Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సీక్వెల్‌కు ప్లాన్ చేస్తా

$
0
0

ఏ దర్శకుడికైనా రీమేక్‌కంటే కొత్త సినిమా చేయాలనే ఉంటుంది. కాకపోతే -తెలుగు రీమేక్ అంటే పరభాషా దర్శకులకు ఓ ప్రమోషన్ అనుకోవాలి. తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువ. వేరే భాషా దర్శకులెవరైనా మార్కెట్‌ను విస్తృతం చేసుకోవాలంటే -తెలుగు సినిమా లేదా రీమేక్ బెస్ట్ చాయిస్.
అర్జున్ సురవరం చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. కాని, ఇప్పుడైతే కాదు. దానికి కొంచెం ప్రణాళిక కావాలి అంటున్నాడు దర్శకుడు టి. సంతోష్. నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠీ జోడీగా తమిళ దర్శకుడు టి. సంతోష్ తెరకెక్కించిన చిత్రం అర్జున్ సురవరం. విడుదలైన సినిమాకు మంచి టాక్ రావడంతో -ఆదివారం మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు సంతోష్.
అర్జున్ సురవరం సినిమా ఆడియన్స్‌కి నచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సామాజికాంశంపై తీసిన సినిమా పట్ల ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. వెరీ హ్యాపీ.
చెన్నై తరువాత హైదరాబాద్ బాగా నచ్చింది. తమిళ దర్శకుడిలా ననె్నవరూ చూడలేదు. సినిమా నిర్మాతలు, యూనిట్ మొత్తం దర్శకుడిగా నన్ను ఆదరించటం పట్ల థాంక్స్ చెబుతున్నా.
తమిళంలో నేను చేసిన ‘కణిదన్’కు అర్జున్ తెలుగు రీమేక్. ముందు చేయకూడదనుకున్నా. కానీ, చేయడానికి ఒప్పుకున్న తరువాత నా ఎఫర్ట్ మొత్తం పెట్టాను.
తమిళంలో ఇదొక ఇంటిలిజెంట్ మూవీ. బట్, తెలుగు ఆడియన్స్ కోసం మార్పులు తప్పలేదు. అందుకే ఇదొక ఎమోషనల్ ఫిల్మ్‌గా డిజైన్ చేశాను. తమిళ, తెలుగు వర్షన్ల మధ్య చాలా మార్పులే ఉంటాయి.
ఫస్ట్ రీమేక్ కోసం హీరో నిఖిల్ అప్రోచ్ అయ్యాడు. చాక్లెట్ బోయ్‌లా కనిపించేసరికి చేయగలడా? అనుకున్నా. మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేయాల్సి ఉంటుందని చెప్పా. పాత్రకు తగినట్టు బాడీని చేంజ్ చేసుకున్నాడు. కెమెరా ముందుకొచ్చిన తరువాత -ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
కణిదన్‌కు ముందు మురుగదాస్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో రెండు (తుపాకి, సెవెన్త్ సెన్స్) సినిమాలు చేశా. కణిదన్ హిట్టు తరువాత అవకాశం వస్తే తెలుగు రీమేక్ కూడా చేయమని ఇన్‌సిస్ట్ చేసిన వాళ్లలో మురుగదాస్ కూడా ఉన్నారు.
దర్శకుడు కాకముందు జర్నలిస్ట్ కావాలన్న ఆలోచన ఉండేది. ఆ ప్రొఫెషన్ నాకు ఇష్టం. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే ఫస్ట్ సినిమా జర్నలిస్ట్ బేస్డ్ చేశానేమో.
తరువాతి ప్రాజెక్టుకు స్క్రిప్ట్ సిద్ధమైంది. కాకపోతే, నాకే సంతృప్తికరంగా లేదు. మళ్లీ వర్క్ చేస్తున్నా. నిర్మాతలు అడిగితే ఆ స్క్రిప్ట్‌ను తెలుగులోనూ చేస్తా. బైలింగ్వల్ ప్రాజెక్టుగా వస్తే ఇంకా హ్యాపీ.


కథే కిక్కిచ్చింది

$
0
0

90ఎంఎల్ నాకు అలవాటులేకున్నా -దర్శకుడు చెప్పిన 90 ఎంఎల్ కథ మంచి కిక్కిచ్చిందంటున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. కంప్లీట్ మాస్ మ్యూజిక్‌తో 6 పాటలు, బీట్ సాంగ్ సిట్యుయేషన్‌కు అనుగుణంగా ఉంటాయన్నాడు.
సినిమాలో హీరో కార్తికేయను మరో లెవల్లో చూస్తారు. అతనిలో మనం చూడని ఎన్నో కోణాలు ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా హ్యూమర్ అద్భుతంగా పండించాడు.
కార్తికేయ లైవ్‌లో ఎలా ఉంటాడో.. సినిమాలోనూ అలానే కనిపిస్తాడు. అతని ఫన్ ఎంజాయ్ చేసినోళ్లలో నేనొకడ్ని. అందుకే హీరో ఫన్ స్టామినాకు అనుగుణంగా బీజీఎం ప్లాన్ చేశా.
నేను చేసిన మాస్ సినిమాలు రెండు మూడే. అందులో ఇదొకటి. కథగా దర్శకుడు నాకేం చెప్పాడో దానే్న స్క్రీన్‌కు ఎక్కించాడు.
ఇదొక ఫీల్‌గుడ్ మూవీ. 90 ఎంఎల్ తీసుకునే హీరో -ప్రధానంగా ఏంచేశాడన్నదే కథనం. 90 ఎంఎల్ తీసుకోకుంటే ఎందుకు చనిపోతాడో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. దర్శకుడు ఈ కోణాన్ని తీసుకుని కమర్షియల్ ఫార్మాట్‌లోనే వైవిధ్యంగా రూపొందించాడు.

మరో హిట్టు పడ్డట్టే..

