Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సూర్య శతకం

$
0
0

తే.గీ. పచ్చిమిరపనుఁ గారమ్ము వదలిపోయె
బెండలో జిగురుండదీ వింతఁ గనుమ
నాటి రుచులను ఁ గనరాని నాళ్లు వచ్చెఁ
జూడుమ కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పచ్చిమిరపకాయలు కారంగా ఉండడం లేదు. బెండకాయల్లో సహజ సిద్ధమైన జిగురుండడం లేదు. ఆనాటి రుచులు కనబడకుండా పోయేరోజులొచ్చేసాయి. కర్మసాక్షివైన ఓసూర్యదేవా!స్వామీ చూస్తున్నావుకదయ్యా ఈ విడ్డూరం!

తే.గీ. ధైర్యమును మించు సిరిలేదు ధరణిలోన
లక్ష్యమును మించునవిగావు లక్షలరయ
ధ్యేయమన్నది లేకున్న దేని కొఱకు?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ధైర్యాన్ని మించిన సంపద ఈ భూమీద లేదు.లక్షలేవీ లక్ష్యాన్ని మించిన విలువైనవి ఎంత మాత్రం కాదు. ధ్యేయమనేది లేకుండా దేనికోసం బ్రతకడం?కర్మసాక్షివైన ఓసూర్యదేవా!ఆలోచించవలసినదిగా ప్రబోధించుము స్వామీ.


అర్థం చేసుకొంటే.. అన్నీ అరచేతిలోనే

$
0
0

పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, కావ్యాల్లో, ప్రబంధాల్లో ఇలా వేటిలోనైనా భగవంతుని ఆరాధన, లేక భగవంతుని అనే్వషణ, భగవంతుని గురించి కథలు ఏవో ఒకటి ఏదోఒక చోట వస్తూనే ఉంటాయ. రామాయణ కథలేని కథలే లేవు అంటారు. ఎన్నో వేల యేండ్ల క్రితం వచ్చిన మహాభారతం లో ఇప్పటి కలియుగ నైజం కూడా కనిపిస్తూనే ఉంటుంది. కలియుగం లో కనిపించేవన్నీ విషయాలు మన కు భారతంలో ముందే కనిపిస్తాయ అంటారు. ఇది అంతా ఎందుకు అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే. సృష్టి ఒక్కటే సృష్టిలో ని చలమైనది, అచలమైనది, ప్రాణమున్నది నిర్జీవ మైనది, కదలగలిగేది, కదలలేనిది దేనిలోనైన అంతర్యామి గా భగ వంతుడనే వాడు ఉన్నాడు. ఆయన సృష్టి వైచిత్రాలు చూసే దృష్టికి లెక్కలేనన్ని కనబడుతాయ. విచిత్రం లేని వస్తువు ఏదీ ఉండదు అన్నా ఆశ్చర్యం ఏదీలేదు.
ప్రతి ఒక్క అంశంలోను ఏదోఒక మహత్తు లేదా ఒక అంత రార్థం దాగి ఉంటాయ. నిశితంగా పరిశీలిస్తే చాలు అందులో మర్మం అర్థమయ పరంజ్యోతిస్వరూపుడైన అవ్యక్తుడైన పరమాత్మ లీల గోచర మవుతుంది. ఉదా ఒకసారి శివుని పుత్రులైన షణ్ముఖునకు, వినాయ కునకు భేదం ఏర్పడిందట. వినాయ కుడు చిరుబొజ్జ ఉన్నవాడు, మరు గుజ్జువాడు, సుందరుడే అయనా రూపం కాస్త మోయలేనట్టు కని పించేవాడు, మూషికాసుర సంహా రం కోసం ఆవిర్భవించినవాడు, షణ్ముఖుడు తారకాసురుని సంహ రించడానికై పుట్టినవాడు, శివ పార్వ తులకు ప్రియమైన వాడు, పొడగరి, శరీరాన్ని సునాయాసంగా తిప్ప గలిగినవాడు ఇటువంటి వీరిద్దరూ ఒక పందెం పెట్టుకున్నారు. మనిద్దరి లో ఆధిక్యులు, అధికులు ఎవరంటే భూప్రదక్షిణం ఎవరు ముందుగా చేస్తారో వారే ఆధిక్యులని, అధికులని అనుకొందాం అనుకొన్నారు.
శివపుత్రులకు భేదాభిప్రాయా లు, హెచ్చుతగ్గుల పోరాటాలా? దీనిలోనూ ఒక మర్మం ఉంది. అర్థం చేసుకొంటూ అనే్వషిస్తూ వెళ్లితే పర మదయాళువు అయన పరమేశ్వరుడి కరుణాంతరంగం అర థమవుతుంది.
సరే. శివపుత్రులిద్దరూ పందెం ప్రకారం బయలుదేరుదాం అను కొన్నారు. మూహూర్తం నిర్ణయం చారు. నెమలి వాహనారూఢుడైన సుబ్రహ్మణుడు అతివేగంగా సంచ రించే నేర్పున్న నెమలినెక్కి తుర్రు మన్నాడు. మూషిక వాహనుడు, లంబోద రుడు, ఏనుగు తలవాడు, వెనకయ్య వెనుకపడ్డాడు. ఆలోచ నాంతరంగుడు అయ్యాడు. షణ్ము ఖునితో పెట్టు కుంటే గెలుసా తనా? ఎలానాఆధిక్యం నిలుపు కోవాలా అనుకొన్నాడు. వెంటనే ప్రత్యక్ష పరమేశ్వరులైన తన తల్లిదండ్రులపై భారం వేసి వారి ఎదుట దీనంగా నిల్చున్నాడు. పుత్ర ప్రేమున్నవారు, భోళాశంకరులు తండ్రి, అనురాగ వల్లి అపార కృపాం బోనిధి అయన తల్లి వారిరువురూ తన పుత్రుడిని చూసి చిరునవ్వు నవ్వారు. ‘‘కుమారా ఎందుకీ కలత? తల్లి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త జగత్తును చుట్టివచ్చినట్లే కదా. ఈవిషయంలో సందేహం మెందుకు అన్నారు. అంతే విఘ్నే శ్వరుడు మనసా వాచా కర్మణా తన తల్లిదండ్రులను మనసారా సేవించి వారికి ముమ్మారు ప్రదక్షణలు చేయసాగాడు.
నెమలినెక్కి భూప్రదక్షిణం చేస్తున్న తారకాసుర భంజనం చేసి దండధరునకు అర్థమైంది. తనకన్నా పెద్దయన సోదరుడు తనకన్నా ముం దు పుట్టినవాడు, తల్లిదండ్రులనే పరమాత్మగాగుర్తించినవాడు ఆధిక్యు డు కానీ తాను కానని వెంటనే తల్లి దండ్రుల దగ్గరకు వచ్చాడు. వినాయ కుడిని క్షమించమని కోరాడు. పరమేశ్వరుడు చిరునవ్వుతో వినాయ కుడిని గణాధిపత్యం ఇచ్చాడు.
ఇందులోవిఘ్ననాయకుడు భూ ప్రదక్షిణం చేయలేక తన తల్లిదండ్రి చుట్టూచుట్టడం అంటే ఓ మానవు ల్లారా మిమ్ములను కని, పెంచి పెద్దచేసి బుద్ధిని గరిపే తలి లదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారిని మించిన దైవం మరొకరులేరు. ప్రతి మాన వుడు తల్లిదండ్రిని తప్పక జీవితపర్యంతం ఆదరించాలి అనే తత్వం అంతర్నిగూఢంగా దాగి ఉందనే విషయం గోచరమవుతుంది కదా. అంటే మాతా పిత సేవలో తరించువాడు ముల్లోకముల యందు పూజనీయుడు అనే కదా అర్థం. ఎవరైనా సరే ఆ పరమాత్మనే అవతారం దాల్చి మానవుడుగా అవతరిస్తే అమ్మకు సేవచేసినవాడే. అమ్మ ఒడిలో ఆడు కున్నవాడే అని పురాణాలు చూస్తే అర్ధం అవుతుంది. అమ్మకు అన్నం పెట్టి వూరికి ఉపకారం చేశామనే ప్రబుద్ధులు దీనిని గురించి ఆలోచించాలి కదా.

జగదేకసుందరి క్లియోపాత్రా--64

$
0
0

పర్షియన్ సరిహద్దుల్లోనూ, ఆర్మీనియాలోనూ తాను పడిన పాట్లన్నీ ఆమెకు విన్నవించుకొని, తన తప్పేమీ లేదని నచ్చచెప్పవలసిన దుర్భర పరిస్థితి ఉంటుందనుకున్నాడు. కాని ఆమె రుూ సంవత్సరంలోనూ గొప్ప విశేషాలేమీ జరగనట్లే, చాలా మామూలుగానే ఆనందంగానూ నవ్వుతూ ఎదురొచ్చేటప్పటికి ఏంటనీ ‘బతికా!’ననుకున్నాడు.
ఏంటనీ చాలా మారిపోయాడు. లావెక్కాడు. ఎక్కువగా తాగటంవల్ల పెద్ద పొట్ట కూడా వచ్చింది. కష్టాలు కడతేరిన సంతోషం మాత్రం అతనిలో కనిపిస్తోంది. ఏంటనీని చూడగానే ఆమెకు నిజంగా నవ్వొచ్చింది. నాటకాల్లో కేతిగాడి మొహం ఆమెకు గుర్తొచ్చింది. ఏమైతేనేం- తాను మనసారా ప్రేమంచిన ప్రియుడు, కాదు.. భర్త. తనకూ, తన పిల్లలకూ సంరక్షకుణ్ని, రోమన్ గద్ద బారినుంచి కాపాడుకున్నందుకు ఆమె మనోవేదన తగ్గి, మనసు తేలికయింది.
మరోసారి టాలమీల రాజభవనం ఆనందాతిరేకంతో మారుమ్రోగింది. ఏంటనీ పర్షియాలో ఉండగా, క్లియోపాత్రా అతనికొక మగశిశువును కన్నది. ఈ కొత్త జీవిని చూశాక, అతను రోమన్ తండ్రివలెనే సహజంగా గర్వపడ్డాడు.
ప్రపంచంలో అనేక తావుల్లో తాను పిల్లల్ని కన్నాడు. ఐతే, అటు ఏధెన్స్‌లో ఆక్టోవియా రక్షణలో వున్న సంతానమూ, ఇక్కడ క్లియోపాత్రా సంతానంమీదనే అతనికి మమత. ఈజిప్టులో ఉన్నన్నాళ్ళూ అతనికి క్లియోపాత్రాయే ఆరాధ్యదైవం, ఇలవేలుపు. ఆ కామదేవతను ఆరాధించటం మినహా తాను ప్రపంచంలో చేయదగినదంటూ లేదనే ధోరణిలో అతను ప్రవర్తిస్తున్నాడు. క్లియోపాత్రా చూపులకు ఆ శక్తి ఉన్నదనుకోవాలి!
ఇక్కడ ఈజిప్టుకు పాలనాధికారం ఏంటనీ చేతుల్లో ఉన్నది. రోమ్‌లో సర్వాధికార వర్గ సభ్యత్వమూ ఉన్నది. ఐతే, చరిత్రలో అతను పరిపూర్ణంగా ఈజిప్టుకూ అంకితమైపోలేదు. రోమన్‌గానూ నిలవలేదు. ఈ ద్వంద్వ జీవితానే్న గడుపుతున్నాడు. తాను ఏ పక్షమైపొయ్యేదీ ఇంకా నిశ్చయంగా తేలలేదు.
ఇప్పుడు క్లియోపాత్రా వయసు 34 ఏళ్ళు. నలుగురు బిడ్డల తల్లి. ఐనప్పటికీ ఆమె యవ్వనశోభ తగ్గలేదు. ఈనాటికీ పురుషత్వమంటూ వున్న పురుషణ్ణి చూపులతోనే రెచ్చగొట్టి, అతని బాధను చూసి గర్వపడే చిలిపితనం ఆమెలో కనిపిస్తుంది. ఆమెను చూస్తే వయసులో వున్న కన్య అనిపిస్తుంది.
ఏంటనీ వయస్సు యాభైకు దాపుల్లో వున్నది. అతను ముసలివాడైపోతున్నాడనుకున్నది క్లియోపాత్రా. ఐతే, సీజర్ అంత ముసలివాడు కాదు. మొత్తంమీద తమ దాంపత్యాన్ని చూసినవాళ్ళకు మాత్రం, ముసలిమొగుడూ- పడుచు పెళ్ళాం సామెత గుర్తుకురాక తప్పదు.
పూర్వంవలె ఏంటనీ విలాస జీవితాన్ని మాత్రమే కోరటం లేదు. రాత్రింబవళ్ళు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. క్లియోపాత్రా సమక్షంలో కూడా పరాకు చిత్తగిస్తున్నాడు. ఈ అన్య మనస్కతను ఆమె పసిగట్టింది. బహుశా తన భర్త పర్షియన్ దండయాత్రలో ఓడినందుకూ లోలోన కుమిలిపోతూండి ఉంటాడని ఆమె భావించింది. తన వీరత్వాన్ని రుజూ చేసుకునేందుకు ఈసారి చాలా పట్టుదలతో పర్షియా మీద దండెత్తే ఆలోచనలతోనే వేధించబడుతుండి ఉండాలని ఆమె గ్రహించింది.
అసలు ఆ విషయాన్ని ఎత్తుతే, మానుముఖం పట్టిన గాయాన్ని కెలికి, అతనికి బాధ కలిగించడవౌతుందని తాను ఊరుకున్నది. ఇప్పుడిక అతన్ని ఊరడించి, తిరిగి తగిన ప్రోత్సాహమివ్వకుంటే అంతరాత్మ బాధకు తట్టుకోలేని దుస్థితిలో పడతాడేమోనని అనుమానించిందామె.
అందుకని ఒకనాటి రాత్రి ‘‘ప్రియా! మీరెందుకో దిగులుగా ఉంటున్నారు. నేనుండగా మీకొచ్చిన కష్టమేమిటి? సగం ప్రపంచాన్ని కొనగలిగిన ధనరాశులు నా స్వాధీనంలో ఉన్నవని మీకు తెలుసు కదా! మీ విచారానికి కారణం చెప్పండి’’ అన్నదామె.
క్లియోపాత్రా తనస్థితిని గ్రహించిందని ఏంటనీ తెలుసుకున్నాడు. అతనికి నిజం చెప్పే సాహసం ఇంకా కలగలేదు.
భర్త ఏమీ మాట్లాడకుండటం చూసి ఆమె అన్నది: ‘‘నాకు తెలుసు- పర్షియన్ యుద్ధంలో అపజయాన్ని పొందానని మీరు బాధపడుతున్నారు. అంతమాత్రానికే కుంగిపోవాలా? నాకు తెలుసు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఈసారి పట్టుదలతో వెళ్లండి. విజయలక్ష్మి మిమ్ము తప్పక వరిస్తుంది’’.
క్లియోపాత్రా తన మనసులోని సంఘర్షణను అర్థం చేసుకోవవటమేకాకుండా, ఆవేదనకు ఉపశమననం కలిగించటమెలాగో కూడా తెలుసుకోగలిగినందుకు, నిజంగా ఈమె దగ్గర దైవశక్తులున్నవనే విశ్వాసం ఏంటనీలో పెంపొందింది. ఆమె తెలివికి అతను ఆశ్చర్యంతో మూగవోయాడు.
‘‘మీరింకా భయపడుతున్నది దేనికో నాకు అర్థం కావటంలేదు. నా సహాయం మీకు ఉంటుంది లేదా, అసలీ యుద్ధాలే మనకొద్దు, దురాశకు పోయి భంగపడటం కన్నా, ఉన్నదాన్ని అనుభవిస్తేనే సరిపోతుంది. మనకేం తక్కువ? చివరకు రోమ్‌ను కూడా మరిచిపోయి మనం హాయిగా బతకగలం. ఆలోచించండి’’ అన్నదామె.
తన హృదయాన్ని ఏ భాషలో ఆమెకు చెప్పాలో అర్థంగాక ఏంటనీ పిచ్చిగా ఆమె మొహంలోకి చూస్తూ ఊరుకున్నాడు.
‘‘నిజానికి మనకు సమస్యలేమున్నవి? ఒక్కటి ఆలోచించండి. మన జీవితాలకు అంత్య దశలు సమీపిస్తున్నవి. ఎంత జీవితాన్ని కళ్ళముందు తళుక్కున మెరిపించి కాలం పరువులెత్తిందో ఎన్నడన్నా ఆలోచించారా? బతికినన్నాళ్ళూ బతకబోతున్నామా? మీకెలా తోస్తూన్నదో కాని, నాకు మాత్రం ఈ ప్రపంచంలో మనం సాధించదగింది మన సుఖమేననే వేదాంతం వంటబట్టింది. మరీ మిమ్ము చూస్తుంటే, ఈ సంవత్సర కాలంలోనూ, కనీసం పది సంవత్సరాలు వయసు ముదిరిందనిపిస్తోంది. అందుకనే ఇక వున్నకొద్ది వ్యవధినీ మనం వృథా చేసుకోకూడదని తోచింది. అందుకని-’’
ఏంటనీ గ్రహించాడు. క్లియోపాత్రా తనను ఎటు మళ్లిస్తుందో? అందుకనే అతను ఆమె మాటలకు అడ్డుపడి, ‘‘ప్రియా! బతుకులు తెల్లవారే వేళ అవుతోందనే నాకూ తోస్తోంది. అందుకే కీర్తి ప్రతిష్ఠలు జీవిత చరిత్రకు మెరుగుపెట్టే పనులేమీ చేయలేకపొయ్యానేనన్న బాధ నన్ను పీడిస్తోంది’’ అన్నాడు.
‘‘మీకా ఓపిక, పట్టుదలా వుంటే ఎవరు కాదన్నారు? ఎవరు అడ్డగలరు?’’ అన్నదామె ఉత్సాహంతో.
‘‘రాణీ! తిరిగి నీ సహాయాన్ని అర్థించేందుకు సిగ్గుపడుతున్నాను. కానీ నాకు నీకన్నా ఎవరున్నారు చెప్పు! ఈ ఎండాకాలంలో తిరిగి పర్షియన్ దండయాత్రకు నాకు అనుమతివ్వు’’ అన్నాడు ఏంటనీ.
ఏంటనీ పొరపాటున విజయుడైతే తన చేతుల్లోనుంచి జారిపోతాడనే భయం ఆమెకున్నది. ఐతే, తాను నిరుత్సాహపరిచినట్లయితే అతనసలు మనిషిగా కూడా బతకలేడనీ, దుర్భర వేదనకు గురవుతాడనీ తెలుసు. కనుక ఎక్కువగా చర్చిందుకు ఇష్టపడలేదామె. అదీగాక ఇంతకుముందే, ఇప్పుడు ఏంటనీ కోరబోయే కోర్కెలు తీరుస్తానని కూడా వాగ్దానం చేసింది.
‘‘నా అనుమతేంటి ప్రభూ! ఈజిప్టు అంతా మీదనే అనేకసార్లు మనవి చేశాను. మీరు నా దగ్గర సిగ్గుపడటమేమిటి? మనిద్దరం ఒకటిగానే బతకాలని నేను వాంఛిస్తున్నాను. మీరేమో నాతో విడివడి, మీ అనుభూతులకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు కదూ?’’ అన్నదామె.
‘‘కాదు- రాణీ! కాదు! నన్ను అపార్థం చేసుకోకు. నిజానికి నాలో రాజ్యకాంక్ష లేదు. ఆ సంగతి నీకూ తెలుసు. అంతమాత్రాన కూర్చొని, సుఖపడటమే పరమావధిగా కూడా చూసుకోలేను. నేను కూడా ఒక వీరుణ్ణనీ, యుద్ధ కౌశలమనేదాన్ని నేనూ ఎరుగుదుననీ రుూ ప్రపంచానికి రుజూ చేయాలి. నేను జయించే దేశాలన్నీ నీ కొరకే కదా!’’ అన్నాడతను.
క్లియోపాత్రా తిరిగి కాస్త మైకంలో పడింది. సీజర్ స్వప్నంలో కొంత భాగమన్నా నిజవౌగాక! అనుకున్నది.

- ఇంకాఉంది

శ్రీనివాసుడు ముంచుతాడా? తేలుస్తాడా?

