్వ శాఖలనూ ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే మూడు కీలక ప్రభుత్వ సంస్థలను అనవసరమైనవిగా గుర్తించి మూసివేయాలనీ నిర్ణయించినట్టు సమాచారం. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తాత్కాలికంగా ఇరు రాష్ట్రాలకు కొనసాగించాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న గదులను కేటాయించాలని నిర్ణయించారు. తరువాత కొత్తగా వచ్చే ముఖ్యమంత్రులు తమకు సంబంధించిన కొత్త భవన్‌లు ఏర్పాటు చేసుకుంటాయని సమావేశంలో నిర్ణయించారు. అలాగే, గురువారం నుంచి విభజన ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలింగ్ కూడా ముగిసిపోవడంతో ఎన్నికల కోడ్ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపకాలు ముందుగాకాకుండా, జూన్ 1న జరుగుతాయని కేంద్రం నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం.

పంపకాల ప్రక్రియపై గవర్నర్ సమీక్ష రెండు రాష్ట్రాలకు 20 కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్ల రద్దుకు నిర్ణయం ఇద్దరికీ తాత్కాలికంగా ఒకే ఏపీ భవన్ జూన్ 1న ఏఐఎస్ అధికారుల పంపకం సీమాంధ్ర సిఎంకు.. ‘లేక్ వ్యూ
english title: 
v

బరి నుంచి తప్పుకున్న హరి

$
0
0

విశాఖపట్నం, మే 6: జై సమైక్యాంధ్ర పార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి చెందిన నలుగురు అసెంబ్లీ అభ్యర్థులు బరినుంచి తప్పుకుని తెదేపాలో చేరి ఒక్కరోజు కూడా గడవకముందే విశాఖ లోక్‌సభకు ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న సబ్బం హరి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. జై సమైక్యాంధ్ర పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎన్డీయే అభ్యర్థులను బలపర్చాలంటూ పిలుపునిచ్చారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన పోలింగ్‌కు కేవలం 24 గంటలముందు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన పోటీ చేస్తే కనీస ఓట్లు కూడా వస్తాయా? రావా? అన్న అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర విభజపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వనందుకు నిరసనగా తాను ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తనపై అభిమానంతో తనకు ఓటు వేయాలనుకున్న వారు ఈవిఎంలో ఉన్న పాదరక్షల గుర్తుకు ఓటు వేయవద్దని హరి సూచించారు. తెలుగుదేశం, బిజెపి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ విశాఖకు రావటం వెనుక మర్మం తనకు తెలుసునన్నారు. ఎటూ కెసిఆర్ వీరిని హైదరాబాద్ రానివ్వడు కాబట్టి విశాఖ వనరులపై జగన్ కన్నుపడిందన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే, టిడిపి అభ్యర్థులకే ఓటెయ్యాలన్నారు. ‘రాష్ట్ర విభజన అంశాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తుందని, విభజనపై స్టే వస్తుందని భావించాం.. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాం’ అన్నారు. రాష్ట్ర విభజన తేదీ ఖరారైందని, సుప్రీం కోర్టు ఈ కేసును ఆగస్ట్ 20కి వాయిదా వేయడం శోచనీయమని హరి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పునిచ్చినా, జరిగిన పొరపాట్లకు సంబంధించి కేంద్రానికి మొట్టికాయలు మాత్రమే వేస్తుంది తప్ప, విడిపోయిన రాష్ట్రాన్ని కలిపే అవకాశం లేదన్నారు. విభజనను అడ్డుకోడానికి ఉన్న అవకాశాలన్నీ మృగ్యమయ్యాయని, అందుకే జై సమైక్యాంధ్ర పార్టీకి రాజీనామా చేశానని హరి తెలియచేశారు.

భాజపా -తెదేపా కూటమికి ఓటేయాలని సబ్బం పిలుపు జైసపాకు మరో షాక్
english title: 
b

ఏడు రాష్ట్రాలు 64 స్థానాలు..