$
0
0

మందు తాగకుంటే చనిపోయే కుర్రాడికి.. అసలు ఆ వాసనే పడని అమ్మాయి తండ్రి మధ్య నడిచే కథ -90ఎంఎల్ అన్నాడు హీరో కార్తికేయ. కార్తికేయ, నేహాసోలంకి జోడీగా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కించిన చిత్రం -90ఎంఎల్. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రమిది. డిసెంబర్ 5న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ -ఇదొక ఫ్యామిలీ ఈవెంట్‌లాంటి సినిమా. ఫస్ట్ఫా చెప్పిన కొద్ది రోజులకే టైటిల్ 90ఎంఎల్ అంటూ దర్శకుడు చెప్పడం బాగా నచ్చింది. మంచి బడ్జెట్‌ల తీయాలనే సొంత బ్యానర్లో చేశా. చిరంజీవి సినిమాలు చూసే హీరో అయ్యా. నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తన్నాంటే అది నా దర్శకుల చలవ. నా ఆశను మన్నించి తల్లిదండ్రులు, బాబాయ్ ప్రోత్సహించారు. ఆర్‌ఎక్స్ 100తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాం. ఈ సినిమాతో త్రిబుల్ ఫ్రాఫిట్స్ వస్తాయన్న నమ్మకముంది. దర్శకుడు శేఖర్‌రెడ్డి, నాకూ ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. పదిహేనేళ్లుగా స్ట్రగులవుతోన్న దర్శకుడి కసి నుంచి పుట్టిన సినిమా 90ఎంఎల్ అన్నాడు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ -హీరో కార్తికేయ నా తమ్ముడులాంటోడు. సినిమాలపట్ల అతని ఆసక్తే హీరోని చేసింది. పెద్ద హీరోగానూ ఎదిగేలా చేస్తుందని నమ్ముతున్నా అన్నాడు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ -కార్తికేయ సొంత బ్యానర్ నాకోసమే పుట్టింది. ఆర్‌ఎక్స్ 100తో మంచి రిజల్ట్ అందుకున్నాం. ఇప్పుడు 90ఎంఎల్‌తోనూ కార్తికేయ మంచి హిట్టు కొడతాడని ఆకాంక్షిస్తున్నా అన్నారు. చిత్ర దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్రా మాట్లాడుతూ -అజయ్ భూపతితోనే కార్తికేయ పరిచయం. అతని సహకారంతోనే కార్తికేయకు కథ చెప్పాను. 90ఎంఎల్ టీంనుంచి ఇప్పటి వరకూ బయటికొచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సైతం అదే స్థాయిలో హిట్టందుకుంటుందన్న నమ్మకం ఉంది. సినిమా నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా -కథపై నమ్మకంతో కార్తికేయ సపోర్ట్‌గా నిలవడం హ్యాపీ అన్నారు.

మొదలైంది.. రీసౌండ్

$
0
0

సాయిరాంశంకర్, రాశీసింగ్ జోడీగా దర్శకుడు కృష్ణ చిరుమామిళ్ల తెరకెక్కించనున్న రొమాంటిక్ యూత్ ఎంటర్‌టైనర్ ‘రీసౌండ్’. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకాలపై జె సురేష్‌రెడ్డి, రాజు, ఎన్వీఎస్ రాజారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రారంభోత్సవంలో దర్శకుడు సుకుమార్ హీరో హీరోయిన్లపై క్లాప్‌నివ్వగా, మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. పోసాని కృష్ణమురళి తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ -సాయిరాం శంకర్ మళ్లీ ‘రీసౌండ్’తో వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ -సినిమా మంచి కథ, కొత్తదనంతో ఉంటుంది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడుతున్నాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నాడు. నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ -కథ నచ్చటంతో వెంటనే సినిమా మొదలుపెట్టామని, ఆడియన్స్‌కి మంచి ఫీల్‌నిచ్చే సినిమా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆకాష్‌పూరి, నిర్మాతలు జె సురేష్‌రెడ్డి, రాజు, నటుడు కాశీవిశ్వనాథ్ తదితరులు మాట్లాడారు.

తె(తే)గ నచ్చేస్తోంది

$
0
0

తాటి చెట్టులో వాడని భాగం లేదు. తాటి కర్రకు చెదలు, పిప్పి పట్టే అవకాశం తక్కువు. అందుకే ఇంటి నిర్మాణంలో వాసాలకు, ఎనగర్రకు దీన్ని విరివిగా వాడుతున్నారు. మంచాలకు, బల్లలకు వివిధ పనిముట్లకు తాటి కర్రలను వాడుతున్నారు. తా ఆకు ఇంటి పైకప్పుకు, బావి నుంచి నీరు చేదుకోవడానికి ఉపయోగించే ‘చేద’ను, బుట్టలు తయారుచేయడానికి, చాపలు వేయడానికి వాడుతున్నారు. తాటికల్లు తాగేవారి సంఖ్య అపరిమితం.
ముంజలు తినగా మిగిలిన తాటికాయలతో పిల్లలు బండ్లు కట్టుకుని ఆడుకుంటారు. ముంజలు ముదిరితే వాటిని ఉడకబెట్టి ‘చెక్కరగళి’ చేసుకుంటున్నారు. తాటిపండ్లు వరుసగా నలభై రోజులు తింటే వంటికి మంచి రంగు వస్తుందని, ఆయుష్షు పెరుగుతుందనే నమ్మకం వుంది. తాటిపండ్ల పీసం (గుజ్జు)తో తాటి తాండ్ర చేస్తున్నారు. తాటి కల్లుతో తాటి బెల్లం తయారుచేసి బాలింతరాలికి పెడతారు. తాటి పండ్లను తిన్న తరువాత ఆ బుర్రలను మట్టిలో పాతిపెడితే తేగలు తయారవుతాయి. ఈ తేగలను కాల్చి తింటారు. సుబ్రహ్మణ్య షష్టికి తేగలనే నైవేద్యంగా పెడుతున్నారు.
తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని, తింటే చదువురాదనీ చెప్పేవాళ్ళు. తేగను తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్‌ను దూరం చేస్తుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. తేగల పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెలను చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, కాల్షియం, ఫాస్పరస్, ధాతువులు పుష్కలంగా వున్నాయి.
తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి. బ్లడ్ కాన్సర్‌కు తేగలు చెక్ పెడతాయి. కాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకు ఉంది. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎములకు బలాన్నిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
తాటి తేగల ఉత్పత్తిలో అసలు పురుగుమందుల వినియోగం అసలు వుండదు. ఒకరకంగా చెప్పాలంటే కల్తీలేని ఆహారంగా తేలను చెప్పవచ్చు. ఇవి తినడానికి చాలా రుచికరంగా వుంటాయి. ప్రస్తుతం తాటి తేగలతో రవ్వ బిస్కెట్‌లు, కేక్‌లు, నూడిల్స్ కూడా తయారుచేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. తేగల్లో 60 శాతం పిండి పదార్థంతోపాటు పీచు పదార్థం కూడా వుంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారంగా చెప్పవచ్చు.
పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే మంచిది. ఫైబర్ సమృద్ధిగా వుండటంవలన రక్తంలో కొలెస్ట్రాల్ కూడా నిల్వ లేకుండా బయటకు పోతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. తాటి తేగలను మధుమేహం వున్నవారుకూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం కంట్రోల్‌గా ఉండేలా చేస్తుంది. రక్త వృద్ధి జరుగుతుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు రెగ్యుల్‌గా తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుంతుంది. చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తాటి తేగలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతుంటారు.
తేగలలో విటమిన్స్!
తేగల్లో బి, బి1, బి3, సి విటమన్లు ఉంటాయి. అలాగే ప్రతిరోజూ శరీరానికి అవసరం అయ్యే పొటాషియం, ఒమేగా 3, కాల్షియం కూడా పుష్కలంగా వుంటాయి. కాలరీలు తక్కువగా వుంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీన్ని డైట్‌లో భాగం చేసుకోవచ్చు.
అయితే తేగలను అధికంగా తీసుకోకూడదు. రోజుకు రెండు తీసుకోవచ్చునని, వారానికి ఐదారు తీసుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేగాని ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధిక మోతాదులో తీసుకుంటే కడుపునొప్పి ఏర్పడే అవకాశం వుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణలులు.

