Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సినిమాలు.. సాహిత్యవేత్తలు

$
0
0

ఎవరీ శ్రావణ భాద్రపదాలు అని అడిగాట్ట ఒక సందర్భంలో గుడిపాటి వెంకటచలం, దాశరథి, సినారెలనుద్దేశించి. అప్పటికింకా దాశరథి, సినారెలు ఇప్పుడు మనం చెప్పుకునేంత ఎత్తుకు ఎదగలేదు. నిజానికి దాశరథి, సినారె విషయంలో భాద్రపదం, శ్రావణం తర్వాత ఆరేళ్ళకు కాని రాలేదు. దాశరథి 1925లో జన్మించారు. సినారె 1931లో జన్మించారు. కవిత్వం వ్రాసే ఆరంభ దశలోను, సినిమా రంగంలో పాటలు వ్రాయడం మొదలుపెట్టడంలోను దాశరథి సినారెకు పెద్దన్న లాగే ఉన్నారు. కవిత్వం విషయంలోనైతే సినారె ‘నా తరుణ కావ్య లతికలానాడు పైకి ప్రాకలేక దిక్కులు సూడ, నీ కరాలు సాచి లేత రేకులకు కెంజాయలద్ది మంచి పందిళ్ళపైకి ప్రాకించినావు’ అంటూ దాశరథికి తన కృతజ్ఞతా భావాన్ని వెళ్ళబుచ్చారు.
చాలామంది సినారె 1962లో వచ్చిన గులేబకావళి కథతో సినీరంగ ప్రవేశం చేశారని భావిస్తారు. నిజానికి 1959, 1960ల్లోనే సినారె సినీరంగ ప్రవేశం జరగాల్సింది. 1959లో ఎల్.వి.ప్రసాద్ నిర్మించదలచిన ‘కొడుకులూ, కోడళ్ళూ’చిత్రానికి సినారె ఒకటి రెండు పాటలు వ్రాశారు. కాని కారణాంతరాలవల్ల ఎల్.వి.ప్రసాద్ ఆ చిత్ర నిర్మాణం ఆపివేశారు. 1960లో విడుదలైన ‘పెళ్ళిసందడి’, ‘శభాష్ రాముడు’ చిత్రాల్లో ఒక్కొక్క పాట వ్రాయమని ఆహ్వానం వచ్చింది కానీ, ఆయన దానికి అంగీకరించలేదు. ‘గులేబకావళి’ చిత్రంలో అన్ని పాటలూ సినారేనే వ్రాయడానికి ఎన్.టి.ఆర్. ఒప్పుకోవడంతో సినారె సినీ రంగప్రవేశం సుగమమైంది. అనేక కవితలు, కావ్యాలు, వ్యాసాలు వ్రాసిన సినారె 1973లో ‘‘మంటలూ, మానవుడూ’’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1977లో పద్మశ్రీ, 1988లో విశ్వంభర పుస్తకానికి జ్ఞానపీఠ్, 1992లో పద్మభూషణ్ పురస్కారాలనందుకున్నారు. 2001లో ‘‘ప్రేమించు’’ సినిమాకు వ్రాసిన ‘‘కంటేనే అమ్మా అని అంటే ఎలా?’’ పాటకు, 2003లో ‘‘సీతయ్య’’ సినిమాకు వ్రాసిన ‘‘ఇదిగో రాయలసీమ గడ్డ’’ పాటకు నంది పురస్కారాలనందుకున్నారు.
దాశరథి క్రిష్ణమాచార్యులు ప్రముఖ కవి. ‘‘అగ్నిధార’’, ‘‘రుద్రవీణ’’, ‘‘కవితా పుష్పకం’’వంటి ప్రముఖ రచనలు చేశారు. గాలిబ్ ఉర్దూ గీతాలను ‘‘గాలిబ్ గీతాలు’’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి లభించింది. 1974లో ‘‘తిమిరంతో సమరం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆస్థాన కవిగా కొన్నాళ్ళు వ్యవహరించారు. 1961లో ‘‘వాగ్ధానం’’తో సినీ రంగప్రవేశం చేశారు. 2000కు పైగా సినిమా పాటలు వ్రాశారు. ‘‘ఇద్దరు మిత్రులు’’, ‘‘పూజ’’, ‘‘మూగ మనసులు’’వంటి సినిమాలకు దాశరథి వ్రాసిన పాటలు చాలా జనాదరణ పొందాయి.
విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవి, నవలా రచయిత, విమర్శకులు. కేంద్ర సాహిత్య అకాడమీ (1962, విశ్వనాథ మధ్యాక్కరలు), జ్ఞానపీఠ్ (1970), పద్మభూషణ్ (1970) పురస్కారాల గ్రహీత. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించింది. 2017లో భారత ప్రభుత్వం ఆయనపై స్టాంపును విడుదలచేసింది. 1941లో విడుదలైన ధర్మపత్ని సినిమాకు ఆయన సంభాషణలు వ్రాసి ఉండాల్సింది. అయితే అవి చాలా గ్రాంథికంగా ఉండటంతో అప్పటికే శరత్‌చంద్ర ఛటర్జీ రచించిన పలు బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించిన ఆలూరి వెంకట సుబ్బారావు (ఉరఫ్ చక్రపాణి)తో వ్రాయించారు. 1951లో విడుదలైన ‘‘ఆకాశరాజు’’ సినిమాకు గౌరీశంకరశాస్తి నిర్మాత. జ్యోతిసిన్హా దర్శకుడు. ‘‘పాటల రెక్కలమీద ఎగిరిపోయే స్వభావం ఉన్నవాన్ని, మాటల నేలమీద నిలబడగలనా’’అని సందేహిస్తునే ఆ సినిమాకు కథ, పాటలు వ్రాయడానికి ఒప్పుకున్నారు విశ్వనాథ. సినిమా నడవలేదు. మళ్ళీ ఆయన సినిమాల జోలికి వెళ్ళలేదు.
గుంటూరు శేషేంద్రశర్మ సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట, ‘‘ఋతుఘోష’’ ఆయనను ప్రతిభావంతుడైన తెలుగు కవిగా నిలబెడుతుంది. ‘నాదేశం, నా ప్రజలు’ పుస్తకంతోపాటు పలు కవితల ద్వారా ఆయన నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ కాబడ్డ రెండవ భారతీయునిగా గుర్తింపు పొందారు. శేషేంద్రశర్మ సంస్కృతంలో విశ్వనాథకంటే మెరుగైన పండితుడన్న శ్రీశ్రీ వ్యాఖ్యలతో ఉడికిపోయిన విశ్వనాథ ‘‘నాలాంటి కవి మరో వెయ్యేళ్ళకుగానీ పుట్టడు’’అని ఉరిమారు. ‘‘అసలు మీరు వెయ్యేండ్ల క్రిందే పుట్టాల్సింది. ఇప్పుడు పుట్టి మమ్మల్ని వేధిస్తున్నారు’’, అని ప్రతిధ్వనించారు శ్రీశ్రీ. 1994లో ‘‘కాలరేఖ’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు శేషేంద్రశర్మ. ఆయన వ్రాసి సినిమాలకు వాడబడిన ఒకే ఒక్క పాట, ‘‘ముత్యాల ముగ్గు’’ సినిమాలోని ‘‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ...’’. ‘‘ముత్యాలముగ్గు’’ సినిమా షూటింగ్ 15నుండి నెల రోజులపాటు శేషేంద్రశర్మ భార్య ఇందిరా ధన్‌రాజ్‌గీర్‌కు చెందిన జ్ఞానబాగ్ ప్యాలెస్‌లో జరగడం, సినిమాలో ఈ పాట వాడటానికి దోహదం చేసింది.
