కడప,మే 7: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో బుధవారం జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలు, ఘర్షణలు చోటుచేసుకున్నా ఓటర్లు వాటిని లెక్కచేయకుండా ఓటు హక్కును జిల్లా వ్యాప్తంగా 76.41 మంది వినియోగించుకున్నారు. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.82 శాతం మంది, అతి స్వల్పంగా కడప అసెంబ్లీ సెగ్మెంట్లో 55.99శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్లో 82శాతం, ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 77.80శాతం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 78.5శాతం, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 74శాతం, పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో 80శాతం, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లో 74.95 శాతం, రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 78శాతం, బద్వేలు అసెంబ్లీసెగ్మెంట్ లో 75శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో వాతావరణం ఉదయం 10గంటల వరకు,సాయంత్రం 4 గంటల తరువాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో 74 శాతం మొదలుకుని, 82 శాతం వరకు ఓటింగ్ జరిగింది. అయితే నేతలు మాత్రం గెలుపుధీమాతో ఆశల పల్లకిలో ఊగిపోతున్నారు. ఓటరు నాడి మాత్రం అంతుపట్టడంలేదు. జిల్లాలో రెండుపార్లమెంట్, పది అసెంబ్లీ సెగ్మెంట్లలలో 21,61,324 మంది ఓటర్లుండగా పురుషులు 10,62,658 మంది, మహిళలు 10,98,385మందిలో తమ ఓటు హక్కును 76.41 శాతం వినియోగించుకున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లే 35,627 మంది పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్లో కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో 1798, పది అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,540 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కులో 76.41 మంది వినియోగించుకున్నారు. కాగా నియోజకవర్గాల వారీగా పోలింగ్ ప్రక్రియ తీసుకుంటే బద్వేలు పురుషులు 1,09,300లు, మహిళలు 1,06,581 ఓటర్లలో 75శాతం, రాజంపేట పురుషులు 1,01,510, మహిళలు 1,08,376 ఓటర్లలో 78శాతం, కడప పురుషులు 1,34,508 మంది, మహిళలు 1,35,504 ఓటర్లలో 58.99శాతం, రైల్వేకోడూరు పురుషులు 85,492 మంది, మహిళలు 91,089 ఓటర్లలో 74శాతం, రాయచోటి పురుషులు 1,11,978మంది, మహిళలు 1,13,710 ఓటర్లలో 74.95శాతం, పులివెందుల పురుషులు 1,11,111 మంది, మహిళలు 1,13,882 ఓటర్లలో 80శాతం, కమలాపురం పురుషులు 92,189 మంది, మహిళలు 94,798 ఓటర్లలో 84.82శాతం, జమ్మలమడుగు పురుషులు 1,10.882 మంది, మహిళలు 1,10,817 ఓటర్లలో 82శాతం, ప్రొద్దుటూరు పురుషులు 1,19,554 మంది, మహిళలు 1,18,908 ఓటర్లలో 77.80శాతం, మైదుకూరు పురుషులు 95,694మంది, మహిళలు 99,259 ఓటర్లలో 78.5శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్లో ఫ్యాక్షన్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 7: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా పోలీసు అధికారులపై దాడులుచేసి వారి వాహనాలు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థుల వాహనాలను ధ్వంసంచేసి, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. అలాగే టిడిపి నేతలకు చెందిన మరో రెండు వాహనాలు, వైకాపాకు చెందిన ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. పలు నియోజకవర్గాల్లో వైకాపా, టిడిపి కార్యకర్తల, నేతల మద్య రాళ్లవర్షం, మారుణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇరుపార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు, నేతలు గాయపడ్డారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో యధేచ్చగా, ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. పులివెందులలో పోలింగ్ ముగిసే సమయంలో వైకాపా దొంగ ఓట్లు వేసుకుంటుండగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ సతీష్కుమార్డ్డి, కాంగ్రెస్ డిసిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకోగా అప్పటికే అక్కడికి చేరుకున్న వైకాపా నేతలు మంగళి