ధైర్యానికి తరుణమిదే

$
0
0

అన్నం తినడం లేదా? ఇట్లా మాట్లాడుతున్నావు? గడ్డి ఏదైనా తింటున్నావా ఈవిధంగా చేస్తున్నావు? అనటం మనం వింటూనే ఉంటాం! మన నడవడి, మన మాటతీరు ఇవన్నీ మనం ఏం తింటున్నామో లోకానికి చెబుతాయి. ఓ సన్యాసి భిక్షార్థం వచ్చినవి తినేవాడట. కానీ ఓ సారి ఓ భూకామందు ఆ సన్యాసిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడట. సన్యాని భోజనం తర్వాత కాస్త విశ్రమించాడట. ఆ సమయంలో ఆయనకు ఈ భూకామందు సంపాదనను ఎట్లా కొట్టేయాలా అన్న ఆలోచన వచ్చిందట. ఆయన వెంటనే ఇది ఏమిటి ? ఈ కొట్టేసే ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి? దీనికి కారణమేమిటి? అని ఆలోచిస్తే అది ఆ రోజు భూకామందు ఇంట చేసిన భోజనం కారణంగా కనిపించిందట.
వెంటనే ఆ సన్యాసి భూకామందును పిలిచి ఎట్లా సంపాదిస్తున్నావు. నీ వ్యాపారాలేమిటి అంటూ ఆరాలు తీసేసరికి మాయమాటలు చెప్పకపోతే నా వ్యాపారం నడవదంటూ ఏమేమి వ్యాపార కిటుకులు చెప్పాడట. వెంటనే ఆ సన్యాసి ఆ ఇంటినుంచి బయటకు వచ్చేసి ఆ కామందుకు ఇట్లా చేయడం తప్పు. నీవు చేసి సంపాదించిన సొత్తుతోటి తిండి తిన్నందువల్ల నాలో ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి. నీవు ధర్మమార్గంలో నడవకపోతే నీకు నరకం తప్పదు అని చెప్పాడట.
అది పురాతన కాలం కనుక ఆ కామందు సన్యాసి మాట విన్నాడు. పరిస్థితులు మారాయి.
కానీ ఇది కలియుగం! పైగా ఏ రంగంలోనైనా స్ర్తిపురుషులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అవినీతి ఇద్దరూ చేస్తున్నారు. వారు వీరు అనే తేడాల్లేకుండా స్ర్తిలు కూడా అవినీతిని పాల్పడుతున్నారని పత్రికలు చెబుతున్నాయి.
ఎందుకు ఇంత అవినీతి. కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట, ఉండడానికి ఇల్లు చాలవా? మనిషికి? ఒక్క సారి ఆలోచించండి.
అమాయకులు, స్ర్తిలను వీళ్లనే కాదు ఎవరు కాస్త మెత్తగా ఉంటే వారినందరినీ బెదరించి మరీ అవినీతికి పాల్పడుతున్నారంటే ఏమనుకోవాలి? జంతువులు కూడా వాటి ఆకలి మేర మాత్రమే ఎదుటి జంతువులపైన దాడి చేస్తాయి. అవి అన్నింటినీ చంపేసి తమ దగ్గర దాచుకోవు.
కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం తరతరాలకు తరగని గనుల్లాంటి ఆస్తులను కూడబెట్టుకోవడానికి అవినీతి చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఎంత ఆస్తి కూడబెట్టినవారైనా ఎంత పెద్ద పదవి చేతిలో ఉన్నవారైనా అవినీతి లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకిలా?
అవినీతితో, అక్రమంగా, అన్యాయంగా సంపాదిస్తూ తిండి తింటూ ఉంటే ఎక్కడ చూసినా అమానుషాలు జరుగుతూనే ఉంటాయి. మనశ్శాంతి లేకుడా సమాజం అంతా అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది. ఒకరిని ఒకరు చంపుకుని తినే రోజులు మళ్లీ వస్తాయి. ఆడపిల్లలు చంపడాలు, స్నేహితుల్లో చంపడాలు, భార్యభర్తల్లో చంపడాలు, పిల్లలను చంపడాలు, ఇక వృద్ధుల గురించి చెప్పడానికే వీలులేదు. బయట వారైనా, ఇంట్లో తన వారు అనుకొంటున్న సంతానమైనా వారికి యమభటులే అవుతున్నారు.
ఇటువంటి నేర ప్రవృత్తి మరీ మితిమీరడానికి కారణం అక్రమ సంపాదన కూడా కారణమవుతుందని మానసిక విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే మనిషి సక్రమంగా, ధర్మంగా సంపాదించి తింటాడో అపుడు పక్కమనిషికి తోడుగా నిలుస్తాడు కానీ ఇతరులను కొట్టి సంపాదన పెంచుకుంటారో ఆ సంపాదన తిన్న వారంతా అవినీతిపరులుగానే ఎదుగుతారు.
ఇవేకాదు నేటి కాలంలో విశృంఖలంగా వ్యాప్తిచెందుదున్న మద్యపాన మహమ్మారి. మనిషిని మత్తులోకి దించి చేయరానికి పనులను చేయించే మద్యం మత్తుకు చిన్న పిల్లల నుంచి పెద్దవారిదాకా బానిసలౌతున్నారు. మద్యపాన నిషేధ చట్టాలున్నా మద్యపాన బానిసలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. ప్రతి వీధిలో రెండోమూడో ఉండే మద్యపాన అంగళ్లు నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రభుత్వానికి సంపాదన వచ్చినా సమాజం తిరోగమనంలో నడవడానికి మద్యం కూడా ఒక కారణం అవుతోంది.
కనుక మద్యపాన మహమ్మారి గురించిన అవగాహనను ప్రజలందరికీ తెలియచేయడానికి స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. మద్యపాన మత్తు వల్ల యువత చెడుదారిలో నడవడం కాదు ఎందరి అమాయకుల ప్రాణాలోమంట గలుస్తున్నాయి. వీటిగురించిన విషయాలను మద్యానికి బానిసలైన వారికి తెలియజెప్పాలి.
సమాజం లోని ప్రతివారు కార్యకర్తలై అటు మద్యపాన నిషేధానికి, ఇటు అవినీతి దురాచార నిర్మూలనకు నడుం కట్టితేనే సమాజం బతుకుతుంది. లేకపోతే రాక్షస సమాజం మాత్రమే మిగులుతుంది. ఈరోజు ఎక్కడో ఏదో జరుగుతోంది. మనకేం అనుకోవచ్చు. కానీ అది రేపు మీ దగ్గరకు రాకుండా ఉంటుందా? నీరు పారుతుంటే పల్లం అంతా మునిగిపోతే మెరక ప్రాంతానికి కూడా వచ్చి తీరుతాయి. కనుక ప్రతి ఒక్కరూ అవినీతికి, అన్యాయాలకు నోరు విప్పండి. అధర్మానికి కొమ్ముకాయకండి. మీకు తెలిసినా మనకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణిని అవలంబించకండి. వెంటనే మీకు చేతనైనంతలో సమస్యను పరిష్కరించడానికి పూనుకోండి.

తెలుసుకుని తీరాలివి!

