Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు : సీపీ

$
0
0

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 21: నేరాల నియంత్రణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. శనివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆర్‌కెనగర్‌లో కాలనీ సంక్షేమ సంఘం ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో కాలనీలో ఏర్పాటు చేసిన 28 సీసీ టీవీ కెమెరాలను సీపీ మహేష్ భగవత్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలు అవగహన కల్పించడంతో ఇటీవల కాలంలో కాలనీ, అపార్ట్‌మెంట్‌లలో నివసించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొవడం వల్ల దొంగతనాలు, గొడవలు, ఎవైనా ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తు చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. అనుమానస్పద వ్యక్తులు వస్తే వెంటనే గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సందీప్ రావు, సీఐ మన్‌మోహన్ యాదవ్ కాలనీ అధ్యక్ష,కార్యదర్శులు సోమశేఖర్, రవి కిరణ్ పాల్గొన్నారు.
మినీ శిల్పారామంలో
సందర్శకుల సందడి
ఉప్పల్, సెప్టెంబర్ 21: పట్టణంలోని మినీ శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శిల్పారామం సాంస్కృతిక వేదికపై నిర్వహించిన భరత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరర్ రిలేషన్స్ డైరెక్టర్ లక్ష్మాజీరావు ముఖ్య అతిథిగా వచ్చి కళాకారులను అభినందించారు. ఐసీసీఆర్ ఎంపానియెల్డ్ ఆర్టిట్స్ డాక్టర్ దేబాల్లేవ్ జానా చెన్నై తన భరతనాట్య ప్రదర్శనలో భాగంగా జయమహేష జత, జతిస్వరం, శ్రీరామచంద్ర కృపాట భజమన-్భజన్, ధిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. నృత్య దర్పణ డాక్టర్ అర్ధనారీశ్వర వెంకట్ శిశ్య బృందంతో కలిసి అర్ధనారీశ్వరం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. వకళాకారులు డాక్టర్ అర్ధనారీశ్వర వెంకటేశ్ అత్యద్భుతంగా ప్రదర్శించారు.


కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

$
0
0

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కార్తికేయ కామాక్షి కెమికల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుఝామున కార్మికులు కెమికల్ రసాయనాలను కలుపుతుండగా రియాక్షన్ అయి మిస్ ఫైర్ కావడంతో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో భారీ శబ్దం రావడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్‌లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ్ధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్థి నష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు, అధికారులు తెలిపారు. శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుంటామని అన్నారు. ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించడం రెండోసారని, పరిశ్రమ నుండి ప్రమాదకర రసాయనాల వాసనలు వెలువడుతాయని స్థానికులు చెబుతున్నారు. రసాయనాల దుర్వాసనతో శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చిన పెడ చెవిన పెట్టేవారని, అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడి కెమికల్ పరిశ్రమల పై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి కెమికల్ పరిశ్రమలను తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
జీడిమెట్ల, సెప్టెంబర్ 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కొంపల్లి సెంట్రల్ పార్కులో కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కొంపల్లి మున్సిపల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఉండాలని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, శివారెడ్డి, ప్రశాంత్, సుదర్శన్ రెడ్డి, శివకుమార్, బాస్కర్, అశోక్, సురెందర్ రెడ్డి, నిషాంత్, ఇబ్రహీమ్, కావలి గోపాల్ పాల్గొన్నారు.

23, 24న పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం

$
0
0

హైదరాబాద్ : మహానగరానికి కృష్ణా జలాలను తీసుకువచ్చే కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు పలు చోట్ల లీకులు ఏర్పడటంతో, వాటికి అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నందున ఈ నెల 23, 24వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజైన 24వ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు అంతరాయం ఏర్పడవచ్చు, లేక సరఫరా బంద్ కావచ్చునని అధికారులు పేర్కొన్నారు. సాహెబ్‌నగర్, ఆటోనగర్, వైశాలినగర్, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, శాస్ర్తీపురం, బండ్లగూడ, బుద్వేల్, సులేవర్ణన్‌నగర్, హైదర్‌గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్‌పేట, ప్రశాసన్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలీ, మణికొండ, నార్సింగి, బోడుప్పల్, చెంగిచెర్ల ఫీర్జాదిగూడ, సైనిక్‌పురి, వౌలాలి, లాలాపేట, స్నేహపురికాలనీ, కైలాస్‌గిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. 23 ఉదయం ఆరు గంటల నుంచి 24వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మంచినీటిలో అంతరాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తించి, వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించి, బోర్డుకు సహకరించాలని జలమండలి అధికారులు కోరుతున్నారు.

చీకటి ఒప్పందాలు వద్దు

$
0
0

నాచారం, సెప్టెంబర్ 21: మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు మాదిగ వ్యతిరేక మంద కృష్ణతో చీకటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మాదిగ సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. శనివారం తార్నాకలోని తన నివాసంలో 29న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే అలయ్-బలయ్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మాదిగలకు మంత్రి పదవి రాలేదని ఆరోపణలు చేస్తే మాకు భవిష్యత్ లేదని, పదవి కావాలంటే సీఎం కేసీఆర్‌తో మాట్లాడుకోవాలన్నారు. మంద కృష్ణతో జతకట్టిన వారు ఎవరు బతికి బట్టకట్టలేదని, అతనితో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని, అంతర్గత వివరాలు బయటపడుతాయన్న విష యం తెలుసుకోవాలని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ-కుమ్మర్ల పాత్రపై సమావేశం

$
0
0

నాచారం, సెప్టెంబర్ 21: ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం పర్యావరణ పరిరక్షణ-కుమ్మర్ల పాత్ర అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్‌రావు, నగర కమిటీ అధ్యక్షుడు బండారు భిక్షపతి, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు శ్యాంకుమార్, మట్టి పాత్రల ట్రైనింగ్ కమిటీ అధ్యక్షుడు వేలాద్రి, సంఘం ప్రతినిధులు,రాష్ట్ర బీసీ నేత దొమ్మాట వెంకటేశ్, నరేష్, సిల్వేరు శంకర్, రీసర్చ్ స్కాలర్స్ కృష్ణ, కిషన్ పాల్గొని మట్టి పాత్రల వినియోగంపై వివరించారు. వచ్చిన అతిథులందరికీ మట్టి గ్లాసులలోనే తాగు నీటిని సరఫరా చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి కుండలు, గ్లాసులను వినియోగంలోకి తీసుకరావాలని ప్రభుత్వాన్ని కోరారు.
కొనసాగుతున్న ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో
వనస్థలిపురం, సెప్టెంబర్ 21: తెలంగాణ వీడియో అండ్ ఫొటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో2019 రెండవ రోజు ఘనంగా జరుపుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కేబీఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో 20 నుంచి 23 వరకు ఏర్పాటు చేసిన ఎగ్జీబీషన్‌కు శనివారం చక్కటి స్పందన లభించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫొటో గ్రాఫర్స్ పెద్ద ఎత్తున హాజరై తాము ప్రదిర్శంచిన అనేక రకాల చిత్రాలను ఎక్స్‌పోలో ప్రదర్శించారు. చూపరులు హాజరై వీటిని తిలకిస్తూ, అధునాతన తరహాలో ఏర్పాటు చేసిన పలు రకాల పరికరాలను కోనుగోలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మధు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో చక్కటి ఏర్పాట్లను చేశారు.

ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలి

* మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర
షాద్‌నగర్, సెప్టెంబర్ 21: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పురపాలక సంఘం కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ షాప్ , ర్యాగ్ పిక్కర్లతో (చెత్త కాగితాలు సేకిరించేవారు) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ శరత్‌చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘స్వచ్ఛత హీ సేవ’లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాకడంపై అవగాహన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అందులో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చట్ట ఉల్లంఘనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్క్రాప్‌షాపు యజమానులు, ర్యాగ్‌పిక్కర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు

$
0
0

హైదరాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని మహిళలు తమ ఆటాపాటతో జరుపుకునే బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్దమైంది. మహానగరానికి ఈ సారి 15లక్షల 40వేల 718 చీరలను పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు మొదటి దశగా 4లక్షల 19వేల 100 చీరలను ప్రభుత్వం బల్దియాకు అందించినట్లు అధికారులు తెలిపారు. మరో 11లక్షల 21వేల 618 చీరలను కూడా త్వరలోనే అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుంచి బతుకమ్మ చీరలను పంపిణీని ప్రారంభించేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సర్కిళ్ల స్థాయిలో కూడా పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం లేకుండా ఫుడ్‌సెక్యూరిటీ కార్డున్న లబ్దిదారులను గుర్తించి, వారికి ఈ చీరలను పంపిణీ చేయాలని బల్దియా ఉన్నతాధికారులు సర్కిళ్ల వారీగా ఉన్న డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఇందుకు గాను ప్రతి డిప్యూటీ కమిషనర్ తమ సర్కిల్ పరిధిలోని పేదలు నివసించే మురికివాడలు, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సమక్షంలో ఈ చీరలను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా మురికివాడ, బస్తీ,కాలనీల్లోని కమ్యూనిటీ హాళ్లు, కాలనీ సంక్షేమ సంఘాల ఆఫీసులు, స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారురాలికి ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని ముప్పై సర్కిళ్లలో అత్యధికంగా లక్షా 17వేల 887 చీరలను సంతోష్‌నగర్ సర్కిల్‌కు, ఆ తర్వాత 94వేల 887 చీరలను మలక్‌పేటకు మంజూరు కాగా, అత్యల్పంగా కేవలం 16వేల చీరలను హయత్‌నగర్ సర్కిల్‌కు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

గాంధీ హిల్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతాం

$
0
0

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 21: మరుగున పడుతున్న గాంధీ హిల్‌ను తిరిగి పర్యాటక కేంద్రంగా తీర్చిద్ది, ప్ర జలకు అందుబాటులోకి తీసుకు వచ్చే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. నగరంలో శనివారం ఆయన గాంధీ హిల్ ఫౌండేషన్ ప్రతినిధుల, నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి గాంధీ హిల్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఒకప్పుడు గాంధీ హిల్, ప్లాం టోరియంను చూసేందుకు ప్రజలు పె ద్ద ఎత్తున వచ్చేవారన్నారు. గాంధీహిల్ ఆకర్షణ క్రమంగా మరుగున పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీహిల్‌ను పర్యాటకులు ఆకర్షించేలా మరిం త అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. గాంధీహిల్ నుండి నగరాన్ని, ప్రకాశం బ్యారేజీను చూ స్తుంటే ఆ శోభ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందన్నారు. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర ప్రజలకు అందించేందుకు గాంధీ హిల్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇ టీవల గాంధీహిల్ అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వం రూ.5కోట్ల నిధులతో కొండపై పర్యాటకులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వినియోగించాలని గాంధీహిల్ ఫౌండేషన్ సెక్రటరీ దుర్గాప్రసాద్‌ను ఆయన ఆదేశించారు. నగరాన్ని వీక్షించే కేంద్రం, పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా సౌకర్యాలు, పెద్దలు సేదతీరడానికి గార్డెన్, క్యాంటీన్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. గాంధీ హిల్ ఫౌండేషన్ సెక్రటరీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గాంధీ హిల్ ఫౌండేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా రూ.5కోట్లను కేటాయించిందన్నారు. ఈ నిధులతో గాంధీ మ్యూజియం, టె లిస్కోప్ అబ్జర్వేటరీ కేంద్రం, స్పేస్ మ్యూజియం, లైబ్రరీ, ప్లానిటోరియం అభివృద్ధి, పర్యాటకులను కొండపైకి తీసుకువెళ్లేందుకు బగ్గీస్, తదితర కా ర్యక్రమాలను ప్రతిపాదించామన్నారు. నిధుల విడుదల అయిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. గాంధీజీ నగర పర్యటనకు వచ్చినప్పుడు ఈ కొండ ప్రాంతంలో సమావేశం పెట్టారని, విజయవాడ, అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో స్థపతి శివనాగిరెడ్డి తెలిపారు. అలాగే ఔరంగజేబు మచిలీపట్నం వెళుతూ మొగల్రాజపురం వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇటువంటి సంఘటనలు, గాథలు కూడా గాంధీ హిల్‌కు వచ్చే పర్యాటకులకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ హెల్త్ అధికారి ఇక్బాల్ హుస్సేన్, వెస్ట్ తహసీల్దార్ రవీంద్రనాథ్, ఆర్‌ఐ రాంసింగ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలి

$
0
0

కంకిపాడు, సెప్టెంబరు 21: ప్రతి రేషన్ కార్డుదారునికి నాణ్యమైన బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కే మాధవీలత అధికారులను ఆదేశించారు. మండలంలోని ఉప్పలూరుగ్రామంలో శనివారం బియ్యం గోడౌన్‌ను జాయింట్ కలెక్టర్ మాధవీలత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని 9 బియ్యం బఫర్ గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలిస్తున్నామన్నారు. బియ్యం నాణ్యత పరిశీలించేందుకు తన అధ్యక్షతన జిల్లా కమిటీ ఏర్పాటైందన్నారు. కమిటీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ నుండి సాంకేతిక నిపుణులు, వేరే జిల్లా నుండి సాంకేతిక నిపుణులు సభ్యులు ఉంటారన్నారు. ఈ కమిటీ సభ్యులందరూ రైస్ మిల్లర్ల సమక్షంలో బియ్యం బఫర్ గోడౌన్లలలో బియ్యం శాంపిల్స్‌ను సేకరించి, వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుదారులకు అందించే నాణ్యమైన బియ్యం శాంపిల్స్‌ను తీసుకున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మిలర్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ రాజ్యలక్ష్మి, సివిల్ సప్లై నాణ్యత నిపుణులు, మేనేజర్లు, తహసీల్దార్ టీ సతీష్, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లు, తదితరులు పాల్గొన్నారు.