కృష్ణప్ప, భాస్కర్రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. దీంతో ఇరువర్గాల మద్య మాటమాట పెరిగి వైకాపా నేతలపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించడంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు సతీష్రెడ్డి వాహనాన్ని ధ్వంసంచేసి, శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. ఈసంఘటనలో వైకాపా నేత భాస్కర్రెడ్డికి గాయాలయ్యాయి. కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదినె్న మండలం ఎర్రమాచుపల్లెలో టిడిపి వల్లూరు జెడ్పిటిసి అభ్యర్థి పుత్తా లక్ష్మిరెడ్డి, వైకాపా యువనాయకుడు, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి తనయుడు నానిలు పోలింగ్ ముగిసే సమయానికివెళ్లి పరస్పరం మాటమాట పెరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వారి ఇరువురి వాహనాలు ధ్వంసం చేశారు. అనంతరం పుత్తాలక్ష్మిరెడ్డి అనుచరులు గ్రామంపై మూకుమ్మడిగా దాడులు చేయడంతో ఆ గ్రామస్తులంతా కడప -పులివెందుల ప్రధాన రహదారిపై వందలాది మంది లక్ష్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సంఘటన తెలుసుకుని కడప డిఎస్పీ రాజేశ్వరరెడ్డి భారీ పోలీసు బలగాలతో మోహరించిన ఆందోళన కొనసాగింది. ఇక జిల్లాలో సంఘటనల విషయానికొస్తే ఫ్యాక్షన్కు నిలయమైన జమ్మలమడుగు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి సి.ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి సొంత ఇలాఖా అయిన దేవగుడిలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం స్వయంగా పోలీసు అధికారులే వెళ్లారు. దేవగుడికి ఇరువురు ఐపిఎస్ అధికారులు, జమ్మలమడుగు ఎఎస్పీ వెంకట అప్పలనాయుడు, బెటాలియన్ కమాండెంట్ రాజేష్కుమార్లు తమ సిబ్బందితో వెళ్లారు. అక్కడ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు వరుస తప్పి గుంపులు గుంపులుగా ఉండగా వారందర్నీ క్యూలో నిలుచుకుని ఓటేసు కోవాలని సూచించారు. దీంతో అక్కడి వైకాపా నేతలు, కార్యకర్తలు అధికారులపై తిరగబడి వాహనాలు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో సిద్దారెడ్డి, బాబు అనే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రాయలసీమ జోన్ ఐజి నవీన్ చంద్ ఈప్రాంతానికి ఎన్నికల అధికారిగా నియామకం చేసిన డిఐజి ఎం.సురేంద్రబాబులు హుటాహుటిని భారీ బలగాలతో వెళ్లి జమ్మలమడుగులో మకాంవేసి దేవగుడికి భారీ పోలీసు బలగాలు పంపి అక్కడ ఉన్న అధికారులను రప్పించారు. అలాగే దేవగుడి ఇలాఖా అయిన గొరిగనూరు పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్గా కూర్చోబెట్టడానికి రాజారెడ్డి అనే వ్యక్తిని టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడ వైకాపా నేతలు ఏజెంట్ ఫారాలు చించి ఆయన్ను కిడ్నాప్చేశారు. పి.రామసుబ్బారెడ్డి వారిని ప్రశ్నించగా ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే జమ్మలమడుగు పెద్ద ముడియం మండలం కొండ సుంకేసులలో వైకాపా, టిడిపిలు ముష్టియుద్ధానికి దిగి ఘర్షణపడ్డారు. మైదుకూరు అసెంబ్లీ చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టిడిపి ఏజెంట్ వెంకటసుబ్బయ్యపై వైకాపా నేతలు దాడిచేయగా, కుచ్చుపాపలో టిడిపి ఏజెంట్ లక్ష్మినారాయణను వైకాపా నేతలు, పల్లవోలులో టిడిపి ఏజెంట్ రామాంజనేయులు, ఆయన కుమారుతు మారుతీకుమార్, తిప్పిరెడ్డిపల్లె చల్లాలక్ష్మినారాయణ, సిద్ధయ్య, శ్రీనివాసులపై వైకాపా నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వైకాపా అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి సొంత ఊరికి టిడిపి అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్రాకతో వైకాపా నేతలు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. విశ్వనాధపురం పోలింగ్ కేంద్రానికి వైకాపా అభ్యర్థి వెళ్లగా టిడిపి కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఆయన వాహనంతోపాటు ఆయనకు షాడోగా అనుసరించి పోలీసు, ఎన్నికల అధికారుల కార్లు ధ్వంసం అయ్యాయి. బి.