$
0
0

పదమూడో తారీఖు సాయంత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సీబీడీటీ) వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద అల్లకల్లోలం రేపింది. వాస్తవానికి ఫిబ్రవరి 6వ తారీఖున చంద్రబాబునాయుడు మాజీ ప్రైవేట్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరిపై ఇన్‌కం టాక్స్ దాడులు 6 రోజులపాటు జరిగినప్పుడే రాజకీయ చర్చలు, పలు ఊహాగానాలు మొదలయ్యాయి. దీని పరిణామంపై సిబీడీటీ ఎప్పుడు ప్రెస్ బ్రీఫ్ ఇస్తారో అని యావత్ ప్రజానీకం ఆతృతతో ఎదురు చూడసాగారు. ఈలోగా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలు కూడా ఆరంభమయ్యాయి. అంత రచ్చ జరుగుతున్నా తెలుగుదేశం వర్గాలు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా గుంభనంగా వున్నారు. మరి సీబీడీటీ పేల్చిన బాంబు తెలుగుదేశం పార్టీలో, నాయకుల్లో ప్రకంపనాలు మొదలయ్యాయి. రాత్రంతా కొన్ని ఛానల్స్ ఈ అంశానే్న చర్చించాయ. చంద్రబాబుగారు కూడా ఉన్న పళంగా హైదరాబాద్‌కు బయల్దేరి రావడం కూడా చర్చనీయాంశం. మరి ఈ వార్త మూలాలకెళ్ళి చిలికి చిలికి గాలివానగా మారి చంద్రబాబు మెడకు చుట్టుకొంటుందా? చంద్రబాబు జైలుకెళ్ళడం ఖాయమా? ఈ అవినీతి విష వలయంలో ఇంకెంతమంది నాయకులు దాగివున్నారు అన్న విషయం మరి కొన్ని రోజుల్లోనే బయటపడే అవకాశం కన్పిస్తున్నది.
సిబీడీటీ, ప్రెస్‌నోట్ ఏం చెపుతుందో ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ మరియు పూణె పట్టణాల్లోని 40 ఆఫీసులపైగా ఆవరణలలో రైడ్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేస్తున్న 3 ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో ఈ సోదాలు జరిగాయి. 2వేల కోట్ల రూపాయల పైబడి అనధికారపు నల్లధనం వీటిలో బైటపడింది. విదేశాలనుండి ఎఫ్‌డిఐ పేరుతో ఈ నల్లధనం ఆంధ్రప్రదేశ్ చేరింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా బోగస్ బిల్లుల రూపంలో ఇది చెల్లింపబడింది. ఈమెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లు, కీలక పత్రాలు కూడా లభించాయి. ఈ సంస్థలపై సోదాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖుని పిఎస్ ఇంటిపై కూడా సోదాలు నిర్వహించి అనేక కీలకపత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సోదాలలో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షలు చేసే బంగారు ఆభరణాలు కూడా లభించాయి. ఇది సిబీడీటీ కమీషనర్ సురభి ఆహ్లూవాలియ ఇచ్చిన ప్రెస్ నోట్‌లోని ప్రధాన సారాంశం. దీని ద్వారా మనకు తెలిసేదేమంటే మూడు ప్రధాన కంపెనీల నుంచి బోగస్ సబ్ కాంట్రాక్టర్ల సంస్థల ద్వారా 2వేల కోట్ల రూపాయలు పైగా నగదును అక్రమంగా తరలించినట్లు తెలుస్తుంది. ఇవన్నీ అడ్రస్ లేని షెల్ కంపెనీలే. వీటి ఐ.టి. రిటర్న్స్ అన్నీ కూడా ఒకే ఐపీ నుంచి సబ్మిట్‌చేశారు. విదేశీ పెట్టుబడుల రూపంలో ఒక ప్రధాన కాంట్రాక్టర్ వచ్చిన నిధులు బోగస్ సంస్థలకు మళ్ళించారు. అందరికీ అర్థ్ధమయ్యేలా చెప్పాలంటే వీళ్ళ నల్ల డబ్బును ఎలాగో విదేశానికి చేరవేయడం, ఆ డబ్బు ఎఫ్‌డిఐ రూపంలో వైట్ మనీగామార్చి రాష్ట్రంలో పెట్టుబడి రూపంలో పెట్టడం. 2వేల కోట్ల అవినీతి సొమ్ము దొంగ తెలివితేటల్తో వైట్‌గా మార్చుకొనే వ్యవహారం ఈ జాదూల పని. మరి పెద్ద జాదూ ఎవరో?
ఫిబ్రవరి 6వ తారీకున సంచలనం రేపిన ఈ దాడులకు అందిన క్లూ కాస్త తెలుసుకొందాం. నవంబర్ 2019న దేశంలోని 42 ప్రదేశాలలో ఐ.టి. దాడులు విస్తృతంగా జరిగాయి. ఆ సందర్భంలో ముంబైలోని ఓ ప్రముఖ సంస్థపై జరిపిన దాడిలో ఆ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు అందజేసినట్లు పేర్కొనడం ఐటి సంస్థను పరిశోధన వైపు నడిపించింది. ఆ పరిశోధన లింకే 6వ తారీఖున చంద్రబాబు పిఎస్‌పై జరిగిన దాడులు.
ఎవరీ పి.ఎస్. శ్రీనివాస్? ఈయన సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంటులో క్లర్క్‌గా జీవితాన్ని ఆరంభించాడు. 1995న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన దగ్గర చంద్రబాబుతోపాటు తిరుపతి కళాశాలలో చదువుకొన్న, ప్లానింగ్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఓఎస్‌డిగా చేరారు. ఆయన దగ్గర పి.ఎ.గా సదరు శ్రీనివాస్ అనే వ్యక్తి చేరారు. అప్పట్లోనే ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు చేసేవారు. ముడుపులు ముట్టేవరకు, చంద్రబాబు సంతకం చేసిన ఫైల్స్ జి.ఓ.లుగా బయటకొచ్చేవి కావని అందరూ చెపుతుండేవారు. ముఖ్యంగా మెడికల్, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బి శాఖల్లోని వ్యక్తులు బహిరంగంగానే చెప్పుకొనేవారు. 2004 ఎన్నికల్లో పరాజయం అనంతరం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. కొన్ని రోజులు గడిచాక చంద్రబాబు దగ్గర పి.ఎ.గా శ్రీనివాస్ చేరాడు. అప్పట్లో లక్ష్మీనారాయణగారే బలవంతం చేసి శ్రీనివాస్‌ను చంద్రబాబు దగ్గర చేర్పించారు. ఆనాటి నుండి శ్రీనివాస్ చంద్రబాబుకు సర్వస్వం, ఆత్మ అయిపోయాడు. వాళ్ళిద్దరి బంధం బలమైంది. ఎన్నికల ఫండ్స్, అభ్యర్థులకు పంపడం, ఇత్యాది అన్ని విషయాలు శ్రీనివాసే చూసుకొనేవాడు. 2004నుండి 2014 వరకు ఈయన బండి కాస్తా ‘స్లో’ అయినా 2014లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఇతని గ్రహాలు పూర్తిగా మారిపోయి అత్యున్నత స్థితికి చేరుకొన్నాడు. చంద్రబాబు ప్రిన్సిపల్ సెక్రటరీకూడా ఇతని ముందర ‘డమీ’నే. ఇంతై, అంతై అంతింతై శ్రీనివాస్ ఈరోజు 2వేల కోట్ల స్కాంకు మూల పురుషుడు. చంద్రబాబును చీమ కలవాలన్నా, దోమ కుట్టాలన్నా శ్రీనివాస్ అనుమతి కావాల్సిందే.. ఎంత పెద్ద ఆఫీసర్లయినా ఈయనను ‘సార్’ అనాల్సిందే. ఇంత సర్వీసులోకూడా తనపై ఎలాంటి చిన్న ఆరోపణలు, ఎలాంటి పత్రికలో కూడా రానీయకపోవడం ఈయన ‘మేధస్సు’కు అద్దం పడుతుంది. ఈ 2వేల కోట్ల లావాదేవీలు వెనుక ఖచ్చితంగా చంద్రబాబే సూత్రధారని చెప్పచ్చు. జగన్‌గారు సీఎం అయ్యాక ఈ శ్రీనివాస్ చంద్రబాబుకు దూరంగా వుంటూ, కాదు నటిస్తూ ‘షో’నడపాలనుకొన్నాడు. ఎవర్ని పట్టుకొన్నాడో, ఏ తాయిలం ఎరవేశాడో కానీ ఈయన తన మాతృసంస్థ కాకుండా ప్లానింగ్ డిపార్ట్‌మెంటులో చేరిపోయాడు. అప్పట్లో డెక్కన్ క్రానికల్‌లో ఓ ఐటం ఇతనిపై వచ్చింది. ‘ ఘోజజూఖ’ఒ ఘౄశ జశ చ్ఘ్ఘశఒ ఆళ్ఘౄ’ అన్న వార్త. ఇధి విమర్శ కాదు. అధికారం కోల్పోయినా ఇతని చాకచక్యం గూర్చే.
ఇంతటి సంచలన వార్తపై ఎవరేమన్నారో పరిశీలిద్దాం.
బొత్స.. ‘‘వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మరి ఎందుకని ఇందులో ఇరుక్కున్నాడో?’’. లోకేష్ బాబు.. ‘‘పచ్చ కళ్ళవారికి లోకమంతా పచ్చగానే కన్పిస్తుంది. జగన్‌కి అవినీతి కనపడడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్లు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు వెసీపీ నేతలు’’. మంత్రి పేర్నినాని.. ‘‘నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు దొరికినట్లు ఇన్నాళ్ళకు చంద్రబాబు పాపం పండింది’’. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ‘‘ఐ.టి. దాడుల్లో చంద్రబాబు బినామీల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకు ఐ.టి. దాడులు కన్పించలేదా’’. మాజీ ఎంపీ రవీంద్రబాబు.. ‘‘2వేల కోట్లు కేవలం అవినీతిలో పొర మాత్రమే. 3 లక్షల కోట్లుపైచిలుకు బయటకొస్తుంది’’. సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్సీ.. ‘‘చంద్రబాబు అవినీతి త్రవ్వేందుకు బుల్‌డోజర్లు కావాలి’’. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్.. ‘‘చిన్న అపార్ట్‌మెంటులో వుండే శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్లు దొరికితే చంద్రబాబు దగ్గర ఎంతుండాలి?’’.
రాత్రంతా టీవీలలో ఈ వార్త గూర్చి విన్నాను. మరి ప్రతికల్లో కూడా చూద్దాం అని చూశాను. ఒక ప్రతికలో సీబీడీటీ ప్రెస్‌నోట్ గూర్చి రాలేదు. ఆశ్చర్యం అన్పించింది. తెలుగుదేశం జెండా కప్పుకొన్నా, కనీసం చిన్న వార్త అయినా ప్రెస్‌నోట్ ప్రచురించి వుండాల్సింది. మన ఖర్మ పత్రికా స్వేచ్ఛ ఇలా తగలపడింది.. ప్రభుత్వ వార్తను కూడా ప్రచురించాలన్న కనీస ధర్మం కూడా ఆ పత్రిక విస్మరించింది. దీని గురించి అటుంచితే.. ఇప్పుడేం జరుగుతుంది? అన్నదే ఈరోజు సర్వత్రా జరుగుతున్న చర్చ. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ కలసి వున్న కాలంలో చంద్రబాబు మోడీగారిని ‘దేవుడి’లాగా పొగిడేవాడు. అమరావతి శంఖుస్థాపనకు మోడీగారిని ఆహ్వానించి కోట్లు వెచ్చించి పంక్షన్ చేశాడు. 2018లో రెండు పార్టీల మధ్య బెడిసింది. వేరు కుంపట్లు పెట్టుకొన్నారు. ఎన్నికలు సమీపించే సమయంలో చంద్రబాబు బీజేపీని ప్రధాని మోడీని, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్‌షాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. తిరుమలకు దేవుడి దర్శనానికి వచ్చిన అమిత్‌షా కార్లపై రాళ్ళు వేశారు. సీబీఐని, ఐ.టి. రైడ్స్‌ను తానే ఆంధ్రప్రదేశ్ నుండి బ్యాన్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. రాహుల్‌గాంధీ, సోనియా, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, దేవెగౌడ, మాయావతి తదితర నేతలతో కోరస్ పాడాడు. అదంతా గతమే.. కానీ 2019లో తిరిగి బీజేపీ విజయభేరి మ్రోగించగా చంద్రబాబు తిరిగి బీజేపీ రాగం ఎత్తుకున్నాడు. ఏ చిన్న విమర్శకూడా బీజేపీని చేయకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు. బీజేపీ స్నేహంకోసం అర్రులు చాచి తన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్పించడం అందరికీ తెలిసిందే. కానీ ఎందుకనో బీజేపీ చంద్రబాబును మన్నించిన దాఖలాలు కన్పడలేదు. చంద్రబాబు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. క్రొత్తగా వచ్చిన కాంగ్రెస్ స్నేహాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇటు వీళ్ళేమో రానీయడం లేదు. చంద్రబాబు జీవితంలో ఇంతటి క్రైసిస్ ఎప్పుడూ రాలేదు. ఆందోళనలో క్రాస్‌రోడ్లపై నిలుచున్నాడు. ఆయన వెంట ఆయన నమ్ముకొన్న పచ్చమీడియా మాత్రం అడుగులు వేస్తూంది. అది కొంతవరకు ఆయనకు సాంత్వన కల్గించే విషయమే..
బీజేపీపై చంద్రబాబు ఆశలు వమ్మయ్యాయి. స్నేహం చిగురిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఆయన మాజీ పి.ఎస్. శ్రీనివాస్‌పై ఐ.టి. దాడులు వున్నపళంగా జరగడం చంద్రబాబుకు నిజంగా షాకే.
ఆయనకిప్పుడు గతం తిరిగి గుర్తుకొచ్చి వుంటుంది. ఒకవేళ గవర్నర్‌తో భేటీ అనంతరం గవర్నర్‌ని, గవర్నర్ వ్యవస్థను కూడా తీవ్రంగా విమర్శించాడు. మరోసారి మీటింగ్‌లో ‘నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు. నాకు మీరంతా అండగా వలయంలా నిలబడాలి’ అని రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థించాడు. అంటే దాని అర్థం ఎన్నికలముందు పోలవరం ఇష్యూలో తనను అరెస్ట్ చేస్తారన్న భయం ఆయన్ని అలా మాట్లాడించింది. మరి ఇప్పుడు అది నిజం కాబోతుందా? శ్రీనివాస్ చిచ్చు తనకు ముప్పుకాబోతుందా? తాను దోషిగా నిలబడితే కేంద్రం అరెస్ట్ చేస్తుందా? తనకిప్పుడు మార్గం ఏమిటి? కోర్టులయినా ఆదుకొంటాయా లాంటి ఎన్నో విశే్లషణలు నేడు చంద్రబాబు మెదడులో ఉద్భవించాయి. ఎలాంటి సిట్యుయేషన్‌నైనా తట్టుకోగల, మేనేజ్ చేయగల వ్యక్తిత్వం తనది. అదృష్టమేంటోగాని ఇప్పటివరకు అన్ని కోర్టులూ ఆయనకు అనుకూలంగానే అండగా నిలబడుతూ వచ్చాయి. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అడ్డంగా దొరికిపోయినట్లుంది.
ఐ.టి. డిపార్ట్‌మెంటు ప్రభుత్వానికి తెలియకుండా చేయదన్నది మనందరికీ తెలిసిందే. శ్రీనివాస్‌పై దాడులు బీజేపీ ప్రభుత్వానికి తెలియవని ఎవరూ అనుకోరు. మరి బీజేపీ ఎందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది? కారణాలేమిటి? నిజంగా చంద్రబాబును దెబ్బతీయాలన్న లక్ష్యంతో వుందా? లేక కేవలం చంద్రబాబుకు ఒక జలక్ ఇచ్చి తన గుప్పెట్లోనే వుంచుకొనేందుకు వేసిన ఎత్తుగడా? ఏమై వుంటుంది? ఏం చేయబోతూంది? అన్నదే అందరిలోనూ జరుగుతున్న చర్చ. మరి ఎన్నికల ముందు మోడీగారు ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ పోలవరం చంద్రబాబు, లోకేష్‌లకు ఎటిఎమ్ అని తీవ్ర విమర్శ చేశారు. మరి ఎన్నికలయ్యాక ఎటిఎమ్‌లపై ఎందుకు సీబీఐని పురమాయించలేకపోయింది. ఔను ఇంతకాలం అంత పెద్ద అవినీతి ఆరోపణను చంద్రబాబుపై చేసిన ప్రధానిగారు ఎందుకు ఆ విషయాన్ని విస్మరించారు? ఇంత పక్కాగా చంద్రబాబు దొరికాక బీజేపీవాళ్ళు వదిలేస్తే ప్రజల్లో చులకన అయిపోరా? మోడీ ఇమేజ్‌కు దెబ్బకాదా? ఈ ఇష్యూ చాలా జటిలమైంది. యావత్ భారతదేశం తీర్పుకోసం ఎదురుచూస్తుంది. పిఎస్‌పై దాడి చేస్తేనే 2వేల కోట్ల నల్లధనం దొరికితే, నిర్భయంగా, నిష్పాక్షికంగా చంద్రబాబుపై సీబీఐవంటి సంస్థలు దర్యాప్తుచేస్తే కొందరు విమర్శిస్తున్నట్లు ఎన్ని లక్షల కోట్ల అవినీతి వెలుగు చూస్తుందో?
శుక్రవారం సాయంత్రం జగన్ అమిత్‌షా మధ్య కీలక భేటీ జరిగింది. వీరి మధ్య ఖచ్చితంగా రాజకీయ చర్చ జరిగే వుంటుంది. కేవలం రాష్ట్ర సమస్యలపైనే చర్చలు జరిగినట్లు ఏ పార్టీ వ్యక్తులైనా చెబితే ప్రజలు నవ్వుకొంటారు. చంద్రబాబు దోస్తీ అనంతరం పవన్‌కళ్యాణ్‌గారు కూడా కాషాయ కండువా కప్పుకొన్నాడు. మరి ఇంతటి ప్రధాన ఇష్యూపై పవన్‌కళ్యాణ్‌గారు ఏ ప్రకటన చేస్తారో చూడాలి. తాను గనుక చంద్రబాబును రక్షించే ప్రయత్నం బీజేపీ ద్వారా చేస్తే చాలా చెడ్డపేరు వచ్చే అవకాశం వుంది. ఏది ఏమైనా సీబీడీటీ ప్రకటన తెలుగుదేశం వారి గుండెల్లో బాంబునే పేల్చింది. హవాలా డబ్బు 2వేల కోట్లు విదేశాలకు ఎలా తీసుకెళ్ళారు. దానిని ఎలా ఎఫ్‌ఐటిల క్రింద తీసుకొచ్చారో! ఆ డబ్బునే తమ ఇన్‌వెస్ట్‌మెంటు క్రింద మన రాష్ట్రంలో అడుగిడిన ఆ సంస్థల పేర్లేంటి? అమరావతిలో ఆ నల్లధనంతో ఎన్ని వేల ఎకరాలు దోచుకొన్నారో లాంటి చాలావిషయాలు ఇక సమగ్రంగా దర్యాప్తుచేయాల్సిన అవసరం, నివేదిక ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. సీబీఐ దాడులు చేసిన రాజకీయ నాయకుల జాబితాలో చంద్రబాబు కూడా చేరుతాడా? ఏమో చూడాలి. 2017లో మొదటి 6 నెలల కాలంలో సీబీఐ దేశంలోని టాప్ పొలిటీషియన్స్ 14 మందిపై కేసులు పెట్టింది. వారిలో హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 82 సం. వీరభద్రసింగ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌రావత్, ఆర్‌జేడీ లీడర్ లాలూప్రసాద్‌యాదవ్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకుమార్ జైన్, చిదంబరం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుధీప్ బంధోపాధ్యాయ్ తదితరులు వున్నారు. వీరంతా అవినీతిలో ఇరుక్కొన్నవారే. మరి శ్రీనివాస్ 2వేల కోట్ల స్కాం గనుక నిష్పాక్షికంగా జరిగితే, ఆ నివేదిక చంద్రబాబును ఆ టాప్ పొలిటీషియన్స్ లిస్టులో చేరుస్తుందా? భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబుకంటూ ఓ స్థానం వుంది. పేరున్న రాజకీయ వేత్తల్లో ఆయన కూడా ఒక్కరన్నది అందరూ అంగీకరించేదే.. ఆ ట్రాక్ రికార్డుతోనే చంద్రబాబు ఇంతకాలం నెట్టుకొచ్చాడు. ఇంతకాలం తాను నిప్పు అని, తనను ఎవరూ వేలెత్తి చూపలేరని, తనను ఎవరూ ఏం చేయలేకపోయారని, తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని చెప్తూ వచ్చిన చంద్రబాబు మాటలు వాస్తవాలా? ప్రగల్భాలా? అన్నది ఈ దర్యాప్తులో తేలుతుంది. నిజంగా చంద్రబాబుకు ఇదొక శీల పరీక్షగానే చెప్పచ్చు. ఈ శ్రీనివాసుడు ఈయనని నీట ముంచుతాడో, పాల ముంచుతాడో ఎదురుచూద్దాం.. అవినీతి అంతం మాత్రం జరగాలని మనందరం కోరుకొందాం..

మావోల ఆశలపై నీళ్లు!