స్విమ్మర్ తులసీ చైతన్యకు సీపీ తిరుమలరావు సత్కారం

$
0
0

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: అమెరికాలోని అత్యంత ప్రమాదకరమై న క్యాటలీనా ఛానల్‌ను విజయవంతం గా ఈది నగర పోలీసుశాఖ ప్రతిష్టను చాటిన హెడ్ కానిస్టేబుల్ తులసీ చైతన్యను నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు శనివారం ఘ నంగా సన్మానించారు. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ ఈత పోటీల్లో ఈనె ల 15న రాత్రి కారిఫోర్నియా తీర ప్రాం తం నుంచి క్యాటలీనా ద్వీపం వరకు క్యాటలీనా ఛానల్‌లో 35 కిలోమీటర్ల ఛాలెంజ్‌ను 12గంటల 40నిముషాల్లో ఈత పూర్తి చేసిన తొలి భారతీయ పోలీసు అధికారిగా తులసీ చైతన్య రికార్డు నెలకొల్పారు. ఇండియాకు వచ్చిన తులసీ చైతన్యను శనివారం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పోలీసు కమిషనర్ శాలువా కప్పి సత్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ స్విమ్మింగ్‌పై ఉన్న మక్కువతో స్థానిక పోటీల నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి విజయాలు సాధిస్తూ నగర, రాష్ట్ర పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్న తులసీ చైతన్యను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు స్వంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ డీ నాగేంద్రకుమార్, డీసీపీలు విజయరావు, హర్షవర్ధనరాజు, కోటేశ్వరరావు, అదనపు డీసీపీలు నవాబ్ జాన్, కేవీ శ్రీనివాసరావు, కే బాల వెంకటేశ్వరరావు, ఎల్‌టీ చంద్రశేఖర్, ఏసీపీలు, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఘాట్టెక్కిన ఉల్లి ధర

$
0
0

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 21: ఉల్లిపాయల ధరలు ఘాటెక్కాయి. వినియోగదారుల కంటి తడి పెట్టిస్తోంది. గత నెలలో కిలో రూ.20 నుండి రూ.25 ధరకు లభించిన ఉల్లిపాయలు క్రమేణా రేటు పెరుగుతూ రైతుబజారుల్లో కిలో రూ.35కి చేరాయి. అయినా రైతుబజారుల్లో అసలు ఉల్లిపాయలే లభించడం లేదు. ఏ షాపులోనూ ఉల్లిసాయలు కన్పించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. పైగా సంచార వ్యాపారుల వద్ద రూ.60 నుండి రూ.65 పెట్టి కొనాల్సి వస్తుంది. గత వారంలో కురిసిన వర్షాల వల్ల కర్నూలు జిల్లాలోని వేలాది హెక్టారుల్లో చేతికి అందాల్సిన ఉల్లి సాగు పూర్తిగా దెబ్బతింది. దాంతో అక్కడ ఉల్లి సాగు రైతులకు నష్టాల ఊబిలో మునిగారు. పంటపోయి ఉల్లి రైతులు కంటతడి పెడుతుండగా ధరలు పెరిగిపోయి వినియోగదారులూ కంటతడి పెడుతున్నారు. నిత్యం వాడే గృహిణులు ఎలాగోలా వాటి వినియోగంలో ఎవ్వరికి వారే రేషన్ విధించుకున్నాగాని తోపుడు బండ్లు, బజ్జీల వ్యాపారులు, అల్పాహారశాల వినియోగదారులు, హోటళ్ల నిర్వాహకులు మాత్రం గిలగిల్లాడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారులు అంటే సమోసాలు తయారు చేసుకుని జీవనం సాగించే వారు ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉండగా రైతుబజారుల ఎస్టేట్ ఆఫీసర్లు మాత్రం ఉల్లిపాయల ఇండెంట్లు మాత్రం మార్కెటింగ్ శాఖ అధికారులకు పంపించామంటున్నారు. వినియోగదారులు మాత్రం ప్రభుత్వం తరపున నియంత్రణ ధరలతో ఉల్లిపాయలను రైతుబజారులో అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

గల్ఫ్‌లో వలస కార్మికుల వెతలు

$
0
0

ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి దశాబ్దాల తరబడి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్‌లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చి రెండేళ్ళు దాటినా కించిత్ అయినా మార్పు రాకపోవడం బాధాకరం. సరైన ధ్రువపత్రాలు లేకుండా నివసిస్తున్న ప్రవాసులను దేశం విడిచి వెళ్ళాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెడితే దరఖాస్తుచేసుకున్న వారిలో 90 శాతం భారతీయులు. వీరిలో 60 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వుండడం ప్రభుత్వాల వైఫల్యానికి అద్దం పడుతోంది. తక్కువ చదువుతో అధిక వేతనాలు, మెరుగైన జీవనోపాధి ఆశతో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిన భారతీయులు దాదాపు కోటికి పైగా వుండగా, అధిక శాతం తెలుగువారే వుండడం, 20 లక్షల మంది కార్మికులుగా జీవిస్తూ, దళారీల మోసాలతో సరైన ధ్రువపత్రాలు లేక అయినవారికి దూరంగా మనోవ్యధను అనుభవిస్తున్నారు. మనదేశంలో నిరుద్యోగ యువత ఎక్కువగా వుండడంతో కొంతమంది నకిలీ ఏజెంట్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొని ప్రాథమిక విద్య పూర్తికాని వారికి కూడా అధిక వేతనాల ఆశ చూపించి, గల్ఫ్‌లో సరైన ఉద్యోగాలు లేకపోయినా వారి నుండి భారీ మొత్తాల్లో డబ్బు గుంజుతున్నారు. పర్యాటక వీసాలు లేనందున బోగస్ వీసాల మీద తప్పుడు పత్రాలతో గల్ఫ్‌లో వీరిని విడిచి రావడం, చివరికి వాస్తవాలు తెలుసుకొని ప్రవాసులు రహస్య జీవనం సాగించడం నిత్యకృత్యమైపోయింది. ఎవరైనా ప్రమాదానికి గురైతే సరైన ఇన్సూరెన్స్, పత్రాలు లేక సకాలంలో చికిత్స అందక వేల మంది నిర్భాగ్యుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. మన ప్రభుత్వాలు దాహం అయ్యాక బావి తవ్వే చందాన మృతదేహాలను రప్పించేందుకు అప్పుడు చర్యలు మొదలు పెట్టడం, కనీసం మృతదేహాలను చూసే భాగ్యం బంధువులకు కలగకపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు పునరావృత్తం అయినా ప్రభుత్వాలలో స్పందన కరువవడం బాధిత కుటుంబాలలో అసంతృప్తి జ్వాలలను రగిలుస్తున్నాయి. రాయబార కార్యాలయంలోని అధికారులు ప్రవాసుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ సుమారు 24వేల మంది తెలుగువారు గల్ఫ్ జైళ్ళలోనే మగ్గుతున్నారు. వీరిని విడిపించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ఉపశమన చర్యలకు ఉపక్రమించక పోవడం దారుణం.
- సి.కనకదుర్గ, హైదరాబాద్
హిందూ దేశం కాక మరేమిటి?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు డి.రాజా తెగ బాధపడిపోయారు. ఆ పెద్దమనిషికి తెలియదా? మనది హిందూ దేశమేనని. పోనీ ఈ దేశాన్ని ఏమని పిలవాలి? ఇండియా, భారత్, హిందూస్తాన్- ఇవన్నీ ‘హిందూ’ పదానికి పర్యాయపదాలే కదా! క్రిష్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు ఇతర దేశాల్లో ఉండగా పరమ పవిత్రమైన, పురాతనమైన వేదభూమి, ఋషులు, సన్యాసులు, ఆధ్యాత్మికవేత్తలు, తదితర పురాణ పురుషులు నడయాడిన ఈ దేశం అనాదిగా హిందూదేశంగానే పిలవబడుతోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’లో కూడా ‘హిందూ’ పదానికి దీర్ఘనిర్వచనం తెలియజేసారు. ఈ దేశపు కమ్యూనిస్టులు ఇతర దేశాలను నెత్తికెక్కించుకుంటారు గానీ మాతృదేశాన్ని తూలనాడడం పరిపాటి అయిపోయింది. వీరిలో దేశభక్తి ఎంత? వీరి మాటలను పట్టించుకునేదెవరు?
-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్