మఠం మండలం ముడుమాల, చెంచయ్యగారిపల్లె వైసిపి, టిడిపి పరస్పరం కలబడి రాళ్లవర్షం కురిపించుకున్నారు. దువ్వూరు ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సిఐ రమణ ఏకపక్షంగా వ్యవహరిస్తు వైకాపాకు వంత పాడటంతో టిడిపి కార్యకర్తలు ఆయనపై తిరగబడి తరుముకున్నారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె మండలం ఓబులరెడ్డిగారిపల్లెలో వైకాపా గ్రూపులోనే ఇరువర్గాల వారు కలబడి రాళ్లవర్షం కురిపించుకుని ఐదుమందికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే చింతకొమ్మదినె్న మండల ఎర్రమాచుపల్లెలో టిడిపి, వైకాపా నేతలు, కార్యకర్తలు కలబడి రాళ్లవర్షం కురిపించారు. ఇక రైల్వేకోడూరు విషయానికొస్తే వైకాపా అభ్యర్థి కె.శ్రీనివాసులు సొంత స్వగ్రామమైన రెడ్డివారిపల్లెలో టిడిపి, వైకాపా అభ్యర్థులు పరస్పరం ఏకధాటిగా మూడుగంటలపాటు రాళ్లవర్షం కురిపించడంతో అక్కడ ఉన్న భారీ పోలీసు బలగాలు కూడా పారిపోయారు. తమ రక్షణ నిమిత్తం ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలిలో రెండు పర్యాయాలు కాల్పులు జరిపారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు సంఘటన సద్దుమణగలేదు. ఈ సంఘటనలో పదిమంది పైబడి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే రాజంపేట అసెంబ్లీలోని రోళ్లమడుగు, బాలరాజుపల్లె పోలింగ్ కేంద్రాల్లో వైసిపి, టిడిపి నేతలు కలబడి కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిర రామాపురం కలపనాయునిచెరువులో వైకాపా ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటుండగా టిడిపి, వైకాపా నేతలు ఘర్షణకు దిగి గాయాలపాలయ్యారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత ఇలాఖా అయిన నియోజకవర్గ కేంద్రంలోని రవీంద్రనాధ్ స్కూల్లో పోలింగ్ ముగిసే సమయానికి టిడిపి అభ్యర్థి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు రిగ్గింగ్ జరుగుతుందని వెళ్లగా అక్కడ వైకాపా నేతలు మోహరించి ఇరువర్గాలు పరస్పరం కలబడి సతీష్రెడ్డి వాహనాన్ని ధ్వంసంచేసి, శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తగులబెట్టారు. ఈ తరహాలో జిల్లా మొత్తం ఎన్నికలు ముగిసిన తమకు అనుకూలంగా ఓట్లుపడలేదని తమను నట్టేట ముంచారని పరస్పరం ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల్లో కోపం కట్టలుతెంచుకుని వచ్చి ఘర్షణలకు దిగుతున్నారు. పోలీసులు హడావిడి, ప్రకటనలు తప్ప శాంతి భద్రతలు కాపాడటంలో పూర్తిగా విఫలయ్యారనే ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి.
ఓటేసిన కలెక్టర్
కడప (అర్బన్), మే 7:వైఎస్సార్ జిల్లాలో బుధవారం జరిగిన సార్వత్రి ఎన్నికల్లో తమ ఓటు హక్కును జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 61లో జిల్లాకలెక్టర్ వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు పార్లమెంట్ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం ఓటింగ్ ప్రారంభంలో కొన్ని పోలింగ్ స్టేషన్లల్లో ఈవిఎంలు మొరాయించి నా సెక్టోరల్ అధికారుల వద్ద నున్న ఈవి ఎంలతో సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నందున ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చాలినంత పోలీసు బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నారని తెల్పుతూ ప్రజలు ప్రశాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
పులివెందులలో
ఓటేసిన జగన్, విజయమ్మ
పులివెందుల రూరల్, మే 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం 8:30గంటలకు పట్టణంలోని బాక్రాపురంలో ఉన్న 124వ నెంబరు గల పోలింగ్ బూత్లో తన ఓటును వేశారు. వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి, మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి, వైకాపా పార్లమెంటు అభ్యర్థి వైఎస్.అవినాష్రెడ్డి, వైఎస్.షర్మిల, వైఎస్.్భరతి, వైఎస్.్భస్కర్రెడ్డి, ఇసి.గంగిరెడ్డి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే వేంపల్లెలో తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎస్వి.సతీష్కుమార్రెడ్డి, ఆయన సతీమణి సుమతి, ఆయన సోదరుడు విష్ణువర్ధన్రెడ్డి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పట్టణంలోని పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలింగ్ ఏకపక్షం!