త్రిపురనేని రామస్వామిచౌదరి కొడుకు త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ రచయిత. ఎన్నో మంచి కథలు వ్రాశారు. అందులో ‘‘్ధర్మవడ్డీ’’ ప్రసిద్ధి చెందిన కథ. కె.బి.తిలక్ దర్శకత్వం వహించి, జగ్గయ్య, ప్రభ నటించిన ‘‘్ధర్మవడ్డీ’’ సినిమా ఈ కథ ఆధారంగానే తీయబడింది. 1981లో ఈ కథకు ఆయనకు posthumousగా నంది పురస్కారం కూడా లభించింది. ఆయన వ్రాసిన ‘‘అసమర్థుని జీవయాత్ర’’ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన నవల Foma Gordayev (The Man Who was Afraid) ఛాయలు దీనిలోఉన్నాయని కొందరంటారు). ఈ నవలను ‘‘ఎందుకు?’’అనే ప్రశ్నను నేర్పినందుకు తన తండ్రికి అంకితమిచ్చారు. 1963లో ఆయన వ్రాసిన ‘‘పండిత పరమేశ్వరశాస్ర్తీ వీలునామా’’ నవలకు posthumousగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2011లో, ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం
ఒక స్టాంపును విడుదలచేసింది. 1939లో ఆయన సినీరంగ ప్రవేశంచేసి, గుడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ‘‘రైతుబిడ్డ’’ సినిమాకు సంభాషణలు వ్రాశారు. ‘‘లక్ష్మమ్మ’’, ‘‘పేరంటాలు’’, ‘‘ప్రియురాలు’’ సినిమాలకు దర్శకత్వం వహించారు.
రాచకొండ విశ్వనాథశాస్ర్తీ ‘‘ఆరు సారా కథలు’’, ‘‘ఆరు సారో కథలు’’, ‘‘బాకీ కథలు’’ మొదలైన ఎన్నో కథలు, నవలలతో తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేశారు. ఆయన వ్రాసిన ‘‘కార్నర్ సీట్’’ ప్రసిద్ధిచెందిన కథ. ఆయన వ్రాసి, పలుమార్లు ప్రదర్శింపబడ్డ ‘‘నిజం’’ నాటకంలోనూ, గురజాడగారి ‘‘కన్యాశుల్కం’’నాటకంలోనూ నటించారు. ప్రత్యగాత్మ తాను దర్శకత్వం వహిస్తున్న విప్లవాత్మక చిత్రం ‘‘స్ర్తి’’కి మాటలు వ్రాయమని ‘‘అల్పజీవి’’ రాచకొండ విశ్వనాథశాస్ర్తీని ఒప్పించారు. మార్పుచేర్పులతో రావిశాస్ర్తీ మాటల రచన పూర్తయ్యింది. రావిశాస్ర్తీ విశాఖకు తిరిగి వెళుతూ తన సహజ ధోరణిలో ఒక చెణుకును విసిరారు. ‘‘సినిమావాళ్ళు శాన మంచోళ్ళు. మన కాఫీ మనల్ని త్రాగనీయరు, మన తిండి మనల్ని తిన నీయరు. చివరకు మన డైలాగులు మనల్ని రాయనీయరు.’’ అయితే సినిమా రంగానికి కృతజ్ఞతలు తెలుపుకొన్న గొప్ప రచయితలూ లేకపోలేదు.
‘‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుధాగాన మంజువాణి... దిగిరాను దివినుండి భువికి’’అంటూ దివిలో కవితావిహారం చేస్తున్న దేవులపల్లి క్రిష్ణశాస్ర్తీని పట్టుబట్టి భువికిదించారు బి.యన్.రెడ్డిగారు 1951లో. ఆ తరువాత ఆయన ‘‘బి.యన్.రెడ్డిగారు నన్ను కవిగా రక్షించారు. లేకపోతే, నా కవిత్వం కూడా విశ్వనాథ సత్యనారాయణగారి కవిత్వంలా పుస్తకాలకే పరిమితమయ్యుండేది’’ అన్నారట డి.వి.