Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఇచ్చుటలో ఉన్న హాయి..

$
0
0

ప్రేమ.. ఒక మధుర జ్ఞాపకం.. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు.. ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసేందుకు మథనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలు/ప్రేమికుడు మనసు దోచేందుకు ఎలాంటి కానుకలు ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు/ప్రేమికురాలు తెగ తికమక పడిపోతుంటారు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విశిష్ట రీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఒక సవాలే.. ప్రేమ.. పేరుకు రెండు అక్షరాలే కానీ అణుబాంబు కంటే బలమైనది.. బుల్లెట్లకంటే శక్తివంతమైనది.. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి.. ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో.. ఇక కొంతమంది తమ ప్రేమ భూమి ఉన్నంతకాలం గుర్తుండిపోవడం కోసం అద్భుతమైన కట్టడాలు నిర్మించారు.
మనం దిగుమతి చేసుకున్న సంప్రదాయాల్లో ‘ప్రేమికుల రోజు’ ముఖ్యమైనదిగా యువత మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఒకవైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రేమికులు ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్నవారు ఉత్సాహంగా వేడుకలు జరుపుతున్నారు. ప్రేమపక్షులు క్షణమొకయుగంగా గడిపే ఈ రోజు కోసం వారు నిరీక్షిస్తుంటారు. ప్రేమికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న వ్యాపార సంస్థలు, వెబ్‌సైట్‌లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. గత కొంతకాలంగా పెరిగిపోతున్న ఇంటర్నెట్ ప్రేమాయణాలకు అదే ఇంటర్నెట్‌లో అందమైన కానుకలుగా కూడా అందుతున్నాయి. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి మదనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రియురాలు మనసు దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తెలియక ప్రేమికుడు/ప్రేమికురాలు తెగ ఆలోచిస్తుంటాడు. ఇక ప్రత్యేకమైన అభిరుచులు, బహుమతుల విషయంలో పట్టింపులున్న అమ్మాయి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోకతప్పదు. ఒకప్పుడు పూలు, చాక్లెట్లు, అందమైన టెడ్డీబేర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎదుటివారి మనసు దోచేస్తే చాలు.. అలాంటి కొన్ని కళారూపాలు మీకోసం..


ప్రేమికులకు ప్రత్యేకం..