జాతి జీవన వికాస కేంద్రం ఆధ్యాత్మికత

$
0
0

భారతీయుల జీవనానికి ఆధ్యాత్మికత ఆలంబన. మన సమాజ అస్థిత్వానికి ఆధారం వేదాలు. వేద నిర్దేశానుసారం మన సమాజ జీవనం వికసించింది. వేదం అంటే తెలియబడినది అని అర్థం. విద్య అంటే తెలుసుకోదగినది అని అర్థం. భారతీయ వాంజ్ఞయంలో మొదటిసారిగా ఉపనిషత్తులు విద్య గురించి చెప్పాయి. ఈ ఉపనిషత్తులలో 34 రకాల విద్యలను గురించిన చర్చ ఉంది. చాందోగ్యోపనిషత్తులో ప్రాణవిద్య గురించి ప్రస్తావన ఉంది. మరణించిన దానిని మంత్రశక్తితో తిరిగి బతికించడం ఎలా అన్నది ఇది వివరిస్తుంది. ముండకోపనిషత్తులో బ్రహ్మవిద్య లేదా పరావిద్య గురించి వివరంగా ఉంది.
విద్య గురించి ప్రస్తావిస్తూ ముండకోపనిషత్తు ఒక శక్తివంతమైన పదప్రయోగం చేసింది. అది ‘వేద్ధవ్యం’’ అన్న పదం. అనగా ‘చొచ్చుకొని పోవడం’ లేదా ‘లోతుగా పరిశీలించడం’ అని అర్థం. ‘ఏది తెలుసుకోవాలి? దేనిని లోతుగా తెలుసుకోవడం వల్ల మనిషి ఆనందాన్ని పొందుతాడు? ఏది మానవుని శోక విముక్తుని చేస్తుంది?’ అన్నదే విద్య పరమార్థం. ముండకోపనిషత్తులో శౌనకుడు అంగీరస మహామునిని- ‘‘ఏది తెలుసుకుంటే నాకు సమస్తం తెలుస్తుంది?’’ అని అడుగుతాడు. అందుకు అంగీరసుడు బదులిస్తూ- ‘‘అటువంటి విద్యలు రెండున్నాయి. మొదటిది అవర విద్య. ఇది దిగువస్థాయి విద్య. రెండోది వర విద్య (అక్షర విద్య). ఇది ఎగువస్థాయి విద్య’’ అంటాడు.
చాందోగ్యోపనిషత్తులో నారద మహర్షి సనత్కుమారుని- ‘‘నేను ఎన్నో తెలుసుకున్నాను. ఎన్నింటినో అధ్యయనం చేసాను. వేదాలు, వేదాంగాలు, వివిధ శాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాను. కానీ శోకం నుండి నేను విముక్తుడిని కావడం లేదు. ఎందుకని?’’ అని ప్రశ్నిస్తాడు. సనత్కుమారుడు నారదునితో- ‘‘నువ్వు మంత్రవేత్తవు కాగలిగావు కానీ ఆత్మవేత్తవు కాలేకపోయావు. మంత్రవేత్తవు అయినంత మాత్రాన నీకు జీవ రహస్యం తెలియదు’’ అని చెబుతాడు. దీనినే వివరిస్తూ ‘్భరతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్- ‘మంత్రవేత్త అంటే ఆధునిక పరిభాషలో ‘టెక్నోక్రాట్’ అని చెప్పవచ్చు. ‘టెక్నిక్’వేరు, ‘ఆత్మ’వేరు. మంత్రవేత్త అయినంత మాత్రాన నీకు జీవ రహస్యం తెలియదు. టెక్నాలజీ తెలిసినంత మాత్రాన అంతరిక సహజ ప్రకృతి తెలియాలని లేదు’’ అని అంటారు.
1907లో గాంధీజీ రాసిన ‘‘హింద్ స్వరాజ్’’ గ్రంథంలో ‘విద్య’ అనే అధ్యాయంలో ఇలా అంటారు. ‘‘విద్య అర్థం ఏమిటి? లౌకికంగా చూస్తే అక్షరాలు, పదాలను గురించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమే విద్య అనుకోవచ్చు. అటువంటి విద్య ఒక సాధనం మాత్రమే. ఆ సాధనం ఎవరిచేతనైనా సద్వినియోగం కావచ్చు లేదా దుర్వినియోగం కావచ్చు. ఇప్పుడు మనం ఉన్నతస్థాయి విద్యను గురించి ఆలోచిద్దాం. నేను భౌగోళిక శాస్త్రం, రేఖాగణితాన్ని, బీజ గణితాన్ని, ఖగోళ శాస్త్రం మొదలైన వాటిని అభ్యసించాను. వీటి ద్వారా మరెన్నో విషయాలను తెలుసుకున్నాను. నేను ఇవన్నీ చదువుకున్నాను కానీ నా జిహ్వను ఎలా అదుపులో పెట్టుకోవాలన్న ప్రశ్నకు వీటిలో సమాధానం లేదు. నన్ను నేను తెలుసుకోడానికి, ఇంద్రియాలను నియంత్రించడానికి ఈ ఆధునిక విద్యలు ఉపకరించవు.’’
మధుమేహం వచ్చినవారు తీపి పదార్థాలు తినకూడదని, షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆహారం తీసుకునే విషయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వైద్యశాస్త్రం చెప్తుంది. కానీ ముందు నుంచీ ఆహారం పట్ల స్వీయ నియంత్రణ పాటించడం వల్ల రోగాలకు దూరంగా ఉంచవచ్చని ఈ ఆధునిక వైద్యశాస్త్రాలు చెప్పవు. లైంగిక సంపర్కం గురించి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా శాస్ర్తియంగా వివరిస్తుంది. కానీ మనుషుల మధ్య గల వావివరసల గురించి, వాటికి విలువనివ్వడం గురించి చెప్పదు. లాభాలు గడించడానికి రకరకాల పద్ధతులను గురించి వ్యాపార శాస్త్రాలు గొప్పగా వివరిస్తాయి. కానీ మనిషి దానగుణం అలవరచుకోవాలని గానీ, దయాదాక్షిణ్యాల గురించి గానీ వాటిలో ప్రస్తావన ఉండదు. మన దేశంలో మద్యం అమ్మడం చట్టసమ్మతమే. రాజ్యాంగమే దానికి చట్టబద్ధత కల్పించింది. కానీ మద్యం అమ్మడం అనేది నైతికమైనది కాదు. ఆ విషయం గురించి ఏ న్యాయశాస్త్రం, న్యాయస్థానం కూడా నోరు విప్పలేదు.