$
0
0

న్యూఢిల్లీ, మే 6: 16వ లోక్‌సభ ఎనిమిదో దశ పోలింగ్ బుధవారం జరుగుతోంది. 9 కోట్ల 55 లక్షల 22 వేల 471మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 897మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎనిమిదో విడతలో 64 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
సీమాంధ్రలో 25, బీహార్‌లో ఏడు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు, జమ్మూకాశ్మీర్‌లో రెండు, ఉత్తరప్రదేశ్‌లో 15, ఉత్తరాఖండ్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు లోక్‌సభ స్థానాల్లో 897మంది వివిధ పార్టీల టికెట్లపై పోటీ పడుతున్నారు. ఓటర్ల కోసం లక్షా 7వేల 430 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,83,650 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో 333, బీహార్‌లో ఏడు స్థానాల్లో 118మంది నిలబడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్లో 38, జమ్మూకాశ్మీర్ రెండు స్థానాలకు 19మంది, ఉత్తరప్రదేశ్‌లోని 15 లోక్‌సభ స్థానాల్లో 243 మంది, ఉత్తరాఖండ్‌లో ఐదు సీట్లలో 74 మంది, పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు 72మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఇంతవరకు జరిగిన ఏడు దశల పోలింగ్‌లో 438 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. తొమ్మిదో విడత పోలింగ్‌తో 16వ లోక్‌సభ ఎన్నికల పర్వం ముగుస్తుంది.
ఇలా ఉండగా బుధవారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (అమేథీ), ఆయన కజిన్ వరుణ్ (సుర్తాన్‌పూర్), కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ (గొండా), క్రికెటర్ మహ్మద్ కైఫ్ (్ఫల్‌పూర్) నియోజకవర్గాలున్నాయి. ఇవన్నీ యూపీ లోనివే. అలాగే బీహార్‌లో రాం విలాస్ పాశ్వాన్ (హాజీపూర్), రబ్రీదేవి, రాజీవ్ ప్రతాప్ రూడీ (శరన్)లో పోలింగ్ జరుగుతోంది.

నేడు ఎనిమిదో విడత పోలింగ్ ప్రముఖుల స్థానాలపై ఆసక్తి
english title: 
s

చలో సీమాంధ్ర

$
0
0

హైదరాబాద్, మే 6: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్ధానాల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగనుందా ? సీమాంధ్ర ప్రజల మూడ్ చూస్తుంటే కచ్చితంగా 75 నుంచి 80 శాతం మధ్య ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక నుంచి కూడా భారీ ఎత్తున ఆంధ్రాకు ఓటర్లు తరలి వెళ్లారు. స్వగ్రామంలో ఈ సారి ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలనే తపనతో ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ నుంచే దాదాపు వెయ్యికి పైగా ఆర్టీసి బస్సులు సీమాంధ్రకు వెళ్లాయి. దీనికి తోడు ప్రైవేట్ బస్సులు, రైళ్లలో ప్రజలు తమ జిల్లాలకు వెళ్లారు. గతంలో ఇటువంటి పరిణామాన్ని చూడలేదని రాజకీయ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన జరిగిన ఎన్నికలో 72 శాతం వరకు ఓట్లుపోలయ్యాయి. ఆంధ్రాలో మాత్రం ఓట్ల శాతం కొన్ని చోట్ల గరిష్టంగా 85 శాతం వరకు పోలయ్యేటట్లు కనపడుతోంది. ‘ సీమాంధ్ర ప్రజలు కసితో ఉన్నారు. విభజనకు కారణమైన పార్టీని ఓడించడం కంటే, దార్శనికత ఉన్న గట్టి నేతను ఎన్నుకోవాలనే ఆత్రత ఓటర్లలో కనపడుతోంది’ అని పోలీసునిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇందులో 30 శాతం వరకు ఓటర్లకు ఆయారాజకీయ పార్టీలే వాహనాలను ఏర్పాటు చేయడం విశేషం.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వివిధ జిల్లాల్లో మధ్య తరగతి వర్గం ఓటర్లు ఈ సారి ఎక్కువ చైతన్యంతో ఉన్నారు. ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో వారిలో కనపడుతోంది. భారీ పోలింగ్ నమోదైతే తమకు లాభమంటే తమకు లాభమని వైకాపా, టిడిపి పార్టీల నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. రాష్ట్ర విభజన, అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే నేతకు తమ ఓటు ఉంటుందని హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఓటర్లు చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం అనేది ఎప్పుడూ ఉండేదని, కాని అన్నివౌలిక సదుపాయాలతో కూడిన రాజధాని నిర్మాణం వల్ల కొన్ని వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి లభిస్తుందని హైదరాబాద్‌లో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒక స్కిల్డ్ వర్కర్ చెప్పారు. తాను తన కుటుంబ సభ్యులు, బంధు పరివారం మొత్తం దర్శి, కనిగిరిలో ఓట్లు ఉన్నాయని ఆ కార్మికుడు చెప్పారు. కృష్ణా , గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అనేక వేల మంది కార్మికులు మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ కుల వృత్తులు చేసుకుని జీవిస్తున్నారు.