$
0
0

ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీ యువకులు ఉంటారా? ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దగ్గరలో రాబోతున్నది. ప్రేమికుల రోజును ఒక వేడుకల జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోతారు. ఇక ఆ రోజు ఏ ప్రదేశాలకు వెళ్లాలి? ఎక్కడ గడపాలి? అని ప్లాన్లు వేసుకునే ప్రేమ పక్షులు ఎన్నో.. మనసుపడ్డ వారికి మదిలోని ప్రేమను ఎక్కడ? ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి జంటల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు పరచుకున్న ఆ ప్రదేశాలు ప్రేమికులను అద్భుత లోకాల్లో విహరించేలా చేస్తాయి. అలాంటి ప్రదేశాల్లో మన హైదరాబాద్ కూడా ఒకటి. మరి హైదరాబాద్‌లో అలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..
హైదరాబాద్ అందమైన సిటీ మాత్రమే కాదు చారిత్రక కట్టడాలు, రొమాంటిక్ వాతావరణం కలిగిన ప్రదేశం. వాలెంటైన్స్ డే రోజును ప్రేమ జంటలు తిరగడానికి అనేక రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ డేటింగ్‌తో మీ ప్రియుడు/ప్రేయసిని ఆశ్చర్యపరచవచ్చు. ప్రేమికులు మనస్సును ఆహ్లాదపరిచేవిధంగా హైదరాబాద్‌లో వాటర్ ఫాంట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఫర్‌ఫెక్ట్ రొమాంటిక్ సెట్టింగ్‌ను కలిగి ఉన్నాయి. నెక్లెస్ రోడ్ నుండి హుస్సేన్ సాగర్ లేక్, దుర్గం చెరువు, ఫలక్‌నామా ప్యాలెస్ వరకు అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమలో ఉన్నవారి మధ్య బంధం మరింత బలపడటానికి అనువైన ప్రదేశాలు. మరి వీటితో పాటు మరికొన్ని రొమాంటిక్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
ఫలక్‌నామా ప్యాలెస్
19వ శతాబ్దకాలం నాటి ఒక అద్భుతమైన కట్టడం ఫలక్‌నామా ప్యాలెస్. రాజసాన్ని ఉట్టిపడేలా చేసే ఈ ప్రదేశం ప్రేమజంటలకు చాలా అద్భుతమైన
ప్రదేశం. ఇక్కడ రెస్టారెంట్లో డిన్నర్ చేసి, కొంత సమయాన్ని గడపవచ్చు. కాబట్టి.. మీ పార్టనర్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
హుస్సేన్‌సాగర్ లేక్
ఇది మానవ నిర్మిత సరస్సే అయినప్పటికీ హుస్సేన్ సాగర్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాయం సంధ్యలో ప్రకృతి.. ప్రేమ పక్షులు.. ఎంతో బాగుంటాయి. ఇందులో నీటికి సంబంధించిన ఆటలు కూడా ఉన్నాయి. ఇక్కడికి మీ పార్టనర్‌ను తీసుకెళ్ళడానికి అనువైన ప్రదేశం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇది ప్రేమికులను ఆహ్వానిస్తుంది. సంధ్యాసమయంలో ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్‌తో పాటు దగ్గరలోని లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, ఈట్‌స్ట్రీట్ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.
గోల్కొండ
ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం గోల్కొండ కోట. ఫిబ్రవరి 14న మీ పార్ట్‌నర్‌తో డేటింగ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశం గోల్కొండ కోట. మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి ఒక ఉత్తమ ప్రదేశం గోల్కొండ. ఇతర ప్రేమ జంటలు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్లు, రొమాంటిక్ ప్రదేశాల్లో రద్దీగా ఉన్నప్పుడు మీరు ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకున్నప్పుడు గోల్కొండ కోట రొమాంటిక్ ప్రదేశం.
కేబీఆర్ పార్క్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతున్న పార్క్ ఇది. ప్రేమజంటలు చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగేవారు, ఇప్పటికే మునిగినవారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.
గుఫా
థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఇది. పార్ట్‌నర్‌కు ఒక సరికొత్త నార్త్ ఇండియన్ వంటకాలను రుచి చూపించడానికి ఒక సరైన ప్రదేశం ఇది. ఒక గుహలోపల క్యాండిల్ లైట్ డిన్నర్‌కు చాలా మంచి ప్రదేశం. ప్రేమికుల రోజున ఇక్కడ భోజనం మరింత ఉత్సాహాన్నిస్తుంది.
అనంతగిరి హిల్స్
నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్.. రొమాంటిక్ డెస్టినేషన్‌గా ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కొండల నుండి జాలువారే జలాలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో అనంతగిరి హిల్స్ ప్రకృతి ప్రేమికులను మైమరిచిపోయేలా చేస్తుంది. నగరం నుండి సుమారు ఒక గంట ప్రయాణం చేస్తే అనంతగిరి కొండలను చేరుకోవచ్చు. ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన హిల్ స్టేషన్ ఇది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి దృశ్యం మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేర్చే శృంగార ప్రదేశం.
షామీర్‌పేట్ లేక్
ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిలరాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.
సీక్రెట్ లేక్
ఒకప్పుడు సీక్రెట్ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజ సిద్ధమైన చెరువు ప్రేమికులకు మాత్రమే.. ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ చెరువు లోయలో, కొండల మధ్య అత్యంత సుందరంగా ఉండేది, అయితే ఈ ప్రదేశం ఎక్కువమందికి తెలియకపోవడం చాలా కొద్దిమంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్ లేదా రహస్య చెరువు అని మారుపేరు ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.
తారామతి-బారాదరి
చరిత్రలోకి తొంగిచూస్తూ మధుర స్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి-బారాదరి కూడా పర్‌ఫెక్ట్ వాలెంటైన్ డే ప్లేస్ అని చెప్పవచ్చు. సుఫీ అండ్ గజల్స్, ఖవ్వాలీ సింగర్స్‌తో ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. ఒకప్పుడు భగ్మతి అనే ప్రముఖ నృత్యకారుడు ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా థియేటర్‌గా మారింది. ఇది ఇప్పుడు గజల్స్ మరియు డాన్స్ నైట్స్ నిర్వహించబడుతోంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రదేశానికి వెళ్లడం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది.
ఫిబ్రవరి.. ప్రేమ జంటలకు చాలా ముఖ్యమైన మాసం. పర్యటనలకు ఈ నెలలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ ప్రేమికుల రోజును జరుపుకునేందుకు ఒక మంచి ట్రిప్‌ను ప్లాన్ చేయడం ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. సరికొత్తగా ప్రపోజ్ చేయవచ్చు. ఈ క్షణాలను మరపురాని జ్ఞాపకాలుగా మలచుకోవాలంటే ఈ రొమాంటిక్ గైడ్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. *
వాలెంటైన్స్ వీక్
ప్రేయసి/ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు వాలెంటైన్స్ డేనే సరైన సమయమని భావిస్తుంటారు. ఇందుకు వారికి తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను చెబుతుంటారు. ఇలా చెప్పడానే్న ప్రపోజ్ చేయడమంటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపోజ్ డే..గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేతో పాటు వాలెంటైన్స్ వీక్ కూడా ఉందని మీకు తెలుసా.. వారం రోజుల ముందుగానే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7న రోజ్ డే మొదలుకొని ప్రపోజ్ డే వరకు చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. చివరగా వాలెంటైన్స్ డే.. ఇలా వారం రోజుల పాటు ప్రేమ పండుగను ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 7న రోజా పువ్వు ఇవ్వడంతో మొదలుపెట్టి లవ్ కొటేషన్ ఉన్న మంచి గ్రీటింగ్ కార్డో.., ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువో.. ఇస్తూ ఐ లవ్ యూ చెప్పవచ్చు. ప్రేమ తెలుపకపోతే అవతలివారికి మీపై ఫీలింగ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మీకు వారంటే ఇష్టం లేదని వారు అడ్వాన్స్ అవ్వకపోయే అవకాశం లేకపోలేదు. పెన్ను కదపడం కాస్త అలవాటుంటే చాలు.. సొంతంగా ప్రేమను తెలుపుతూ ప్రేమలేఖ రాయటం ఉత్తమం. సంగీతవాద్యాలపై పట్టు ఉంటే.. వాటిని ప్తే చేస్తూ మంచి సమయం చూసి ప్రేమ విషయాన్ని చెబితే ప్రయోజనం ఉంటుంది. అబ్బాయిలైతే.. ఒక ఎర్రటి రోజూ పువ్వుతో పాటు ప్రేమలేఖను ఇవ్వచ్చు.

ఢిల్లీ పెద్దల కంట్లో పడకుండా తప్పించుకు తిరుగుతున్న బాబు

$
0
0

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 13: పని ఉన్నా లేకుండా ఢిల్లీకి ఎప్పటికప్పుడు వెళ్లే చంద్రబాబు ఇప్పుడు మాత్రం అటుగా కనె్నత్తి కూడా చూడటం లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ పాత కేసులు గుర్తుకొస్తాయోమోనన్న భయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని గురువారం ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి ఆరోపించారు.
గడచిన ఎనిమిది నెలలుగా ఢిల్లీ బీజేపీ పెద్దల కంట్లో పడకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. ఒకప్పుడు దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నా తన నమ్మకస్తులను పంపించి కోరి ఆహ్వనం సంపాదించుకునేవాడన్నారు. ఇప్పుడు పిలిచినా వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