1907లో భారతదేశంలో ఆధునిక విద్యలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ‘‘ఈ విద్యలు నాకేం చేస్తాయి? నా చుట్టుపక్కల వారికి ఏం చేస్తాయి?’’ అని గాంధీజీ ప్రశ్నించారు. ‘‘నన్ను నేను తెలుసుకోవడానికి, ఇంద్రియాలను నియంత్రించడానికి ఈ ఆధునిక విద్యలు ఉపకరించవు’’అని ఆయన అన్నారు. 20వ శతాబ్దం చివర్లో యునెస్కో వారు ఏర్పాటుచేసిన ఒక కమిషన్ ఓ నివేదికను సమర్పించింది. మన దేశం నుండి డాక్టర్ కరణ్‌సింగ్ కూడా ఆ బృందంలో పాల్గొన్నారు. ఆ నివేదిక పేరు ‘‘లెర్నింగ్ ది ట్రెజర్ విథిన్’’ (అనగా ఆత్మ సంపద అని అర్థం). ఆ నివేదిక ప్రధానంగా ఏం చెప్తోందంటే- 21వ వతాబ్దంలో నేర్చుకోవడం అనేది నాలుగు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అవి- 1. తెలుసుకోవడం కోసం నేర్చుకోవడం 2. చెయ్యగడానికి నేర్చుకోవడం 3. నువ్వు నువ్వుగా ఉండడానికి నేర్చుకోవడం 4. కలిసిమెలసి బతకడం నేర్చుకోవడం. వీటిలో ‘కలిసి మెలసి బతకడం నేర్చుకోవడం’ ఎంతో ముఖ్యమైనది. తైత్తరీయోపనిషత్తు ఇలా చెప్తోంది- ‘సహనా వవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్వాషావహై’’. అంటే ‘‘కలిసి జీవిద్దాం, కలిసి భుజిద్దాం, కలిసి బలం సంపాదిద్దాం, కలిసి తేజస్సును సంపాదిద్దాం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా కలిసి జీవిద్దాం’’ అని అర్థం. వేల యేండ్ల క్రితమే మన ఉపనిషత్తులు కలిసి మెలసి జీవించండని ప్రబోధించాయి.
మరి నేడు పరిస్థితి ఎలా ఉంది? ‘సోషల్ మీడియా’ మనిషిని సమాజం నుంచి వేరు చేస్తోంది. ఎక్కడెక్కడి వారితోనో గంటలకొద్దీ చాట్ చేస్తాం. మన పొరుగునే ఉన్న వారి గురించి మనకు అసలు పట్టదు. మన భావోద్వేగాలను మరొకరితో పంచుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. సోషల్ మీడియా వల్ల మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఆధునిక అర్థశాస్త్ర పితామహునిగా చెప్పబడే ఆడమ్ స్మిత్ మనిషిని ఒక ఆర్థిక జీవిగా అభివర్ణించాడు. పాశ్చాత్య భౌతికవాదులు మనిషిని ఒక సోషల్ యానిమల్ (సాంఘిక జంతువు)గా పేర్కొన్నారు. కానీ నేడు మనిషి ‘‘సోషల్ యానిమల్’’ నుంచి ‘‘సోషల్ మీడియా యానిమల్’’ దశకు ప్రయాణిస్తున్నాడు. అతడి చేతిలోని సెల్‌ఫోన్‌లో యావత్ ప్రపంచం ఉంది. అతడు మాత్రం ప్రపంచంలో జీవించడం మరిచిపోయాడు.
ముండకోపనిషత్తు- ‘‘నువ్వు ఎంత చదివినా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు. నీ లోపల, బయట ఉన్నది ఒకటే అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీకు ప్రయోజనం చేకూరుతుంది’’ అని స్పష్టంగా చెప్తోంది.
ఈ ఆధునిక కాలపు విద్య మనల్ని కూలివాళ్ళుగా అంటే ‘‘నాలెడ్జి వర్కర్స్’’గా చేస్తోంది. జ్ఞానాన్ని ఒక పదార్థంగానే ఆధునిక విద్య భావించింది. కానీ జ్ఞానాన్ని నిరంతర చైతన్యంగల ఒక శక్తిగా మన ఉపనిషత్తులు ప్రకటించాయి. దానిని నిరంతరం సాధన చెయ్యాలి. అంటే నీ లోపల, బయట ఉన్నది ఒకే శక్తి చైతన్యం అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ గ్రహించడం అనేది మాటల వల్ల, కొన్ని పుస్తకాలు చదవడంవల్ల కాకుండా సాధన వల్ల జరగాలి. అటువంటి సత్యమే చివరికి విజయాన్ని పొందుతుంది. అందుకే ముండకోపనిషత్తు- ‘‘సత్యమేవ జయతే... నానృతం’’ అని ఘోషించింది. ఋతం అంటే ధర్మం. సత్యాన్ని అనుసరించి ఒక క్రమంలో సాగేదే ధర్మం. అటువంటి సత్యధర్మముల ఆధారంగా మహానీయులైన మన మహర్షులు అందించిన ఆచరణాత్మక విలువలతో కూడిన విద్యను నేటి తరానికి అందించాలి. అప్పుడే ప్రతి మనిషి, ‘‘వసుదైవ కుటుంబకం’’ భావనతో విశ్వశ్రేయస్సుకు ఒక సాధనంగా తయారుకాగలడు.

ప్రాంతీయ పార్టీలకు పరీక్షా సమయం!