తరలుతున్న ‘పొరుగు’ ఓటర్లు భారీ పోలింగ్‌కు చాన్స్?
english title: 
c

పదండి ఓటుకు

$
0
0

హైదరాబాద్, మే 6: రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల కోసం కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న అరకు, పాడేరు నియోజక వర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, కురుపాం, సాలూరు, పార్వతీపురం, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గుజరాల, మాచర్ల స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, రెండోదశ ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకు 2241 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 333మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 13 జిల్లాల్లో 3.67 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ ప్రాంతం కన్నా సీమాంధ్రలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉండటంతో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయని ఎన్నికల అధికార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ పరిస్థితి చేరుకోవడం తెలిసిందే. తెలుగుదేశం, వైకాపా మధ్య గట్టి పోటీ నడుస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. అటువంటి ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల అధికార్లు నిర్ణయించారు. ప్రధానంగా రాయలసీమలో పరిస్థితి మరింత సమస్యాత్మకంగా ఉంటుందని భావిస్తున్న ఎన్నికల అధికారులు, అక్కడ పోలీసులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఇంటలిజెన్స్ అధికారుల నుంచి కూడా ఈ ప్రాంతాలపై నివేదికలు వస్తున్నాయి. మావోయిస్టు ప్రాంతాల కన్నా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. సీమాంధ్ర ఎన్నికల కోసం 272 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధం చేయగా, అందులో వంద కంపెనీలను మావోయిస్టు, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లోనే మోహరిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించడం గమనార్హం. ఇలా ఉండగా, 13 జిల్లాల్లో మొత్తం 40708 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులో 23 వేల కేంద్రాల్లో పోలింగ్ సరళిని నేరుగా పర్యవేక్షించేందుకు లైవ్ వెబ్ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో భారీగా డబ్బు, మద్యం ప్రవహిస్తోంది. ఇప్పటికే 140 కోట్లను స్వాధీనం చేసుకోగా, చివరి రెండు రోజుల్లోనే పట్టుబడని మొత్తం వందల కోట్లలో చేతులు మారినట్టు అంచనా. ఇక లక్షల లీటర్ల మద్యం కూడా పోలింగ్ సమయంలో ఏరులై ప్రవహిస్తోంది. దీనిపైనా ఎన్నికల అధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడటంతో ఒకరిపై ఒకరు చేసుకునే ఫిర్యాదులు కూడా పెద్ద సంఖ్యలో ఎన్నికల కమిషన్‌కు చేరుకుంటున్నాయి.
కాగా, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలోకి దిగిన సబ్బం హరికి నోటీసు జారీ చేస్తున్నట్టు భన్వర్‌లాల్ ప్రకటించారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, బిజెపి అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తున్నానని సబ్బం హరి చేసిన ప్రకటనపై నోటీసు జారీ చేస్తున్నట్టు భన్వర్‌లాల్ వెల్లడించారు.

సీమాంధ్రలో సార్వత్రిక పోలింగ్ నేడు నువ్వా నేనా రీతిలో ఆధిపత్య పోరు 175 అసెంబ్లీ స్థానాలకు 2241మంది, 25 లోక్‌సభ స్థానాలకు 333మంది అభ్యర్థులు ఘర్షణలపై ఇంటలిజెన్స్ నివేదికలు భారీగా మోహరించిన సాయుధ బలగాలు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్
english title: 
p