$
0
0

జరిగిపోయిన తరువాత ఎన్ని చెప్పినా లాభం ఉండదు. నేటి మహిళలు అందరూ ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నా ఇంకా ఎంత చదువుకున్నా అమాయకత్వాన్ని వీడని వారు మృగాళ్లకు బలవుతునే ఉన్నారు.
మృగాళ్లు అన్ని చోట్లా ఉంటున్నారు. వారు ఉండని ప్రదేశం అంటూలేనేలేదు. ఒక తండ్రి, ఒక సోదరుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక సహోద్యోగి, ఒక అపరిచితుడు, ఒక సహ ప్రయాణీకుడు ఇలా ఎవరైనా మృగాడు కావొచ్చు. మృగాడు కాదు అని చెప్పే వీలు లేనే లేకుండాపోతోంది. ఏ పరిస్థితుల్లో ఎవరు ఎందుకలా స్పందిస్తారో అమాయకులపైన వారి పంజా ఎందుకు విసురుతారో చెప్పలేము...
అందుకే ప్రతి ఆడపిల్లా ముందస్తు జాగ్రత్త తీసుకొని తీరాలి. దీనికి తల్లిదండ్రులే చొరవ చూపించాలి. బండి మీద వెళ్తున్నా, ఇద్దరితో కలసి వెళ్తున్నా, ఆఫీసుకానీ, పరిచితులతో కానీ ఎక్కడి వెళ్లినా అది ఏ సమయం సందర్భం అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి.
టీవీల్లో ప్రతి పదిహేను నిముషాలకొకసారి యాడ్స్ వచ్చినట్లే మహిళా రక్షణ గురించి పోలీసులు తీసుకొంటున్న వివరాలను చూపించాలి. టిక్ టాక్ లాంటి యాప్స్‌లో పనికిమాలిన దృశ్యాలు చూపించి ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవడం లేదా సంసారాల్లో చిచ్చులు పెట్టుకునే చర్యలు కాక ఆడపిల్లలను ఎలా సంరక్షించుకోవాలి సమాజం లోని వారు ఎలా అప్రమత్తులై ఉండాలో చూపించాలి.
ప్రతి పౌరుడూ ప్రతి మహిళనూ సంరక్షించే దిశలోనే ఉండితీరాలి. అంతగా జనసంచారం లేని ప్రదేశాలు నగరంలో ఉన్నాయి అంటే అక్కడ తప్పనిసరిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసైనా సరే పోలీసులను అక్కడ నిరంతరం కాపుదలకు ఉంచాలి. తోల్‌గేట్స్ దగ్గర పోలీసు యంత్రాంగం ఉండే చర్యలను తీసుకోవాలి.
ప్రతి సంస్థలోను రాత్రిళ్లు ఒంటరిగా చాలా దూరం వెళ్లే మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
100, 112, 181 వంటి నెంబర్లను టీవీల్లో అందరికీ తెలిసేవిధంగా రోడ్లపైన, టీవీల్లో స్క్రోలింగ్స్‌లోకూడా పెట్టాలి.
చిన్న పెద్దా అనే తేడాల్లేకుండా ప్రతి మహిళనోట్లో పోలీసు యంత్రాంగం, షీటీమ్స్ నెంబర్లు ఆడుతూ ఉండాలి.
ఇక పై ఎప్పుడూ ప్రియాంక రెడ్డిలాగా అనవసరంగా అసువులు కోల్పోయే స్థితి ఏ మహిళ తెచ్చుకోకూడదు. దానికోసం ప్రతి పౌరుడు, ప్రతి మహిళా తగిన చర్యలను తీసుకోవాలి.

మానవత్వం మంటగలుస్తోంది..

$
0
0

జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. స్ర్తి ఒంటరిగా కనిపిస్తే చాలు, కసిదీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలను చూడనట్లు ఆబగా చూసే కళ్ళు.. అనె్నం పునె్నం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడి చేసి దాహం తీర్చుకుంటున్నాయి.
ఇటు హైదరాబాద్.. అటు వరంగల్.. తెలంగాణలో రెండు ముఖ్యమైన నగరాల్లో ఒకే రోజున రెండు దారుణాలు జరిగాయి. చారిత్రక నగరాలకు మచ్చతెచ్చే దురంతాలు చోటుచేసుకున్నాయి. షీ టీమ్‌లు, పెట్రోలింగ్‌లు.. ఎన్ని వున్నా ఆడపిల్లలపై అరాచకాలు జరుగుతూనే వున్నాయి.
ప్రియమైన నోరు మూగబోయింది
ప్రతిరోజూ మూగజీవాలతో ముచ్చటించే నోరు మూగబోయింది. జీవితం అంటే ఏంటో తెలుసుకునేలోపు ఆ నోటిని, మనిషి రూపంలో వున్న మృగాలు అతి క్రూరంగా హింసించి మూసాయి. జంతువుల రూపంలో వున్న మృగాలకు కూడా చికిత్స చేయగలిగిన తాను, మనిషి రూపంలో వున్న జంతువులవల్ల ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. తమ కామవాంఛకు మహిళలపై వికృత స్థాయిలో విజృంభిస్తూ వికృతం రూపంగా మారుతున్న మానవ మృగాలను ఏం చేయాలి.. రోజురోజుకు ఒక్కొక్క విచిత్రమైన కథనాలు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం.
కఠిన శిక్షలు అమలు చేయాలి
ప్రస్తుత తరుణంలో మనిషి కాలంతోపాటు పోటీ పడుతూ సాంకేతికంగా అభృవృద్ధిలో దూసుకువెళ్తున్నా, ఒకవైపు ప్రపంచాన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసినా కొన్ని మానవ మృగాలవల్ల దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. తమ కామవాంఛ తీర్చుకోవడానికి మహిళలపై వికృత స్థాయిలో విజృంభిస్తూన్న మానవ మృగాలను ఏం చేయాలి. ఇలాంటి లైంగిక వాంఛలతో పేట్రేగిపోతూ ప్రపంచాన మానవత్వం మట్టిలో కలుస్తుందేమో అనే భయం వేస్తుంది. దేశంలో బలమైన చట్టాలు వున్నప్పటికీ మానవ మృగాలు మహిళలను చిదిమేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరుగకుండా కఠినంగా వ్యవహరించాల్సిందే. లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినశిక్షలు అమలుపరచాలి.
నైతిక విలువలు నేర్పాలి
చట్టపరమైన శిక్షలు విధించటమే కాకుండా పాఠశాల విద్యనుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించేలా మార్పు తీసుకురావాల్సిన అవసరం వుంది. అలాంటి మార్పు తీసుకురాగలిగితే కొంతమేరకైనా ఈ అత్యాచారాలకు అడ్డుకట్టవేసే అవకాశం వుంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా నీతి నిజాయతీలను గురించి, ధర్మం గురించి తోటి ప్రాణులను ఎలా చూడాలన్న కనీస జ్ఞానం వారికి అందించితీరాలి.
మహిళా హక్కులు బేజారు
భారత రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. మహిళల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలను భారత పార్లమెంట్ ఆమోదించింది. ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతున్నాయి. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంవల్ల నేడు ఎంతోమంది మహిళలు విద్యావంతులు అవుతున్నా, వారి కాళ్లమీద వారు నిలబడుతున్నా, ఎక్కడో ఒక చోట వివక్ష ఎదుర్కొంటూనే వుంటుంది. మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, వారి రక్షణ కోసం కేటాయించిన చట్టాలను గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ప్రతి స్ర్తిమూర్తికి అవసరం. అప్పుడే సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడగలం.
ఆత్మరక్షణకు టోల్‌ఫ్రీ
అపాయంలో మహిళలు ఈ టోల్ ఫ్రీనెంబర్లు 112, 100, 1090, 181, 1091 సత్వర సాయం అవసరమైన సందర్భంలో రక్షణకు ఉద్దేశించిన టోల్‌ఫ్రీ ఫోన్ల నెంబర్లపట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా వివిధ రకాల బాధ్యతలతో నిర్వహణ కోసం బయటకు వచ్చిన అమ్మాయిలు, మహిళలు విధిగా తమ మొబైల్ ఫోన్‌ల టోల్‌ఫ్రీ నెంబర్‌ను సేవ్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.
సమాజ బాధ్యత
అశ్లీలత, ఇంటర్‌నెట్, ఇతర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి శృంగారం లాంటివి మొబైల్స్‌లోకి అందుబాటులోకి రావడం ప్రధాన కారణం. అనేక కేసులలో మాదకద్రవ్య వినియోగం, మత్తుపానీయాల సేవనంతో నేరాలు జరిగినట్లు వెల్లడవుతున్నందున వాటిని కూడా నియంత్రించాలి. మహిళల్లో సామాజిక చైతన్యం కల్గించడం, భాగస్వాములను చేయడం, చట్టాలపై సరైన అవగాహన కల్పించడం, అకృత్యాలపై ప్రభుత్వం పకడ్బందీగా నిఘా వేసి నియంత్రించాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మహిళా సంఘాలు, మేధావులు సమిష్టి కృషితోనే మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. పర స్ర్తిలలో తల్లిని, చెల్లిని, అక్కను చూసే సమాజం కొరకు కృషిచేద్దాం. అమ్మాయిలకు ఆత్మరక్షణ నేర్పు వచ్చేలా ప్రతి ఒక్కరం పాటుపడదాం. ప్రతి మహిళా గౌరవంగా, సామరస్య వాతావరణంలో ఎదగాలి.