ఉన్నత ప్రమాణాలతోనే యూనివర్సిటీల అభివృద్ధి

$
0
0

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 13: విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు పెంచితేనే యూనివర్సిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం అనంతపురం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో రెండవ టెక్ వీసీ కన్‌క్లీవ్- 2020 ఇన్‌వెన్‌టివ్ ఎక్స్‌లెన్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై రెండు రోజుల ఉపకులపతుల సదస్సు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ అనంతపురం, కర్లాటకలోని బెల్‌గావ్ విశే్వశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐటీఈసీ), బెంగళూరు ఎల్‌ఐహెచ్ అకాడమి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్మెన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏపి హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మెన్ హేమచంద్రారెడ్డి, ఏఐసీటీఈ ఛైర్మెన్ అనిల్ సహస్త్ర బుద్దే, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెక్రెటరీ జనరల్ పంకజ్ మిట్టల్, నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఛైర్మెన్ అగర్వాల్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెంబర్ రామచంద్రన్, ఆర్‌జియు కెటీ ఛాన్స్‌లర్ కెసి రెడ్డి, విశే్వశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ వీసీ కరిసిద్దప్ప, జెఎన్‌టియూ వీసీ శ్రీనివాసకుమార్, మాజీ ఏపీపీయస్సీ ఛైర్మెన్ వెంకటరామిరెడ్డి హాజయ్యారు. ఈ సందర్భంగా సతీష్ చంద్ర, సహస్ర బుద్దే, పంకజ్ మిట్టల్, అగర్వాల్, కరిసిద్దప్ప మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విద్య చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యావ్యవస్థలో నాణ్యతతో కూడిన నైపుణ్యాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో నూతన టెక్నాలజీని జోడించి విద్యను బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంపొందించి, నూతన విద్యావిధానం అమలు చేస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుందన్నారు. అలాగే పాత విధానంలో బోధించడం వల్ల సబ్జెక్టుపై విద్యార్థులకు సరైన అవగాహన కలగడం లేదన్నారు. నూతన టెక్నాలజీని జోడించి బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
టెక్నాలజీకి అనుగుణంగా నూతన పరిశోధనలవైపు దృష్టి సారించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసాన్ని సవరించాలి

$
0
0

విజయవాడ, ఫిబ్రవరి 13: ఆర్టీసీ ఉద్యోగులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సవరించాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్ అశుతోష్ మిశ్రాను ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నేతలు, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కోరారు. అశుతోష్ మిశ్రాను గురువారం ఆయన కార్యాలయంలో కలిసిన యూనియన్ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నందున వేతనాల్లో వ్యత్యాసాలను కూడా సవరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుండి ఇంకా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ గురించి ఇంకా ఎటువంటి జీఓ రాలేదని, ప్రభుత్వం నుండి పే రివిజన్ కమిషన్‌కు ఆదేశాలు వచ్చిన వెంటనే గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ నాయకత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటామని పే రివిజన్ కమిషనర్ అశుతోష్ మిత్రా హామీ ఇచ్చారు. పే రివిజన్ కమిషన్‌కు ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు పీటీడీ (ప్రజా రవాణా విభాగం) ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కేటగిరీల వారీగా ఉన్న తేడాలను సరిపోల్చుతూ ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా చూస్తామని, ఈ విషయంపై ఆర్టీసీలో ఉన్న జేఏసీ సంఘాలతో కూడా చర్చించి ప్రభుత్వం నుండి ఆదేశాలు విడుదల అయిన వెంటనే ప్రతిపాదనలు అందజేస్తామని ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

దిశ యాప్‌కు అనూహ్య స్పందన

$
0
0

గుంటూరు, ఫిబ్రవరి 13: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్‌కు విశేష స్పందన లభిస్తోందని దిశ స్పెషల్ ఆఫీసర్ దీప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు రోజుల్లోనే 50 వేల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. యాప్ ద్వారా పోలీసులు స్పందిస్తున్న తీరుకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకంగా 5 పాయింట్లకు 4.9 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు. 9వ తేదీ నుండి రోజుకి సగటున 2 వేలకు పైగా దిశ యాప్ ద్వారా పోలీసు కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ వస్తున్నాయన్నారు. దిశ చట్టాన్ని అమలులోకి వచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు స్పందించిన తీరుపైనా, బాధితురాలికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించడంపైనా ప్రతి ఒక్కరూ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారన్నారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను మూడుసార్లు ఊపడం ద్వారా దిశ ఎస్‌ఒఎస్ సెంటర్‌కు బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో రెండు భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలని, గొడవ చోటు చేసుకున్న సమయంలో తన భర్త విచక్షణ కోల్పోయి కొడుతుంటే బాధిత మహిళ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను ఊపడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిందన్నారు. తక్షణమే స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకుని భర్త వేధింపుల నుండి రక్షించారన్నారు. ఈ ఫిర్యాదులో ఒకటి కృష్ణా జిల్లాది కాగా, మరొకటి విశాఖపట్నంకు చెందినదన్నారు. దిశ అప్లికేషన్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం కుటుంబ సమస్యలతోనే ఉంటున్నాయని, అలాంటి వారి పట్ల నిపుణులైన వారిచే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

ఏమిటీ నిర్లక్ష్యం?