$
0
0

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలు ఎంతగా ‘మహా’ జోరు ప్రదర్శించాయో... ఎంతగా ఆకాశానికి నిచ్చెనలు వేశాయో..! అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిగో మహా కూటమి అంటే.. అదిగో మరో కూటమి.. అంటూ ప్రాతీయ పార్టీల మహా నాయకులు మహా సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ సందడి మరీ ఎక్కువగా కనిపించింది. ఇటు నుంచి తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ దిక్కునుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, మరోవైపు నుంచి మాయావతి ఎవరికి వారు ఎన్నికల అనంతరం కేద్రంలో ఏర్పడే సంకీర్ణంలో చక్రం తిప్పేది తామే అని తెగ సంబరపడి పోయారు. నిజానికి, చాలావరకు రాజకీయ విశే్లషకులు కూడా ఇంచుమించు అదే అభిప్రాయాన్ని వ్యక్తపరించారు. అయితే, రాజకీయ జ్యోతిషుల అంచనా తప్పింది. రాజకీయ పండితుల విశే్లషణలూ తప్పాయి. బీజేపీ సొంత బలం ఏకంగా 303కు చేరింది. మోదీ మళ్ళీ ప్రధాని కారాదని ‘ప్రార్ధనలు’ చేసిన కలల బేహారుల కలలు చెదిరిపోయాయి. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అది కూడా తిరుగులేని ఆధిక్యతతో.
సరే, అది అప్పటి మాట, ఇపుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ప్రాతీయ పార్టీల పరిస్థితి అంతే అద్వానంగా ఉంది. దేశంలో ప్రతిపక్షం నిరాధారంగా దిక్కులు చూస్తోంది. ప్రతిపక్షం కనుమరుగై పోయే ప్రమాదకర పరిస్థితిలోకి జాతీయ రాజకీయాల ప్రస్థానం సాగుతున్నదా? అనే సందేహం బలపడుతోంది. బీజీపీని సంస్థాగతంగా ఎదుర్కొనే పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. బీజీపీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్న హిందూ జా తీయ వాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే మరో ప్రత్యాన్మాయ సిద్దాంతం ఏదీ ప్రతిపక్షాలు ప్రజల ముందుంచ లేకపోతున్నాయి. ఇంతకాలం, కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలు సహా వివిధ ప్రాంతీయ, కుటుంబ పార్టీలు బీజేపీని హిందూమతోన్మాద పార్టీగా ముద్ర వేసి, లౌకిక వాదం, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో పబ్బం గడుపుకున్నాయ. అయితే, మారిన జాతీయ రాజకీయ కథాకథనం (నేషనల్ పొలిటికల్ నెరటీవ్) కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యం లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అడుగుజాడల్లో నడిచే నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలొ చ్చాయి.అయితే,ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత స్వరూప, స్వభావాలు తెలిసిన ఎవరికైనా, ఇలాంటి ఆలోచనే చాల చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనిపిస్తుంది.
ప్రస్తుత వాస్తవంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కథ క్లైమాక్స్‌కు చేరింది. పత్రికలు, మీడియాలో వస్తున్న కథలు, కథనాలు, రాజకీయ విశే్లషణలు గమనిస్తే బీజేపీ లక్ష్యం (కాంగ్రెస్ ముక్త భారత్) ఇంకెంతో దూరంలో లేదోమో అనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ మనుగడ రోజురోకుకూ దిగజరిపోతోంది. క్షణక్షణానికీ మసకబారి పోతోంది. ఎక్కడో ఒకటీ అరా రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం పుణ్యాన కొంత బలంగా ఉన్నా, జాతీయ స్థాయిలో పార్టీ దినదినం దిగజారిపోతోంది. ఆ కారణంగా అంతో ఇంతో బలంగా ఉన్న రా ష్ట్రాలలోనూ, హస్తం పార్టీ ప్రత్యర్ధుల ముందు చేతులెత్తేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందుకు తెలంగాఈలో కాంగ్రెస్ పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఎంతో కొంత బలంగానే ఉన్నాయి. ఓట్ల శాతం, సీట్ల సఖ్య ఎలా చూసినా, తెరాస తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీనే నిలిచింది. అయినా, అధికార తెరాసకు, ‘ప్రధాన ప్రత్యర్ధి’ బీజీపీతో పోటీలో నిలవలేక పోతోంది. మరో వంక జాతీయ నాయకత్వం అండదండలతో కమల దళం ‘తెరాస’కు ప్రధాన ప్రత్యర్ధిగా తెరపైకి దూసుకోస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మీద ప్రజలకే కాదు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విశ్వాసం సన్న గిల్లడంతో పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వదిలిపోతున్నారు. అందుకే, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యాన్మాయం బీజేపీ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. మరోవంక తెరాసలోని అసమ్మతులు (జితేందర్ రెడ్డి మొదలు వినోద్ వరకు) కూడా కమల దళం వైపు కదులుతున్నారే గానీ కాంగ్రెస్ వైపు కనె్నత్తి చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగొచ్చిన నాయకులే సొంత పార్టీని చులకన చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు హస్తానికి ‘హ్యాండి’చ్చి కమల దళంలో చేరి పోతున్నారు. ఒక విధంగా చూస్తే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోందని కాంగ్రెస్ నాయకులే నిరాశకు లోనవుతున్నారు.
అన్నిటినీ మించి తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో ఏకుమేకై కూర్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అనంతరం కొంత అణిగిమణిగి ఉన్న రేవంత్ రెడ్డి, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి గెలవడంతో మళ్ళీ దూకుడు పెంచారు. పీసీసీ అధ్యక్ష పీఠంపై కనే్నశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిసి, పీసీసి రేసులో తాను ఉన్నానన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలా రేవంత్ రెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి మధ్య వర్గ పోరు సాగుతోంది. పీసీసీ ‘కుర్సీ’ కొట్లాటకు తోడు’హుజూర్ నగర్’ ఉపఎన్నిక అభ్యర్ధి విషయంలో తలెత్తిన విబేధాలు ‘చినికి చినికి గాలివాన’గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి తీవ్రంగా ఖండిచారు. మరవంక నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హుజూర్ నగర్ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి జోక్యాన్ని తప్పు పట్టారు. ఉత్తమ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అభ్యర్ధిత్వాన్ని సమర్ధించారు. మరో అడుగు ముందుకేసి జిల్లాలో కీలక నేతలు ఉత్తమ కుమార్ రెడ్డి, జానారెడ్డితో గతంలో ఉన్న విభేదాలు ఇప్పుడు లేవని తామంతా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనిస్తే, తెరాసలో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య మరో ‘సంకుల’ సమరానికి తెర లేచినట్లే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి జోరుకు పగ్గాలు బిగించేందుకు పాత ‘రెడ్లం’తా ఒకటవుతున్నారు అన్న మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ‘కాంగ్రెస్ పార్టీలో పదువులు ఎప్పుడు వస్తాయో, ఎలా పోతాయో ఎవరికీ తెలియదు’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీలో కొత్త కుంపట్లు రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం అనేది కనుమరుగై పోయింది. సార్వత్రిక ఎన్నికల క్రతువు పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతవరకు పార్టీ కోలుకోలేదు, కనీసం ఎన్నికల ఫలితాలను సమీక్షిచుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదు. మరో వంక పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామాతో తలెత్తిన సంక్షోభానికి ఇంతవరకు ‘తాత్కాలిక ‘ పరిష్కారమే గానీ, శాశ్వత పరిష్కారం చిక్కలేదు. ఎన్నికల్లో ఓటమికంటే నాయకత్వ సంక్షోభం పార్టీ మనుగడను మరింత ప్రశ్నార్ధకం చేసింది. ఇప్పుడు పార్టీ అస్తిత్వ సమస్యను ఎదుర్కుంటోంది. సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు గానీ, ఆ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక పోతున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీతో పాటుగా జాతీయ స్థాయిలో సమర్ధవంతమైన ప్రతిపక్షం కనుమరుగై పోతోంది. జాతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న వామపక్ష పార్టీలు దాదాపు కనుమరుగై పోయాయి. ప్రస్తుత లోక్ సభలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే మిగిలింది. పెద్దన్న సిపిఎంకు ముచ్చటగా మూడు సీట్లు మిగిలితే, చిన్న తమ్ముడు సిపిఐకి రెండు సీట్లు మాత్రమే మిగిలాయి. మరోవంక సిపిఐ జాతీయ హోదాను కోల్పోయింది. జాతీయ హోదాను కోల్పోయిన మరో రెండు ‘జాతీయ’ పార్టీలు ఎన్సీపీ, బీఎస్పీలతో పాటుగా సిపిఐ- ఈ సారికి వదిలేయండి, వచ్చే ఎన్నికలనాటికి కష్టపడి జాతీయ హోదాకు అవసరమైన ‘పాస్’ మార్కులు తెచ్చుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘానికి మొర పెట్టుకున్నాయి. ఎన్నికల సంఘం కరుణిస్తే సరి, లేదంటే ‘కంకీకొడవలి’ (సిపిఐ ఎన్నికల చిహ్నం)కనుమరుగై పోతుంది. శరద పవార్ పార్టీ ఎన్సీపీ, మాయావతి పార్టీ బీఎస్పీ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.
గత ఎన్నికల ముందు బీజేపీని, మోదీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం మెడకు చుట్టుకోవడంతో, మోదీ, అమిత్ షాలతో సయోధ్య సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను ప్రత్యేకంగా కలిశారు. అందుకు ఆమె చెప్పే కారణాలు ఏవైనా,సీబీఐ చిక్కుల్లోంచి బయట పడేందుకే ఢిల్లీ వెళారన్నది బహిరంగ రహస్యం. ఇక చంద్రబాబు విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కేంద్రంలో చక్రం తిప్పే విషయం ఎలాఉన్నా రాష్టంలో అధికారం, ప్రతిష్ట అన్నీ పోయి, ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అన్న భయంతో ఉన్నారు. కేంద్రంతో సయోధ్య కోసం తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నారు.
నిజానికి కాంగ్రెస్ అస్తమయం కంటే ప్రతిపక్షం నిర్వీర్యం అవుతున్న తీరు మరింత ఆందోళన కలగచేస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షం ఇంత బలహీనంగా ఉన్న సందర్భం లేదనే చెప్పాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ 404 సీట్లు గెలుచుకున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షం స్పేస్ కుదించుకు పోయింది. బీజీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. 1952 నుంచి 1971 వరకు జరిగిన ఐదు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగానే ఎనికలలో గెలుస్తూ వచ్చింది. 1952 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 489 స్థానాలకుగాను 364 సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్షాలకు మిగిలింది ఒక వంతు స్థానాలు మాత్రమే. 1967 ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. అప్పటి పరిస్థితికి, ప్రస్తుత పరిస్థ్తితికి చాలా తేడా ఉందనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే, స్వాతంత్య్ర అనంతర దేశ రాజకీయాలు 360 డిగ్రీలు పయనించి, మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా, అప్పుడు జాతీయ వాదానికి చిరునామాగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ ఆక్రమించింది. మరో వంక స్వాతంత్రం తొలి నాళ్లలో ప్రత్యాన్మాయ రాజకీయ ప్రభావం చూపిన కమ్యూనిజం, సోషలిజం సిద్ధాంతాలకు కలం చెల్లింది.ఇప్పడు కావలసింది ప్రతిపక్షం మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ సిద్ధాంతం కూడా.