గత నెలలో.. రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మూడు నెలల తర్వాత తాజాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఊపందుకున్నాయి. గడచిన నవంబర్‌లో ఈ వసూళ్లు 6 శాతం పెరిగి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1.03 లక్షల కోట్లు వసూలయ్యాయని, ఇటీవలి పండుగ సీజన్ ఇందుకు ప్రధానంగా దోహదం చేసిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 97.637 కోట్లు వసూలయ్యాయి. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ వసూళ్ల ద్వారా రూ. 95,380 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దాదాపు రెండు నెలలపాటు వసూళ్లలో వృద్ధి లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తాజాగా వసూళ్లలో గణనీయ వృద్ధి చోటుచేసుకోవడం ద్వారా దేశంలో వినిమయం, పన్ను వర్తింపు పెరిగాయని తేటతెల్లమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా గడచిన నెల రోజులుగా దేశీయంగా జీఎస్టీ వసూళ్ల ద్వారా లావాదేవీల్లో 12 శాతం వృద్ధి నెలకొంది. ఈ ఏడాది ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. స్థూలంగా గత నెలలో రూ. 1,03.492ల వసూళ్లు జరిగాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 19,592 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 27,144 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 49,028 కోట్లు (దిగుమతుల ద్వారా వసూలైన రూ. 20,948 కోట్లు కలుపుకుని), సెస్ రూ. 7,727 కోట్లు (దిగుమతుల ద్వారా వసూలైన (రూ. 869 కోట్లు సహా) ఉన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వివరించారు. జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 2017 జూలైలోప్రవేశపెట్టిన తర్వాత జరిగిన ఈ పన్ను వసూళ్లలో ఇవి మూడవ అత్యధిక స్ధాయి వసూళ్లుగా నమోదయ్యాయి. అలాగే ఇలా నెలవారీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది ఎనిమిదోసారి.
గడచిన జూలైలో రూ. 1,02,083 కోట్లు వసూలుగా ఆ తర్వాత నవంబర్‌లోనే ఈ ఘనత వీలైంది. ఐతే ఎగుమతులపై వసూలవుతున్న జీఎస్టీ శాతం మాత్రం గత నెలలో (-) 13 శాతం తగ్గడం గమనార్హం. కానీ అక్టోబర్‌తో పోల్చుకుంటే (-) 20 శాతం వృద్ధి నెలకొంది. ఇలావుండగా గడచిన అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ కోసం మొత్తం 77.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం 25.150 కోట్ల రూపాలు సీజీఎస్టీ ద్వారా సెటిల్మెంట్ చేసింది. అలాగే రూ. 17.431 ఐజీఎస్టీలోని ఎస్‌జీఎస్టీ కింద సెటిల్మెంట్ చేసినట్టు గణాంకాలు తెలిపాయి.

విదేశీ పెట్టుబడులదే పైచేయి

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ప్రధాన మార్కెట్లలో గడచిన నవంబర్ మాసంలో విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) రూ. 22,872 కోట్ల నికర నిధులను మదుపు చేశారు. ఇలా వరుసగా మూడో నెలలోనూ దేశీయ పెట్టుబడుల్లో ఎఫ్‌పీఐలదే పైచేయిగా నిలిచింది. డిపాజిటర్స్ గణాంకాలను బేరీజు వేసుకున్న విశే్లషకుల అభిప్రాయం మేరకు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా మారడం, దేశీయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రధానంగా ఎఫ్‌పీఐలు మన దేశం వైపు దృష్టి సారించేలా చేశాయని స్పష్టమైంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను తగ్గించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున వస్తున్నాయని, ప్రత్యేకించి ఇందులో ఎఫ్‌పీఐలు అధిక శాతం మదుపు చేస్తున్నారని అంటున్నారు. కాగా నవంబర్‌లో మొత్తం రూ. 25,230 కోట్లు భారత మార్కెట్లలో మదుపుచేసిన ఎఫ్‌పీఐలు రూ. 2,358.2 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. అందువల్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 22,871.8 కోట్లుగా మిగిలాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 16,037.6 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 6,557.8 కోట్లు వంతున విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు మదుపు చేశారు. ఇలావుండగా గత సెప్టెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను సంస్కరణలను ప్రస్తుతం అమలులోకి తేవాల్సివుంది. తద్వారా ఇందుకు సంబంధించిన ప్రభావం పెట్టుబడులను మరింతగా పెంచే అవకాశాలున్నాయని విశే్లషకు ప్రణయ్ భాటియా అభిప్రాయపడ్డారు. పన్ను సంస్కరణల అమలుతో ద్రవ్య లభ్యత గణనీయంగా పెరుగుతుందని, తద్వారా ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వినిమయాన్ని పెంచడం వల్ల కంపెనీలు ఉత్పత్తిని మరింతగా పెంచుతాయన్న అంచనాలతోనే ప్రస్తుతం పెట్టుబడులు విరివిగా వస్తున్నాయని మరో విశే్లషకుడు హరీష్ జైన్ అంటున్నారు, ప్రధానంగా రెండో త్రైమాసిక బలహీన వృద్ధిరేటు గణాంకాలు స్వల్పకాలానికి విదేశీ మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చంటున్నారు.