చాలెంజర్స్‌కు ముంబయి షాక్

$
0
0

ముంబయి, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది. ముంబయిలోని సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో 19 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్‌ను ఓడించి ఈ సీజన్‌లో ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ అర్థ శతకంతో కదం తొక్కగా, కీరన్ పొలార్డ్ 43 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించగా, రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే రాబట్టింది. రాయల్ చాలెంజర్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు క్రిస్ గేల్ (38), పార్థివ్ పటేల్ (26), కెప్టెన్ విరాట్ కోహ్లీ (35), చివర్లో రిలీ రొసెయు (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ సీజన్‌లో నాలుగో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ ముంబయి ఇండియన్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ జట్టులో ఓపెనర్ బెన్ డంక్ (15), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (9) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ వికెట్ కీపర్ చిదంబరం గౌతమ్‌తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో మూడు సిక్సర్లు, మరో రెండు ఫోర్ల సహాయంతో 30 పరుగులు సాధించిన గౌతమ్ 9వ ఓవర్‌లో వరుణ్ ఆరోన్ వేసిన బంతిని ఎదుర్కోబోయి వికెట్ల వెనుక పార్థివ్ పటేల్ చేతికి చిక్కగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కొరీ ఆండర్సన్ 6 పరుగులకే నిష్క్రమించాడు. ఈ తరుణంలో రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు తీయించారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు ఐదో వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత పొలార్డ్ (43) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరగా, 35 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మరో మూడు ఫోర్ల సహాయంతో 59 పరుగులు సాధించిన రోహిత్ శర్మ అజేయంగా నిలిచాడు. దీంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, అశోక్ దిండా, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ ఆరోన్ ఒక్కో వికెట్ రాబట్టారు.
అనంతరం 188 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్, పార్థివ్ పటేల్ 53 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆరో ఓవర్‌లో హర్భజన్ వేసిన బంతికి పార్థివ్ (26) క్లీన్‌బౌల్డ్ అవడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఈ తరుణంలో విరాట్ కోహ్లీతో కలసి రెండో వికెట్‌కు మరో 41 పరుగులు జోడించిన గేల్ (38) కూడా హర్భజన్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా, కొద్దిసేపటికి ఎ.బి.డివిలియర్స్ (9)తో పాటు కోహ్లీ (35) కూడా పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత రిలీ రొసెయు (24) మినహా మిగిలిన వారంతా రెండంకెల స్కోర్లు చేయకుండానే నిష్క్రమించారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
chitram..
ముంబయని గెలిపించిన
కెప్టెన్ రోహిత్ శర్మ (59-నాటౌట్)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్
english title: 
c