నరసరాజుతో. ‘‘క్రిష్ణపక్షం’’, ‘‘ప్రవాసం’’, ‘‘ఊర్వశి’’వంటి ప్రముఖ రచనలుచేశారు దేవులపల్లి. గోదాదేవి వ్రాసిన తమిళ గ్రంథం ‘‘తిరుప్పావై’’ని తెలుగులోకి అనువదించారు. తెలుగు సినిమా రంగానికి పలు అద్భుతమైన గీతాలనందజేశారు. 1976లో పద్మభూషణ్ పురస్కారమందుకున్నారు. చనిపోవడానికి రెండేళ్ళకు ముందు, 1978లో ‘‘దేవులపల్లి క్రిష్ణశాస్ర్తీ సమగ్ర సాహిత్యం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమందుకున్నారు. 1978లో ‘‘సీతామాలక్ష్మి’’ సినిమాలో పాటలకు, ఎప్పుడో వ్రాయబడి ఆ తరువాత 1982లో వచ్చిన ‘‘మేఘసందేశం’’ సినిమాలో వాడబడిన ‘‘ఆకులో ఆకునై’’పాటకు నంది పురస్కారాలనందుకున్నారు.
ఇక ‘‘రెండు శ్రీలు ధరించి, రెండు పెగ్స్ బిగించి, వరలు శబ్దవిరించి’’గా విలసిల్లిన శ్రీశ్రీ జీవితానికి సినీ రంగం వెనె్నముకగా లేకుంటే, ఆయన విశాఖపట్నంలో విప్లవ గీతాలు వ్రాసుకుంటూ విరసం సభల్లో వాటిని అడపాదడపా పాడుకుంటూ ఉండేవారేమో, ఒక సందర్భంలో ఆయన ‘‘అవకాశం దొరికితే వాసన్ (ఎస్.ఎస్.వాసన్ జెమినీ స్టూడియోస్ అధినేత, గొప్ప తెలుగు, తమిళ సినిమాల నిర్మాత), లేకపోతే ఉపవాసన్’’అని కూడా అన్నారు. ‘‘మహాప్రస్థానం’’, ‘‘ఖడ్గసృష్టి’’ ఆయన ప్రముఖ రచనలు. 1972లో ‘‘శ్రీశ్రీ సాహిత్యం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1950లో ‘‘ఆహుతి’’తో ఆయన సినీరంగ ప్రవేశంచేశారు. 1974లో వచ్చిన ‘‘అల్లూరి సీతారామరాజు’’ సినిమాకు ఆయన వ్రాసిన ‘‘తెలుగువీర లేవరా’’ గేయానికి జాతీయ పురస్కారం లభించింది. ఈ గేయంలో వ్యాకరణ దోషముందని ఆయన హానెస్ట్‌గా ఒప్పుకున్నారు. 1983లో చనిపోవడానికి కొన్నిరోజుల ముందు విడుదలయిన ‘‘నేటి భారతం’’ సినిమాకు వ్రాసిన ‘‘అర్థరాత్రి స్వాతంత్య్రం అంధకార బంధురం’’ పాటకు నంది పురస్కారం లభించింది. సినారె జ్ఞానపీఠం రాకముందు ఆ పురస్కారానికి స్వయంగా ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తుల్లో శ్రీశ్రీ ఒకరు.
ఆరుద్ర (్భగవతుల సదాశివ శంకరశాస్ర్తీ) ప్రముఖ కవి, పరిశోధకుడు, సాహిత్యవేత్త. ‘‘త్వమేవాహం’’, ‘‘సమగ్రాంధ్ర సాహ్యిం’’ (13 సంపుటాలు), ‘‘కూనలమ్మ పదాలు’’ ఆయన ప్రముఖ రచనలు. తమిళ గ్రంథం ‘‘తిరుక్కురాల్’’ను తెలుగులోకి అనువదించారు. 1987లో ‘‘గురజాడ గురుపీఠం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సినారె తనకు జ్ఞానపీఠ్ పురస్కారం రాకముందు ఆ పురస్కారానికి స్వయంగా ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తుల్లో ఆరుద్ర కూడా ఒకరు. 1950లో ‘‘బీదలపాట్లు’’తో సినీ గేయ రచయితగా కెరియర్ ప్రారంభించారు. ‘‘కొండగాలి తిరిగిందీ, గుండె ఊసులాడిందీ’’తో సహా ఎన్నో ప్రసిద్ధిచెందిన సినీ గేయాలు వ్రాశారు.