కాశ్మీర్ అంశంలో భారత్‌ను విమర్శించే కనీస అర్హత పాక్‌కు లేదు

$
0
0

పుణే, సెప్టెంబర్ 21: కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్నాన్ని విమర్శించే కనీస అర్హత పాకిస్తాన్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ విమర్శించారు. పుణే అంతర్జాతీయ అక్షరాస్యత ఉత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ ఇటువంటి విదేశీ సమస్య వచ్చినప్పుడు దేశంలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలన్నారు. పార్టీల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయని, అయితే బయటి నుంచి సమస్యలు, చిక్కులు ఎదురైనప్పుడు దేశం కోసం ఏకం కావాలన్నారు.
ఇది బీజేపీ విధానం కాదని లేదా కాంగ్రెస్ విధానం కాదని, భారత్ విధానమని అన్నారు. కాశ్మీర్ అంశం విషయంలో మన దేశాన్ని విమర్శించే అర్హత పాక్‌కు లేదన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు.

హైస్కూలు స్థాయిలోనే వృత్తి విద్య

$
0
0

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఆరేళ్ల లోపు పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలన్న యోచనను స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ పాలసీ అమలుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని సూచించినట్టు చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కెబ్) సమావేశం శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హజరయ్యారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతన విద్యా విధానం ముసాయిదాపై చర్చ జరిగినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పలు సలహాలు. సూచనలు చేసినట్టు వెల్లడించారు. 8, 9, 10 తరగతుల్లో వృత్తి విద్య అమలు చేయాల్సిన అవసరం వుందని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం జిల్లాకో కౌన్సిలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఒత్తిడిలో ఉండే విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్ మాదిరిగా జాతీయ అటెండెన్స్ పాలసీ ప్రవేశపెట్టి విద్యార్థులను ప్రోత్సాహించాలని సమావేశంలో కోరినట్టు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలో బోధన అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాల్లో మాత్రమే ఈ నిబంధన అమలు చేస్తే, పోటీ ప్రపంచంలో అందరూ ఆంగ్లం బోధించే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశక్తి కనబరుస్తున్నారని మంత్రి సబిత వెల్లడించారు.
*చిత్రం...తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


గాంధీ ఆదర్శాలు విస్తృతంగా ప్రచారం చేయండి

$
0
0

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన సిద్ధాంతాలు, ఆదర్శాలపై విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ ఎంపీలకు, రాష్ట్ర విభాగాల నేతలకు పిలుపునిచ్చారు. శనివారం వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ ఉత్సవాలకు సంబంధించి విస్తృత ప్రణాళికను ఆవిష్కరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక అంశాల గురించి చర్చించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా మోదీ సర్కారు తీసుకున్న ఈ ఉద్దీపన చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత పుష్టి కలుగుతుందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదంటూ ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా విపక్షాల దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకే పార్టీ శ్రేణులతో ఆర్థిక అంశాలను అమిత్ షా విస్తృతంగా చర్చించారని చెబుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఎంపీలతో మాట్లాడిన ఆయన మహాత్మా గాంధీ ప్రవచించిన విలువలను జనంలోకి తీసుకెళ్ళాలని, అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ఆయన ఆశయాలను పరివ్యాప్తం చేయాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పర్యావరణం, ఖాదీ వినియోగం వంటి వాటిపై ప్రచారం నిర్వహించాలని ఆయన అన్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి సర్దార్ పటేల జయంతి రోజైన అక్టోబర్ 31 వరకు 150 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయాలని పార్టీ ఎంపీలను ప్రధాని మోదీ ఇదివరకే కోరిన సంగతి తెలిసిందే.
ఈ ప్రచారంలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ నేతలను కోరారు. అలాగే అందరు ప్రముఖ నేతల విగ్రహాలను కూడా సిద్ధాంతాలకు నిమిత్తం లేకుండా ప్రక్షాళన చేయాలని కూడా బీజేపీ నేతలు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