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 7: ఫ్యాక్షన్కు నిలయమైన పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పలుపోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఏకపక్షంగానే ఓటింగ్ జరిగినట్లు బుధవారం జరిగిన పోలింగ్లో తేటతెల్లమైంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో దిట్ట అయిన వైకాపా నేతలు సంబంధిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడి పంతం నెగ్గించుకుని ఓటింగ్ను తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు సంబంధిత ప్రాంతాల నేతలే బాహాటంగా చెబుతున్నారు. టిడిపి అధిష్టానం, కడప దేశం ఎంపి అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, వైకాపా నేతలు బుధవారం అనుసరించిన విధానాలు, జరిగిన సంఘటనలపై ఎన్నికల కమిషన్కు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేసినా ఏమాత్రం లాభం చేకూరలేదు. సాక్షాత్తు ఇరువురు పోలీసు అధికారులను, కానిస్టేబుళ్లపై దాడులుచేసి వారి వాహనాలు ధ్వంసంచేసినా సంఘటన జరిగి 12 గంటలైన ఇంతవరకు ఎవరిమీద కేసులు బనాయించాలో వారికే అర్థంకావడంలేదు. దశాబ్దాల కాలం నుంచి బ్యాలెట్ను చూడని ఓటర్లు ఈ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ను చూడలేదు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిపించేందుకు తెలుగుదేశం కడప పార్లమెంట్ అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి గళ్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నికల కమిషన్ను సంబంధిత అధికారులను కలిసి ప్రశాంతంగా అందరూ ఓటు వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చివరకు సంబంధిత ప్రాంతాల్లో టిడిపి తరపున పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను స్థానికేతరులను పెట్టేందుకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకొచ్చారు. తెలివిగా వైకాపా నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి టిడిపి నేతల ప్రయత్నాలకు నీళ్లుచల్లి పథకం ప్రకారమే సంబంధిత ప్రాంతాల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈమారు ఏకపక్షంగా ఓటింగ్ కొన్నిప్రాంతాల్లో టిడిపి నేతల పుణ్యమా అని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైకాపా నేతలు విధ్వంసాలు, దాడులు చేసినప్పటికీ టిడిపి నాయకులు జడసకుండా ఓటర్లకు, తమ అనుచరగణానికి అండగా నిలిచారు. మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో స్వపక్షంలోనే అనుకూల శత్రువులతో టిడిపి అధిష్టానం, కడప ఎంపి అభ్యర్థి ఆర్.శ్రీనివాసరెడ్డి అనుకున్న వ్యూహం ఫలించలేదు. అయితే సంబంధిత నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని శ్రీనివాసరెడ్డికే అనుకూలంగా ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.
వైకాపా, టిడిపి బాహాబాహీ
ప్రొద్దుటూరు, మే 7: బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలలోని పలుచోట్ల తెలుగుదేశం, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గాయాలయ్యాయి. ఆయా ప్రాంతాల్లో గాయపడిన కార్యకర్తలను కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రొద్దుటూరు 12వ వార్డులోని 23వ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘర్షణలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వి ఎస్.ముక్తియార్ వాహనం ధ్వంసమయింది. శంకరాపురం, చిన్నశెట్టిపల్లె తదితర గ్రామాలలో కూడా చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. ఈ సంఘటనలో వైకాపా, టిడిపిలకు చెందిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గంలో చాపాడు మండలం నక్కలదినె్న గ్రామంలో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్పై వైకాపా నాయకులు దాడిచేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. తప్పెట ఓబాయపల్లెలో ఆ రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మైదుకూరు మండలంలోని ఎన్. ఎర్రబల్లెలో వైసిపి ఏజెంట్లను టిడిపి నేతలు కొట్టి బయటకు పంపడంతో పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అదేవిధంగా బి.మఠం మండలంలోని చెంచయ్యగారిపల్లె, పి.