$
0
0

అమరావతి, ఫిబ్రవరి 13: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలి ప్రతిపాదించిన సెలక్ట్ కమిటీ ఏర్పాటు చెల్లదని మండలి కార్యదర్శి చేస్తున్న వాదనలపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ రూల్ నెం. 154 ప్రకారం విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. కమిటీలో సభ్యుల పేర్లు పంపాల్సిందిగా రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఇందులో భాగంగా అధికార పార్టీ మినహా ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ ఆయా పార్టీలు చైర్మన్‌కు లేఖలు పంపాయి. వీటిని మండలి కార్యదర్శికి పంపి సెలక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని చైర్మన్ షరీఫ్ ఆదేశించారు. అయితే ఇది చెల్లదంటూ కార్యదర్శి ఇటీవలే దాన్ని వెనక్కు పంపారు. దీనిపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి ఈ ఫైలింగ్ సిస్టం ద్వారా కార్యదర్శికి సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై లేఖ రాశారు. దీంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కూడా సెలక్ట్ కమిటీ ఏర్పాటు అంశాన్ని తిప్పి పంపితే ధిక్కరణ నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని చైర్మన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. శాసనమండలిలో ఓటింగ్ జరగలేదు కనుక సెలక్ట్ కమిటీ ఏర్పాటు చెల్లదని అధికార పార్టీ వాదిస్తోంది. అయితే దీనికి ఓటింగ్ సాధ్యంకాదని, సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆ ప్రక్రియను కార్యదర్శి పూర్తి చేయాల్సిందేనని చైర్మన్ షరీఫ్ స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అలా జరక్కపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు. శాసనమండలి ఇంకా రద్దు కాక పోవటంతో నిబంధనలు వర్తిస్తాయనే ప్రచారం జరుగుతోంది.

కార్మిక హక్కులను హరిస్తున్న మోదీ

$
0
0

గుంటూరు, ఫిబ్రవరి 13: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక హక్కులను హరిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ ధ్వజమెత్తారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగే అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ 5వ జాతీయ మహాసభలు సీపీఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లోని వరికల్లు కోటేశ్వరరావు హాలులో గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత ఫెడరేషన్ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. జాతీయ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ రోజువారీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో మోదీ సర్కారు వైఫల్యం చెందిందన్నారు. అస్తవ్యస్త పాలన కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం జాతీయస్థాయిలో ఉద్యమం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయని, బ్రిటీష్ తరహాలో విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తున్నాయన్నారు. స్వచ్ఛ్భారత్ ఒక పెద్ద బూటకమని, ఆ పేరుతో మున్సిపల్ కార్మికులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్మికులకు నష్టదాయకమైన కార్మిక చట్టాల క్రోడీకరణకు ఏఐటీయూసీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కార్మికులకు 7వ వేతన సంఘం ప్రకారం సౌకర్యాలను కల్పించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో కేంద్ర కార్మిక సంఘాలకు స్థానం కల్పించక పోవడం శోచనీయమన్నారు. కార్మికుల భద్రతకు కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సరిగా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో అనారోగ్య కారణంగా వారు మంచాలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల వేతనాలు, ఆరోగ్య భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సుకుమార్ దామ్లే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి వారిపై ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని స్పష్టంచేశారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుందని గుర్తుచేశారు. కార్మికులు, కర్షకులు కష్టాల్లో ఉండగా... వారి గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

*చిత్రం... అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభల్లో ప్రసంగిస్తున్న అమర్‌జిత్ కౌర్


విద్యార్థిని హంతకులెవరు?

$
0
0

కరీంనగర్, ఫిబ్రవరి 13: కరీంనగర్‌లో ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి దారుణంగా హత్య కేసును ఛేదించడం పోలీస్ యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది. ఈనెల 10న నగరంలోని విద్యానగర్ ప్రాంతంలోని ఇంటిలో రాధిక దారుణ హత్య కేసు ఛేదించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి ఐదు బృందాలు గురువారం రాధిక స్వగృహాన్ని సందర్శించి కీలక మైన ఆధారాలు సేకరించారు. సిటీ పోలీస్ క్లూస్ టీం ఇన్‌చార్జి ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదు బృందాలు జర్మనీ టెక్నాలజీ ఉపయోగించి రక్తపుమరకలు కడిగినవి తెలుసుకొనే టెక్నాలజీలో భాగంగా త్రీడి క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, త్రీడి స్కేనర్, బాడీ ఫ్లుడ్ కిట్టులను ఉపయోగించి ముఖ్యమైన ఆధారాలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే పనిలో పడ్డారు. సాధ్యమైనంత తొందరగా రాధిక దారుణ హత్య గురించి విశే్లషించుకొని నిందితున్ని పట్టుకునేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇది తెలిసిన వారి పనా? లేక ప్రేమోన్మాది చేసిన పనా? మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణ కొనసాగించినా ఖాకీల విచారణకే అంతుచిక్కని అంశంగా మారింది. ఇది సవాల్‌గా తీసుకొని ఏదేమైనా రాధిక హంతకుల పట్టుకొని తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. రాధిక దారుణ హత్య కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతుండగా, ఇదివరకే నలుగురు యువకు లను అదుపులోకి తీసుకొని విచారించినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ క్రైమ్ సైన్స్ అధికారిణి ఇంద్రాణి ఐదు బృందాలతో విచారణను ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేసినా హంతకుడు బయట పడకపోవడంతో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ రిపోర్టు, సీసీ కెమెరాల నివేదికను కూడా ఉపయోగపడలేదని నిర్ధారణకొచ్చాక హైదరాబాద్ క్రైమ్ సైన్స్ ఆఫీసర్‌కు ఈ కేసును అప్పగించినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన సంఘటన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారం కాకుండా అనుకోకుండా జరిగినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. నిందితుల ఎలాంటి ఆనవాళ్ళు చిక్కకుండా హత్య చేయడంతో కేసులో హంతకుడెవరనేది పోలీసులు, నగరవాసులను కలవరపరుస్తోంది. ఇదివరకు ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగించినా వారంతా అమాయకులేనని తేలిపోవడంతో అంతు చిక్కని కేసును ఎలాగైనా ఛేదించాలనే పనిలో పోలీసులు పడ్డారు.
కాగా క్రైమ్ సైన్స్ ఆఫీసర్ ఇంద్రాణి గురువారం రాధిక ఇంటిని, రక్తపు మడుగులను పరిశీలించారు. ఆమె చుట్టుపక్కల వాళ్లను సైతం విచారించి రాధిక ఇంటిలోకి వచ్చి బయటకు వెళ్లే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వేలిముద్రలు కూడా పోల్చి చూసినా ఫలితం దక్కకపోవడంతో హంతకులు ఎవరనేది తేల్చడం పోలీసులకే పెనుసవాల్‌గా మారింది. కాగా, రాధిక హత్య కేసు ఛేదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో నిందితుల వివరాలు వెల్లడిస్తే తగిన పారితోషికాన్ని అందించడంతో పాటు పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడిస్తుండడం కొసమెరుపు.
*చిత్రం... రాధిక హత్య కేసులో అసలు నిందితులెవరనేది అంతు చిక్కక పోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్న క్రైమ్ సైన్స్ బృందం