$
0
0

దేశంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ముఖ్యంగా దశాబ్దాలుగా నానుతున్న సాయుధ ఘర్షణలకు తావిస్తున్న బోడో సమస్యపై కేంద్రం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
అస్సాంలోని నాలుగు జిల్లాలతో కూడిన బోడోల్యాండ్ కోసం దశాబ్దాలుగా హింసాత్మక ఉద్యమాలు జరుగుతున్నాయి. వేల మంది బలిదానాలు చేశారు. తాజా ఒప్పందంతో అక్కడ ఇప్పుడు కొత్త ఉషోదయం తొంగి చూసింది.
డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడో ల్యాండ్(ఎన్‌డిఎఫ్‌బి), ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, బోడో పౌర సంఘాలు కలిసి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ మొత్తం పరిణామంలో ముఖ్యమైన అంశమేమంటే... ఎన్‌డిఎఫ్‌బికి చెందిన అజ్ఞాత పోరాట వాదులు దాదాపు 1615 మంది తమతమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి శాంతియుత పరిష్కారానికి దారి వేయడం. దాంతో అస్సాంలో తిరుగుబాటు తత్వం... సాయుధ దాడుల ముప్పు తొలగిపోయింది. కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బోడో సంఘాలు ముందుకొచ్చి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయంగానే పరిగణించాలి. 1993నుంచి కొనసాగుతున్న ఈ తిరుగుబాటు ఉద్యమంలో ఇప్పటివరకు 4వేల మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం లొంగిపోయిన కార్యకర్తలకు అన్నివిధాల సాయంచేసేందుకు అస్సాం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలో పునరావాస విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్నది. దీంతో మిలిటెంట్ గ్రూపులు తమ సంతోషాన్ని వ్యక్తంచేశాయి. బోడోల్యాండ్‌లో సాయుధ చర్యలు ఇకపై ఉండవని హామీఇచ్చారు. ప్రశాంతంగా ప్రజలు జీవించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సాయుధ ఉద్యమాన్ని ‘డైమరీ’ మరికొందరు మార్క్సిజంతో స్ఫూర్తిపొంది ప్రారంభించారు. ఆ ప్రధాన నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
అస్సాంలోని కోక్రజార్‌లో ఈ ఒప్పంద విజయోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని శాంతి, సౌభాగ్యంపై ఎక్కువ శ్రద్ధకనబరచాలని పిలుపునిచ్చారు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమంతో అట్టుడికిన అస్సాంలోనే ప్రధాని భారీ సభలో ప్రసంగించారు. అనూహ్య స్పందన లభించింది. దేశంలో మిగతాచోట్ల ఆయుధాలు పట్టిన యువత కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన సూచన చేశారు.
మధ్యభారతంలో తమదైన రీతిలో స్థావరాలు ఏర్పరచుకుని ఆయుధాలతో సంచరిస్తున్న మావోయిస్టులు ఈశాన్య రాష్ట్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐక్య సంఘటనగా ఏర్పడి ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చాలన్న ‘కల’ను వారు చిరకాలంగా కంటున్నారు. కాని ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మిలిటెంట్లు సాయుధ మార్గాన్ని వీడుతున్న ‘దృశ్యం’కనిపిస్తోంది. తాజాగా బోడో తీవ్రవాదులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోవడంతో మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. పైగా ఆ ఉద్యమ నాయకులు మార్క్సిజం స్ఫూర్తితో ఉద్యమించడంతో భావసారూప్యం ఎక్కువగా ఉంటుందని ఆశించారు.
అంతకుమునుపు కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దుచేయడంతో కూడా మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం మావోలకు వెన్నుదన్నుగా కనిపించింది. పరస్పర సహాయ, సహకారాలతో ఆదాన ప్రదానాలతో కాలం గడిపారు. అనేక సదస్సులు నిర్వహించి స్నేహ సంబంధాలు బలపరుచుతున్నారు. అవసరమైనప్పుడు అర్బన్ నక్సల్స్ బహిరంగంగానే కశ్మీర్ వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి అట్టుడుకింది.
ఇట్లా కశ్మీర్ ఈశాన్యప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఆందోళనలను ఒక ‘గొడుగు’ కిందకు తీసుకొచ్చేందుకు మావోలు తమ ప్రయత్నాలుచేశారు. బలహీనమైనా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాని వారి ఆశలపై వరుసగా నీళ్లుకుమ్మరించే విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల లక్నోలో డిఫెన్స్ ఎక్స్‌పో-2020 జరిగింది. ప్రపంచంలోని ప్రముఖ ఆయుధ తయారీ సంస్థలు, వాటి ప్రతినిధులు, ప్రభుత్వ నేతలు, అధికారులు, నిపుణులు, విశే్లషకులు ఇందులో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ ప్రాజెక్టులో కనిపించిన, వినిపించిన విషయాలను మావోయిస్టులు చెబుతున్న యుద్ధకళ- కళ పద్ధతికి ఎక్కడా పొంతన లేదు. ఇందులో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తొలిరోజు స్వాగత ప్రసంగంచేస్తూ యుద్ధరంగంలోకి ఆధునిక సైన్స్-టెక్నాలజీ ప్రవేశించిందని, దాంతో యుద్ధపరికరాల్లో, ఆయుధాల్లో సంపూర్ణ మార్పు చోటుచేసుకుందని పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఆయుధ తయారీలో నిమగ్నమైందని, ఆయుధ తయారీ హబ్‌గా భారత్ ఎదిగిందని తెలిపారు. కృత్రిమ మేధ, వర్చువల్ టెక్నాలజీ పెద్దఎత్తున ఉపయోగిస్తోందని, ఆయుధ రంగంలో ‘నయాభారత్’ ఆవిర్భవించిందని, అనేక ఆవిష్కరణలు, ప్రయోగాలు జరుగుతున్నాయని, ఆర్ అండ్ డికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఆ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఆయుధాల టెక్నాలజీ, యుద్ధపరికరాలు... పరిశీలించి మావోయిస్టుల మాటలు వింటే అవి పూర్తిగా మతిలేనివిగా తోస్తాయి. ఆయుధాల ఆవిష్కరణ-పరిశ్రమ, ఉత్పత్తి-ఎగుమతి- ఈ అమేయమైన శక్తి, టెక్నాలజీ ఆసరాతో శత్రువును అదుపుచేసే వైనం ఉబికి వచ్చాక- ఈ అమేయమైన శక్తిని గెరిల్లా దళాలతో చిత్తుచేస్తామని ప్రగల్భాలు పలకడం ప్రజల్ని మోసగించడమే తప్ప మరొకటి కాదు.
చైనా నిపుణుడు సున్‌జు ప్రకారం యుద్ధం చేయకుండానే విజయం సాధించడం ముఖ్యం. ఆ ప్రక్రియను పెద్ద ఎత్తున ఒడిసిపడుతున్న వైనం ఇలాంటి ప్రదర్శనల్లో దర్శనమవుతోంది. ఈ నేపథ్యంలో మావోల ఆలోచనలు ఎంత గొప్పగా, ప్రజాజ్ఞానస్ఫూర్తి దాతగా ఉండాలి? దాన్ని గాలికొదిలేసి దండకారణ్యంలో గెరిల్లాదండు నిర్మాణంపై సర్వశక్తులు ఒడ్డటం విడ్డూరం. అన్నివైప
ల మంచి వారి దారులు మూసుకుపోతున్న ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి విశాఖ మన్యంలో, కేరళ వైనాడ్ ప్రాంతంలో, జార్ఖండ్‌లో అంతటా ఎదురుదెబ్బలే! అరెస్టులు, లొంగుబాట్లు, ఎదురుకాల్పుల్లో మరణాలు, ఆరోగ్యం సహకరించక ఉద్యమం నుంచి విరమించుకోవడం.. ఇదే కనిపిస్తోంది తప్ప ఇంతకుమించిన ఉత్తేజకర, నిర్మాణాత్మక అంశమేదీ తెరముందుకు రాలేదు.
తాజాగా ఒడిశాలో ఓ కీలక మావోయిస్టు నాయకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు కారకుడిగా భావిస్తున్న జిప్రో మల్కన్‌గిరి ఎస్‌పి ఎదుట లొంగిపోయాడు. అతనిపై రూ. 4 లక్షల రివార్డు ఉంది. అలాగే విశాఖ మన్యంలో ఇటీవల సీనియర్ మావోయిస్టు నాయకుడు ఆజాద్, అతని భార్యను పోలీసులు అరెస్టుచేశారు. ఆజాద్‌పై రూ.20 లక్షల రివార్డు, అతని భార్య ఫూల్‌వతిపై రూ.8 లక్షల రివార్డు ఉంది.
ఇక ప్రజాసంఘాలకు చెందిన వారిని సైతం ప్రభుత్వం పెద్దఎత్తున అరెస్టు చేస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ విద్యార్థివేదిక, చైతన్య మహిళా సంఘం, విరసం నాయకులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్ని కవర్ సంఘాల ముసుగులో ఉన్నా వారు అరెస్టవుతున్నారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? హళ్ళికి హళ్ళి... సున్నాకు సున్నా అనే కదా?

సరికొత్త సృజన సమీరం!

$
0
0

సుందరం.. సుకుమారం.. వర్ణరంజితం సీతాకోక చిలుక రూపం.. చిత్రకారులకు ఇంతకు మించిన గొప్ప ‘వస్తువు’ ఏముంటుంది? చిత్రకారుడికి పరీక్ష పెట్టే, సవాలు విసిరే ప్రాణి మరొకటేముంటుంది?
ఆ అల్ప ప్రాణి సవాలును చిత్రకారుడు అక్కిరాజు రమణ హుందాగా స్వీకరించి తన కాన్వాసుల నిండా సీతాకోక చిలుకలకు ప్రాణం పోశాడు. పరిపరి విధాల చిత్రిక పట్టాడు. పరిసరాల నిండా సీతాకోక చిలుకల ‘జాడ’ను పరిచాడు.
సీతాకోక చిలుక రెక్కల్లో కేవలం రంగులనే గాక మనుష్య ఆకృతులను జత చేయడంలో రమణ సృజన కనిపిస్తోంది. ఆ రూపాంతరం సరికొత్త సంకేతంలా నిలుస్తోంది.
అలా మానవాకృతి, సీతాకోక చిలుకలు ఏకీకృతం అయిన చోట కాన్వాసు కోటి కాంతులతో వెలుగొందుతుంది. ఆ ‘టెక్చర్’ ఉల్కాపాతంలా దేదీప్యమానంగా విస్తుగొలుపుతుంది. ఆ టెక్చర్‌లోనూ తిరిగి రేఖా రూపంలో రెక్కలను టపటప లాడిస్తూ సీతాకోకలు కనిపిస్తాయి. ఇందుకు చిత్రకారుడు ఎంచుకున్న టెక్నిక్ అపురూపమైనది.
కాన్వాసుపై ‘వైట్ టెక్చర్’ పొరలు పొరలుగా వేయడం వల్ల ఈ అద్భుతం చోటు చేసుకుందని చిత్రకారు డంటున్నారు.
ఒకే ఫ్రేమ్‌లో ఎంతో విషయాన్ని నిక్షిప్తం చేసిన ఆయన విద్వత్‌కు ఓ తార్కాణం.
ఓ మార్మిక లోకపు అంచులను తాకేందుకు జరిగే ప్రయత్నం ఆ ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. సీతాకోక చిలుక రెండు రెక్కల స్థానంలో రెండు అర్థకైరూప్య తలలు... అందులో ఒకటి ఆడ.. మరొకటి మొగ. వారి తలల నిండా లతలు, ఆకులు అలములతో అనంత ఈ ప్రకృతిలో అంతర్భాగమై వెలుగొందుతున్న వైనం.. నేపథ్యంలో రంగుల కోలాహలం సంరంభం.. అందులో తచ్చాడుతున్న... రేఖామాత్రపు సీతాకోకలు.. అంతిమంగా ఈ పెయింటింగ్ రమణ రంగుల విద్వత్‌ను వెల్లడిస్తుంది.
ఈ ప్రపంచంలో అతి అసహ్యకరమైన రూపం (గొంగళిపురుగు) నుంచి ఓ అద్భుత అందమైన అపురూపమైన నాజూకైన, నయనానందకరమైన ప్రాణి (సీతాకోకచిలుక)గా రూపాంతరం చెందడం ఈ ప్రకృతిలో ఆ ఒక్క ప్రాణి విషయంలోనే చూస్తామని చెప్పే చిత్రకారుడు ఆ అల్పప్రాణిని అమితంగా ప్రేమించి అనేకానేక ఫ్రేముల్లో, వివిధ నేపథ్యాల నడుమ చిత్రిక పట్టి జేజేలు అందుకున్నారు. అవి విసిరిన సవాలుకు న్యాయం చేశారు.
ప్రకృతి అందానికి మారుపేరుగా నిలిచే సీతాకోకల గుంపును సైతం తనివితీరా చిత్రించి చిత్రకారుడు చరితార్థుడయ్యాడు.
అదంతా సహజసిద్ధంగా రంగుల పోహళింపుతో సృజనాత్మకతకు సరికొత్త హద్దులు నిర్ధారించి చేసిన విన్యాసం.
దీన్ని తలదనే్న రీతిలో డిజిటల్ మిక్స్ పేర, డిజిటల్ మీడియాలో ఆయన గ్రహాంతర వాసుల ఊహారూపాలతో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. కుంచెతో తీసుకురాలేని మార్మికత, రంగుల తీక్షణత, ఓ ఒంపులు వయ్యారాలు, నేపథ్యంలోని కలల ప్రపంచం అంతా ఓ వినూత్న అనుభవం. సృజనకారుడి అనంత సృష్టికిదొక తొలి మెట్టుగా కనిపించే, కళ్లు మిరుమిట్లు గొలిపే గొప్ప అనుభూతిని పంచుతాయి. ఒక్కసారి పంచేంద్రియాలు ఉలిక్కిపడేలా, తాదాత్మ్యం చెందేలా చేస్తాయి. ఈ వైభోగం కేవలం డిజిటల్ మీడియాలోనే సాధ్యమని, భారతదేశం వెలుపల ఎందరో చిత్రకారులు.. సృజనకారులు తమ ప్రతిభను డిజిటల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారని అక్కడి ప్రజల ఆదరణ పొందుతున్నారని రమణ అంటున్నారు.
రంగుల రసగంగలో మునుగుతూ, సీతాకోక చిలుకల్ని అమితంగా ప్రేమిస్తూ, చెట్టులో, పుట్టలో, స్ర్తి ముఖంలో ఇలా అంతటా తిలకించడమేగాక చిత్రించి అబ్బురపరుస్తున్న రమణ అక్కిరాజు హైదరాబాద్‌లో 1967లో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఖమ్మం జిల్లా నుంచి చాలా కాలం క్రితం రాజధానికి చేరుకున్నారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. ఇక్కడే ప్రముఖ చిత్రకారుడు నరేంద్ర రాయ్ డ్రాయింగ్ టీచర్‌గా తమకు చిత్రలేఖనంపై అనురక్తిని పెంచారన్నారు. అది హాబీగా ప్రారంభమైనా చివరికి ఆరవ ప్రాణంగా మారిందంటున్నారు రమణ.
కాచిగూడ జూనియర్ కాలేజీలో చదువుతూ సాయంత్రం కోఠిలోని వి.వి. కాలేజీలో చెప్పే చిత్రలేఖనం తరగతులను హాజరై తన తృష్ణను చాటుకున్నారు. ఆ రంగంలో రాణించేందుకు అడుగులు వేశారు. ఆ రకంగా కొంత చేయి తిరిగాక 1987 సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బిఎఫ్‌ఏలో చేరారు.
అక్కడ ‘అప్లైడ్ ఆర్ట్స్’ విభాగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ రోజుల్లో రకరకాలైన కమర్షియల్ ఆర్ట్ పనులు చేయాలంటే అప్లైడ్ ఆర్ట్స్ పరిచయం తప్పనిసరి. గ్రాఫిక్స్, డిజైన్స్, లే అవుట్, పోస్టర్ రూపకల్పన, బొమ్మలు వేయడం ఇత్యాది పనులకు భూమిక ఈ విభాగం కావడంతో దానిపై మనసు పెట్టి దూసుకుపోయారు. వౌలికంగా తాను చిత్రకారుడినన్న మాట మాత్రం విస్మరించలేదు. తన అంతరంగంలో సమాంతరంగా ఆ సంభాషణ - చర్చ - సృజన, రంగుల పోహళింపు కొనసాగుతూనే ఉంది. అందుకే 2013, 2014 సంవత్సరంలో వరుసగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి బహుమతులు అందుకున్నారు. అంతకుముందే సిద్దిపేటలోని లలిత కళాసమితి నుంచి కూడా ఉత్తమ చిత్రకారుడి బహుమతి పొందారు.
ఇక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో, దాయిరా ఆర్ట్ గ్యాలరీలో, మాక్స్‌ముల్లర్ భవన్‌లో.. ఇలా పలుచోట్ల ఆయన గ్రూప్ షోలలో పాల్గొని ప్రశంసలందుకున్నారు. వివిధ ఆర్ట్ క్యాంపుల్లో తోటి చిత్రకారులతో పోటీ పడి ప్రతిభను చూపారు. త్వరలో సోలో షో నిర్వహించనున్నట్టు చెప్పారు.

*చిత్రాలు.. రమణ అక్కిరాజు.. 9347203234

ఈనాడే బాబూ.. (నాకు నచ్చిన పాట)

$
0
0

ఎస్వీ రంగారావు, రాజ్‌బాబు తాతామనవడుగా నటించిన చిత్రంలో అంజలీదేవిపై చిత్రీకరించిన ‘ఈనాడే బాబూ నీ పుట్టినరోజు’ అనే పాట చాలా బావుంటుంది. సినారె కలంలోనుండి జాలువారి, పి.సుశీల గళంలోనుండి వినిపించే ఈ పాట ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. కొడుకు ఇంట్లోనే కోడలికి తెలియకుండా పనిమనిషిగా బ్రతుకుతూ తన సొంత మనవడైనా, గుండెకు హత్తుకోలేని బేలత్వం ఆమెది. మనవడిపై ప్రేమ చూపిస్తే కోడలు ఏమంటుందో తెలియని అమాయకురాలు. కానీ ప్రేమ పాశాన్ని వదులుకోలేదు. కొడుకంటూ ఒకడున్నా వాడు గుండెల్ని ఏనాడో అమ్ముకున్నాడు. కోడలు పంచన చేరి తల్లిదండ్రుల్ని మర్చిపోయాడు. ఇంటికి పనిమనిషిగా వచ్చిన తల్లిని చూసి జాలిపడకపోగా ఈ విషయాన్ని కోడలికి చెప్పొద్దన్నాడు. ఎవరేమంటే ఏమి? నా కొడుకు నా మనవడింట్లోనే కదా నే పనిచేస్తుంది అని సమాధాన పడిపోయింది ఆ మాతృమూర్తి. తల్లీతండ్రీ పుట్టినరోజుకి పాట పాడినా ఆ చిన్నబాబుకి నచ్చలేదు. తననెంతో ఆప్యాయంగా పెంచి పెద్దచేస్తున్న ఆయమ్మ అనబడే నానమ్మనే పాట పాడమన్నాడు బాబు. అందుకే పెద్దలు సుద్దులు చెప్పినట్లుగా ఈ పాటలో రాముడి గురించి చక్కగా మనవడికి వివరించి చెబుతుంది. తండ్రి మాటకోసమే తనయుడు అడవులపాలయ్యాడని, అందుకే ఆయన అందరికీ దైవమయ్యాడని చెబుతుంది. చుక్కలు వేయి ఎందుకు, ఒక్క చంద్రుడే చాలు, తల్లిదండ్రులను చూసే కొడుకు ఒక్కడే చాలు. తన స్వార్థం, సుఖం చూసుకున్న కొడుకు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు అని ఆనందపడుతుంది ఆ తల్లి. చిన్నబాబు పెరుగుతుంటే కన్నవారికి ఆనందం. అలాగే ఆకాశంలో నెలవంక పెరిగితే నింగికి ఒక అందం అని చక్కని ఉపమానాలతో ఈ పాటను రాశారు సినారె. పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో, అక్కడ సన్నివేశం అంత భావగర్భితంగా ఉంటుంది. ఈ రెండిటినీ సమన్వయం చేస్తూ తన తొలి చిత్రంతోనే అద్భుతాన్ని సృజియించారు దర్శకుడు దాసరి నారాయణరావు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు ఈ సినిమాకానీ ఈ పాట కానీ చూపిస్తే సిగ్గుతో తల వంచుకుంటారు. అది ఈ పాటలో ఉన్న గొప్పతనం.
- మేడా శ్రీనివాసరావు, ఎడ్చెర్ల

మానవుడు దానవుడు (నాకు నచ్చిన సినిమా)

$
0
0

ఉషశ్రీ పిక్చర్స్ పతాకంపై శోభన్‌బాబు, శారద, రాజ్‌బాబు, సత్యనారాయణ, కృష్ణకుమారి, ముక్కామల ప్రధాన తారాగణంగా రూపొందిన మానవుడు-దానవుడు చిత్రం దాదాపు 40 ఏళ్ల క్రితం రూపొందిస్తే ఇప్పటికీ ఆ చిత్రంలోని పరిస్థితులు మన సమాజంలో కనబడుతుండడం విశేషం. మానవులందరూ దానవులుగా మారి నేడు జరుగుతున్న దిశ, నిర్భయ లాంటి సంఘటనలను గుర్తుచేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో అక్క అటువంటి అకృత్యానికే బలైపోతుంది. చిన్నవాడైన హీరో పెద్దయ్యాక ఇటువంటి మానవ మృగాలను ఏరివేయడానికి దానవుడుగా మారతాడు. సినిమాలో విశేషమేమిటంటే మానవుడిగా మంచి వాడిగా కనిపించే డాక్టర్, రాత్రివేళల్లో మానవ మృగాలను వేటాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఇద్దరు శోభన్‌బాబులు ఉన్నారు అనుకుంటారు. దర్శకుడు చివరి దాకా ఇద్దరు ఉన్నట్లుగానే చూపిస్తాడు. కానీ క్లైమాక్స్‌లో మానవుడే దానవుడిగా మారి నిజమైన రాక్షసులను అంతమొందించాడు అని ముగింపు ఇస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఇప్పటి సమాజంలో కనబడడం చాలా అరుదు. అలాంటి రోజులు మళ్లీ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది. అణు అణువున వెలసిన దేవా కనువెలుగై మమ్ము కరుణించరావా, పచ్చని మన కాపురం పాలవెలుగై మరిగే పాలవెలుగై, నీకోసం... నీ సోకైన మగసిరికోసం నీకోసం, అమ్మాలాంటి చల్లనిది లోకమొకటి ఉందిలే ఆకలి ఆ లోకంలో లేనే లేదులే. జీవితంలో ఎన్నికలొస్తే కనె్నపిల్ల ఓటెయ్యమంటే ఎవరికయ్యా నీ ఓటు, అన్న అశ్వత్థామ సంగీతంలో రూపొందిన పాటలన్నీ ఆణిముత్యాలే. రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని చూపుతూ నటించారు శోభన్‌బాబు. ఆయనకి జోడీగా శారద మంచి నటిగా నిరూపించుకుంది మరోసారి. రాజ్‌బాబు, ముక్కామల, సత్యనారాయణ, జయకుమారి, డబ్బింగ్ జానకి లాంటి వారు వైవిధ్యంగా నటించి మెప్పిస్తారు.
-తినె్నమీది సూరన్న, సింగనమల