42 శాతం పెరిగిన కాల్‌డేటా చార్జీలు

$
0
0

న్యూఢిల్లీ, నవంబర్ 1: టెలికాం రంగంలో నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా మొబైల్ కాల్ రేట్లను వొడాఫోన్ ఐడియా మంగళవారం (3వ తేదీ) నుంచి పెంచనుంది. ఈమేరకు ప్రీ పెయిడ్ సేవలకు 42 శాతం అదనంగా కాల్ డేటా చార్టీలను పెంచుతున్నట్టు ఆ కంపెనీ ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల వంతున చార్జి చేయడం జరుగుతుందని తెలిపింది. వొడాఫోన్‌తో ఐడియా విలీనం నేపథ్యంలో ఈ కంపెనీ దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవిర్భవించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ ఆదివారం ప్రీ పెయిడ్ సేవలకు కొత్త టారిఫ్‌లను ప్రకటించింది.
అలాగే డిసెంబర్ 3 మధ్యరాత్రి నుంచి సరికొత్త ప్లాన్లు వినియోదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో రెండు రోజుల ‘అన్‌లిమిటెడ్’ కేటగిరీ, 28, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన పథకాలున్నాయన్నారు. వీటిద్వారా కొత్తగా పెంచే 41.2 శాతం కాల్‌డేటా చార్జీలకు తగిన ప్రయోజనాలుంటాయని ఆ కంపెనీ తెలిపింది. తమ సంస్థకే ఈ ప్రణాళికలు సొంతమని వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌ను 3వ తేదీ నుంచి సవరించిన కొత్త ప్లాన్స్ ద్వారా భర్తీ చేస్తామని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ప్రధానంగా ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ద్వారా వినియోదారులు అత్యంత వేగవంతమైన డేటా యూసేజ్‌తోబాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ధరల పెరుగుదలతో కూడిన వార్షిక అన్‌లిమిటెడ్ కేటగిరీ ప్రణాళికకు రూ. 2,399 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 1,699 గా ఉంది. అలాగే 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఆరంభ ప్రణాళిక రోజుకు 1.5 జీబీతో ఉంటుందని దీనిపై 31 శాతం పెంచడం ద్వారా ధర 458 నుంచి 599కి పెంచుతున్నట్టు వివరించారు. అలాగే రోజుకు 1.5 జీబీ డేటాతో కూడిన ప్రస్తుత రూ. 199 ప్లాన్‌ను సైతం 25 శాతం అదనంగా రూ. 249కి పెంచుతున్నట్టు తెలిపారు. కాగా గత నెలలో ఈ కంపెనీ భారతీయ కార్పొరేట్ కంపెనీల్లోకెల్లా అత్యధికంగా రూ. 50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రొనాల్డో కీలక గోల్‌

$
0
0

ట్యూరిన్‌లోని జువెంటస్ అలియాంజ్ స్టేడియంలో ఇటాలియన్ సిరీ ‘ఏ’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ససువొలోతో జరిగిన మ్యాచ్‌లో బంతితో ముందుకు దూసుకెళుతున్న జువెంటస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేయడంతో ఈమ్యాచ్ డ్రాగా ముగిసింది. జువెంటస్ తరఫున లియోనార్డో బొనుసీ (20వ నిమిషం), రొనాల్డో (68) గోల్స్ చేశారు. ససువొలో ఆటగాళ్లు జెరెమీ బొగా (22వ నిమిషం), ఫ్రాన్సిస్కో కాపుటో (47వ నిమిషం) చెరొక గోల్ చేశారు. ప్రత్యర్థి కంటే ఒక గోల్ వెనుకంజలో ఉన్న జువెంటస్‌ను రొనాల్డో తన కీలక గోల్‌తో ఆదుకున్నాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు.

బర్న్స్, రూట్ శతకాలు

$
0
0

హామిల్టన్, డిసెంబర్ 1: ఓపెనర్ రొరీ బర్న్స్, కెప్టెన్ జో రూట్ శతకాలతో చెలరేగడంతో, న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటను వర్షం కారణంగా నిర్ణీత సమయాని కంటే ముందుగానే ముగించే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లకు 269 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి, 201 పరుగుల వద్ద బర్న్స్ వికెట్‌ను కోల్పోయింది. 209 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లతో 101 పరుగులు చేసిన అతను దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. స్టార్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ 59 బంతుల్లో 26 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. జాక్ క్రాలే కేవలం ఒక పరుగు చేసి, నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో జేబీ వాల్టింగ్‌కు దొరికిపోయాడు. 99.4 ఓవర్ల వద్ద వర్షం కారణంగా నిలిచిపోయిన ఆటను కొనసాగించే అవకాశం లభించలేదు. దీనితో ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి రూట్ 114, ఒలీ పోప్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రూట్ 278 బంతులు ఎదుర్కొన్నాడు. అతని స్కోరులో 14 ఫోర్లు ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 375 ఆలౌట్ (టామ్ లాథమ్ 105, రాస్ టేలర్ 53, బీజే వాల్టింగ్ 55, డెరిల్ మిచెల్ 73, స్టువర్ట్ బ్రాడ్ 4/73, క్రిస్ వోక్స్ 3/83, శామ్ క్యూరెన్ 2/63).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 99.4 ఓవర్లలో 5 వికెట్లకు 269 (రొరీ బర్న్స్ 101, జో రూట్ 114 నాటౌట్, బెన్ స్టోక్స్ 26, టిమ్ సౌథీ 2/63, నీల్ వాగ్నర్ 1/76).

‘కూలింగ్ ఆఫ్’ పై నీళ్లు!