*చిత్రం...బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్

$
0
0

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ దూసుకుపోతోందని, అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతి పౌరుడు అంకితభావంతో పనిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ హైదరాబాద్ సైబర్ కనె్వంన్షన్ సెంటర్‌లో ప్రాజెక్టు మేనేజిమెంట్‌పై ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన ప్రాజెక్టు రిపోర్టుపై నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో గ్రామాల్లో జీవిస్తోందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న భారతదేశంలో స్థానిక సంస్థల ద్వారా అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కోసం కేంద్రం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం కింద 6 లక్షల కి.మీ గ్రామీణ రహదారులను నిర్మించిందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉద్యమంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. ప్రపంచంలో అతి పెద్ద గృహ నిర్మాణ కార్యక్రమమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయన్నారు. పట్టణాభివృద్ధి శాక చేపట్టిన స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ లాంటి పథకాలకు ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక పథకాలు జయప్రదమవుతాయన్నారు. మహిళా సాధికారత గురించి ఆయన వివరించారు.
*చిత్రం... హైదరాబాద్‌లో శనివారం జరిగిన సదస్సులో ప్రాజెక్టు రిపోర్టుపై నివేదికను
విడుదల చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేను శివప్రసాద్ కలసి చదువుకున్నాం

$
0
0

హైదరాబాద్, సెప్టెంబర్ 21: టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ తాను ఒకే స్కూల్‌లో చదువుకున్నామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.చెన్నై అపోలో ఆసుపత్రిలో చిక్సిపొందుతూ శనివారం మృతి చెందిన డాక్టర్ శివప్రసాద్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి ఆయన ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శుక్రవారం చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళి శివప్రసాద్‌ను చూశానన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడానన్నారు. 24 గంటలు గడవక ముందే శివప్రసాద్ చనిపోవడం చాలా బాధవేస్తోందన్నారు. హైస్కూల్ చదివే రోజుల్లో కలసి చదువుకున్నామన్నారు. శివప్రసాద్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించానన్నారు. రాజకీయాలోకి వచ్చి ఎమ్మెల్యే, మంత్రిగా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారన్నారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పార్టీ ఇతర సీనియర్ నేతలు శివప్రసాద్‌కు నివాళులు అర్పించారు.

మంగోలియా అధ్యక్షుడు బతుల్గా ప్రార్థనలు

$
0
0

*చిత్రం...బీహార్‌లోని బౌద్ధాలయంలో శనివారం ప్రార్థనలు జరుపుతున్న మంగోలియా అధ్యక్షుడు బతుల్గా

బీజేపీలో ‘మహా’ సంబరం

$
0
0

ముంబయి, సెప్టెంబర్ 21: వచ్చే నెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేయడంతోపాటు మరింతగా తన బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఫడ్నవిస్ నాయకత్వానికి ఈ ఎన్నికలు మరో పరీక్షగానే భావిస్తున్నారు. అధికార పార్టీ ఆశలు మరింతగా ఇనుమడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ మాత్రం ఏవిధంగా బలాన్ని పెంచుకోవాలి, ఓట్లను పుంజుకోవాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏవిధంగా చూసినా కూడా ప్రతిపక్ష కూటమికి ఈ ఎన్నికలు ఉనికి పోరాటంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వలసల సెగలకు లోనైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఈ ఎన్నికలు ఓ కఠిన పరీక్షగానే కనిపిస్తున్నాయి.
వచ్చే నెల 21న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిలు జరపాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రచార వేడి పుంజుకుంది. కేంద్రంలో రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నిక కూడా ఇదే. 2014లో 122 సీట్లు గెల్చుకున్న బీజేపీ ఈసారి గణనీయంగానే తన బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 2014-19 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో దుమ్మురేపిన బీజేపీ 288 సీట్లు గల అసెంబ్లీలో ఈసారి గణనీయంగానే విజయాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న విదర్భ, మరాఠ్వాడా, ముంబయి ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనపడడం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అన్నివిధాలుగా కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మొదటినుంచి పశ్చిమ మహారాష్టల్రో బలమైన పట్టును కనబరుస్తూ వచ్చిన శరద్ పవార్ నాయకత్వానికి ఈసారి ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. కొంకణ్ ప్రాంతంలో మాత్రం శివసేన తన పట్టును బిగిస్తూ వస్తోంది. అయితే, విజయావకాశాలపై దృష్టి పెట్టిన బీజేపీ తన బలహీనతలను కూడా అధిగమించేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంతోనే కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి గత రెండు నెలలుగా సీనియర్ నేతలను ఆకర్షిస్తూ వచ్చింది. ఆ విధంగా సంస్థాగతంగా తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ పట్టును బిగించేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ద్వితీయ స్థానానికి పరిమితం కావడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహా జనాదేశ్ యాత్రను మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్ 140 నియోజకవర్గాల్లో దాదాపు 4వేల కిలోమీటర్ల మేర పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ యాత్ర రెండు రోజుల క్రితమే ముగిసింది. కాగా, ఐదు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చిన శరద్ పవార్‌కు వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికలు అత్యంత కఠినమైనవిగానే కనిపిస్తున్నాయి. పవార్‌నే లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యూహాత్మకంగా సాగించిన దాడులే అందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారాస్త్రాలుగా బలమైన ఆయుధాలే ఉన్నాయి. అభివృద్ధి, రుణ మాఫీతోపాటు కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి జాతీయ అంశాలు కూడా రాజకీయ లబ్ధికి కమలనాథులు వాడుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీలకు కరవు కాటకాలు, ఆర్థిక మాంద్యం, రైతాంగం అవస్థలు, నిరుద్యోగం బలమైన ఆయుధాలుగా ఉన్నా అవి ఎంతమేరకు వాటిని ఆదుకుంటాయన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. 2014లో శివసేన-బీజేపీ, ఎన్సీపీ-కాంగ్రెస్ కూటములుగా ఏర్పడ్డా చివరిక్షణంలో అవి బెడిసికొట్టాయి.
అప్పట్లో జరిగిన చతుర్ముఖ పోటీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తాజా ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సంబంధించి బీజేపీ, శివసేన మధ్య ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం చెరో 125 సీట్లలో పోటీ చేయాలని సంకల్పించాయి. ప్రతిపక్ష కూటమిలో చిన్న పార్టీలకు 38 సీట్లు మిగిలాయి.
*చిత్రాలు.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ *ఎన్‌సీపీ నేత శరద్ పవార్ *శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>