అందుకే.. అది సినీ స్వర్ణయుగం

$
0
0

సినిమాల్లో చిన్న డైలాగ్ ఆర్టిస్టే అయినా -పెద్ద జీవితాన్ని చూశాడు శ్రీరామమూర్తి. అందుకే ఆయన లోతైన మాటల్లో తాత్వికత కనిపిస్తుంది. ‘కళామతల్లి నీడలో ఓ వెలుగు వెలగాలనే అంతా వస్తారు. కాకపోతే -అదృష్టాన్ని బట్టి కొందరు ఎదుగుతారు. కొందరు చరిత్ర సృష్టిస్తారు. అంతమాత్రాన -వెనుకున్న వాళ్లంతా మనుషులు కాదని కాదు. అది -స్వర్ణయుగం కాలంలోనే మేం చూశాం. స్టార్ ఇమేజ్‌వున్న పెద్ద తారలైనా సన్నివేశం, సందర్భాన్ని బట్టి జూ.ఆర్టిస్టులతోనూ సమానమన్న భావన కలిగించేవారు. వాళ్లనూ పైకి తీసుకొచ్చేందుకు సహకరించేవారు. ఆనాటి గొప్ప వాతావరణం ఇప్పుడుంటుదని నేననుకోను. అందుకే -ఆ కాలాన్ని స్వర్ణయుగంగా ఇప్పటివాళ్లూ పరిగణిస్తున్నారు’ అంటారు శ్రీరామమూర్తి. పాత్ర చిన్నదైనా పెద్ద పెద్ద చిత్రాల్లో చేసిన శ్రీరామమూర్తి మరికొన్ని జ్ఞాపకాలు వెనె్నల పాఠకులకు ఈవారం ముచ్చట్లు.
దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద దాదాపు 15 సినిమాలకు పనిచేశా. ఆ టైంలో ఆయన చేసిన సినిమాల్లో తమిళ నటులెవరైనావుంటే వాళ్లకి తెలుగులో డైలాగులు నేర్పడం నా పనే. అలాగే దర్శకుడు కోదండరామిరెడ్డి చేసిన చిత్రాల్లో -ఏకైక బిళ్ల బంట్రోతును నేనే. బిళ్ల బంట్రోతు పాత్రలన్నీ నాకే రావడం యాదృచ్ఛికం -అంటూ నవ్వేశారు శ్రీరామమూర్తి. ‘వాహిని స్టూడియోలో జరిగిన సంఘటన ఇది. బిళ్ల బంట్రోతు పాత్ర చేస్తున్నా. ఆ టైంలో -నిర్మాత, జూనియర్ ఆర్టిస్టుల మధ్య గొడవ తలెత్తింది. ఆ సినిమా హీరో కృష్ణంరాజు. ఆయనొస్తే.. గొడవ సమసిపోయేది. కానీ ఆయన రావడం ఆలస్యమైంది. గొడవ పెద్దదైంది. డైలాగ్ ఆర్టిస్టునైనా -నన్నూ సమ్మెకు సహకరించమని కోరారు జూనియర్లు. మరోపక్క దర్శకుడు షాట్‌కు రమ్మంటూ పిలుస్తున్నాడు. జూ.ఆర్టిస్టుల సమస్య కొలిక్కొస్తేనే సెట్‌లోకి వస్తానన్నాను. నేనూ జూనియర్ ఆర్టిస్టుగా ఇబ్బందులు చూస్తున్నానని, వాళ్లకు న్యాయం చేయాలని కోరాను. దర్శక నిర్మాతలు మొదట నాపై కోపగించారు. కొద్దిసేపటికి సమస్య పరిష్కారమైంది. ఆ తరువాతే నేను షాట్‌కు వెళ్ళా. అప్పుడే -హీరో కృష్ణంరాజు వచ్చారు. నన్ను ఆలింగనం చేసుకొని -నేను చేయాల్సిన పరిష్కారాన్ని నువ్వే చేశావ్ అంటూ భుజం తట్టారు. సమస్య పరిష్కారం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేయటం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. అప్పట్లో హీరోలు అంత ఉన్నతంగా ఆలోచించటమే కాదు, వర్కర్లపట్ల ఆదరణతో ఆలోచించేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రీరామమూర్తి.
మరోసారి దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద జోడీగా ‘బండోడు గుండమ్మ’ షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో శ్రీరామమూర్తి పోలీసు కానిస్టేబుల్. స్క్రిప్ట్ ప్రకారం హీరో వెంబడే కానిస్టేబుల్ తిరుగుతుండాలి. అలా హీరో కృష్ణ వెంబడే శ్రీరామమూర్తి కానిస్టేబుల్ వేషంలో ఉండేవాడు. అయితే ఒకరోజు -శ్రీరామమూర్తికి వేరే షూటింగ్‌కు వెళ్లాల్సిన అవసరమొచ్చింది. కానీ, ‘ఇక్కడ హీరోపై చిత్రీకరించే సన్నివేశంలో కంటిన్యుటీ ఉండాలి. లేదంటే, మళ్లీ హీరో కాల్షీట్లు దొరక్కపోతే రసాభాస అవుతుంది. ఏంచేయాలో నాకు అర్థం కాలేదు. సరాసరి పెద్ద దిక్కైన దాసరినే ఉపాయం కోరాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్లమని భరోసా ఇచ్చారు. శ్రీరామమూర్తి వెళ్లిపోయాక మరొక వ్యక్తిని పోలీసు వేషం వేయించి పక్కన నిలబెట్టారు. షాట్ రెడీ అయింది. షాట్‌లో పోలీస్ పాత్రధారి మారిపోవడాన్ని కృష్ణ గుర్తు పట్టేశారు. ఎవరితను? ఇప్పటిదాకా వున్నది మరొక వ్యక్తి కదా? అప్పుడే మారిపోయాడా? అని అడిగేశారు. దానికి దాసరి అడ్జెస్ట్ చేసుకుందాం అని చెప్పబోయారు. వెంటనే కృష్ణ అందుకుని, భవిష్యత్‌లో గొప్ప దర్శకుడివి కావాల్సిన వాడవు. నీవిలా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే ఎలా? మొదటినుంచీ ఉన్న పాత్రధారి వచ్చాకే ఈ సీన్ తీద్దాం. మరొకరిని పెడితే సీన్‌లో కంటిన్యూటీ దెబ్బతింటుంది. అవసరమైతే అతనితోవున్న సీన్లు రేపు చేద్దాం అన్నారు. హీరోలు అంత మర్యాదగా ఉంటే, దర్శకులు మాలాంటి చిన్న వాళ్లపై కనికరంతో ఉండేవారు అని చెప్పుకొచ్చారు శ్రీరామమూర్తి.
‘కోడలుపిల్ల’ షూటింగ్ ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో జరుగుతోంది. కృష్ణ, కెఆర్ విజయ హీరో హీరోయిన్లు. వీనస్ స్టూడియోలో ఆ రోజు కెఆర్ విజయపై రేప్ సీన్ చేయాలి. ఆ పాత్రధారిని నేనే. కానీ అప్పటికే కెఆర్ విజయ పెద్ద స్టార్. ఆమెతో ఇలాంటి సీన్లో నటించాల్సి రావడం ఓరకంగా నాకు భయమేసింది. తప్పదుగా అని ఆలోచించుకుంటూ ఓ మూలన అలాగే నిలబడిపోయాను. దర్శకుడేమో విసుక్కుంటున్నాడు. వచ్చి సీన్‌లో నటించమంటున్నాడు. కానీ నా అడుగులు ముందుకు పడటం లేదు. ఇదంతా గమనించారు కెఆర్ విజయ. సెట్‌లోనుంచి పక్కకు తీసుకెళ్లారు నన్ను. ‘ఏంటి? రేప్ సీన్ అని భయపడుతున్నావా? లేక నేను నీకు ఆడదానిలా కనిపించటం లేదా? పెద్ద పెద్ద హీరోలే ఇలాంటి సీన్లు కోసం చూస్తుంటారు. అలాంటిది నువ్వేంటయ్యా, అంత వణికిపోతున్నావ్’ అంటూ నటనలోని తాదాత్మ్యత గుర్తుకొచ్చేలా చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పారు. ఇది సినిమా, అలాంటి భయాలు పెట్టుకుంటే పెద్ద ఆర్టిస్ట్ ఎలా అవుతావ్? సంకోచాలు వదిలి పాత్రను రక్తికట్టించు’ అంటూ కర్తవ్య బోధ చేసి -ఓకె షాట్ రెడీ సార్ అని డైరెక్టర్‌తో అంటూ సెట్‌లోకి వెళ్లిపోయిందావిడ. ఎంత స్టార్ ఇమేజ్‌కి ఎదిగినా ఒద్దికైన మనసుతో ఉండే అలాంటి తారల పక్కన కొంతసేపే కనిపించినా, వాళ్లతో నటించే అవకాశం నిజంగా నా అదృష్టం’ అంటారు శ్రీరామమూర్తి. ‘అప్పటి హీరోయిన్లు చిన్న నటులతోనైనా కోఆపరేట్ చేస్తూ నటించేవాళ్లు. చిన్నా, పెద్దా భేషజం వారికి ఏనాడూ ఉండేది కాదు. ఇప్పటివాళ్లలా ఉండటం లేదు. మొదటి సినిమాలోనే జూ.ఆర్టిస్టులను అంటరాని వ్యక్తులుగా చూస్తారు. అది భరించలేని విషయం. జీవితంలో అందరూ గొప్పవాళ్లం అవ్వాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కానీ ఎవరి తలరాత ఎవరూ మార్చలేరు.
పరిశ్రమలో మహర్జాతక హీరో నందమూరి తారకరామారావు, దర్శకుడు నా గురువు దాసరేనని నా అభిప్రాయం. అలాంటి జాతకం భవిష్యత్‌లో ఎప్పుడూ ఎవరికీ రాదనే నమ్ముతా. వాళ్లిద్దరూ పరిశ్రమకు రెండు సింహాలు అనిపించేది. అప్పట్లోనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ వున్నది ఒక్క ఎన్టీఆర్‌కే. ఆయన్ని కలవాలంటే చాలా కష్టమయ్యేది. ఉదయానే్న నిద్రలేచి వ్యాయామాలు చేసి, తిరుపతినుంచి వచ్చే అభిమానుల బస్సుల కోసం ఎదురు చూసేవారు. ప్రతిరోజూ ఆయన ఇంటిముందు పండగ వాతావరణమే. అందరినీ పలకరించి యోగక్షేమాలు విచారించి ఇంట్లోకి వెళ్లేవారు. వారితోపాటుగా నేనూ రెండు మూడుసార్లు ఆయన ఇంట్లోకి వెళ్లాను. అందరూ వెళ్లిపోయినా నేను అలాగే నిలబడిపోయాను. ఆయన మేనేజర్ మీసాల సత్యనారాయణ ఉండేవారు. ఎన్టీఆర్ షూటింగ్‌కు వెళ్తూ ఇంకా ఉన్నావేంటి.. వెళ్లలేదా? అన్నారు. ‘నేను గుంటూరులో మీ చేతులనుండి ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్నా. సినిమాల్లో వేషాలకోసం వచ్చానని చెప్పాను. అవకాశాలు నేనొక్కడ్నే ఇప్పించలేను బ్రదర్, మీ ప్రయత్నాలు మీరు చేయాలి అంటూ పంపేశారు. ప్రయత్నాలు ఎన్నో చేసినా చాన్స్‌లు రాలేదు. రెండోసారి మళ్లీ తిరుపతి అభిమానులతోపాటుగా ఇంట్లోకి వెళ్లా. మళ్లీ అంతా వెళ్లినా నేనుండిపోయాను. ఎన్టీఆర్ మళ్లీ అడిగారు. వేషాలకోసమే వచ్చానని చెప్పాను. సరే అంటూ ఓ నాలుగు కంపెనీలకు సిఫారసు చేసి కొన్ని వేషాలిప్పించారాయన ’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రీరామమూర్తి.
సినీ పరిశ్రమలో అమ్మగా వ్యవహరించే గయ్యాళి సూర్యకాంతమ్మ. షూటింగ్‌కు వస్తూనే ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు పెద్ద పెద్ద క్యారేజీలనిండా తెచ్చి అందరికీ పెట్టేవారని మనకు తెలిసిన విషయమే. కానీ నేను చూసిన మరో అన్నదాత కృష్ణంరాజు అంటారు శ్రీరామమూర్తి. ప్రతిరోజూ షూటింగ్‌కు వారి ఇంటినుండి ఎన్నిరకాల నాన్‌వెజ్ వంటలున్నాయో అన్నీ వచ్చేవి. అవన్నీ ఆయన ఒక్కరే తినగలరా? అందుకే తనకిష్టమైన చిన్న యూనిట్ బాయ్‌తో సహా అందరినీ పిలిచి వారందరికీ వంటకాలు వడ్డించేవారాయన. అందరూ తిన్నాకే ఆయన తినేవారు. అది మా అందరికీ చాలా సంతోషం అనిపించే సంగతి. ఆ రోజుల్లో ఐదు రూపాయలుంటే కుటుంబమంతా హ్యాపీగా వుండేది. ఈరోజున వెయ్యి రూపాయలిచ్చినా సరిపోవడంలేదు. అప్పటికీ ఇప్పటికీ మానవుని జీవిత పోరాటంలో ఆవేశం ఎక్కువైంది. తృప్తిపడేవారు నేటికాలంలో తక్కువ. అసంతృప్తితో పోరాడేవాళ్లే ఎక్కువ. ఎకరానికి 15 బస్తాలు పండించడం అప్పట్లో గగనం. కానీ ఇప్పుడు 60 నుంచి 70 బస్తాలదాకా పండిస్తున్నారు. అప్పటిలాగా ఇప్పుడు ఆకలి నినాదాలు తగ్గాయి. అవకాశాలూ ఎక్కువయ్యాయి. మాటల్లో అందరూ మహానుభావులే. కానీ చేతలకొచ్చేసరికి చెప్పడానికే ధర్మం అనే దాతలు ఎక్కువయ్యారు. అప్పట్లో చదువులేని లీడర్లువున్నా పాలన బాగా జరిగేది. ఇపుడు ఎంతో చదువుకున్న నాయకులున్నా పాలనలో పవిత్రత లేదు. పరిపాలన సక్రమంగా జరగక సోమరులు ఎక్కువై చోద్యాలు చేసేకాలం వచ్చింది. ఇది ఎవరి తప్పూ కాదు. కాల పరివర్తన. ఇలా ఎంతకాలం పోరాడాలో మనిషే నిర్ణయించుకోవాలన్న నా ఆలోచనలు నిరంతరం సాగుతూనే వుంటాయి. ఎంత సంపాదించినా హీరోలు కష్టాలు అనుభవిస్తూ కాలం చేశారు. నటులు నటులుగా బ్రతికారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు వచ్చి జీవితం అంటే ఇది అని చెప్పి ఆర్జనే కాదు మనిషిగా ఎలా బ్రతకాలో సినీ జీవులకు నేర్పించారు. ఎలా బ్రతకాలో నిరూపించారు. అందుకు ఈ రోజు ప్రతి చిన్న నటుడు కూడా సంతోషంగా బ్రతుకున్నాడు. అప్పట్లో ఒక రూపాయి దానం చేయాలన్నా ఆలోచించేవారు. ఇపుడు నటులందరూ కలిసి ‘మా’ ద్వారా మాలాంటి వృద్ధ పేద కళాకారులను పోషిస్తున్నారు. హెల్త్‌కార్డులు, పెన్షన్లు ఇస్తున్నారు. కళను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడని నా నమ్మకం అంటూ ముగించారు శ్రీరామమూర్తి. *

అలా.. అన్నమాట

$
0
0

మహాభారతంలోని విరాటపర్వ గాథ ఆధారంగా రాజ్యం పిక్చర్స్‌వారు నిర్మించిన చిత్రం ‘నర్తనశాల’ (1963). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కథాకథనం, సాంకేతిక విషయాలు ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంది. కీచకుడిగా ఎస్వీ రంగారావు తన విశ్వరూపం చూపించారు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. అందుకే జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఆ పాత్రకుగాను ఎస్వీఆర్‌ను విశిష్ట బహుమతి వరించింది. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని అందుకున్న నటుడు ఎస్వీఆర్. అదే ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి అద్భుతంగా కళాదర్శకత్వం వహించిన ఏకహస్త శిల్పి టి.వి.ఎస్.శర్మ (పదేళ్ల వయసులో ప్రమాదవశాత్తు ఎడమ చేయి పూర్తిగా కోల్పోయారు) గారికి కూడా ఉత్తమ కళాదర్శకుడి అవార్డు లభించింది. బృహన్నలగా ఎన్టీఆర్ హావభావాలు ప్రేక్షకులను మైమరపించాయి. బృహన్నల నాట్యాచారుడిగా నాట్యం చేస్తూ ఉత్తర వేషంలో ఉన్న ఎల్.విజయలక్ష్మికి నేర్పించాలి. నృత్య దర్శకుడు వెంపటి సత్యం తెల్లవారుఝామున లేచి నాలుగు గంటలనుండి ఆరు వరకు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి నాట్య భంగిమలు నేర్పేవారట. ఆ రిహార్సల్స్ నెల రోజులు జరిగాయి. సైరంధ్రిగా సావిత్రి నటన హైట్స్‌కు వెళ్లింది. ఉత్తరగా నటించిన ఎల్.విజయలక్ష్మి చక్కని నృత్యాలు చేసింది. మల్లయుద్ధ ప్రవీణ దండమూడి రాజగోపాల్ భీమునిగా నటించడం, అలనాటి గ్లామర్ తార కాంచనమాల ఒక చిన్న పాత్ర ధరించడం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్లేబ్యాక్ పాడటం ఈ చిత్రంలోని విశేషాలు. ఎమ్.ఎ.రెహమాన్ ఫొటోగ్రఫీ చిత్రానికి వనె్నతెచ్చింది. సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, కొసరాజులు రాసిన పాటలకు సుసర్ల దక్షిణామూర్తి కూర్చిన బాణీలు ప్రేక్షకులను రంజింప చేశాయి. ‘నరవరా.. ఓ కురువరా’ అంటూ పద్మిని ప్రియదర్శిని చేసిన నాట్యం చిత్రానికి హైలెట్. అతిథి పాత్రలో కాంతారావు, లక్ష్మీరాజ్యం, సూర్యకాంతం నటించారు. జననీ శివకామినీ, సఖియా వివరించవే, సలలిత రాగసుధారస రాగం, దరికి రాబోకు రాబోకు రాజా, ఎవ్వరికోసం ఈ మందహాసం పాటలు పాపులర్ అయ్యాయి. ‘ఏనుంగునెక్కి, కాంచనమయ వేదిక’ పద్యాలు ఘంటసాల గళంలో జీవం పోసుకున్నాయి. ఈ చిత్రం శత దినోత్సవాలు జరుపుకుంది.

అలా.. అన్నమాట

$
0
0

*శ్రీ శంభు ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం పూజాఫలం (1964). మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా నిర్మించారు. మంచిగంధం, మల్లెపువ్వులు, మనస్సులోగల ఒక నిష్కల్మష హృదయుని జీవితంలోకి ముగ్గురు యువతులు ప్రవేశించి, కల్లోలాన్ని సృష్టించారు. చివరికి ఆ ముగ్గురిలోనే తన జీవిత భాగస్వామిని గుర్తించడం ఈ చిత్ర కథ. ఆ ముగ్గురు యువతులుగా సావిత్రి, జమున, ఎల్.విజయలక్ష్మి ఆయా పాత్రల్లో జీవించారు. వారి మధ్య నలిగిన యువకునిగా అక్కినేని నటించారు. చిత్రం అడుగడుగునా బి.ఎన్.రెడ్డి కళాత్మక దృష్టి కనిపిస్తుంది. హీరో గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే చివరి సన్నివేశాల చిత్రీకరణ బి.ఎన్.రెడ్డి ప్రతిభకు నిదర్శనం. ఘనం శీనయ్య రాసిన ‘శివదీక్షా పరురాలనురా..’ పాట, సంగీతం, అభినయం, చిత్రీకరణ అపూర్వంగా సాగి, రసహృదయులను మెప్పించింది. ఎల్.విజయలక్ష్మి ఈ నృత్యానే్న కాక ‘మదనా మనసాయెరా’ అంటూ పాడుతూ చేసే నృత్యం కూడా గొప్పగా ఉంటుంది. ఎస్.రాజేశ్వర్‌రావు మంచి సంగీతాన్ని అందించిన చిత్రాలలో ఇదొకటి. ‘పగలే వెనె్నల’, ‘నిన్నలేని అందమేదో’, ‘అందేనా ఈ చేతులకు అందేనా?’, ‘ఇది చల్లని వేళైనా’, ‘ఎందు దాగి ఉన్నావో బృందావిహారి’, ‘నేరుతునో లేదో ప్రభూ’, ‘సుందర సురనందన’ పాటలు పాపులర్ అయ్యాయి. ప్రణయానే్న కాక చక్కని వేదాంత సారాన్ని వివరించేటట్లు సి.నారాయణరెడ్డి రాసిన ‘వస్తావు పోతావు నాకోసం, వచ్చి కూర్చున్నాడు నీకోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీకోసం’ అనే భావగీతం ఈ చిత్రంలోనిదే. స్వంత చిత్రాలు కాకుండా బయట రెండు చిత్రాలకు మాత్రమే బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. మొదటిది భాగ్యరేఖ (1957), రెండవది పూజాఫలం. బి.ఎన్.రెడ్డి మొదటిసారిగా ఈ సినిమాలో ప్రధాన కథకు సమాంతరంగా ఒక కామెడీ ట్రాక్‌ను పెట్టారు. జెమిందారుగారి తమ్ముడి కొడుకు గోవిందయ్య వేషంలో రమణారెడ్డిని పెట్టి, అతని కొడుకు రాజాగా పొట్టిప్రసాద్‌ను తీసుకున్నారు. అతనికి ఈ చిత్రం మంచి మలుపునిచ్చింది. అక్కినేని వయొలిన్ విద్వాంసుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశాల్లో వయొలిన్‌ను వాయించింది పోరూర్ గోపాలకృష్ణన్. మాటలు డి.వి.నరసరాజు, ఫొటోగ్రఫీ యు.రాజగోపాల్ అందించారు. మితిమీరిన క్లాసికల్ చిత్రంగా ముద్రపడి కాసులు సంపాదించుకోలేకపోయింది.