పోలింగ్ ప్రశాంతం

$
0
0

విజయనగరం, మే 7: జిల్లాలో అక్కడక్కడ ఇవిఎంలు మొరాయింపు..లైవ్ వెబ్‌కాస్టింగ్‌ల మొరాయింపు... రిగ్గింగ్‌నకు యత్నాలు... తదితర సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జనరల్ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగ్గా, రిజర్వుడు స్థానాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా సరాసరి పోలింగ్ ఉదయం 9 గంటల సమయానికి 17.56 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటలకు 37.49, మధ్యాహ్నాం 1 గంటకు 53.3, మధ్యాహ్నాం 3 గంటలకు 65.1, సాయంత్రం 5 గంటలకు 70.71 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో లోక్‌సభ స్థానానికి 9 మంది బరిలో నిలవగా, 77 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, బొబ్బిలితోపాటు రిజర్వుడు స్ధానాలైన పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కొత్తవలస మండలం ఎగువ ఎర్రవానిపాలెంలో 80 ఓట్లు ఉన్న చోట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, 140 ఓట్లు ఉన్న దిగువ ఎర్రవానిపాలెంనకు ఎందుకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని అక్కడ ఓటర్లు ప్రశ్నించారు. మధ్యాహ్నాం 2 గంటల వరకు ఓటుహక్కును వినియోగించకుండా భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వారికి నచ్చజెప్పి ఎగువ ఎర్రవానిపాలెంలో ఓట్లు వేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. విజయనగరంలోని గోకపేటలోను, బొబ్బిలి, తెర్లాం తదితర చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో అర్థగంట ఆలస్యంగా పోలింగ్‌ను ప్రారంభించారు. కొమరాడ మండలం కొడిశిల, వేపుకొన పోలింగ్ కేంద్రాల్లో వైకాపా కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో అక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామంలో టిడిపి గుర్తు బటన్ నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు లైటు వెలిగిందని ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలం విశ్వనాధపురంలో ఇవిఎంబటన్ నొక్కితే ఐదు ఓట్లు పడ్డాయని ఓటరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. దీంతో అక్కడ టిడిపి ఏజంట్, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక పలుచోట్ల ఇవిఎంలు మొరాయించడంతో వాటిని మార్పు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో అతి సమస్యాత్మక గ్రామాల్లో 617 చోట్ల లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా, 21 చోట్ల లైవ్ వెబ్‌కాస్టింగ్ పనిచేయకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. ఇవి మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
ఆశ, నిరాశల మధ్య
ప్రధాన పార్టీల అభ్యర్థులు!
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు తమ జాతకాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో లోక్‌సభ స్థానానికి 9 మంది బరిలో నిలవగా, 77 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీలో ఉన్నారు. లోక్‌సభ స్థానానికి టిడిపి, కాంగ్రెస్, వైకాపా, బిఎస్పీ, జెఎస్‌ఎ, అమ్ ఆద్మీ, పిరమిడ్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఎలాగైనా గెలుపు సాధించాలని అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఈ దఫా ఎన్నికల్లో టిడిపికి, వైకాపాకు ఆశాజనకంగా ఫలితాలు ఉండవచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో టిడిపి నుంచి అశోక్‌గజపతిరాజు, వైకాపా నుంచి బేబినాయన, కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీలక్ష్మి, బీఎస్పీ నుంచి బోను కృష్ణ, జై సమైక్యాంధ్ర నుంచి టి.రమేష్‌నాయుడు, అమ్ ఆద్మీ నుంచి నారు సింహాద్రినాయుడు, స్వతంత్ర అభ్యర్థిగా కె.హరికిషన్ పోటీ చేసిన విషయం విదితమే. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన అశోక్‌గజపతిరాజు, బొత్స ఝాన్సీలక్ష్మి, బేబినాయనలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ నామమాత్రపు పోటీ మాత్రమేనని అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే... చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడోసారి బరిలో దిగడంతో ఈ నియోజకవర్గంపై అందరిదృష్టిపడింది. ఇక్కడ హాట్రిక్ కోసం ఆయన ప్రయత్నిస్తుండగా, వైకాపా నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్‌రావు, టిడిపి నుంచి శ్రీకాకుళం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కిమిడి మృణాళిని గట్టి పోటీ నిచ్చారు. దీంతో ఇక్కడ మాజీ మంత్రి బొత్సకు ముచ్చెమటలు పట్టాయి. ఇక్కడ ఓటర్లు గుంభనంగా ఉండటంతో ఎవరిని ఆదరించారన్నదీ విశే్లషకులు అంచనా వేయలేకపోతున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి మీసాల గీత, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కర్ఫ్యూ ప్రభావం, సమైక్యాంధ్రఉద్యమం వంటి సంఘటనల వల్ల ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి గీత, వైకాపా అభ్యర్థి కోలగట్లలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి వైకాపా నుంచి ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ సుజయ్‌కృష్ణ రంగారావు, కాంగ్రెస్ నుంచి మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పోటీ చేశారు. ఇక్కడ కూడా టిడిపికి ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. నెల్లిమర్ల నుంచి టిడిపి తరఫున మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైకాపా నుంచి పి.సాంబశివరాజు తనయుడు పివివి సూర్యనారాయణరాజు, జైసమైక్యాంధ్ర నుంచి టి.