$
0
0

ముంబయి, డిసెంబర్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీరు మళ్లీ మొదటి వస్తున్నట్టు కనిపిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన లోధా కమిటీ అనేకానేక అశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికలోని అంశాలను నీరుగార్చే ప్రయత్నానికి మళ్లీ శ్రీకారం చుట్టింది. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్నీ తు.చ తప్పకుండా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడమేగాక, ఇందు కోసం పాలనాధికారుల బృందాన్ని (సీఓఏ) నియమించింది. నిజానికి వీరి ఆధ్వర్యంలోనే ఇంత వరకూ బోర్డు కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే, పదవీ కాలానికి సంబంధించి లోధా కమిటీ సిఫార్సు చేసిన అంశాలు, ప్రధానంగా 3కూలింగ్ ఆఫ్2ను మార్చాలని ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీర్మానించింది. ఈ నిర్ణయాల కాపీని ఆమోదం కోసం సుప్రీం కోర్టుకు పంపింది. స్థానిక క్రికెట్ బోర్డుల నుంచి బీసీసీఐ వరకూ ఎక్కడైనా సరే, కార్యవర్గంలో మూడేళ్లకు మించి పని చేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కావచ్చు. అంటే ఏకబిగిన ఆరు సంవత్సరాలు క్రికెట్ సంఘాలు లేదా బోర్డు కార్యవర్గంలో ఉండవచ్చు. ఆ తర్వాత కనీసం మూడేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలి. దీనినే 3కూలింగ్ ఆఫ్2 కాలంగా లోధా కమిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఆతర్వాత మరోసారి మాత్రమే సదరు వ్యక్తి క్రికెట్ సంఘాలు లేదా బీసీసీఐ కార్యవర్గానికి ఎన్నిక కావచ్చు. స్థూలంగా చెప్పాలంటే, మొత్తం మూడు పర్యాయాలు, వరుసగా ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఎవరూ క్రికెట్ పాలక వర్గం వర్గాల్లో ఉండకూడదు. రెండు పర్యాయాలు పాలక మండలిలో ఉంటే, ఆతర్వాత కూలింగ్ పీరియడ్ మొదలవుతుంది. ఈ అంశమే బోర్డుకు నచ్చడం లేదు.
గంగూలీ ఎత్తుగడ!
3కూలింగ్ ఆఫ్2 నిబంధనను తొలగించాలంటూ బీసీసీఐ తీర్మానాన్ని ఆమోదించడం ఇటీవల బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎత్తుగడగానే కనిపిస్తున్నది. బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఆతర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, వరుసగా ఆరు సంవత్సరాలు ఒక పదవిలో ఉన్న తర్వాత 3కూలింగ్ ఆఫ్2 అమలవుతుంది. దీని ప్రకారం అతను వచ్చే ఏడాది తన పదవి నుంచి తప్పుకోవాలి. అందుకే, ఈ నిబంధనను మార్చాలని లేదా ఎత్తివేయాలని బీసీసీఐ తీర్మానాన్ని ఆమోదించేలా చూశాడన్నది వాస్తవం. సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందిస్తూ, 2024 వరకూ అతడను బోర్డు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

*చిత్రం... సౌరవ్ గంగూలీ

అయోధ్య ముగిసిన అధ్యాయం

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అయోధ్య వివాదానికి సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన చారిత్రక తీర్పుతో శాశ్వతంగా తెర పడిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ వేయాలన్న అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్‌బీ), జమాయత్-ఉలేమా-ఏ-హింద్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు సంస్ధలూ ప్రజల్లో వైషమ్యాన్ని, సంఘర్షణను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, సుప్రీం తీర్పుతో పరిష్కారమైన ఓ వివాదస్పద అంశాన్ని తిరగదోడుతున్నాయని నఖ్వీ అన్నారు. ముస్లింలకు సంబంధించినంత వరకూ ప్రధాన సమస్య బాబ్రీ (మసీదు) కాదని, బరాబరీనేనని (సమానత్వం) ఆయన ఉద్ఘాటించారు. ముఖ్యంగా విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముస్లింలకు సమానవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కోర్టులను ఆశ్రయించే హక్కు ఉంటుందని పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన నఖ్వీ ‘సుప్రీం తీర్పుతో ఏకగ్రీవంగా పరిష్కారమైన ఓ అంశాన్ని తిరగదోడడం ద్వారా సామరస్యపూర్వక వాతావారణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు’ అని ఉద్ఘాటించారు. సుప్రీం తీర్పును సమాజంలోని ప్రతి వర్గం హర్షించిందని స్పష్టం చేసిన ఆయన ఈ తీర్పుతో దేశంలో సమానత్వ భావన బలోపేతమైందన్న వాస్తవాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతే అంతకు మించి విచారించాల్సిన అంశం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ ముసాయిదా సిద్ధమైందని, డిసెంబర్ 3 లేదా 4వ తేదీల్లో దీనిని దాఖలు చేస్తామని జమాయత్-ఉలేమా వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా డిసెంబర్ 9న రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని వెల్లడించింది. ఈ రెండు సంస్థల ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించిన నఖ్వీ సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ రెండు సంస్థల వాదనను మొత్తం సమాజం చేస్తున్న వాదనగా ఎంత మాత్రం పరిగణించడానికి వీలు లేదని తెలిపారు. దేశ ప్రజలంతా కూడా అయోధ్య సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని భావిస్తున్నారని, ఇందుకు సంబంధించిన తదుపరి అంశాలపై ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ రెండు సంస్థలకూ నిజంగా తమ వాదనలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే గతంలో కోర్టు జరిపిన రాజీ ప్రయత్నానికి ఎందుకు అంగీకరించలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడడానికి ముందే అది ఎలా ఉన్నా కూడా కట్టుబడి ఉంటామని ముస్లింలు, హిందువులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలోని తన ఇంట్లో జరిపిన సమావేశంలోనూ అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని, సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దానికి కట్టుబడి ఉంటామని ముక్తకంఠంతో వెల్లడించిన విషయాన్ని నఖ్వీ ఈ సందర్భంగా చెప్పారు. వివాదం రేకెత్తిస్తున్న ఈ రెండు సంస్థలు కూడా సుప్రీం తీర్పును అంగీకరించాయని గుర్తు చేసిన నఖ్వీ ఇప్పుడు వాటి మనస్సు ఎందుకు మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో ఈ తీర్పును అంగీకరిస్తామని అంగీకరించిన ఈ రెండు సంస్థలు ఇప్పుడు పూర్తి భిన్నంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఈ రెండు సంస్థల ప్రయత్నాల వల్ల అయోధ్య వివాదంపై కొత్త అంకానికి తెర లేస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఈ రెండు సంస్థలు తమ వాదన గురించి ఇళ్ళలో చర్చించుకోవాల్సిందే, ఎందుకంటే సుప్రీం తీర్పును దేశ ప్రజలందరూ అంగీకరించారు. ఈ వివాదం శాశ్వతంగా ముగిసిందన్న నిర్ణయానికి వచ్చేశారు’ అని నఖ్వీ జవాబిచ్చారు.
*చిత్రం... కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ


99 శాతం ముస్లింలు అనుకూలం

$
0
0

లక్నో, డిసెంబర్ 1: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఏకగ్రీవ తీర్పునకు సంబంధించిన సమీక్షా పిటీషన్ వేయాలని దేశంలోని 99 శాతానికి పైగా ముస్లింలు కోరుకుంటున్నారని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం నాడిక్కడ వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేసిన ఈ సంస్థ న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయోధ్యలోని వివాదస్పద స్థలంలో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారానే ఆలయ నిర్మాణం జరగాలని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించిందని, అయితే ఈ ట్రస్టు ఇప్పుడు బలహీనపడిందని ప్రధాన కార్యదర్శి వౌలానా వాలీ రహెమానీ తెలిపారు. 99 శాతం మంది ముస్లింలు రివ్యూ పిటీషన్ వేయడానికి అనుకూలంగా ఉన్నారని ఆన చెప్పారు. మెజారిటీ ముస్లిం ప్రజలు సుప్రీం తీర్పును అంగీకరించారని చెప్పడం తప్పు అని పేర్కొన్న ఆయన ‘మా పిటీషన్‌ను డిస్మిస్ చేస్తారని అనుమానిస్తున్నాం..అయినా కూడా దాఖలు చేసి తీరుతాం’ అని తెలిపారు. సుప్రీం తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలు ఎన్నో ఉన్నాయని, దీని దృష్ట్యా రివ్యూ పిటీషన్ దాఖలు చేయడం తమ న్యాయపరమైన హక్కు అని అన్నారు.