భావోద్వేగ ప్రేమ కథ

$
0
0

బాగుంది*** లవ్ ఆజ్ కల్
***
తారాగణం: కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్, రణదీప్ హూడా, ఆరుషి శర్మ తదితరులు
సంగీతం: ప్రీతమ్, ఇషాన్ చబ్ర
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఆర్తి బజాజ్
నిర్మాత: దినేష్ విజన్
దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
***
ప్రేమ.. ఆకర్షణ -రెండూ విరుద్ధ భావాలు. నిజమైన ప్రేమేదో.. కోరికతో కూడిన ఆకర్షణేదో మనకు మనమే గ్రహించాలి. ప్రశాంత మనసు వీటిగురించి తరచూ హెచ్చరిస్తూనే ఉంటుంది. చుట్టూ సమాజం, పరిస్థితులూ అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. అయినా -ఆకర్షణల విష వలయంలో కూరుకుపోతుంటాం. ఆ తరువాతి జీవితం -తీరిగ్గా కూర్చొని బాధపడటానికి. పశ్చాత్తాపంతో కన్నీటి గాధలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఎందుకంటే -అప్పటికే అంత అయిపోయి ఉంటుంది కనుక.
***
మనషులు క్రమంగా స్వతంత్ర ఆలోచనలకు దూరమవుతున్నారు. పరిచయమైన ప్రతి వ్యక్తినీ పరీక్షించి -ఇతనిలా ఉండాలనో, ఉండకూడదనో నిర్ణయించేసుకుంటూ.. జీవితాన్ని లాగించేయడానికే అలవాటు పడుతున్నారు. కొద్దిమంది మాత్రమే -ఆ చట్రం నుంచి తొందరగానే బయటికొచ్చి.. తమను తాము ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
***
ఈ రెండంశాలను సమన్వయంతో అల్లే ప్రయత్నమే -లవ్ ఆజ్ కల్. స్టూడియో మెడాక్, విండోసీట్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైనె్మంట్ సమర్పణలో దర్శకుడు ఇంతియాజ్ అలీ సృష్టించిన ‘ప్రేమ అలజడి’ ఇది.
వీర్ (కార్తీక్ ఆర్యన్) జీవితం పట్ల ఖచ్చితమైన భావాలతోవుంటాడు. ఎవరినైనా ప్రేమిస్తే నూరుశాతం నిజాయితీ ఉండాలి. ఎంతగా అంటే -వాళ్లలోని ప్రతి ఆలోచనని అర్థం చేసుకునేంతగా. సెక్స్, తాగటం, తిరగటంలాంటివి కాదు, జీవితమంటే ఓ మంచి తోడు అన్న ఆలోచనతో ఉండాడు. మరోవైపు జోయ్ చౌహాన్ (సారా అలీఖాన్)కు తన లక్ష్యం ముఖ్యం. ఐదేళ్లలో భారీ ఈవెంట్స్ నిర్వహించే కంపెనీ స్థాపించాలి. తరువాత డబ్బున్న వాడినొకడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేయాలి. ఈలోపే -చిన్నా, పెద్దా అన్ని ఆనందాలూ రుచి చూసేయ్యాలి. అదే లైఫ్ అన్నట్టు బతుకుతుంటుంది.
వీర్ -తొలి చూపులోనే జోయ్‌ని ఇష్టపడతాడు. ఆరాధిస్తుంటాడు. కాని, జోయ్ తిరస్కరిస్తుంది. ఇలాంటి సీరియస్ ప్రేమలు తనకు అస్సలు పడవంటుంది. ‘కావాలంటే సరదాగా ఉందాం. నాకు నా కెరీర్ ముఖ్యం’ అన్న ధోరణి చూపిస్తుంది. తల్లి ఎలా చెబితే అలా తలాడిస్తుంది జోయ్.
ఇక -మరో అంకం 30ఏళ్ల క్రితంనాటిది. ఎప్పుడో 1990లనాటి ప్రేమ కథని -ఓరకంగా తన ఆత్మకథగా రఘు (రణదీప్ హూడా) జోయ్‌కి చెబుతుంటాడు. ప్రేయసి లీనా (ఆరుషి శర్మ)తో సాగిన ప్రేమ కథ అది.
చివరకు వీర్ -జోయ్ కలిశారా? అప్పటి రఘు-లీనాల ప్రేమకథ ఏమైంది? అనేది 2 గంటల 15 నిమిషాల నిడివిలో దర్శకుడు ఇంతియాజ్ అలీ సినిమా చూపించేశాడు.
ఇందులో -రెండు కథలూ సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకటి వీర్-జోయ్‌ది, రెండోది రఘు చెప్పే.. రఘు-లీనాల కథ. వీర్‌గా, చిన్నప్పటి రఘుగా రెండు పాత్రలనీ కార్తీక్ ఆర్యను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. తన పెర్ఫార్మెన్స్‌తో పాత్రలకు ఆత్మనిచ్చాడు. 2020 లవ్ స్టోరీ కంటే, 1990 ప్రేమ కథలో అద్భుతం చూపించడానికే ఎక్కువ అవకాశముంది. ఆ చాన్స్‌ని కార్తీక్ ఆర్యన్ అస్సలు వేస్ట్ చేసుకోలేదు. సినిమా చూస్తున్నామన్న భావనకంటే, మనకు తెలిసిన స్నేహితుని కథ కంటితో చూస్తున్నామన్నంత సహజంగా చిత్రీకరించటం బావుంది.
1990లనాటి రఘు కథలో జోడీగా కనిపించిన లీనా (ఆరుషి శర్మ) తన నటనతో ఆ కథకు వనె్నలద్దింది. కొలమానపూర్వక పెర్ఫార్మెన్స్ అన్నట్టు.. భావోద్వేగాలను తూకం తూచినంతగా చూపిస్తూ ఆడియన్స్‌కి మాటలేకుండా చేసింది. ఇక -సినిమాకు ప్రధాన ఆకర్షణ జోయ్. అందం, అభినయం రూపుదిద్దుకుంటే జోయ్ అన్నంత చలాకీగా, హుషారైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సారా అలీఖాన్. తల్లి మాట వినే కూతురిలా.. రఘు స్నేహితురాలిలా.. చివర్లో వీర్ ప్రేమకై తపించే ప్రేమికురాలిగా.. తాగి తందనాలాడాలనుకునే కేర్‌లెస్ అమ్మాయిగా -ఇలా ఎన్నో షేడ్స్‌ని పలికించటంలో సారా సక్సెస్ అయ్యింది. పెద్ద రఘు పాత్రలో రణదీప్ హూడా నటన ఎంత చెప్పినా తక్కువే. సినిమా సగానికి పైగా రఘు-లీనా ఫ్లాష్‌బ్యాక్ కనుక.. ఆ స్పేస్‌ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. 45 ఏళ్లు పైబడిన వ్యక్తి జీవిత సారాన్ని రంగరించి అందిస్తున్నాడన్నంత సహజత్వాన్ని చూపించాడు. గుండెల్లో టన్నుల కొద్దీ బాధలు, సుడులు తిరుగుతోన్న భావాలను ముఖంలో చూపిస్తూ -మెస్మరైజ్ చేశాడు.
రెండు కథలని సమన్వయం చేయటంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. కానీ, రెండు పదార్థాలు వడ్డించి ఏది బావుందో చెప్పమన్నట్టే ఉంటుంది. కాకపోతే -ఒకదాన్ని మించి మరో పదార్థం రుచులుంటే సరే. కాని ఒకటి బ్రహ్మాండమై, మరొకటి ఆ స్థాయిని అందుకోలేకపోతే -ఎలాంటి భావన కలుగుతుందో ఈ కథల్లోనూ ఆడియన్స్ అలాంటి రుచినే చూడాల్సి వచ్చింది. రెండూ దర్శకుడి సృష్టే. కాకపోతే -1990ల నాటి ప్రేమకథలో ఆత్మను ఆవిష్కరించాడు. ప్రతీ సన్నివేశాన్ని మాటల్లో చెప్పలేనంతగా తీర్చిదిద్దాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్కూల్, కాలేజీ.. ఇలా చిన్నతనపు జ్ఞాపకాలని ఫ్రేముల్లో చూపించి కొత్త అనుభూతిని తట్టిలేపాడు. ఆ తొలి ప్రేమ తియ్యని జ్ఞాపకాలు హృదయంలోంచి కళ్లలోకి శరీరమంతా చేరి మురిసిపోతాం. 2020ల ప్రేమ కథనూ అలాగే తీయాలని ప్రయత్నించినా, భావోద్వేగాల కూర్పు అమరలేదు. సినిమాలో పాటలు బావున్నాయి. సందర్భానికి తగినట్టు (శాయద్ కభీ న కహూంగా) -ఎప్పటికీ నా ప్రేమను చెప్పలేననుకుంటా అంటూ వచ్చే గీతం గుండెను తడిపేస్తుంది. మిగిలిన పాటలూ వినసొంపే. ఇక సంభాషణల్లో తాత్విక చమత్కారం చూపించటం ఆకట్టుకుంటుంది. ‘ఈలోకంలో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు’, ‘లోకంలో ఎన్నో జంటలు కనిపిస్తాయి. అవన్నీ నిజం కాదు’లాంటి వాఖ్యాలు జీవిత సత్యాలు అనిపిస్తాయి.
మనిషికి జీవితంలో కెరీర్ ముఖ్యమో? జీవిత భాగస్వామి ముఖ్యమో? ఏది ముందు? అనే ఓ అందమైన ప్రశ్నను.. ముఖ్యంగా ఇప్పటి యువత తీవ్రంగా ఆలోచించే బర్నింగ్ టాపిక్‌ని ఎంచుకోవడంలోనే దర్శకుడు విజయం సాధించాడు. ఇక రఘు పాత్ర చాలాకాలంపాటు వెంటాడటం ఖాయం. అంతేకాదు, ఎలా బతకొద్దో చెప్పే ప్రయత్నమూ చేస్తుంటుంది. ఒద్దికైన భావోద్వేగ కథకు తగినట్టే టెక్నీషియన్లు మంచి సహకారం అందించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఒకే టికెట్‌పై నేర్పుగా రెండు ప్రేమకథల్ని చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇంతియాజ్ అలీ ప్రశంసార్హుడు.

బోర్డర్ దాటని లవర్

$
0
0

ఫర్వాలేదు** వరల్డ్ ఫేమస్ లవర్
**
తారాగణం: విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ధ్రెస్సా, ఇజిబెల్లా, ప్రియదర్శి, జయప్రకాష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
సంగీతం: గోపీసుందర్
నిర్మాత: కెఏ వల్లభ
దర్శకత్వం: క్రాంతిమాధవ్
**
దిసీజ్ మై లాస్ట్ లవ్ స్టోరీ. ఇదీ -ప్రమోషన్స్ టైంలో యంగ్ సెనే్సషన్ విజయ్ వదిలిన ప్రచారాస్త్రం. ‘అర్జున్‌రెడ్డి’లాంటి సినిమాతో లవ్‌లో కొత్త ఫేజ్ చూపించిన కుర్రాడిలో ఎంతలో ఎంత మార్పు? అనుకున్నారంతా. లవ్ స్టోరీతో సెనే్సషన్ అయిన విజయ్ -ఒకేసారి మూడు ప్రేమ కథలు చెయ్యడంతో బహుశ బోర్ కొట్టేసిందేమో అనుకున్నారు కూడా. కానీ -విజయ్ ఆ డైలాగ్ వదలడానికి కారణం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చూశాక మాత్రం కచ్చితంగా అర్థమవుతుంది.
ఈ కథకు -రచయిత, దర్శకుడు క్రాంతిమాధవ్. భావోద్వేగ ఆద్యంతాలను -కుక్కికుక్కి చూపించాలనుకునే ఆయన ప్రయోగాత్మక రచనలు ఒక్కోసారి ‘ఆహా’ అనిపిస్తే, మరోసారి ‘ఓహ్’ అనిపించినవీ ఉన్నాయి. ఈసారీ ‘ప్రేమకోసం ఆలోచనల పరంపరలో ఫ్రేములు దాటెళ్లిన గౌతమ్ అనే కుర్రాడికి -జీవితం ఎలాంటి విచక్షణారహిత పాఠం నేర్పించింది’ అన్న సంక్షిప్త కథను భిన్న కోణాల్లో చూపించే ప్రయత్నం చేశాడు. కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదూ. సింపుల్‌గా చెప్పుకోవాలంటే -హీరోగా విజయ్ దొరికాడు కనుక.. మూడు ప్రేమకథల్ని ఒకే టికెట్‌పై ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
***
జీవితం ఏం నేర్పిందో -లాకప్‌లోని గౌతమ్ (విజయ్ దేవరకొండ) రివ్యూ చేసుకోవడంతో కథ మొదలవుతుంది. రచనలంటే గౌతమ్‌కి పిచ్చి. మంచి రైటర్‌గా పేరు తెచ్చుకోవడానికి -ఉద్యో ఉద్యోగాన్నీ వదిలేస్తాడు. ఆ క్రమంలో తారసపడిన యామిని (రాశిఖన్నా)తో లవ్ జర్నీ మొదలవుతుంది. రచయితగా తన సంకల్పం నెరవేర్చుకోడానికి సహకరించమంటాడు. లక్ష్యంవున్న గౌతమ్ నచ్చటంతో -సహజీవనానికి సిద్ధపడుతుంది. సహజీవన జర్నీలో యామినికి మునుపటి గౌతమ్ కనిపించడు. రచనపై దృష్టిపెట్టకుండా -కాలయాపన చేస్తున్న గౌతమ్ చిరాకు పుట్టిస్తాడు. జీవితాన్ని మత్తుగా సాగించే నీతో జర్నీ కష్టమంటూ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. తాను మారడానికి టైమ్ ఇవ్వాలంటూ -మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడిన యమినిని ప్రాథేయపడినా వినిపించుకోదు. ఆ సంఘటనతో గౌతమ్ -ఎటు జర్నీ చేశాడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బొగ్గు గనుల ప్రాంతం ఇల్లందులో ఐశ్వర్యతో సాగించిన వైవాహిక జీవితమేంటి? ప్యారిస్‌లో ‘ఈజా’ అనే పైలెట్‌తో ఎప్పుడు ప్రేమలో పడ్డాడు. ఇలా భిన్నమైన ప్రేమకథల్లో -గౌతమ్ పాత్రేంటి? చివరికి ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ప్రేమలో పడిన కుర్రాడికి కాలం నేర్పిన కఠిన పాఠం -అన్న పాయింట్‌ని మూడు ఎపిసోడ్స్‌గా విడదీశాడు క్రాంతిమాధవ్. హైదరాబాద్‌లో గౌతమ్-యామిని, ఇల్లందులో సువర్ణ, స్మిత, ప్యారిస్‌లో ఈజాతో సాగే ఎపిసోడ్స్ సారమే.. ఓవరాల్‌గా -వరల్డ్ ఫేమస్ లవర్. నిజాయితీగా కథ రాసుకున్నా -విజయ్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ పరిధిలోకి కథను లాక్కురావడంతో -‘అర్జున్‌రెడ్డి’ ఫ్లేవర్‌లోకి వచ్చేసినట్టే అనిపించింది. గౌతమ్ లైఫ్‌లో రియల్ లవ్ యామిని. అందుకే -గౌతమ్ ఆలోచనల్లో పుట్టిన ప్రేమకథలను పరిమితంగా, ఆసక్తికరంగా చెప్పాడు దర్శకుడు. ప్రేమలోని రొమాన్స్, ఎమోషన్, అట్రాక్షన్ అన్న కోణాల్లో నలుగురు హీరోయిన్లను చూపిస్తూ -కమర్షియాలిటీ కోసం శత్రు పాత్రలో చిన్నపాటి విలనిజం.. అనూహ్య ఘటనతో తలెత్తిన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినా -కన్ఫ్యూజన్ పూర్తిగా డామినేట్ చేసేసింది. ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించేందుకు ఆశ్రయించిన చీటింగ్ స్క్రీన్ ప్లే -మొత్తంగా కథలోనే కన్ఫ్యూజన్‌కు కారణమైంది. విజయ్-రాశి లవ్‌స్టోరీ ఎపిసోడ్‌లో బిగింపు లేకపోవడం, సెకెండాఫ్‌లో ఇజబెల్లే ఎపిసోడ్ తరువాత కథనం పట్టుసడలుతూ -ప్రీక్లైమాక్స్‌కి చేరేసరికి సన్నివేశాలు సాగదీత అనిపిస్తూ సినిమా అంచనాలనుంచి దూరమైపోయింది. ఇంటెన్స్ క్లైమాక్స్ కూడా లేకపోవడంతో -వరల్డ్ ఫేమస్ లవర్.. గల్లీ ప్రేమ కథను దాటలేకపోయాడు. ఇల్లెందులో సాగే ఒక్క కథకే సినిమా తీసేంత స్పాన్‌వున్నా -దర్శకుడు ఎపిసోడ్‌గా మార్చేసుకున్నాడు.
గౌతమ్.. శీనయ్య పాత్రల పెర్ఫార్మెన్స్‌లో -సడెన్ బ్రేక్ తరువాత పికప్ తీసుకుంటున్న అర్జున్‌రెడ్డిలానే అనిపిస్తాడు విజయ్. బొగ్గు గని కార్మికుడిగా తెలంగాణ యాసలో విజయ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆడియన్స్‌కి ఒకింత ఊరట. రాశిఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లే పరిధిమేరకు పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. ఐశ్వర్య రాజేశ్ మాత్రం పాత్రపరంగాను, పెర్ఫార్మెన్స్‌పరంగా ముగ్గురినీ డామినేట్ చేస్తూ సహజమైన నటన చూపించింది. జయప్రకాశ్, శత్రు, ప్రియదర్శి పాత్రల పరిధిలో నటించారు. గోపీసుందర్ మ్యూజిక్ అద్భుతాలేం చేయలేదు. సన్నివేశాలకు ప్రాణం పోసేంత బీజీఎం లేదు. ఒక్క పాటకు కట్టిన బాణీ సినిమాలో ఉన్నంతసేపూ గుర్తుంటుంది. అద్భుతమైన విజువల్స్‌తో జయకృష్ణ గుమ్మడి మాత్రం సినిమాకు ప్రాణం పోశాడు. మనసుకు హత్తుకునే సంభాషణలు, అద్భుతం అనిపించే ఎడిటింగ్ నైపుణ్యం లేవు.
అప్పుడప్పుడూ అద్భుతమైన టైటిల్స్ -సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అందులోని తారాగణం -ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పనిచేస్తున్న సాంకేతిక నైపుణ్యం -సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అనుకునేలా చేస్తుంది. నిర్మాణ సంస్థను గుర్తు చేసుకున్నపుడు -ఆ సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందోనని మనసూరిస్తుంది. ఇన్నీ చూసుకుని.. టికెట్ లెక్కలేసుకుని థియేటర్లకు వెళ్లి సినిమా చూశాక -అప్పుడు విషయం అర్థమవుతుంది. సినిమాను ముందుగా చూసుకుని, విషయాన్ని ముందే అర్థం చేసుకున్నాడు కనుకే -ఇకపై లవ్ స్టోరీలు చేయను అని విజయ్ అనుంటాడు. సినిమా చూస్తే -ఆ విషయం మీకే అర్థమవుతుంది.