(మరికొందరు వచ్చేవారం)


వారం వారం గోచారం (16.2.2020 నుంచి 22.2.2020 వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు, నష్టాలు, ఆరోగ్య లోపాలకు అవకాశముంది. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అధికారిక కార్యక్రమాల్లో ఒత్తిడులు, లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు. ముఖ్య కార్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వారం మధ్యమంలో శుభకార్యక్రమాలపై దృష్టి, కీర్తి ప్రతిష్టలు. సుదూర ప్రయాణ భావన. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. నిరాశ తగ్గించుకోవాలి. విలాసాలు, విందుల కోసం ఖర్చులుంటాయి. విహారయాత్రలకు అనుకూలం. విశ్రాంతిగా గడుపుతారు. సౌఖ్యాలుంటాయి. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. హోదా పెంచుకుంటారు. పదోన్నతులకు అవకాశం. కొంత అసంతృప్తి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆథ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు కలుగుతుంది. కొంత అసంతృప్తి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత. భాగస్వామ్య వ్యపారాలు రాణిస్తాయి. హోదా పెంచుకుంటారు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయాలి. నిరాశ తగ్గించుకోవాలి. దానధర్మాల వల్ల మేలు. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. లాభాలకై ఆశించకుండా కృషి చేయాలి. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మేలు కలుగుతుంది. వారాంతంలో ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం. కొంత అసంతృప్తి. వృత్తి, ఉద్యోగాదుల్లో పదోన్నతులుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలపై విజయం, గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ, కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. శారీరక శక్తి తగ్గుతుంది. వ్యాపారాదుల్లో అనుకూలత. ప్రయాణావకాశాలు, ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉన్నా కార్య నిర్వహణలో ఒత్తిడి తప్పకపోవచ్చు. వారం మధ్యమంలో భాగస్వామ్యాలపై దృష్టి, పరిచయాలు, స్నేహానుబంధాల విషయంలో ఒత్తిడులుంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనారోగ్య భావనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ఊహించని సంఘటనలకు అవకాశం. లోపాలను శ్రమతో అధిగమించాలి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన, అభీష్టాలు నెరవేరుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానవర్గ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. లోపాలను అధిగమిస్తారు. శ్రమ ఉంటుంది. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. అన్ని పనుల్లోనూ చికాకులుంటాయి. కార్య నిర్వహణలో కొంత నిరాశ. సమున్నత భావాలపై దృష్టి ఉన్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. ఉన్నత లక్ష్యాలను సాధించడంలో శ్రమ తప్పదు. ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. వారాంతంలో భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాల్లో జాగ్రత్త. ఆరోగ్య లోపాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి, ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ వాహనాలపై ప్రత్యేక దృష్టి. వ్యతిరేక ధోరణులు తప్పవు. పోటీ రంగంలో ఒత్తిడులు. కార్యనిర్వహణలో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార భాగస్వాములతో మంచి అనుబంధాలు. కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సంతాన వర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. ప్రణాళికల్లో కొంత ఇబ్బంది ఏర్పడే సూచనలు. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. ఆహార వ్యవహారాలు, ప్రయాణాలు, విలాసాలతో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో పోటీలు, ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు అధికం.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సంతానవర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు, ఒత్తిడులున్నా విజయం లభిస్తుంది. వ్యాపారాదుల కోసం ప్రయాణిస్తారు. వారం మధ్యమంలో సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి. ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. ఆశించిన సౌఖ్యం అంతగా అందకపోవచ్చు. విద్యారంగంలోని వారికి ఒత్తిడులు. భాగస్వామితో అత్యంత అనుకూలత. కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. ప్రణాళికాబద్ధత తగ్గే సూచనలు. పోటీల్లో విజయం సాధిస్తారు.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. బ్యాంకు వ్యవహారాలపై దృష్టి. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. సౌకర్యాలు ఆశించిన సంతోషాన్ని ఇవ్వలేవు. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలుంటాయి. క్రియేటివిటీ పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త వహించాలి. నిరాశ ఉంటుంది. ఆశించిన సహకారం అందకపోవచ్చు. వ్యతిరేకతలు ఎక్కువ. అన్ని విషయాలకు పోటీపడాల్సి వస్తుంది. పుణ్యం కోల్పోయే అవకాశం. ఋణాదుల చికాకులుంటాయి. వారాంతంలో గృహ వాహనాది సౌకర్యాల విషయాలపై దృష్టి. ఆశించిన సంతోషం అందక పోవచ్చు. శ్రమాధిక్యం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. స్వస్థత ఉంటుంది. సేవక వర్గ సంప్రదింపులు, సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో సమస్యలు. కమ్యూనికేషన్స్ విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపారాదులకు అనుకూలం. చమత్కారంగా వ్యవహరిస్తారు. ఆహార విహారాలుంటాయి. వారం మధ్యమంలో కుటుంబ, బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో తొందరపాటు కూడదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. కొన్ని నైరాశ్యపు భావనలుంటాయి. నిల్వధనం కోల్పోవచ్చు. ఆలోచనలకు రూపకల్పన. వ్యవహారాల్లో శుభపరిణామాలు. క్రియేటివిటీ పెరుగుతుంది. వారాంతంలో సంప్రదింపులపై దృష్టి, కొత్త వార్తలు ప్రభావితం చేస్తాయి. మీడియా రంగంపై దృష్టి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణావకాశాలు, కుటుంబ వ్యవహారాల కోసం ఖర్చులు, ప్రయాణాలు, ఆశించిన ధనం అందకపోవచ్చు. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వారం మధ్యమంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి, సమర్థత పెంచుకుంటారు. కొంత నిరాశ తప్పకపోవచ్చు. సౌకర్యాలకు అనుకూలం. సౌఖ్యంగా గడుపుతారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట్లాడే ధోరణిలో జాగ్రత్త అవసరం. అధికారిక సంప్రదింపులు, సహకారం ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు, లాభాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. నిర్ణయాదుల్లో చాలా ఆలస్యం ఉంటుంది. బద్ధకం తగ్గించుకోవాలి. పెద్దల ఆశీస్సులుంటాయి. కుటుంబంలో సంతోషం. వ్యాపారాదుల వల్ల నిల్వధనం పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు అధికమవుతాయి. థార్మికమైన ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ఆశించిన సంతృప్తి దొరకకపోవచ్చు. పరామర్శలకు అవకాశం. సంప్రదింపులుంటాయి. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ముఖ్యమైన వార్తలు వింటారు. వారాంతంలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. కొంత శ్రమ ఉన్నా బాధ్యతలు నెరవేర్చుతారు.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో ప్రయోజనాలు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. కొన్ని వ్యర్థమైన పనులు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త. విశ్రాంతి లోపం. వ్యాపార వ్యవహారాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో లాభాలు అధికం. కానీ ఆశించిన ప్రయోజనాలు అందలేదనే నిరాశ ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కుటుంబంలో సంతృప్తి, ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. బ్యాంకు కార్యక్రమాలపై దృష్టి. చమత్కార ధోరణి. వారాంతంలో నిర్ణయాలు ప్రాధాన్యం వహిస్తాయి. బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు. కుటుంబంలో ఒత్తిడి, మాటల్లో అధికారిక ధోరణి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాలుంటాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. నిరాశ ప్రభావితం చేస్తుంది. కొంత జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. క్రియేటివిటీ పెరుగుతుంది. బాధ్యతలు నిర్వర్తిస్తారు. కార్యనిర్వహణ, దక్షత, వారాంతంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అధికారికమైన ఖర్చులుంటాయి. విశ్రాంతి లోపాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం.