కన్న తండ్రి మరణం -- దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని

$
0
0

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13: కన్న తండ్రి మరణించాడు అనే విషయం తెలిసినప్పటికీ ఆ బాధను గుండెల్లో దిగమింగి ఒక విద్యార్థిని గురువారం పరీక్షలు రాసింది. పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే కన్నీటి పర్యంతం కావడంతో విద్యార్థిని రోదన చూసి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో గాయత్రి ఇంటర్మీడియేట్ బైపీసీ చదువుతోంది. ఆమె తండ్రి అబ్బోజు రమేష్ (45) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఉదయం మృతిచెందాడు. ఈ విషయం తెలిసి తల్లడిల్లిన ఆమెను కళాశాల ప్రిన్సిపల్ భార్గవి, చైర్మన్ రమేష్ దగ్గరుండి ధైర్యం చెప్పి జువాలజీ ప్రాక్టికల్ పరీక్ష రాయించారు. కాగా బైపీసీ ప్రథమ సంవత్సరంలో గాయత్రి 440 మార్కులకు 416 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. తండ్రి వడ్రంగి వృత్తి చేస్తుండేవాడు. ఆయన మృతి వార్త తెలిసినప్పటికీ గుండె దిటవు చేసుకుని పరీక్ష రాసి బయటకు వచ్చిన గాయత్రి ‘మా నాన్న మృతి చెందాడు.. మా అమ్మను, మా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు’ అని దీనంగా ఏడుస్తుండటంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
*చిత్రం... పరీక్ష రాస్త్తున్న విద్యార్థిని గాయత్రి

సామాన్య భక్తుల చేతిలో శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ

$
0
0

తిరుపతి: శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ అంటే అది పరపతి, పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే సాధ్యమనే మాట నాటిది. అయితే నేడు సామాన్య భక్తులకు సైతం లడ్డూలను విక్రయించే కార్యక్రమానికి తిరుమల అదనపు ఈఓ ధర్మారెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాధ్ సుమారు పదివేల లడ్డూలను తయారుచేయించి సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 4 కౌంటర్లు కూడా ఏర్పాటుచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ పెద్ద లడ్డూ విక్రయాలను ప్రారంభించారు. గురువారం ఉదయం 8 గంటల వరకు 614 పెద్ద లడ్డూలను సామాన్యభక్తులు కొనుగోలుచేశారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5800 పెద్దలడ్డూలు విక్రయించారు. అర్థరాత్రి సమయానికి మరో 3000 లడ్డూలకు పైగా సామాన్యభక్తులకు లడ్డూలు కొనే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ.200 విలువచేసే ఈ పెద్దలడ్డూను దళారీలో బహిరంగ మార్కెట్‌లో ఒక్కోలడ్డూను రూ.500విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్యులైనా, సంపన్నులైనా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండానే రూ.200కే లడ్డూ అందుబాటులో ఉంటూండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక సిఫార్సులపైన, ఎల్‌పీటీల ద్వారా గతంలో విక్రయిస్తున్న విధానాన్ని కూడా అమలుచేస్తున్నారు. ఏది ఏమైనా పెద్దలడ్డూకొనాలనే సామాన్యుని కోరికను అధికారులు తీర్చడం ఎంతైనా అభినందనీయమే.
*చిత్రం... టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో పెద్దలడ్డు కొని ఆనంద పడుతున్న సామాన్యభక్తులు

అపాక్ దేశాలకు దెబ్బ

$
0
0

ముంబయి: కరోనా వైరస్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. భయంకరమయిన ఈ కొత్త వైరస్ ఇప్పటికే చైనాలో 1,100కు పైగా మందిని పొట్టన పెట్టుకుంది. ఈ వైరస్ విజృంభణ ఇలాగే కొనసాగితే, ఆసియా-పసిఫిక్ (అపాక్) రీజియన్‌లోని ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. దీని ప్రతికూల ప్రభావం బ్యాంకులపై మరింత తీవ్రంగా ఉంటుంది. బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత దెబ్బతింటాయి. కరోనా వైరస్ ప్రభావంపై ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా ఇది. చైనాలో గత నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన తరువాత దేశంలోని అనేక ప్రాంతాలు మూతపడిన పరిస్థితిలోకి వెళ్లాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ అంటు వ్యాధిని తీవ్ర ప్రమాదకరమయిందిగా అభివర్ణించడంతో పాటు అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈరోజు చైనా ఏకైక అతిపెద్ద మూలాధార మార్కెట్‌గా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావం ప్రయాణాలు, పర్యాటకం, వినియోగం, సరుకుల ధరలపై పడుతుంది. వైరస్ వ్యాప్తి వల్ల సరఫరా మార్గాలకు కలిగే అంతరాయం బ్యాంకులను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా బ్యాంకుల లాభదాయకత తగ్గిపోతుంది. వాటి ఆస్తుల నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందని మూడీస్ ఒక నోట్‌లో హెచ్చరించింది. ‘కరోనా వైరస్ అంటు వ్యాధి మరింత తీవ్రమయితే, దాని వల్ల కలుగుతున్న అంతరాయాలను, ఆటంకాలను రానున్న కొన్ని నెలల్లో నియంత్రించకపోతే ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని బ్యాంకుల ఆస్తుల నాణ్యతను, లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ‘కరోనా వైరస్ తీవ్రత, విస్తృతి ఇంకా అధిక అనిశ్చితిలోనే ఉంది. ఒకవేళ వైరస్ సంబంధిత అంతరాయాలు స్వల్ప కాలం పాటే ఉంటే, ఆసియా-పసిఫిక్ (అపాక్) ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకులపై దాని ప్రతికూల ప్రభావం పరిమితంగా ఉంటుంది. అలాకాకుండా ఈ అంటు వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగితే, దాని ప్రతికూల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ప్రజల ప్రయాణాలు తగ్గుతున్నాయి. ఇది సాధారణంగా ఈ రీజియన్‌లో ఆర్థిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను బలహీనపరుస్తుంది. ప్రత్యేకించి విదేశీ ప్రయాణికులు, పర్యాటకులపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు మరింత దెబ్బతింటాయి. ‘ఈ పరిస్థితి బ్యాంకుల ఆస్తుల నాణ్యతను దెబ్బతీస్తుంది. రుణ వ్యయం పెరిగి, లాభదాయకత తగ్గుతుంది’ అని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ వివరించింది.

రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమాలు సాగించాలి

$
0
0

నల్లగొండ, ఫిబ్రవరి 13: రాజకీయ రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా పార్టీలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు సాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర భారతదేశంలో అగ్రకుల పాలకులు గొర్రెలు, బర్రెలు, వృత్తిరుణంలు ఇచ్చి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 29 మంది ముఖ్యమంత్రులైతే అంతా అగ్రకులాల వారేనన్నారు. చివరకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల జారీలో కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒక్క రోజులో బిల్లు పెట్టి 10 శాతం రిజర్వేషన్లు అందించారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని, 29 రాష్టాల్లో 16 రాష్ట్రాల్లో ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యుడు లేరని, 545 లోక్‌సభ స్థానాల్లో కేవలం 96మంది మాత్రమే ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేల్లో 22మంది మాత్రమే ఉన్నారని, ఏపీలో 175 మందిలో 33మంది ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో 22 జిల్లాల నుండి బీసీ ఎమ్మెల్యే లేరని, రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉండగా ఇప్పటిదాకా 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. కేవలం బీసీలు ఓట్లు వేసే వారిగానే మిగిలిపోతుండగా ధనస్వామ్యమైన భారత ఎన్నికల వ్యవస్థలో బీసీలకు రాజ్యాధికారం కష్టసాధ్యమైపోతుందని అందుకే రాజకీయ రిజర్వేషన్ల సాధనకు బీసీలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. న్యాయవ్యవస్థలో సైతం సుప్రీంకోర్టు జడ్జీల్లో 33మంది ఉండగా వారంతా అగ్రకులాల వారేనని, దేశంలోని మొత్తం హైకోర్టుల జడ్జీలు 749 మందిలో 39 మంది బీసీలు, 18 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు మినహా మిగతా 687 మంది జడ్జీలు ఉన్నత కులాలవారేనన్నారు. అటు న్యాయవ్యవస్థలో 92 శాతం, రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలో 80 శాతం పదవులను 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారే పొందుతున్నారన్నారు. 80 శాతం పదవుల్లో ఉన్న 15 శాతం మంది అగ్రకులాల వారు రాజ్యాధికారంలో అండగా రిజర్వేషన్లు, కాంట్రాక్టులు వారి వర్గాల వారికే ఇచ్చుకుంటూ వెళుతుండగా 54శాతం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని ఐనప్పటికీ ఒక్క పార్టీ కూడా నోరు మెదపడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో బీసీలు ఐక్య పోరాటాలతో రాజ్యధికార సాధనకు రాజకీయ రిజర్వేషన్లకు పోరాటాలు సాగించాలని ఇందుకు బీసీ సంఘాల నాయకులు గ్రామాల వారిగా బీసీ వర్గాల్లో చైతన్యం రగిలించి వారిని ఉద్యమ పథకంలో నడిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, వివిధ జిల్లాల బీసీ సంక్షేమ సంఘాల నాయకులు దుడుకు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, సింగం లక్ష్మినారాయణ, ఐతగోని జనార్ధన్‌గౌడ్, తిరుమలగిరి అశోక్, కాశీరాములు యాదవ్, సిరిప్రోలు వెంకటపతి, దుడ్డు కృష్ణమూర్తి, సత్యనారాయణ ముదిరాజ్, పుట్ట కోటి, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్‌కుమార్, చిలుకరాజు సతీష్‌కుమార్, కర్నాటి యాదగిరి పాల్గొన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణయ్య

హైజాక్‌ల నియంత్రణపై ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: ఉగ్రవాదుల దాడులు, విమానాల హైజాక్‌కు గురయ్యే పరిస్థితులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే తీరుపై విశాఖ విమానాశ్రయంలో ఐఎన్‌ఎస్ డేగ వద్ద గురువారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల నుంచి ప్రయాణికులను రక్షించడం, హైజాక్‌కు గురయ్యే విమానాలను సురక్షితంగా ఏ విధంగా కిందకు దించాలనే పలు అంశాలపై ఈ మాక్‌డ్రిల్ జరిగింది.
ప్రపంచ దేశాల్లో పలుచోట్ల ఇటీవల జరుగుతోన్న విమానాల హైజాక్ నేపథ్యంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సంఘటనలు తలెత్తే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపే విధంగా ఐఎన్‌ఎస్ డేగలో నిర్వహించిన మాక్‌డ్రిల్ ప్రయాణికులను విస్మయపరిచింది. మెరైన్ కమాండోలు (మార్‌కోస్), సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), ప్రభుత్వ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. నేవీ, ఎయిర్‌పోర్టు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నేషనల్ సివిల్ ఎవియేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా విమానాశ్రయాల్లో సామర్థ్యాన్ని తెలియజేసేందుకు వీలుగా ఇది జరుగుతోందని సంబంధితాధికారి ఒకరు పేర్కొన్నారు.
*చిత్రం... ఐఎన్‌ఎస్ డేగ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్

త్వరలో మెగా డీఎస్సీ

$
0
0

అమరావతి, ఫిబ్రవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్ వెల్లడించారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనూహ్యమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. యువతకు పోటీ తత్వంతో కూడిన ఉపాధి కల్పనతో పాటు నైపుణ్యతా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి కార్పొరేట్ సంస్థల కొమ్ముకాసిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో 665 ప్రభుత్వ హాస్టళ్లు మూతపడ్డాయని తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ పరిస్థితుల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించకుండా ఉపాధ్యాయులు, అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.