కలక్షన్ల యుద్ధం

$
0
0

మాటల యుద్ధం ముగించి, సంక్రాంతి చిత్రాలు కలక్షన్ల యుద్ధం ప్రారంభించాయి. రెండు వారాలు గడిచాక 140 కోట్ల బడ్జెట్‌తో తయారైన సరిలేరు రెండు రాష్ట్రాల్లో దగ్గరదగ్గరగా 100 కోట్లు, ఓవర్సీస్‌లో 20 లక్షల డాలర్లుపైగా సాధించగా అలవైకుంఠపురం రెండు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా ఓవర్సీస్‌లో 2.13 కోట్లు సాధించింది. అయితే వైకుంఠపురం బడ్జెట్ 130 కోట్లు. అందువల్ల సరిలేరుకు సరిజోడుగా నిలబడడమే కాక ఒక మెట్టుపైనే ఉంది. కాలం గడిచేకొద్దీ మరిన్ని మెట్లు పైకి పోవచ్చు. తమాషా ఏంటంటే ఈ రెండు చిత్రాలకన్నా ప్రతిరోజు పండగ బాగుందనేవారూ ఉన్నారు!
- జె.పూర్ణారావు, కాకినాడ
ఇదేంటి రాజా?
ఇదివరలో నాగార్జున తర్వాత వెంకటేష్, ఆమధ్య బాలకృష్ణ, ఇప్పుడు ఈ రాజా (రవితేజ) వారి సినిమాలతో ఇచ్చిన సందేశం ‘మా పనైపోయింది ఇక మీదట తండ్రి, తాత పాత్రల్లో మిమ్మల్ని తరింప చేస్తాము అని’. అదే నిజమైతే మంచి ఉద్దేశమే. కాకపోతే ముఖం మీద పది మడతలతో 20 ఏళ్ల కుర్ర హీరోయిన్లతో గెంతులు చాలా అసహ్యంగా ఉన్నాయి. కనుక వీరందరూ స్వచ్ఛంద పదవీ విరమణ హీరోలుగా కనిపిస్తున్నారు. హీరోగా నటించకుండా ఇతర పాత్రలు చూసుకుంటే చాలా మంచిది.
-శిష్ట్లా నరసింహమూర్తి, హైదరాబాద్
గత జ్ఞాపకాలు
వెనె్నలలోనే హాయి ఏలనో అన్నట్టు ఆదివారం వెనె్నలలో ఆనందించే సంగతులు ఎన్నో ఉన్నాయి. సినిమా రివ్యూలు థియేటర్లో కన్నా సమీక్షలలో చూసేసి థియేటర్ల వైపు నడవవలసిన అవసరం ఉందో లేదో చెబుతున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ అలనాటి ప్రేక్షకులకు గత వైభవాలను గుర్తుచేస్తున్నాయి. ఈనాటి యువత అలనాటి సినిమాలు ఇలా ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు చదివి. స్వరబాల రావు బాలసరస్వతి, సుశీల, లీల, జిక్కి, జానకీలకు సీనియర్. ఆమె జూనియర్లవల్ల వెనకబడ్డారా లేక కుటుంబ సమస్యలవల్ల పాడడం మానేశారా? అనేది తెలిసింది. తన గాత్ర స్వర పేటిక ఘంటసాల వారితో యుగళ గీతాలకు సరిపోదని ఆమె ఓసారి చెప్పినట్టు చదివాను. నటించే రాజేశ్వరరావు, పాడించే సంగీత సామ్రాట్ అయితే నటించిన సరస్వతి గాయని అయ్యారు. గత జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఝనక్ ఝనక్ జాను
శర్వానంద్, సమంత నటించిన జాను చిత్రం చాలా క్లాసికల్‌గా ఉంది. ముఖ్యంగా శర్వానంద్ నటన ఈ చిత్రానికి హైలెట్. కళ్లతోనే నటించాడు. అతనికి పోటీగా సమంత కూడా బాగా నటించింది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయి. తమిళంలో విజయవంతమైన 96 చిత్రాన్ని రీమేక్ చేయడం బాగానే ఉన్నా, ఒరిజినల్ ఏమాత్రం ఆవిష్కరించలేకపోయాడు అదే దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలన్న నిర్మాత ప్రయత్నం మెచ్చదగినదే.
-సూరపనేని విజయ,
మంగళగిరి
ఏకీభవిస్తా..
చంపక్, మాధవ్‌నగర్, పల్లి వరలక్ష్మి ఆదోని వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. కనె్నమనసులు, లక్ష్మీకటాక్షం రెండు ఫ్లాప్ చిత్రాలే. లక్ష్మీకటాక్షం బి,సి సెంటర్లలోను రిపీట్ రన్‌లోను కొంతవరకు నష్టాన్ని పూడ్చి ఉండవచ్చు. అలాగే రాజమకుటం కూడా బి.ఎన్.రెడ్డి పేరు ఉన్న గట్టెక్కలేకపోయింది. ఏ హీరోలైనా ఉన్నది ఉన్నట్లే చిత్ర విశేషాలు చెబితే అది ముందు తరాల వారికి మన చరిత్ర కచ్చితంగా అందించినట్లవుతుంది. లేకుంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈమధ్య ఒక హీరో అన్నట్లు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీలు రాకున్నా మన వారిని మనం గౌరవించుకోవాలంటే రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు అన్నా ఇచ్చి గౌరవించుకోవాలి. అలనాటి సినీ రత్నాలు రావు బాలసరస్వతికి ఇప్పటివరకు రాలేదు. ఆ అవార్డుకు ఎందరో అర్హులున్నారు గమనించగలరు.
- టి.సదాశివరెడ్డి, తిరుపతి

జై జవాన్

$
0
0

దేశభక్తిని ప్రబోధించే చిత్రాన్ని రూపొందించాలని అన్నపూర్ణా సంస్థ నిర్మాత భావించారు. తమ అభిప్రాయాన్ని రచయిత డివి నరసరాజుతో ప్రస్థావించారు. దానికి ఆమోదం తెలిపిన నరసరాజు, చైనా వార్‌తో ప్రారంభించి పాకిస్తాన్ వార్‌తో ముగిస్తూ చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి కథ రూపొందించి చిత్రంగా నిర్మించమని సూచించారు. అంతేకాక, ‘ఆత్మగౌరవం’ చిత్రానికి కథను సమకూర్చిన నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనకే కథా బాధ్యత అప్పగించమని సలహానిచ్చారు. ఆ ప్రకారం యద్దనపూడి సులోచన కథ సిద్ధంచేయగా, డివి నరసరాజు సంభాషణలు సమకూర్చారు.
జై జవాన్ చిత్రానికి డి.యోగానంద్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటికి హిందీ చిత్రం నిర్మాణ దర్శకత్వ బాధ్యతల్లో ఆదుర్తి సుబ్బారావు బిజీగా ఉండటంతో, డి యోగానంద్‌కు అవకాశమిచ్చారు. అన్నపూర్ణా సంస్థలో పనిచేసిన 5వ దర్శకుడు డి యోగానంద్. 1970 ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
కథ: యద్దనపూడి సులోచనారాణి
మాటలు: డివి నరసరాజు
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
కెమెరా: పిఎస్ శెల్వరాజ్
ఎడిటింగ్: ఎంఎస్ మణి
కళ: జివి సుబ్బారావు
నృత్యం: తంగప్పన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి యోగానంద్
నిర్మాత: డి మధుసూధనరావు
సహ నిర్మాతలు: జి ప్రసాద్, పి గంగాధరరావు
*
భారత్- చైనాలమధ్య యుద్ధంతో సినిమా మొదలవుతుంది. దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మాధవరావు (గుమ్మడి) కుమారుడు ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రవీంద్రనాథ్ (అక్కినేని), కుమార్తె భారతి (చంద్రకళ). మాధవరావు సోదరి సుందరమ్మ (సూర్యకాంతం), ఆమె భర్త నరసింహం (నాగభూషణం), మేనకోడలు కస్తూరి (మంజుల). కుస్తూరి బావను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. యుద్ధంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలోవున్న రవీంద్రను నర్సు సుశీల (్భరతి) రక్షిస్తుంది. వారిరువురూ ప్రేమించుకుంటారు. రవి స్నేహితుడు డాక్టర్ రఘు (కృష్ణంరాజు) మాధవరావు కుటుంబానికి అండగావుంటాడు. అతనికి కాళ్లులేవని తెలిసినా భారతి అతడిని ఇష్టపడుతుంది. ఇంటికి వచ్చిన రవి -రఘు, భారతికి వివాహం జరిపిస్తాడు. తాను సుశీలను వివాహం చేసుకుంటానని తండ్రికి తెలియచేసి, అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో, కారు ఆక్సిడెంట్ సంభవించి సుశీల మరణిస్తుంది. మనోవేదనతో పర్యటనకు వెళ్లిన రవికి సుజాత (మరో భారతి) కనిపిస్తుంది. ఆమె సుశీల చెల్లెలని, వారిరువురినీ శివయ్య (్భనుప్రకాష్), లక్ష్మి (జి వరలక్ష్మి) దంపతులు పెంచి పెద్ద చేశారని తెలుసుకుంటాడు. అంతేకాదు సుజాతతో వారి కుమారుడు రాముకు చిన్నతనంలో పెళ్లి నిశ్చయమైందని, రాము ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కనుక.. సుజాత -రవిలకు పెళ్లి జరిపిస్తామని చెబుతారు. రవి, సుజాతల పెళ్లి సమయంలో -పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా సైనికులను ప్రభుత్వం వెనక్కి రమ్మని పిలుపునిస్తుంది. ఆ విధంగా తిరిగి యుద్ధానికి వెళ్లిన రవి విజయవంతంగా పోరాటం జరపటం, నమ్మకస్తుడిగా నటిస్తూ దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తి మేనమామ నరసింహం తలపెట్టిన రైలుమార్గాలు, వంతెనల విధ్వంసం కుట్రలను భగ్నం చేస్తాడు. నరసింహం కొడుకు పద్మనాభం భార్య లిల్లీ (లిల్లీ) ఒక సిఐడి ఆఫీసర్. ఆమె కూడా మామ కుట్రను పోలీసులకు సాక్ష్యాలతో అందచేయటం, నరసింహం అరెస్ట్ కావటం జరుగుతుంది. భారత్- పాక్ యుద్ధ విరమణ అనంతరం.. రవి ప్రధానమంత్రి చేతులమీదుగా బహుమతి స్వీకరించి, తన ఊరిలో సుజాతను వివాహం చేసుకోగా.. రామూ, రఘు ఒకరేనని తెలియటంవంటి విశేషాలతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
‘దొంగరాముడు’ చిత్రం ద్వారా అన్నపూర్ణ సంస్థకు మాటల రచయితగా పరిచయమై, పదునైన సంభాషణలతో ఆ చిత్ర విజయంలో తనవంతు సహకారం అందించిన డివి నరసరాజు జై జవాన్ చిత్రానికి తనదైన శైలిలో చక్కని సంభాషణలు సమకూర్చారు. అక్కినేని, సుశీల (్భరతి), సుజాత (్భరతి)తో తన ఆత్మీయతను వెల్లడిచేసే సన్నివేశాల్లో, అలాగే రఘును ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న భారతి.. మేనత్త మాటలు విని తన పెళ్లికి ఏ ఆర్భాటాలూ వద్దనే సన్నివేశంలో, దేశ రక్షణకంటె వివాహం ముఖ్యంకాదని రవి యుద్ధ్భూమికి వెళ్లటం, తాను మనసుపడిన బావను వేరొకరు వివాహం చేసుకుంటున్నారని తెలిసి కస్తూరి వేదన, అలకతో ఇంటినుంచి పారిపోయినా తిరిగి తల్లిదండ్రుల వద్దకు ఎందుకు రాలేకపోయాడో రఘు వివరణ వంటి సన్నివేశాల్లో వీరి రచనా చాతుర్యం బహుముఖీనమై ఆకట్టుకుంది. సమర్థతగల దర్శకులు యోగానంద్ కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దగా, ఉత్తమ పౌరునిగా, వీరోచిత కెప్టెన్‌గా, ప్రేమికునిగా, విఫల ప్రేమికునిగా పాత్రోచితమైన నటనలో అక్కినేని నాగేశ్వరరావు, అతనికి సమఉజ్జీగా భారతి తమ నటనతో హావభావాలతో మెప్పించారు.
నిర్మాత మధుసూధనరావు ఖర్చుకు వెనుకాడక మిలటరీ క్యాంప్‌లో సైనికుల శిక్షణ దృశ్యాల చిత్రీకరణలో వాస్తవికత కోసం హైద్రాబాద్‌లోని గండిపేటకు వెళ్లేదారిలో సైనిక శిక్షణ కేంద్రం సహాయాన్ని తీసుకున్నారు. వారు అన్నివిధాల సహకరించటంతోపాటు, కొన్ని సన్నివేశాల్లో అట్మాస్పియర్ షాట్స్ కోసం, జూనియర్ ఆర్టిస్టుల అవసరం లేకుండా తమ సిపాయిలను (సోల్జర్స్)ను పంపించారు. అక్కినేని నాగేశ్వరరావు, భారతిలపై చిత్రీకరించిన, జవాన్, కిసాన్‌ల గొప్పతనాన్ని తెలిపే కొసరాజు రచించిన గీతం -పాలబుగ్గల చిన్నదాన్ని (గానం: పి సుశీల, ఘంటసాల). పాటలో కనిపించే వారంతా నిజమైన సైనికులే. ఇలా వారి సహకారంతో చిత్రాన్ని పూర్తిచేశారు. క్లైమాక్స్‌ల పాకిస్తాన్- భారత్ యుద్ధ దృశ్యాలు చూపించాలి. కాని తాష్కెంట్ ఒప్పందం కుదిరి యుద్ధం ముగిసింది. ఫిలిమ్స్ డివిజన్‌వారు ‘తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇండో-పాక్ యుద్ధ దృశ్యాలు ఎక్కడా ప్రదర్శించకూడదు. అది నిషిద్ధం’ అనటంతో వాటిని చిత్రంలో చూపటం వీలుకాలేదు. చిత్ర ప్రారంభంలో మంచుకొండల్లో చైనా సరిహద్దు పోరాట దృశ్యాలు ఎంతో సహజంగా చిత్రీకరించినా, క్లైమాక్స్ అంతగా ఆకట్టుకునేలా చిత్రీకరించక పోవటం, చిత్రానికి లోటుగా కనిపిస్తుంది.
చిత్ర గీతాలు:
చిత్ర ప్రారంభంలో దేశ రక్షణ నిధికి విరాళాల కోసం గుమ్మడి ఆధ్వర్యంలో చంద్రకళ, మంజుల బృందంపై చిత్రీకరించిన నృత్య గీతం -స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి (గానం: పి.సుశీల బృందం, రచన: శ్రీశ్రీ). భారతి, చంద్రకళ, మంజులపై గీతం -చక్కని వదినెకు సింగారమే (గానం: పి సుశీల, వసంత బృందం, రచన: కొసరాజు). అక్కినేని, భారతిలపై చిత్రీకరించిన మూడు యుగళ గీతాలు -అల్లరి చూపుల అందాల బాల నవ్వులు చిలికి (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: దాశరథి). మరో దాశరథి గీతం -అనురాగపు కన్నులలో ననుదాచిన ప్రేయసివే (గానం: ఘంటసాల, పి సుశీల). మరో మధురమైన గీతం, జై జవాన్ చిత్రంలోని గీతాలన్నిటిలో రంజింపచేసే దిశగా సాగిన గీతం -మధురభావాల సుమమాల మనసులో పూచే ఈ వేళ (గానం: పి సుశీల, ఘంటసాల). సినారె రచనలో పరిపుష్టమై నేటికీ గానలహరి కార్యక్రమాల్లో, స్వరలహరులలో శ్రోతలను అలరిస్తు పరవశింప చేస్తోంది. జై జవాన్ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకున్నా, ప్రతిష్టాత్మక సంస్థ అన్నపూర్ణ చేసిన మంచి ప్రయత్నానికి ఆనవాలుగా నిలిచిందని భావించాలి.


ఫిలిం క్విజ్ -- 170

$
0
0

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పండి?
2. కొత్త బంగారులోకం
హీరోయిన్ ఎవరు?
3. ఎంతటి రసికుడవో -అంటూ
హలం ఏ నటుడిని చూసి
పాటేసుకుంది?
4. నాని తొలి హీరోయిన్ పేరు?
5. ‘బంగారు వనె్నల’.. సువర్ణసుందరి పాటలో నటించింది?
6. నేనితే -చిత్ర దర్శకుడు?
7. ఏయన్నార్ మురళీకృష్ణ
దర్శకుడు?
8. ఎదుట నిలిచింది చూడు
-అన్న పాట ఏ సినిమాలోది?
9. నువ్వు నా ముందుంటే/
నిన్నలా చూస్తుంటే
-పాటకు బాణీ కట్టిందెవరు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్?
*
సమాధానాలు- 168
*
1) తొలిప్రేమ 2) అమ్మమనసు
3) శోభన్‌బాబు 4) కురసాల కల్యాణకృష్ణ 5) బంగారు కలలు
6) పద్మనాభం 7) ఊపిరి 8) కల్యాణ వైభోగమే 9) సర్దార్ గబ్బర్‌సింగ్
10) మాళవికా మోహనన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
విఎస్ ప్రియాంక, విజయవాడ
విఆర్ చారి, యాదగిరిగుట్ట
జి విజయశ్రీ, నరసరావుపేట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనెటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఎస్ రాజు, కర్నూలు
ఆర్వీసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఎన్ సరిత, హైదరాబాద్
బి రమణి, హైదరాబాద్
సాయిమనస్విత, హైదరాబాద్
కె ప్రసన్నరాణి, ఘట్‌కేసర్
పి అనూష, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

ప్రజాస్వామ్యం అపహాస్యమా!?

$
0
0

ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులుగా సామాన్య ఓటర్ల ప్రజాధికార పాలనా వ్యవస్థ లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత రాజ్యాంగ నిర్దేశిత పవిత్ర సూత్రాల ప్రాతిపదికపై కొనసాగుతోంది. సుదీర్ఘంగా దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన భారత జాతీయ కాంగ్రెస్‌కు, ప్రత్యామ్నాయ రాజకీయ పాలనా శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు యుపీఏ, ఎన్‌డీఏ సంకీర్ణ కూటమిల సారథ్యం కేంద్రంలో, రాష్ట్రంలోని చట్ట సభలలో పాలనాధికార కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండటం ప్రస్తుత రాజకీయ పరిణామల పెను మార్పుగా స్పష్టమవుతోంది. అసెంబ్లీలయినా, పార్లమెంటు అయినా ఎన్నికలలో అధికార పార్టీగా అందలం అధిష్ఠించటానికి, మెజారిటీ సంఖ్యా బలం ప్రధానం కావటంతో, ఏకైక పెద్ద అధికార పక్షంగా అవతరించటానికి మెజారిటీ కోసం వలలు వేయటం ఎన్నికల ఫలితాల పర్యవసానాలను బట్టి రాజకీయ క్రీడగా పరిణమిస్తోంది. అధికారం కైవసం చేసుకొనే తాపత్రయంలో, ఏ అడ్డదారైనా దొడ్డదారిగా ప్రజల్ని నమ్మించే అనైతికత, రాజమార్గమైంది. అసెంబ్లీ ఎన్నికలలో బొటాబొటి మెజారిటీ వచ్చినపుడు, అధికారాన్ని ఇతరులకు దక్కకుండా చేయటానికి, రాష్టప్రతి ప్రతినిధులుగా గవర్నర్‌లు మితిమీరి వ్యవహరిస్తున్న ఉదంతాలు స్పష్టమవుతున్నాయి. గోడ దూకి వచ్చే ఫిరాయింపుల జాడ్యానికి, అన్ని రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి. ప్రత్యర్థి పక్షాన్ని చావుదెబ్బ కొట్టడానికి పలు రాష్ట్రాలలో సభాపతులు అతి విధేయతతో వ్యవహరిస్తూ, నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఫిరాయింపుల నిషేధ చట్టం లొసుగుల ఆధారంగా, ఆఖరి నిమిషంలో గోడ దూకే గెలుపు గుర్రాలకు స్వాగత సంరంభ ప్రలోభాలు స్వేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామూహిక గోడ దూకుళ్ల కారణంగా ప్రతిపక్ష పార్టీలు నిర్వీ ర్యం అవుతున్నాయి. మళ్లీ తామే అధికార పీఠంపై కూర్చోటానికి ప్రతిపక్షాలను పూర్తిగా అసెంబ్లీలో తల ఎత్తకుండా చేసే రాజకీయ క్రీడ కొనసాగుతోంది.
ఓటరును అవమానించే ఫిరాయింపులు
నిష్పక్షపాతం, పారదర్శకత, స్వయం పాలనాధికారంతో నిర్ణయాలు తీసుకోవలసిన స్పీకర్‌లు కొందరు తమ పదవుల ఔన్నత్యాన్ని కాపాడలేక పోతున్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి, గవర్నర్లు కొందరు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్షంగా ఓటర్లతో సంబంధం లేకుండా, అధికార పార్టీ దయా దాక్షిణ్యాలపై నెగ్గుకొస్తున్న మేధావులు చెలాయిస్తున్న విధి నిర్వహణలపై దేశ ప్రజకు గౌరవం క్రమేపీ సన్నగిల్లుతోంది. రాజకీయాలకు అతీంగా, ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమైన రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య నైతికతా విలువలను పరిరక్షించటంలో, ఢిల్లీ పెద్దలు గతి తప్పి దారి తప్పుతున్నారు. కుటిల మేధస్సు చాణక్య నీతి అవుతోంది.
‘చట్టసభ గౌరవ ప్రతిపత్తి, స్వేచ్ఛకు స్పీకర్ ప్రతినిధి’
చట్టసభలు, జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాతినిధ్యం కాబట్టి స్పీకర్ అన్ని వేళలా అసాధారణ సామర్థ్యం, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగి ఉండాలి’ అన్నారు నవ భారత నిర్మాత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1948 మార్చి నెలలో. తాము ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీతో పెనవేసుకొన్న అనుబంధం కారణంగా కీలక రాజ్యాంగ పదవులలో వున్న కొందరు గవర్నర్లు, స్పీకర్‌లు గోడదూకుడు అనైతిక పోకడలకు కళ్లెం వేయకుండా, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు అంశంపై సహేతుక సమయంలో ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. తాజా నేపథ్యంలో మణిపూర్ సభాపతిని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం అనర్హత పిటీషన్ల పరిష్కారం కోసం స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. 1993లో గోవా శాసన సభాపతి ఫిరాయింపుదారులతో జతకట్టి తానే ముఖ్యమంత్రి కిరీటం అలంకరించుకోవటం వింత పరిణామం. ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాపతి అధీనం కావటంతో, అధికారం చేజిక్కించుకోవటమే పరమావధిగా భావించే ఢిల్లీ పెద్దలు ఇష్టారాజ్యానికి పావులు కదుపుతున్నారు. తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబంగ, జమ్మూ కాశ్మీర్, బీహార్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో గవర్నర్, స్పీకర్‌లు కీలకంగా వివాదాస్పద సంక్షోభాలు చెలరేగాయి.
సుప్రీం ఆదేశం శిరోధార్యం
గవర్నర్లు, కేంద్రంలోని అధికార పార్టీకి పావులుగా ఏకపక్ష పక్షపాత నిర్ణయాలతో రాజకీయ సంక్షోభం సృష్టించటం భారత ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు కొత్త కాదు. 1984లో గవర్నర్ రామ్‌లాల్, 1988లో పి.వెంకటసుబ్బయ్య, 1994లో భాను ప్రతాప్‌సింగ్, 1996లో కృష్ణపాల్ సింగ్, 1998లో రమేష్ భండారీ, 2005లో సయ్యద్ సిబ్తెరజీ, 2016లో కె.కె.పౌల్, 2016లో జె.పి.రాజ్‌కోవా, 2017లో మృదులా సిన్హా, నజ్తాహెప్తుల్లా, కేసరినాథ్ త్రిపాఠీ, 2019లో వజూభాయ్ వాలా, ఆయా రాష్ట్రాలలో కేంద్రాధికారం చెప్పుచేతలలో వ్యవహరించి అవకాశవాదాన్ని ప్రోత్సహించిన దృషాంతాలున్నాయి. ఇటువంటి అవ్యవస్థలో వ్యక్తిగతంగా స్పీకర్‌లను తప్పుపట్టడం, నిందించడం వారి పట్ల అగౌరవం వ్యక్తీకరించటం భావ్యం కాకపోగా, సంక్షోభం కూడా పరిష్కారం కాదు. చట్టసభలలో అత్యున్నత అథారిటీగా మెజారిటీ సభ్యుల అభీష్టంపై ఆధారపడి ఉండటం కారణంగా స్పీకర్ నియామకం, పదవీ కాలం దృష్ట్యా పక్షపాత అనుమాన ఆరోపణలకు ఆస్కారం వుండనే వుంది. స్పీకర్ చట్టసభల సమగ్ర ప్రతినిధిగా తటస్థంగా వ్యవహరించగల విధానాల చట్టబద్ధతకు పార్లమెంటు, సుప్రీం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని, సూచనలను చిత్తశుద్ధితో అమలుపరిచి స్పీకర్ వ్యవస్థను పటిష్ఠపరచటం ప్రస్తుత కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్‌పై విజయం సాధించిన 20 మంది శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుపై, ఎటువంటి చర్య తీసుకోనందున 2017 అక్టోబర్ 25న వైఎస్‌ఆర్‌సీ లెజిస్లేచర్ పార్టీ స్పీకర్‌పై నిరసన ప్రకటిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి సుమారు రెండేళ్లు తరువాత మళ్లీ 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది భారత ప్రజాస్వామ్య ఘన విజయం గోడ దూకుళ్లకు చెంప పెట్టుగా అనుసరించాలి.