కొత్తపల్లె, గొడ్డవీడు తదితర గ్రామాలలో వైకాపా, టిడిపి నేతల మధ్య ఘర్షణలు జరిగి రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వూరులో టిడిపి కార్యకర్తలు, వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డిపై రాళ్లతో దాడిచేశారు. ఈ సందర్భంగా వైకాపా, టిడిపి నేతల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఖాజీపేట మండలం తవ్వారుపల్లెలో కూడా ఆ రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. అదేవిధంగా దేవగుడి గ్రామంలో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయని టిడిపి నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు చేరుకొని వైకాపా నేతలపై లాఠీచార్జ్ చేయడంతో ప్రజలు తిరగబడి పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు పోలీసులపై కూడా చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బద్వేలు నియోజకవర్గంలోని పుట్టంపల్లె గ్రామంలో వైకాపా, టిడిపిల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
9న సయ్యద్ మీర్షా ఖాద్రీ ఉరుసు
కడప(కల్చరల్), మే 7: కడప నగరంలోని బెల్లంమండి వీధిలోని హజరత్ ఖాజి సయ్యద్ మీర్షా ఖదీరి చిష్టి బందానవాజ్ సాహెబ్ 20వ ఉరుసు ఉత్సవం పీఠాధిపతి సయ్యద్ మున్వర్ బాష ఖాద్రి ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదిన శుక్రవారం వైభవంగా జరుగుతుందని దర్గాకమిటీ కార్యదర్శి సయ్యద్ జహంగీర్బాష ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుసు రోజు రాత్రి 8గంటలకు అన్నదానం, ఫాతెహాఖాని, నాత్ఖాని, ఫకీరుల మేళ తాళాలతో సమాధిపై గంధం, పూలచాందిని సమర్పణ అనంతరం తబర్రుక్ (ప్రసాదం) భక్తులకు పంపిణీ చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఆస్థాన-పీఠాధిపతులు ప్రముఖ ఉర్దూకవులు, ఆధ్యాత్మిక ప్రసంగీకులు పాల్గొంటారని ఆయన కోరారు.
10న కాశిరెడ్డినాయన ఆరాధన మహోత్సవం
కడప (కల్చరల్), మే 7: కడప-రాయచోటికి వెళ్లే రహదారిలో భగత్సింగ్నగర్లో వెలసివున్న అవధూత కాశిరెడ్డినాయన సప్తమ ఆరాధన మహోత్సవాలు ఈనెల 10వ తేదిన వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త జె.ఈశ్వరమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు స్వామివారి అభిషేకం, 6 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటలకు నైవేద్యం భక్తులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు వృషభరాజములచే బండలాగుడు పోటీలు జరుగుతుందన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వృషభరాజముల యజమానులకు ప్రథమ బహుమతి 25వేలు, ద్వితీయ బహుమతలి 15వేలు, తృతీయ బహుమతి 10 వేలు, నాల్గవ బహుమతి 5,116 ఇవ్వబడుతుందన్నారు.జ్యోతులతో స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. భక్తులు, ప్రజలు పెద్దఎత్తున ఆరాధన మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు.
12 నుండి నరసింహస్వామి జయంతి
కడప (కల్చరల్), మే 7:కడప నగరం మోచంపేటలోని అహోబిలం మఠంలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి జయంతి మహోత్సవాలు ఈనెల 12,13 తేదీలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు అహోబిల మఠం నిర్వహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తాదులందరూ స్వామి వారికి అవతార మహోత్సవాలను తిలకించి వారి కృపాకటాక్షములను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
9న ఉత్తమ ఉపాధ్యాయుల సమావేశం
కడప (కల్చరల్), మే 7:జిల్లా పరిషత్లోని డిసిఇబి హాల్లో ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు అవార్డీ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కోశాధికారి నూక ఆదినారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 2013 అవార్డీ టీచర్లకు సన్మానం,జిల్లా కార్యవర్గం ఏర్పాటు, హౌస్బిల్డింగ్ సభ్యుల ఏర్పాటు, ఛలో హైదరాబాద్లపై చర్చజరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఉత్తమ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులందరూ పాల్గొని తమ సలహాలు, సూచనలు ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం, మే 7: సిద్దవటం రేంజ్ మద్దూరు బీటులోని అరిబాట సమీపంలో బుధవారం అటవీశాఖ అధికారులు 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున తరలింపు కోసం స్మగ్లర్లు, కూలీలు ప్రయత్నించారు. ఫారెస్ అధికారి సుబ్బరాయుడు, డీ ఆర్వో లక్ష్మీనారాయణ, బీట్ అధికారి గంగాధర్,సిబ్బందితో వెళ్లి దాడ