*చిత్రం... సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్


బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

$
0
0

కరీంనగర్, ఫిబ్రవరి 13: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకొని బస చేయగా, గురువారం ఉదయం వీఐపీలు, అధికారులు, కార్పొరేటర్లు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఉత్తర తెలంగాణ భవన్‌కు వచ్చి పుష్పగుచ్ఛాలు అందించారు. ముఖ్యమంత్రి కళ్ళలో పడేందుకు నాయకులంతా ప్రయత్నించడంతో వారిని అడ్డుకునేందుకు ఓ మంత్రి యత్నించగా వాళ్ళను కలువనివ్వరా..? అని సీఎం ప్రశ్నించడంతో ఆయన కంగు తిన్నారు. మూడోసారి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లాలోని అన్నిప్రభుత్వ విభాగాల అధికారులు, వీఐపీలు, నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, నూతనంగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అభివృద్ధి పనులు పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధనలో తమవంతు భాగస్వామ్యం ఉండాలని ఆకాక్షించారు. అనంతరం పేరుపేరునా అధికారులను, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. గత జ్ఞాపకాలు వారితో పంచుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు నేరుగా తనకు ఇవ్వాలని సూచించారు. అనుకోని ఆప్యాయతకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక, ఇన్‌చార్జి నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

*చిత్రం... హెలికాప్టర్ నుంచి కిందకు దిగుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం

విద్యా రంగంలో సమూల మార్పులు

$
0
0

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగే రెండవ టెక్ వీసీల సదస్సు-2020ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని జోడించి విద్యాబోధన చేయడం ద్వారానే సాంకేతికపరంగా విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనలు వస్తాయన్నారు. తద్వారా వారు ఉపాధి పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 60కి పైగా ప్రభుత్వ యూనివర్శిటీలు ఉండగా, అందులో కనె్వన్షనల్, డీమ్డ్, టెక్నికల్‌లాంటి పలు రకాల యూనివర్సిటీలు ఉన్నాయని, అందులో ప్రతి ఏడాది ఉత్తీర్ణత సాధించి బయటకి వచ్చిన విద్యార్థులు 75 శాతానికి పైగా ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. పాత పద్దతిలో విద్యా బోధన చేయడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అందుకే ఈ విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లలో మార్పు కోసం రెగ్యులేటరీ, మానిటరింగ్ కమీషన్లు ఏర్పాటు చేసేందుకు బలమైన చట్టాలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ పూర్తయిన తర్వాత ఒక ఏడాది అప్రెంటిష్ విధానం ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలో భాగంగా ఈ అప్రెంటిస్ ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో విద్యార్థుల నైపుణ్య లోపాలను గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అప్రెంటీస్ షిప్ చేస్తున్న ఏడాదిలో విద్యార్థులకు పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక కాలేజి ఏర్పాటుచేసి నాణ్యమైన నైపుణ్యం నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న విద్యాకానుక పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, షూ, బ్యాగులు, పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఏడాది జనవరిలో రూ. 15 వే ఇస్తున్నామని, ఇందుకు పాఠశాల స్థాయిలో కనీసం 75 శాతం హాజరు ఉండాలన్నారు. అలాగే జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన కింద విద్యార్థులకు అవసరమైన వౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నాడు-నేడు కింద పాఠశాలలో తొమ్మిది రకాల వౌళిక వసతులు కల్పిస్తున్నామని, ప్రస్తుతం బాగా లేని పరిస్థితిని, మూడేళ్ల తర్వాత అభివృద్ధి చెందిన పరిస్థితిని ఫొటోల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం విప్లవాత్మకమైన అడుగని, ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులందరికీ ఒకే రకమైన, నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, దీని వల్ల పేదలకు ఉన్నత విద్య అందడం లేదన్నారు. అందుకోసమే ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు.

*చిత్రం... అనంతపురం జేఎన్‌టీయూలో ప్రారంభమైన 2వ టెక్ వీసీల సదస్సులో ప్రసంగిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

*చిత్రం... సెన్సెక్స్

$
0
0

*చిత్రం... సెన్సెక్స్
*చిత్రాలు.. చిట్కాలు
. ( గోరుముద్ద) అన్వేషణ వెన్నెల ఛలో భీష్మ కాన్సెప్ట్ నిన్నే
ఇన్‌సెట్‌లో భో
(వార్తావాఖ్య ) మౌనం నిన్నే యాంక్కే వెన్నేలా విలువల లోగిలి
దూతికా విజయం -వీరాజీ యింది
ఫైల్‌ఫొటో ఎతైన పోస్టాఫీసు
(ప్రపంచ తెలుగు మహాసభలు ) శాస్త్రవేత్త
**** చాలా బాగుంది *** బాగుంది ** ఫర్వాలేదు * బాగోలేదు మౌ న నోయ్ నైషధమ్ (హంస దౌత్యం)
డార్క్ అవెన్యూ
తేజారాణి తిరునగరి
మహాభారతంలో ఉపాఖ్యానాలు
-యలమర్తి అనూరాధ.. 9247260206 -సశేషం పచ్చబొట్టు రంగవల్లి న్యూఢిల్లీ