కాకతీయుల శిల్ప కళ

$
0
0

రామప్ప అనగానే మహాశిల్పి రామప్ప సృజించిన రామప్ప దేవాలయ నర్తకీమణులు మన మనసును దోచుకుంటూ మన ముందు తమ ఒంపు సొంపు వయ్యారాలు ఒలకబోస్తూ మయూరాల్లా నాట్యం చేస్తాయి. ఏ శిలను తాకినా రాగాలే పలుకుతాయి. రామప్ప పేరు వినగానే సముద్రాలను తలదన్నిన రామప్ప సరస్సు తరంగాలు ఆకాశానికి ఉద్వేగంగా ఉప్పొంగి తమ హోరుతో సరిగమల సంగీతాన్ని హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ వినిపిస్తాయి. రామప్ప పేరు వినగానే రుద్రేశ్వరస్వామి గుడి గంటలు ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర నాదాలతో మారుమోగిస్తూ భక్తిపారవశ్యాన్ని కలిగిస్తాయి. రామప్ప సరస్సు పేరు మదిలోకి రాగానే పచ్చని పంట పొలాలూ, వనాలూ, పర్వత శ్రేణులూ, ప్రకృతి సోయగాల రమణీయ దృశ్యాలు రంజింపజేస్తాయి.
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సర్వసైన్యాధ్యక్షుడు రేచెర్ల రుద్రారెడ్డి శాలివాహన శక సంవత్సర 1135 శ్రీముఖ నామ సంవత్సర మధుమాస వసంత శుక్లపక్ష అష్టమి భానువారం నాడు పుష్యమీ నక్షత్రం సరియగు క్రీ.శ. 1213 మార్చి 31వ తేదీ నాటికి కాకతీయ శిల్ప కళావైభవానికి పరాకాష్టగా, కాకతీయ సామ్రాజ్యానికి మణిమకుటంగా రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. మహారాష్ట్ర దేవగిరి రాజ్య ప్రభువు జైత్రపాలుని (జైతుగి) చెరశాలలో ఉన్న గణపతి దేవుడిని విముక్తి చేసి ఆ ప్రభువు కూతురు సోమలా దేవిని తనకు వివాహమొనర్చడం, ఆ క్రమంలో ప్రభుభక్తితో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ నెల్లూరు, కళింగ, కాంచీ తదితర రాజ్యాలెన్నింటినో జయించి తనకు స్వాధీనపరచి సువిశాల కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఎంతగానో దోహదపడినందుకు గణపతి దేవచక్రవర్తి రేచెర్ల రుద్రారెడ్డి సేనానికి అపూర్వ రామప్ప దేవాలయ నిర్మాణాన్ని కానుకగా ఇచ్చాడు.
ఆలయాలకు స్థానిక ఎరుపురాయిని ఎక్కువగా వాడారు. ముఖ్యమైన విభాగాలకు ప్రశస్తమైన నల్లసేనపు జిలుగువెలుగుల శిలలను వినియోగించారు. రాబోయే కాలంలో భూకంపాలూ, ప్రకృతి వైపరీత్యాలకు ఏమాత్రం చెక్కు చెదరకుండా అద్భుత సౌండ్‌బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల్ని నిర్మించారు. వీటిపైన క్షేత్రాకారంలో ఆధార శిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అదోపద్మం అనే ఉపపీఠాల వరుసలపై అధిష్టానం నిర్మించారు. అధిష్టానం దేవాలయానికి పాదం లాంటిది. అలాగే ఆలయం పై కప్పు పూర్తికాగా, గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. గోపురాన్ని నీళ్లులో తేలియాడే తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ గోపురాన్ని కేంద్ర పురావస్తుశాఖ పునర్నిర్మించింది. ఈ నేపథ్యంలో మహా శిల్పి రామప్పాచార్యులు నేతృత్వంలో 300కు పైగా శిల్పులతో భారతీయ శిల్ప సంప్రదాయంలో విశిష్టమైనవేసర శిల్పరీతిన నిర్మాణమైంది. అమరావతి, నాగార్జునకొండల్లో బౌద్ధశిల్పం, మహాబలిపురం, పల్లవశిల్పం, అజంతా, ఎల్లోరాల రాష్ట్ర కూట శిల్పం, ఖజోరహోలోని చందేల శిల్పం, బేలూరు, హాలీబీడుల హోయసల శిల్పరీతులను మించి హోయసల శిల్పంలోని అతిఅలంకరణ, పల్లవశిల్పంలోని అలంకార శూన్యతల వంటి లోపాలు లేకుండా తమదైన గొప్ప కాకతీయ శిల్ప కళాకాంతుల శైలిలో అతి భారీ ఏకకూటాలయంగా రామప్ప దేవాలయాన్ని నిర్మించి శిల్పాచార్యులు కాకతీయ శిల్పానికి విశ్వవిఖ్యాతి గావించారు. రామప్పాచార్యు గెలురుద్రేశ్వర ప్రాణలింగం, మహానందీశ్వరుడు వాత్స్యాయనకామసూత్రాల ప్రాతిపదికన మైథునే శిల్పాలు, సెక్స్ శిల్పాలు, ద్వార, పార్శ్వ శిల్పాలు, మహిషాసురమర్ధినీ, గాలి, వెలుతురు గర్భగుడిలోని రుద్రేశ్వరస్వామిని తాకడానికి వాయుకోష్టములు, రతీమన్మథులూ, గణపతి, గర్భాలయ శిల్పాలు, మహారాజపద్మము, 12 ఆధార అలాసాకన్యల నర్తన శిల్పాలను మహాశిల్పి రామప్పాచార్యులు చెక్కాడు. మిగతా శిల్పులు ఆలయ ఇతర విభాగాలను చెక్కారు. ఈ క్రమంలో ఆలయంలో 4 భాగాలుగా దేవతా రూపాలూ, నర్తకుల బృందం, నర్తకీమణుల బృందం, సాధారణ రూపాలు అలాగే అలంకార శిల్పంలోని 6 రకాలు. అవి మకర తోరణాలూ, హంసలూ, పద్మాలూ, లతలూ, ఏనుగులూ, సింహాలూ, నాగసర్పాలూ శిల్పీకరణ క్రమంలో ప్రదక్షిణాపథంకు 526 ఏనుగుల వరుసలూ, రంగమంటప స్తంభానికి 13 సూక్ష్మరంధ్రాలు, 28 గజకేసరి శిల్పాలు (రుద్రమదేవి విజయ చిహ్నాలు) చెక్కారు. ఆలయ ఆధార శిల్పాలైన 12 అలాసాకన్యల శిల్పాలు శిల్పాచార్యుని కళా ప్రతిభను చాటుతాయి. ధనుర్ధారులైన వేలుకత్తెలు, మిగతావి ఛామరధారిణిలూ, మద్దెల మోగించు పడతులు, అర్ధనగ్న స్ర్తి నగ్ననాగినీ శిల్పాలు రామప్ప దేవాలయానికి శిఖరాగ్ర కీర్తిని తెచ్చిపెట్టాయి.
మదనికల శిల్పాలలో నాగినీ, ఎత్తుమడమల నర్తకీమణుల శిల్పాలలో శిల్పాచార్యుని అమోఘ కళానైపుణ్య ప్రతిభ ప్రస్ఫుటమవుతుంది. ఈ శిల్ప నర్తకుల అలంకరణలు కాకతీయుల నాటి స్ర్తిల సంస్కృతి, సంప్రదాయాలు తెలుపుతాయి. ఈ క్రమంలో ఆలయ ఉత్తర ద్వారంలో కోతి చీరను లాగుతూ నగ్నవతిని చేస్తుండగా ఆమె తన మానాన్ని కాపాడుకుంటూ కోతిని ప్రతిఘటించే స్వమాన సంరక్షిణీ, దక్షిణ ద్వారంలో ఎడమవైపు డోలు వాయిస్తున్న వనకన్య, కుడిదిక్కునే రాగినీ అనబడే వసంత కన్య తూర్పుద్వారమునకు నాగకన్య అనబడే నాగినీ. ఇది కాకతీయ శిల్పకళను దిగంతాలకు చాటి
ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ఈమె పూర్తిగా దిగంబరురాలై చక్కగా నిలువబడి ఎత్తిన రెండు చేతుల్లో త్రాచుపామును పట్టుకున్నది. ఈ నాగిని అంగాంగమును చెక్కుటలో శిల్పాచార్యుడు తన కళాప్రతిభను చూపాడు. దీంతో కవులకూ, రచయితలకూ ఈమె శృంగర కవితాంగన అయింది. చిత్రకారుల కుంచెలో రూపుదిద్దుకుంటూ కలలసుందరి అవుతున్నది. ఈ నాగినీ పక్కనే కాగడా పట్టుకొని వెలుగులు నింపుతున్న వనదేవత విగ్రహం ఉన్నది. ఈమె ఎత్తు మడమల పాదరక్షలు (హైహీల్స్) ధరించి ఉన్నది. ఈనాటి మోడరన్ పాదరక్షలుగా మనం పిలిచే హైహీల్స్ కాకతీయుల కాలంలో ఉండటం అప్పటి నాగరికతను తెలుపుతుంది. దీనికి కుడి వైపున పేరిణీ శివతాండవం చేస్తున్న నర్తకి ఉంది. దీని పక్కనే ధనుస్సు, శరములు ధరించి వేటకు సిద్ధముగా ఉన్న వనమాలక (బోయ కన్య కిరాతిని) విగ్రహం ఉంది. ఆమె కుడికాలుకు ముళ్లు విరిగి వాచిపోగా, మంగళివాడు ముళ్లును సూదితో తీయటం, వాచిన కాలు సహజత్వముగా కనబడుతుంది. ఈ విధంగా హాస్య, రౌద్ర, భక్తి, శృంగార, వినోదం ఆ హావభావాలూ, అభినయ కౌశలం, ఉధాత్తత, నృత్య ప్రతిభా విధానం ప్రతీ మదనికలో స్పష్టంగా, సహజంగా కనిపిస్తుంది.
ఇక దేవగిరి ప్రభువు మహాదేవుడిని ఓడించినందుకు తన విజయ చిహ్నాలుగా రాణిరుద్రమదేవి గజకేసరి శిల్పాలను ఆలయ కప్పుకు అలరింపజేశారు. ఈ శిల్పాలకు రెండు అర్థాలు వస్తాయి. ఏనుగుల వంటి శత్రువులకు కాకతీయ రాజులు సింహాలలాంటివారని, దీనే్న శాతృ గజకంఠీరవ అని అంటారు. ఇక ఆలయం ప్రదక్షిణాపథం చుట్టూ అలాగే గర్భాలయ, అర్థమండపం, రంగమండపంలా... అధిష్టానానికి ఉపానం, కుముదం, కపోతము కాకతీయల కాలం నాటి ప్రజల జీవన విధానాలకు దర్పణం పడుతూ వారు అలంకార ప్రియులుగా, సంగీత, వాయిద్య కళల ప్రేమికులుగా, వాత్స్యాయనకామసూత్రాలను పాటిస్తూ శృంగార, రతిక్రియలు జరిపే విజ్ఞానానికి మైథున శిల్పాలనూ, ఏనుగులూ, సింహాలూ, హంసలూ, తాండవగణపతులూ, భైరవ, గజలక్ష్మీ, మల్లయోధులూ, సూర్యుడు, మొసళ్లు (మకరాలు), అలాగే కుడ్య శిల్పాలు, శృంగార శిల్పాలు, వివిధ వాయిద్యకారులు, వివిధ నర్తకులు, లతలు, పద్మపట్టిల వరుసలు, అలాగే జైనమహాధీరుడు, బుద్ధుడు, ఆంజనేయుడు, మహిషాసురమర్ధిని, వీర భక్తుడు, తదితర శిల్పాలు రామప్ప దేవాలయ శిల్పకళా వైభవాన్ని మహోజ్వలంగా ప్రకాశింపజేస్తున్నాయి.
జీవకళ లొలుకుతున్న నంది: ఇక మహారాష్ట్ర దేవాలయానికి మహోజ్వల ప్రకాశంతో శిఖరాగ్రమాన కళాఖండంగా కాకతీయ శిల్పానికి అగ్రమణిమకుటంగా రామప్ప మహా నంది ఉంది. ఇది ఆలయానికి తూర్పున ప్రత్యేక మంటపంలో కాకతీయ నందులలో అగ్రగామిగా భాసిల్లుతూ ఉంది. జిలుగువెలుగుల రామప్ప నందీశ్వరుడు భారతీయ ప్రఖ్యాత మైసూరు, లేపాక్షి, తంజావూరు, యాగంటి నందులను మించిన మహోజ్వల ప్రకాశిత శిల్ప కళా సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. బలిష్టమైన శరీర సౌష్టవం, తోక, వృషణాలు మూపురం, కాలిగిట్టలతో పాటు ప్రతీ అవయవం సహజంగా జీవకళ లొలుకుతూ ఉన్నాడు. ముఖ్యంగా మూపురం శివలింగం వలే గోచరిస్తూ భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ముఖంపై ఉబ్బిన నరాలు, విప్పారిన కన్నుల్లో నీటిపొరలు చూపించడంలో రామప్ప శిల్పి తన కళా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. మెడపట్టీలు, చిరుగంటలు, అలంకారాలు రకరకాల ఆభరణాల అలంకరణలతో నందీశ్వరుడు రామప్ప దేవాలయానికి శిల్ప కళాకీర్తికి ప్రతీకగా ఉన్నాడు. పూర్వం నుంచి ఆలయంలో ఉన్న మహానందిని 1990లో ఆలయం తూర్పు వైపున ఉన్న నంది మంటపాన్ని పునరుద్ధరించి అందులోకి తెచ్చారు. అయితే మంటపానికి పై కప్పు నిర్మించకపోవడం వల్ల సుమారు 26 ఏళ్లుగా నందీశ్వరుడు తన సహజమైన జిలుగువెలుగులను కోల్పోయి ఉనికికే పెద్ద ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పురావస్తు శాఖ వెంటనే నంది మంటపం పై కప్పును నిర్మించి నందిని శాశ్వతంగా కాపాడాలి.
రంగ మంటపం: ఆలయంలో వైభవోపేతంగా అపూర్వశిల్ప కళతో నిర్మించిన 4 స్తంభాల మంటపాన్ని రంగమంటపం, నాట్యమంటపం అంటారు. ఇది ఒక అద్భుత లోకం, వైకుంఠాన్నీ, బ్రహ్మ లోకాన్నీ, కైలాసాన్ని మరెన్నో లోకాలను, సర్వదేవుళ్లనూ ఒక చోటుకు తెచ్చి వేదిక చేశారు. రామాయణ, మహాభారత, మహాభాగవత, శివలీలల ఘట్టాలకు శిల్పులు శిల్పాభిషేకం చేశారు. దీంతో ఆలయం మరువరాని మధురానుభూతిని కలిగించే మనోజ్ఞ శిల్ప కళా వైభవశాల అయింది. ఈ ఆలయానికి గోడలు తక్కువ, స్తంభాలు ఎక్కువ. కాగా రంగ మంటప స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద దేవదానవుల క్షీరసాగర మధనం, ముగ్గురు నర్తకులకు నాలుగు కాళ్లు ఉండి ఆరుకాళ్లుగా కనిపించే చమత్కార శిల్పం, శ్రీకృష్ణ గోపికా వస్త్రాపహరణం, పేరిణీ నాట్యం, దండలాస్యం, కుండలాకార నృత్యం, శివుడి మన్మథ సంహారం తదితర ఘట్టాలున్నాయి. ఇక రంగమంటపం పై కప్పుకు దశ భుజ నాట్యా రుద్రుడు, చుట్టూ భార్యా సమేతులై వాహనారూఢులై అష్టదిక్పాలకులూ, పశ్చిమ, దక్షిణ దూలములకు పశ్చిమ దిశన మేరు పర్వతం కవ్వముగా వాసుకీ సర్పం తాడుగా దేవ, దానవుల పాల సముద్ర మధనం, శ్రీమహావిష్ణవు, మోహినీ అవతారం, దీని కింద శివుని త్రిపురాసుర సంహారం, తారకాసుర సంహారం, ఉత్తర దిశన గజాసుర సంహారం, నాట్య గణపతి, వరాహ మూర్తులు, ఆలయ శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి. అలాగే ఈశాన్య, వాయువ్య దూలాలకు దక్షసంహారం, శ్రీరాముని అశ్వమేథయాగము, సీతా బంగారు లేడిని గాంచు ఘట్టము, తూర్పున నరకాసుర ఘట్టమున్నది. ఇంకా పార్వతీ కళ్యాణం, త్రిముఖ బ్రహ్మ, మరెన్నో ఘట్టాలున్నాయి. ఇక మంటపం తూర్పున ఎడమ వైపున దిష్టి దోష స్తంభం ఉంది. ఇక స్తంభాలకు చెరుకుగడలూ, అరటి బోదెల మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమల్లో నిలబడిన స్ర్తిలు, సింహాల వరుసలు, లతలూ, వివిధ వాయిద్యకారుల శిల్పాలు జీవకళలతో ఆకట్టుకుంటాయి. ఇక స్తంభాలకు మద్య శిల్ప ఘట్టంలో సన్నని సందులుంటాయి. అందులో సన్నని దారం లేదా గడ్డిపోచలు దూరుతాయి. ఈ సున్నిత, సూక్ష్మ పనితనానికి శిల్పులు ఎంత సూక్ష్మమైన పనిముట్లు వాడారో తెలుస్తుంది. ఇక గర్భగుడి ముఖద్వారంపైన దక్షయజ్ఞము, శివ, పార్వతుల కల్యాణ, ఘట్టాలున్నాయి. ఈ ద్వారబంధానికి ఒకవైపు 9 విభాగాలుగా, మరో వైపు 9 విభాగాల అలంకరణలతో చెక్కారు. కాకతీయ ప్రభువులకు విజయాలు చేకూర్చిన విజయలక్ష్మికి ప్రతీకగా వారికి ప్రీతికరమైన ఇష్టమైన సిరిదేవత గజలక్ష్మీ ఉంది. ద్వారబంధాలకు కుడివైపు దర్పణ సుందరి, ఎడమవైపున పొన్న చెట్టు, సుందరి శిల్పాలున్నాయి. సుందరి పట్టుకున్న పొన్నచెట్టును మీటినా లోహ శబ్దం వస్తుంది. దీన్ని సప్తస్వర శబ్దంగా భావిస్తారు. అలాగే ప్రవేశ ద్వారమునకు ఎడమవైపున ఖడ్గం మొనను భూమికి ఆనించి పిడిని పట్టుకొని సతీసమేతంగా భక్తివినమ్రులై ఆలయాన్ని నిర్మించిన రేచెర్ల రుద్రారెడ్డి దంపతులున్నారు. గర్భగుడి ద్వారంపైన కాకతీయ చక్రవర్తులకు విజయాలను, సిరిసంపదలను ఇచ్చిన గజలక్ష్మీ దేవత ఉంది. భక్తులకు స్వాగతం పలికే ద్వారపాలికలున్నాయి. అలాగే రుద్రేశ్వరస్వామిని సందర్శించి బయటకు వస్తున్న భక్తులకు అరటిపండును ఒలిచి పెట్టే ద్వార పాలిక ఉంది. ఇక గర్భాలయంలోని రుద్రేశ్వరుడు (శివలింగం) వేయి సూర్యుల కాంతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తన దివ్య సందర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రంగమంటప స్తంభాలపై పడే సూర్య కిరణాలు పరావర్తనం చెంది రుద్రేశ్వరుడిపై పడి ప్రాకృతిక వెలుగుల్ని ప్రసరింపజేస్తాయి.
ఇక కాకతీయ ప్రభువులకు యుద్ధాల్లో చేకూర్చిన సప్తమాతృకల దేవతల నిలయాలున్నాయి. ఇవి ఆలయ రంగమంటపంలో ఉన్నాయి. ఈ సప్తమాతృకలను ద్రావిడ దేవతలని అంటారు. వారు బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మహేంద్రా, చాముండా అనే ఏడుగురు దేవతలను ఆ పేర్లతో పిలుస్తారు. ఈ దేవతలను తెలంగాణా వ్యవహారంలో రేణుకా ఎల్లమ్మ, ముత్యాలమ్మ, అంకమ్మ, బంగారమ్మ, మాతమ్మ, పోచమ్మ, మైసమ్మ వారి సోదరుడు పోతరాజు అని పిలుస్తారు. ఈ దేవతల విగ్రహాల్ని ఒక్కొక్క చిన్న దేవాలయంగా నిర్మించి ప్రతిష్ఠించారు. అలాగే వినాయకున్ని కూడా ప్రతిష్ఠించారు. అలాగే భక్తులు కూర్చోడానికి 20 కక్షాసన ఫలకాలున్నాయి. వీటిపైన గోడలకు వివిధ శిల్పాలు వరుసలున్నాయి. ఇక వర్షపు నీరు ఆలయం గోడలపై పడకుండా వెడల్పైన ప్రస్తరకపోతం ఉంది. ప్రస్తరం అనగా కప్పు కపోతం అనగా చూరు.
ఇక ఆలయానికి ఉత్తరం దిశన రేచెర్ల రుద్రసేనాని తండ్రి కామసేనాని పేరున నిర్మించిన కాటేశ్వరాలయం, దక్షిణాన తల్లి కామాంబ పేరున నిర్మించిన సభా మంటపం కామేశ్వరాలయం ఉన్నాయి. ఆతుకూరిపురం (పాలంపేట)లోని ఈ ఆలయాల నిర్వహణకు రేచెర్ల రుద్రసేనాని నెక్కొండ, ఉప్పరపల్లి, బోర్లపల్లి, నడికూడ గ్రామాల్ని దానం ఇచ్చారు. కాగా ఈ ఆలయంలో ఒక అన్నదాన కేంద్రం, ఒక ప్రసూతి కేంద్రం, ఒక వైద్యశాల, ఒక ఓషధీవనం, ఒక మల్ల యుద్ధ పాఠశాల, సైనిక పాఠశాల ఉండేది. ఆలయం ఇంకా ద్రవ్యనిధి కేంద్రంగా (బ్యాంకుగా), న్యాయపీఠంగా, వ్యవసాయ విజ్ఞాన కేంద్రంగా, ప్రభుత్వ అభివృద్ధి పనుల ప్రచార కేంద్రంగా (సమాచార పౌరసంబంధాల కార్యాలయంగా), ఇంకా వివిధ సేవల కేంద్రంగా వర్ధిల్లింది. 72 మంది వివిధ సేవలనందించేవారు. 10 మంది వాయిద్యకారులు, 10 మంది ఆటకత్తెలు (నర్తకీమణులు), 16గురు పాటకత్తెలు ఉండేవారు. ఆలయంలో అలనాటి ప్రసిద్ధి చెందిన నర్తకీమణులు మాచలదేవి, అంబాదేవిలు ప్రదర్శనలిచ్చారు. అందుకు గుర్తుగా రంగమంటపంలో కింది భాగంలో తమ విగ్రహాలను వారు ఏర్పరుచుకున్నారు. క్రీ.శ. 1323లో ఉలఘ్‌ఖాన్ ఓరుగల్లుకోట ధ్వంసం కార్యక్రమంలో రామప్ప దేవాలయంపై దాడి చేశాడు. అయితే ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు తీవ్ర ప్రతిఘటనతో విఫలుడయ్యాడు. అయినా అనేకమంది శిల్పులను చంపి రామప్ప చెరువులో పడేశాడు. నాగినీశిల్పం పై కామదృష్టితో అసభ్యంగా ప్రవర్తించాడు క్రీ.శ. 1323వ సంవత్సరంలో కాకతీయ చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుల వారు దివంగతులైన అనంతరం రామప్ప దేవాలయం నిరాధరణకు గురై వైభవాన్ని కోల్పోయి కటిక చీకటిలో మగ్గింది. ఈ నేపథ్యంలో 610 ఏళ్లు అనంతరం చివరి నిజాం నవాబు దూర్‌ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పురావస్తు శాఖ తొలి డైరెక్టర్, గులాం యాజ్దాని క్రీ.శ. 1930లో రామప్ప దేవాలయాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆలయం ఆగ్నేయ భాగం కూలిపోకుండా ఆధార స్తంభాలు కట్టి అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. కాగా ఇంకా పాలంపేట గ్రామ పరిసరాల్లో 16 ఉప ఆలయాలున్నాయి. ఇలా ఉండగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా త్వరలో గుర్తించనుంది. దీంతో ప్రపంచ స్థాయిలో సందర్శించే పర్యాటకులకు ఆ స్థాయిలో అభివృద్ధి జరిగి సౌకర్యాలు గొప్పగా ఏర్పడనున్నాయి.
రైతన్నలకు ఆధరువు రామప్ప చెరువు: సప్త సంతానాల్లోని ఏడు మహా పుణ్య కార్యాల్లో చెరువు నిర్మాణం ఎంతో పవిత్రమైనదిగా భావించి కాకతీయ ప్రభువులు వేలాది చెరువుల్ని నిర్మించిన క్రమంలో రామప్ప, మహా సరస్సును నిర్మించారు. కాకతీయుల మహోన్నత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా రామప్ప సరస్సు నిర్మాణమైంది. 184 చదరపు కిలోమీటర్ల పరిసర ప్రాంతాల నుంచి చెరువులోకి వర్షపు నీరు చేరుతుంది. చెరువుకట్టను 2000 అడుగుల పొడవులో నిర్మించారు. 82 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ భారీ జలాశయంలోకి 56 అడుగులు నీరు ఉండాల్సి ఉండగా 36 అడుగుల లోతు నీరు ఉంటోంది. కాగా 2913 టి.ఎం.సీలు అనగా, మిలియన్‌ఘనపుటడుగుల నీటి నిలువ సామర్థ్యం ఉంది. అలాగే చెరువు లీగల్ ఆయకట్టు 4350 ఎకరాలు కాగా అదనంగా మరో 2000 ఎకరాలు మొత్తం 6500 ఎకరాలు సాగవుతుంది. చెరువును సోమికాలువ, ఒగరుకాలువ, బూరుగు కాలువ, పీర్లకాలువ, కొత్త కాలువలు ఉన్నాయి. ఇక 50 గ్రామాలకు చెరువు నుంచి డిప్లోరైడ్ నీరందుతోంది. చెరువును దేవాదుల జలాలతో నిండి శాశ్వత రిజర్వాయరుగా ప్రభుత్వం త్వరలో అభివృద్ధిపరచనుంది. కాగా పర్యాటకులు సరస్సులో బోటు షికారు చేస్తూ విహారానందాన్ని పొందుతున్నారు. అలాగే రామప్పలో పర్యాటకులకు విడిది సౌకర్యం ఉంది. ఇందుకు చెరువుకట్టపై 8 కాటేజీలు, సకల సౌకర్యాలతో ఉన్నాయి. అలాగే పర్యాటకులకు భోజన సదుపాయాలకు హరిత హోటల్ రామప్ప, సరస్సు కట్టపై ఉంది.
రామప్ప దేవాలయం వెంకటాపురం (ఎం) మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఉంది.
*