కాశ్మీర్‌లో అస్థిరత్వానికి విద్రోహుల యత్నాలు

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో అల్లర్లు సృష్టించాలని భారత వ్యతిరేక శక్తులు కోరుకుంటున్నప్పటికీ, బీఎస్‌ఎఫ్ వంటి బలగాల పటిష్టమయిన రక్షణ కవచం ఉండటం వల్ల అవి విజయవంతం కాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం నాడిక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బీఎస్‌ఎఫ్ బలగాలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ శత్రువులు సరిహద్దు ప్రాంతాల్లో అస్థిరత్వం సృష్టించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, మన బలగాలు సరిహద్దుల పొడవునా చొరబాటు యత్నాలను, స్మగ్లింగ్ యత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారని అన్నారు. ‘ఇటీవలి నిర్ణయాలు (అధికరణం 370 రద్దు) జమ్మూకాశ్మీర్‌లో సానుకూల పరిణామాలకు దారితీసింది. కాని, జాతి వ్యతిరేక శక్తులు కాశ్మీర్ లోయలో సమస్యలు సృష్టించాలని కోరుకున్నాయి. అయితే, బీఎస్‌ఎఫ్ అభేద్యమయిన గోడవలె నిలబడి అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఆ శక్తుల ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది’ అని మంత్రి పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్ అప్రమత్తత కారణంగా దుష్ట శక్తులు ఏదైనా చర్యకు దిగాలని ప్రయత్నించడానికి ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తాయని ఆయన అన్నారు. బీఎస్‌ఎఫ్ సమర్థవంతమయిన పనితీరు కారణంగా పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కర్తార్‌పూర్ కారిడార్ భద్రతను దానికే అప్పగించడం జరిగిందని మంత్రి తెలిపారు.

గవర్నర్ బేడీ జోక్యంపై కోర్టుకు వెళ్తా..

$
0
0

పుదుచ్చేరి, డిసెంబర్ 1: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిపాలనా వ్యవహరాల్లో గవర్నర్ కిరణ్ బేడీ తరచు జోక్యం చేసుకోవడాన్ని ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో తాను త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ పరిపాలనా వ్యవహారాల్లో తరచు గవర్నర్ కిరణ్‌బేడీ జోక్యం చేసుకొంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సైతం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పార్లమెంట్ సెక్రటరీ ఈ అంశంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా జోక్యం తగదని కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కిరణ్ బేడీ వైఖరిలో మార్పు రాకపోగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సైతం అడ్డుకొంటూ అభివృద్ధి జరగకుండా చూస్తున్నారని సీఎం నారాయణస్వామి విమర్శించారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే.. గవర్నర్ కిరణ్‌బేడీ అభ్యంతరం చెప్పడం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఈ అంశంతో పాటు ఇతర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో తరచు జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నిస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం స్పష్టం చేశారు. జీఎస్‌టీ అమలు చేసినప్పటి నుంచి రాష్ట్ర వాటాగా రావాల్సిన 400 కోట్ల రూపాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకుండా వివక్ష చూపుతోందని సీఎం ధ్వజమెత్తారు.
*చిత్రం...పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి

మీ మైండ్ సెట్ మార్చుకోండి

$
0
0

లాహోర్, డిసెంబర్ 1: ‘మీ మైండ్ సెట్ మార్చుకోండి..’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధికారులకు సూచించారు. పాతకాలం నాటి విధానాలతో, పద్ధతులతో ‘నయా (కొత్త) పాకిస్తాన్’ ఎలా అవుతుందీ? అని ఆయన ప్రశ్నించారు. దేశాభివృద్ధిలో, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, పెరుగుదలలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. మెరిట్, అంకితమైన భావంతో పని చేసే ఉద్యోగులను కీలకమైన శాఖల్లో నియమించాలని ఆయన అధికారులకు సూచించారు. శనివారం జరిగిన పాక్ వివిధ శాఖల ఉన్నతాధికారుల, పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ పాత పద్ధతులను పట్టుకుని వేలాడితే దేశం అభివృద్ధి చెందదని అన్నారు. ఆ మర్నాడే ప్రధాని ఖాన్ 134 మంది ఉన్నతాధికారులను, పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ప్రభుత్వ పని తీరును మెరుగుపరచాలని, శాంతి-్భద్రతలను పూర్తిగా కాపాడాలని ఆయన ఆదేశించారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలని ఆయన సూచించారు. పోలీసు స్టేషన్లపై లోగడ వివిధ రకాల వత్తిళ్ళు ఉండేవని అన్నారు. ప్రజల రక్షణే తమ కర్తవ్యంగా పోలీసులు పని చేయాలని ఆయన సూచించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావీద్ భజ్వా పదవీ కాలాన్ని పొడిగించిన విషయంలో కోర్టు తలదూర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోర్టు విమర్శించం భావ్యం కాదన్నారు. ఆ వివాదం ఇప్పుడు సమిసి పోయిందని ఆయన చెప్పారు. ఇంకా ఈ విషయంపై ఎక్కువ మాట్లాడనని అన్నారు. అవినీతిని పూర్తిగా రూపుమాపాలని, అవినీతిపరులను జైలుకు పంపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.

*చిత్రం...పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నానా పటోల్

$
0
0

ముంబయి, డిసెంబర్ 1: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే నానా పటోల్ ఆదివారం మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అంతకు ముందు తన అభ్యర్థి కిషన్ కాథోర్‌ను ఉపసంహరించుకుంది. ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ అసెంబ్లీలో స్పీకర్‌గా నానా పటోల్ ఎన్నికయినట్టు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు 57 ఏళ్ల పటోల్‌ను స్పీకర్ స్థానం వరకు సాదరంగా ఆహ్వానిస్తూ తీసికెళ్లారు. ఎమ్మెల్యేగా, రైతు నాయకుడిగా పటోల్ చేసిన కృషిని థాకరే, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసించారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే రాష్ట్ర సంప్రదాయాన్ని కొనసాగించడానికి తన అభ్యర్థి కాథోర్‌ను ఉపసంహరించుకున్నట్టు బీజేపీ ప్రకటించింది. ‘ఒక రైతు బిడ్డ ఈ పదవిని అలంకరించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని థాకరే అన్నారు. పటోల్ గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, 2014లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లతో విభేదాలున్నాయని పేర్కొంటూ 2017 డిసెంబర్‌లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రతిపక్ష బీజేపీ తన అభ్యర్థిని ఉపసంహరించుకొని, పటోల్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసిందని, ఈ విషయంలో ఆ పార్టీ అవగాహన తీరు అభినందనీయమని ఎన్‌సీపీకి చెందిన మంత్రి జయంత్ పాటిల్ అన్నారు. హరిభావ్ బాగడే వారసుడిగా పటోల్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2014-19 మధ్య కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీకి చెందిన హరిభావ్ బాగడే స్పీకర్‌గా పనిచేశారు. పటోల్ సకోలి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
*చిత్రం...మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలేను అభినందిస్తున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఇతర నాయకులు

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>