శివ పురాణం
యిం వెయ్యి
ఆంధ్రభూమి బ్యూరో
శాస్ర్తి సశేషం పాతాళస్వర్గం
రాశి (పాప్‌కార్న్) భాగ్యచక్రము
రాష్ట్ర అన్వేషి రాష్ట్ర వ్యాప్తంగా
రాష్ట్రపతి డాక్టర్ ముదిగొండ ఉమాదేవి బియన్కె
ఫిలిం క్విజ్ కొత్త సీరియల్
శ్రీమతి గౌరీ గార్లదిన్నె
- జింబో 94404 83001
మాట్లాడుతున్న
రాష్ట్రా రంగవల్లి
ఫి (రాస క్రీడాతత్త్వము)
భ శ్వేత బీఎన్కే స్వార్ధం
భా (పరిచయం)
యి - దుర్గాప్రసాద్ సర్కార్
‘ ’ - ఎస్.కె.కె. రవళి
వ్యూహం(కొత్త సీరియల్ ప్రారంభం)
మీకు తెలుసా?
మిర్చిమసాలా
(మీకు తెలుసా?) ష్‌
(కొత్తకొత్తగా)
కళాంజలి కొత్తకొత్తగా
(ఫ్లాష్‌బ్యాక్@50) ఫాం
అక్షరాలోచన
- ఎస్.కె.కె. రవళి గోరుముద్ద
మీకు తెలుసా?
(కొత్త పుస్తకం)
పరిచయం
‘క్లాప్’ కొట్టు గురూ!
-సమీర్ విజ్ఞానం
లోకం పోకడ ( కథ )
ఒక మనసు(నాకు నచ్చిన సినిమా)
(సండేగీత) మీకు తెలుసా?
.విజ్ఞానం
జింబో ఇంకావుంది...
ఎదగడానికెందుకురా తొందర... (. నాకు నచ్చిన పాట )
94404 83001
వేదాలలో వైజ్ఞానిక విశేషాలు
(గుర్తుకొస్తున్నాయి 2017)
జింబో ఒన్డే వన్డే
- ఇంకా ఉంది
- భారతి భాగ్యచక్రము
ఓ చిన్నమాట
-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి
అవీ..ఇవీ యాజ్ఞసేని
-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము
నే
కొత్త సీరియల్
ప్రారంభం
అయిపోయింది
దృశ్యం

దృశ్యాలు
అ:
ఆ:
ఇ:
ఈ:
ఉ:
ఊ:
ఋ:
ఎ:
ఏ:
ఐ:
ఒ:
ఓ:
ఔ:
అం,అః:
క:
ఖ:
గ:
ఘ:
ఙ:
చ:
ఛ:
జ:
ఝ:
ణ:
త:
థ:
ద:
ధ:
న:
ప:
ఫ:
బ:
భ:
మ:
య:
ర:
ల:
వ:
శ:
ష:
స:
హ:
ళ:
క్ష:

రాశిఫలం - 02-15-2020

$
0
0
తిథి: 
బహుళ సప్తమి రా.10.01, కలియుగం-5121 ,శాలివాహన శకం -1941
నక్షత్రం: 
స్వాతి ఉ.11.32
వర్జ్యం: 
సా.4.50 నుండి 6.21 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడా రంగాలకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణ బాధలు తొలగిపోతాయి. ధైర్యసాహనాలతో ముందుకు వెళ్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తోటి వారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఋణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగాఉండవు. మానసికాందోళన ఉంటుంది. అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
Date: 
Saturday, February 15, 2020
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

జ్ఞాన నేత్రం

$
0
0

ఓ అజ్ఞాన రాశీభూతమా!
ఓ ఆలోచనా తత్పరా...
నీవు సౌందర్యారాధకుడవని భ్రమిస్తున్నావా...
ధవళకాంతివనవిహారం
చేయాలనేది నీది ఉత్సుకతా...
నీ ఎదరొదలో వేదనా గాథలా...
చిమ్మచీకట్లా.... మధురగీతులా..
ఏవి ఎందున్నాయ...?
నీలో ఉన్నధి నిశాంధకార నిర్నీతి
నీలో అస్కన్నము కావాలి తేజోరాశి
నికనైన వదిలించు మలిన ఆలోచనా పరంపర
ఉంకించు నిక శే్వతాంబరవీధిన
మలినభాష్పాల నొప్పారలేదెన్నడీ జగతి
శే్వతాంబరవినువీధిలో తెలివేకువ పడతి
ఆలపించే సుమధుర గీతిలోగడిపేను
ఈ జగమెల్లప్పుడును
నెనరున్యాయం వీడి
అర్థం పర్థంలేని పదాలపోహళింపుతో
కవిత్వమనే కలికితురాయని
మసిబారనీయకు
చెలిమికి అర్థం తెలియని మూర్ఖశిఖామణీ
తళుకుబెళుకులనతికించి
మ్రోడుమ్రాకుల వెలగించి మురసిపోవ
నీదు ఆలోచనసరళి ఈవిధంగానై నున్నట్టి వేళ
ఏ సజ్జనునినీ కాంచలేవు.....
నీచిత్త శాంతికై పలికించు
నీనోట భగవానుని నామగీతి
ఇదియే నీకు ఆత్మశాంతి
ఇంకానా ఇకపై సాగదు నీ భ్రాంతచిత్తము
కట్టిపడవేయ మనసును
అపుడన్నా
నీలో కురుస్తున్న కృత్రిమ రుధిర ధారలకు
దరి కాలేదు ఏ బుద్ధిజీవి!
భ్రమరమై భ్రమరగీతలు
ఆలపించ ఉద్యుక్తుడవైతే
నీదు వైదుష్యం చూచి
నలుగురు మెచ్చవచ్చు
కాని నీలోని స్వార్థం
నినే్న వెక్కిరిస్తుందోయ వెర్రినాగన్న....
మనసు చెప్పింది విను.......
మర్మంలేకుండా మాట్లాడు
స్వార్థుడై ప్రేమ అనే చెకుముకి రాయ ని ధరించి
ప్రకృతిని చెక్కుతానంటే
అభాసుపాలు కాకతప్పదు మిత్రమా
ఇప్పటికైనా మేల్కొలుపు నీ జ్ఞాననేత్రం

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>