దక్షాధ్వర హరో హరః

$
0
0

ప్రపంచానికి ఆధ్యాత్మిక, దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా, మహోన్నతంగా అందించిన భరతభూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతారాల రూపంతో స్వయంగా వసించినది వ్యధరణి మన భారతదేశం. ముల్లోకాల్లోని (కైలాసం, వైకుంఠం, బ్రహ్మ లోకం) దేవుళ్లకూ, భూలోకంలోని మానవులకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలను కలిగినది భారతదేశం. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో పండుగలూ, ఆచార వ్యవహారాలూ, సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో భగవంతుని సాన్నిధ్యానికి భక్తుని చేరువ చేసిన మహత్తర ఆధ్యాత్మిక వైభవం భారతదేశం సొంతం.. ఈ పరంపరలో భారతీయ సనాతన పండుగల్లో మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గొప్ప పండుగ. వేద కాలం నుంచి భక్తులు ఎంతో నిగ్రహ నియమ నిష్టలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మహా పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులు శాస్తయ్రుక్తంగా నిర్వహించుకుంటూ పరమశివుని కృపకు పాత్రులవుతున్నారు. మహాశివరాత్రి విశేషాలనూ, శివలీలనూ, శివలింగస్కాంద, బ్రహ్మాండాది పురాణాలు, శివగీత తదితర ఎన్నో ఉద్గ్రంథాలు వివరిస్తున్నాయి.
శివుడు, పార్వతి, విష్ణు, బ్రహ్మల పుట్టుక
సకల సృష్టికి పూర్వం సమస్తం జలమయమై ఉండగా, అందులో నుండి గొప్ప మహోజ్వల తేజస్సు పుట్టింది. ఆ తేజస్సులో.. సగం తేజస్సు నుండి త్రిశూలం, శంఖం, ఢమరుకం, ధరించిన.. ఫాలన (నొసట) అగ్ని నేత్రంతో (మూడవ కన్నుతో) పరమేశ్వరుడు, మిగిలిన సగం తేజస్సు నుండి జగజ్జనని పరమేశ్వరి (పార్వతి) ఉద్భవించారు. ఇలా పార్వతీ పరమేశ్వరులు తొలి ప్రకృతి పురుషులు.. ఆదిదంపతులైనారు. ఈ క్రమంలో వారి అనుగ్రహం చేత విష్ణుమూర్తి ఆవిర్భవించాడు. అనంతర కాలంలో శివుడు.. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని బహూకరించినట్లు శివపురాణం చెబుతోంది. ఈ నేపథ్యంలో మహా విష్ణువు శేషశయ్యపై ఎన్నో వందల ఏళ్లు యోగ నిద్రలో ఉన్నాడు. ఈ సమయంలో అతని నాభి కమలం నుండి పంచముఖ బ్రహ్మ ఉద్భవించాడు. కాలక్రమంలో శివుడు కైలాసానికి, విష్ణువు వైకుంఠానికి, బ్రహ్మ.. బ్రహ్మలోకానికి అనగా ముల్లోకాలకు ఆ త్రిమూర్తులు అధిపతులై సృష్టి, స్థితి, లయకారులై యావత్ జీవ రాశికి మనుగడ సాగిస్తున్నారు.
మహాశివరాత్రి ఆవిర్భావం
అనేక సందర్భాలను బట్టి తమలో ఎవరు గొప్ప? అనే గర్వం బ్రహ్మ, విష్ణువుల్లో తలెత్తింది. దీంతో శివుడు మహా నిశీధిలో పాతాళం, భూమి, ఆకాశాలను కలుపుతూ జాజ్వల్యమానకోటి సూర్య కాంతులతో ప్రకాశిస్తూ.. ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా.. అనంతమైన జ్వాలాలింగం (అగ్ని స్తంభం) రూపంలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుత లింగం నుంచి ఈశ్వరుడు లింగోద్భవ మూర్తిగా నాలుగు భుజాలతో మహావిష్ణువు, బ్రహ్మదేవుళ్లకు దర్శనమిచ్చాడు. తన మహాలింగం ఆది, అంతాలను కనుగొనాలనీ, అలా మీలో ఎవరు కనుగొంటే వారే గొప్పవారవుతారని వారిరువురికి పరీక్ష పెట్టాడు శివుడు. ఈ క్రమంలో బ్రహ్మ, విష్ణువు లెవరూ ఆ అనంతమైన శివలింగాన్ని ఆది, అంతాలను కనుగొనలేక వైఫల్యం చెందారు. దీంతో వారి గర్వాన్ని అణచిన సందర్భాన్ని.. మహాశివరాత్రిగా.. సదాశివుడు ప్రపంచానికి ప్రకటించాడు. ఇలా తాను జ్వాలాలింగ రూపంలో ఉద్భవించినట్టి మాఘమాస, బహుళ చతుర్దశి, ధనిష్టాన నక్షత్రం, దివ్య (నిశీధి) రాత్రి.. మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదన్నాడు శివుడు.. ఈ మహా పర్వదినాన.. శివలింగాన్ని దర్శించి, అభిషేకించి.. ఉపవాసాలతో ఆరాధించి జాగరణ చేసిన వారు తనకు ప్రీతిపాత్రులై తన కృపను చూరగొని సకల మహా పాపాల నుంచి విముక్తులవుతారు.. శివ సాయుజ్యాన్ని (శివైక్యం) పొందుతారని ఈశ్వరుడు ప్రపంచానికి దివ్య సందేశమిస్తూ మహా శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకొని పునీతులు కావాలని ప్రజలను ఆదేశించాడు బోళా శంకరుడు. ‘శివ.. రాత్రి’ శివం (శుభం) రాత్రి. శుభం కలిగించే రాత్రి.. రాత్రి తల్లి లాంటిది.. సకల ప్రాణికోటిని తన ఒడిలోకి హాయిగా చేర్చుకొని సేదతీర్చి సుఖనిద్ర నిస్తుంది.
ఓంకార స్వరూపుడు
పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఓంకారానికి నామాంతరం ప్రణవం. రోదనలు బాపే వాడైనందున రుద్రుడు అయినాడు. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు అధిపతి శివుడు. ఈశం ఇవ అక్షరాల కలయిక శివం అవుతుంది. మంగళప్రదమూ శివమూ అయినది శివతత్వము. అందుకే శివుడు మంగళప్రదుడు అయినాడు. కోరిన వారికి కొంగు బంగారమూ, బోళాశంకరుడు అయినాడు. ‘శివం’ అంటే శుభం.. ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యమనే పదం వచ్చింది. సర్వసంపద్రూపుడు శివుడు. అభవుడు పుట్టుక లేనివాడు.
మహాదేవుడికి ప్రతీకగా లింగం
లింగం అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీక అని అర్థం. శివలింగం సర్వశుభంకరుడైన మహాదేవుడికి ప్రతీకగా.. శివునిచే మహాశివరాత్రి ఆవిర్భావమైన నాటి నుంచి భక్తకోటితో కొలువబడుతూ విరాజిల్లుతోంది. శివుడు తన పంచముఖాల నుంచి పంచ లింగాలను సృష్టించాడు. శివుని ఐదు ముఖాలు సద్యోజాతా, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానా.. పంచభూత తత్వాలతో ఆ లింగాలు ఐదు విధాలుగా ప్రసిద్ధికెక్కాడు. జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలో భూలింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం.. ఇవి సర్వవ్యాపకుడైన రుద్రుడు కోటానుకోట్ల సూర్యుల కాంతితో అఖండంగా వెలుగొందే మహోజ్వల తేజోమూర్తి మహాశివుని స్వయం సృష్టి లింగాలుగా పౌరాణికులు చెబుతారు. ఈ లింగాలను దర్శించుకుంటే మహాశివుని ఐదు ముఖాల స్వయంగా దర్శించు కున్నట్లేనని శివపురాణం చెబుతోంది. కాగా పంచభూతాల లింగాలు, స్వయంభూ లింగాలు, జ్యోతిర్లింగాలు వెలిశాయి. భూలోకంలో ఈ లింగాలు 12గా వెలిశాయి. లింగాలలో చల, అచల, పార్థివ, మృత్తిక, రస మొదలైనవి ఉన్నాయి.
త్రిమూర్తుల కలయికకు ప్రతీకగా ఆలయాల లింగాలు
శివాలయాల్లోని లింగాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికకు ప్రతీకలుగా 3 భాగాలుగా ఉన్నాయి. అడుగు భాగం బ్రహ్మ భాగం, మధ్యభాగం మహావిష్ణువు భాగం, స్తంభాకార భాగం రుద్ర (శివుని) భాగం. ఇదే పూజా భాగం. దీనిపై బ్రహ్మసూత్రాలుగా పేర్కొనే గీతలు ఉంటాయి. ఇలా గీతలు ఉన్న శివలింగాలనే పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాగా వ్యాపకశీలమైన ప్రకృతి తత్వమే యోని. ఉత్పత్తికి ఉపాదాన కారణమైన పరమశివుడే శివలింగం.. లోతుగా పరిశీలిస్తే.. యోని, లింగం కలయిక సృష్టి కార్య స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. (ఇది శివలింగంకు ప్రతీక) యోనిని, మూలకారణ శక్తిగా వేదాలు, ఉపనిషత్తులు స్పష్టపరిచాయి. ఇవే కాకుండా భగవద్గీత కూడా (14వ అధ్యాయం, 4వ శ్లోకం) సకల ప్రాణులందు ఉత్పత్తి అగుచున్న మూర్తులకు (జీవజాలానికి) మహాద్యోని ప్రకృతి. అందు బీజ స్థాపన చేయువాడు శివుడు ప్రకృతి తల్లి. వాటికి తండ్రిని నేను, అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ పరంగా, ఈ భావాన్ని శివ పార్వతులకు (ప్రకృతీ పురుషులకు) అన్వయిస్తే సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి. పరమేశ్వరుడే తండ్రి. ఇదే జగజ్జనని, జనక భాగంగా సౌందర్య లహరిలో జగద్గురువు ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు హృద్యంగా, భక్తి ఆధ్యాత్మిక భావనలతో పరమోన్నతంగా చెప్పాడు.
వివిధ నామాలతో శివుడు.. ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు
సౌరాష్టల్రో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, డాకినీ క్షేత్రంలో భీమ శంకరుడు, వారణాసిలో (కాశీ) విశ్వనాథుడు, నాసికంలో త్య్రంబకేశ్వరుడు, ప్రజ్వలం (పర్లి)లో వైద్యనాథేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరంలో ఘృష్ణేశ్వరుడుగా ఆయా పేర్లతో క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కగా భక్తకోటి సందర్శిస్తూ తరిస్తున్నారు.
‘శివార్చనతో తరించిన భక్తులెందరో..
ధూర్జటి అనే మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ అనే శతకాన్ని రచించి శివుని కృపకు పాత్రుడై శివైక్యం చెందాడు. మార్కండేయుడు శివలింగార్చన చేసి చిరాయువును (చిరంజీవి) పొందాడు. అర్జునుడు శివునితో యుద్ధం చేసి అతని ప్రీతిని పొంది అతని నుంచి తిరుగులేని పాశుపతాస్త్రాన్ని సాధించాడు. సత్కీరుడు నూరు పద్యాలతో స్తుతించి శివసాయుజ్యాన్ని పొందాడు. శ్రీకాళహస్తిలో తిన్నడు (్భక్త కన్నప్ప), సాలె పురుగు, పాము, ఏనుగు శివలింగార్చన గావించి శివానుగ్రహాన్ని సాధించగా, వాటి పేరుతోనే శ్రీకాళహస్తిగా వెలసి ప్రసిద్ధి కెక్కింది. బాణాసురుని సహస్ర లింగార్చనకు ఆటంకం కలుగకుండా, అతని వాకిట స్వయంగా శివుడు కాపలాదారుగా ఉన్నాడు. ఇలా శివారాధనలతో భక్తశిఖామణులెందరో శివ సాయుజ్యాన్ని పొంది చరితార్థులైనారు. ఈ నేపథ్యంలో, శివానుగ్రహం పొందడానికి శివరాత్రి కంటే మహా మహిమాన్వితమైన పర్వదినం మరొకటి లేదు. యజ్ఞ యాగాదులు ఒక ఎతె్తైతే శివరాత్రి నాడు శివార్చన ఒక్కటి ఒక ఎత్తు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఈశ్వరుడి లింగోద్భవం జరిగి గొప్ప ‘మహాశివరాత్రి’ ఏర్పడినందున ఆ దినం రాత్రి ‘అతిరాత్ర యాగం’ నిర్వహిస్తారు. ‘అతిరాత్రం’ అంటే రాత్రిని జయించమని అర్థం. చీకటితో పోలుస్తూ చెప్పే అజ్ఞానం, దుఃఖం, బాధ వంటి ప్రతికూల పరిస్థితులను అతిరాత్రం జయిస్తుంది. విశ్వ సామరస్యాన్నీ, సకల జీవరాశి సంక్షేమాన్నీ ఆ యాగం కాంక్షిస్తుంది.
‘తిరుమల క్షేత్రపాలకుడు శివయ్య’
తి.తి.దే ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిల తీర్థం. పరమేశ్వరుడు తిరుమల క్షేత్ర పాలకుడు కావడమే ఇందుకు కారణం.
శివస్తోత్రాలతో మారుమోగే ప్రసిద్ధ దేవాలయాలు
మహాశివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, కాశీ, రామేశ్వర తదితర ప్రసిద్ధ దేవాలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ, అమరారామం, కాకతీయుల వేయి స్తంభాల గుడి (హన్మకొండ) రామప్ప దేవాలయం, గణపేశ్వరాలయం (గణపురం కోట గుళ్లు) తదితర శైవ పుణ్యక్షేత్రాలన్నీ జగజ్జేగీయమానంగా, అపర కైలాస శిఖరంగా ప్రకాశిస్తూ.. శివదర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ.. భక్తకోటి ఓం నమః శివాయః.. శంభోశంకర.. హరహర మహాదేవ స్తోత్రాలతో.. శివనామస్మరణలతో.. భజనలతో.. నగర సంకీర్తనలతో.. జయజయ శివశివ.. ఓంకార నాదాలతో... ఆలయాల గంటల ధ్వనులతో మారుమోగుతూ శివభక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ శివైక్య మార్గాన నడిపిస్తున్నాయి.. ఓం నమః శివాయః *

ఈ వారం తార

$
0
0

సమంత
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>