సత్యనారాయణ పోటీ చేశారు. వీరిలో మాజీ మంత్రి పతివాడకు అవకాశాలు కాస్తా మెండుగా ఉన్నాయి. కురుపాంలో వైకాపా నుంచి పి.పుష్పశ్రీవాణి, టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వి.టి.జనార్థన్ తాట్రాజ్, కాంగ్రెస్ నుంచి ఇంద్రసేన్ వర్థన్ బరిలో నిలిచారు. ఇక్కడ సిపిఎంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నలుగురు పోటీ చేశారు. ఇక్కడ టిడిపి రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్ గట్టిపోటీనిచ్చారు. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్, టిడిపి అభ్యర్థి తాట్రాజ్ మధ్య గట్టి పోటీ నిచ్చారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి ఎ.జోగారావు, టిడిపి నుంచి బి.చిరంజీవులు, వైకాపా నుంచి జె.ప్రసన్నకుమార్ బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, జైసమైక్యాంధ్ర, సిపిఎం పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ వీరి పోటీ నామమాత్రమే. సాలూరులో వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొర, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, కాంగ్రెస్ నుంచి ఆండ్రబాబా పోటీ చేశారు. వీరితోపాటు సిపిఐ, సిపిఎం పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. గజపతినగరంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, టిడిపి నుంచి కె.ఎ.నాయుడు, వైకాపా నుంచి కడుబండి శ్రీనివాస్‌లు బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్, టిడిపిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ అప్పలనర్సయ్యకు గెలుపు అవకాశాలు కాస్తా ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ఎస్.కోటలో టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, కాంగ్రెస్ నుంచి ఇందుకూరి రఘరాజు, వైకాపా నుంచి ఆర్.జగన్నాధం పోటీ చేశారు. వీరితోపాటు బీఎస్పీ, జైసమైక్యాంధ్ర, అమ్‌ఆద్మీ, పిరమిడ్ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు పోటీ చేశారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారికి గెలుపు అవకాశాలు ఉండవచ్చని విశే్లషకులు అంటున్నారు. ఈ విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 78 శాతం పోలింగ్
విజయనగరం (టౌన్) మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం జిల్లాలో 78 శాతం జరిగింది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నకల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తిరిగి ముగిసే సమయానికి శాతం నమోదైంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించి సాయత్రం 5 గంటల సమయానికి 73.7 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటలకు 35.10 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 51.96 3 గంటలకు 64.69 శాతం పోలింగ్ పూర్తియింది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మధ్యాహ్నా 3 గంటల సమయానికి 65.16 శాతం పోలింగ్ జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 31 శాతం మధ్యాహ్నాం ఒంటిగంటకు 45 శాతం 3 గంటలకు 57 శాతం సాయత్రం 5 గంటలకు 63 శాతం పోలింగ్ పూర్తియింది. ఎస్ కోట నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 38 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 49, 3 గంటలకు 58, 5 గంటలకు 68 శాతం పోలింగ్ నమోదయింది. గజపతినగరంలో ఉదయం 11 గంటలకు 37 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 53, 3 గంటలకు 60, 5 గంటలకు 79 శాతం పోలింగ్ పూర్తియింది. చీపురుపల్లిలో ఉదయం 11 గంటలకు 29 శాతం మధ్యాహ్నాం ఒంటిగంటకు 40, సాయత్రం 3 గంటలకు 61.5, 5 గంటలకు 72 శాతం పోలింగ్ నమోదయింది. సాలూరు ఉదయం 11 గంటలకు 36 శాతం, మధ్యహ్నాం ఒంటిగంటకు 51, 3 గంటలకు 64, 5 గంటలకు 69 శాతం పోలింగ్ పూర్తియింది. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధి ఉదయం 11 గంటలకు 38 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 61, 3 గంటలకు 72, 5 గంటలకు 78 శాతం జరిగింది. కురుపాం 11 గంటలకు 45 శాతం, ఒంటిగంటకు 63, 3 గంటలకు 74 శాతం నమోదయింది. పార్వతీపురంలో 11 గంటలకు 38.44 ఒంటిగంటకు 59.5, 3 గంటలకు 69 శాతం పోలింగ్ నమోదయింది. నెల్లిమర్లలో 11 గంటలకు 45 శాతం, ఒంటిగంటకు 59, 3 గంటలకు 71 శాతం పోలింగ్ నమోదయింది.
ఓటు వేసిన ప్రముఖులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 7: సార్వత్రిక ఎన్నికలలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. విజయనగరంలో టిడిపి ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మీసాల గీత, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బొబ్బిలిలో వైకాపా అభ్యర్థులు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబినాయనలు తమ ఓటును వినియోగించుకున్నారు. పూసపాటిరేగ మండలం రెల్లివలసలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఓటు వేశారు. చీపురుపల్లిలో మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్.కోట మండలంలో టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, సాలూరులో వైకాపా అభ్యర్థి పీడిక రాజన్నదొర ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొరాయించిన ఇవిఎంలు.. * విశ్వనాధపురంలో బటన్ నొక్కితే ఐదు ఓట్లు ఒక గుర్తుకు ఓటువేస్తే.. మరో గుర్తు * 21 చోట్ల లైవ్ వెబ్‌కాస్టింగ్ లేనట్టే
english title: 
p
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>