రాశిఫలం - 02-16-2020

$
0
0
తిథి: 
బహుళ అష్టమి రా.8.13, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం: 
విశాఖ ఉ.10.17
వర్జ్యం: 
మ.2.07 నుండి 3.39 వరకు
దుర్ముహూర్తం: 
సా.04.24 నుండి 05.12 వరకు
రాహు కాలం: 
సా.4.30 నుండి 6.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరలకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాటాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదోక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండుట మంచిది. అనవసర భయాందోళనకు లోనవుతారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నేరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంలందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండుట అవసరం.
కుంభం: 
ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకూ వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
Date: 
Sunday, February 16, 2020
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

భృంగి వాహనంపై గ్రామోత్సవం

$
0
0

*చిత్రం... శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి భృంగి వాహనంపై గ్రామోత్సవం

కర్నూలులోనే హైకోర్టు

$
0
0

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న మంత్రివర్గం నిర్ణయం, శాసన సభ ఏకగ్రీవ తీర్మానం మేరకు హైకోర్టును వీలున్నంత త్వరగా కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాన్‌కు స్పష్టం చేశారు. అలాగే శాసన మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కోరారు. జగన్ శనివారం మధ్యాహ్నం రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్ర హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం గురించి చర్చించారు. హైకోర్టును త్వరగా కర్నూలుకు మార్చాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాజధాని కార్యకలాపాలను
వికేంద్రీకరించటంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన రవిశంకర్ ప్రసాద్‌తో చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హై కోర్టును ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ 2019 నాటి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ఆలోచన అని జగన్ ఆయనతో చెప్పటం గమనార్హం. ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను శాసన మండలి అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. దీని వల్ల ప్రజాసామ్యం అపహాస్యమవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లులను అడ్డుకుంటున్న నేపథ్యంలోనే తమ ప్రభుత్వ శాసన మండలిని రద్దు చేయాలని సిఫారసు చేసిందంటూ ‘శాసన సభ తీర్మానం మేరకు వీలున్నంత త్వరగా శాసన మండలిని రద్దు చేయాలి’అని ఆయన రవిశంకర్ ప్రసాద్‌కు సూచించారు. శాసన సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసన మండలిని రద్దు చేయాలనే సిఫార్సు చేసిందని జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. కాగా మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం గురించ రవిశంకర్ ప్రసాద్‌కు వివరించిన జగన్‌మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని వీలున్నంత త్వరగా అమలులోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. కాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను వీలున్నంత త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మొదట రవిశంకర్ ప్రసాద్‌కు శాలువ కప్పి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రితో ఫోటోలు దిగిన రవిశంకర్ ప్రసాద్ ఆ తరువాత వైసీపీ ఎంపీలను తన చాంబర్‌లోకి ఆహ్వానించి వారితో పాటు ఒక గ్రూపుఫోటోదిగటం గమనార్హం.
*చిత్రం... ఢిల్లీ సంచార్ భవన్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి

అమరావతి టు హస్తిన

$
0
0

అమరావతి, ఫిబ్రవరి 15: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ముందు వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పొత్తులు.. ఎత్తులతో ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పటి వరకు అమరావతికే పరిమితమైన పార్టీలు హస్తినలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునస్సమీక్ష, రివర్స్ టెండరింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వ్యక్తిగత భేటీల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాజకీయ ప్రత్యర్థిగానే ఎన్టీఏ భావించింది. దీంతో పాటు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ రాజధానిలో ఆందోళనలు, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, వామపక్ష పార్టీల మద్దతుకు తోడు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా రైతులకు సంఘీభావంగా రాజధాని విషయంలో కేంద్రం స్పష్టతతో ఉందని, అంగుళమైనా కదిలించలేరని చెబుతూ వచ్చారు. అంతేకాదు రాజధానిపై బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ నిర్దేశించుకున్నాయి. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ కావటంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ భాగస్వామి కానుందని జరుగుతున్న విస్తృత ప్రచారం... ఇటు బీజేపీతో జతకట్టిన జనసేనకు అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీలకు మింగుడు పడటంలేదు. ప్రతిపక్ష పార్టీలకే కాదు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యులను కూడా ఈ భేటీలు కలవర పెడుతున్నట్లు చెబుతున్నారు. రాజధాని రైతుల్ని టీడీపీ రెచ్చకొడుతోందని, అందుకు జనసేన వంత పాడుతోందని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ పవన్‌తో దోస్తీ కట్టి టీడీపీని ఏకాకిని చేసింది. రాజధాని వ్యవహారంలో ఆచితూచి అడుగేసి చివరకు అది రాష్ట్ర నిర్ణయంగా పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. దీంతో టీడీపీ రాజధాని రైతుల్ని కూడగట్టి రాష్టప్రతి, ఇతర కేంద్ర మంత్రులను కలవటం, దీనిపై కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం కాక పోవటంతో వ్యూహం బెడిసి కొట్టింది. దీనికి తోడు గత మూడు రోజులుగా జగన్‌కు కేంద్ర పెద్దల వరుస అపాయింట్‌మెంట్లతో ఏకంగా ఎన్డీఏలో వైసీపీ భాగస్వామ్యం పంచుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని భావించిన బీజేపీ వచ్చే ఎన్నికల్తో పార్టీ భవితవ్యాన్ని ఇప్పటి నుంచే బేరీజు వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీ పొత్తుల విషయంలో ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో పోటీచేసి కొద్దో గొప్పో ఉనికిని చాటుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయింది. టీడీపీని పూర్తి స్థాయిలో పాతాళానికి నెట్టిన నేపథ్యంలో వైసీపీ దారికొస్తుందనే భావనతో ఉన్న బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలపై సానుకూలంగా స్పందించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. ఇందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రానికే వదిలేసినట్లు చెప్తున్నారు. ఇక మండలి రద్దు అంశాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని జగన్ ఇప్పటికే ప్రధాని, కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిసింది. ఓ వైపు మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై దూకుడు పెంచుతూ మరోవైపు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అడుగులు వేస్తున్నారు. స్థానిక ఎన్నికలలోపు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ ముఖ్యనేతలను ఇరికించటంతో పాటు సీబీఐ, ఈడీ విచారణలకు ఆదేశించే దిశగా కేంద్రాన్ని ఒప్పించాలనేది జగన్ మదిలో మాటగా చెప్తున్నారు. దీనికి తోడు సీబీఐ కేసుల్లో కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇప్పటికే ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రిని కోరినట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా రాజధానుల తరలింపు, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లపై న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకే ఢిల్లీ పర్యటనను ఒకరోజు పొడిగించుకుని అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. అన్నింటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కేంద్రంతో సఖ్యతకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అమరావతితో పాటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు జనసేన పార్టీని సైతం కలవర పెడుతున్నట్లు చెప్తున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం కావటం ప్రభుత్వపరమని, పార్టీ పరంగా వైసీపీకి బీజేపీ, జనసేన ప్రత్యర్థులని ఇరు పార్టీల రాష్ట్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. రాజధాని పర్యటనలో భాగంగా రైతులకు సంఘీబావం ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఇదే రకమైన వాదన వినిపిస్తూనే ఎవరు వచ్చినా రాకపోయినా తాను రైతులపక్షాన నిలుస్తానని రాజధాని ఇక్కడే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అంటే భవిష్యత్‌లో బీజేపీ దూరమైనా జనసేన ఒంటరి పోరాటం చేస్తుందనే సంకేతాలు పంపారు. కాగా జనసేన పొత్తుతో స్థానిక ఎన్నికల్లో తలపడాలని బీజేపీ నిర్ణయించింది. తమకు వైసీపీ, టీడీపీ ప్రత్యర్థులని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో అటు బీజేపీ, ఇటు జనసేనకు బలమైన క్యాడర్ లేదనేది సుస్పష్టం. ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఎలా సత్తా చాటగలమని ఆ పార్టీల నేతలే చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితులను నిశతంగా పరిశీలించే బీజేపీ హైకమాండ్ రాష్ట్రానికి ఒకింత చేయూతనివ్వటంతో పాటు ఉపాధి హామీ, ఇతర పథకాలపై తన ముద్రపడేలా ప్రయత్నాలు జరుపుతోందని, జగన్‌తో కేంద్ర పెద్దల భేటీ వెనుక అసలు మర్మం ఇదే అని బీజేపీ నేతలు చెప్తున్నారు. మండలి రద్దు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్సీలు ఇటీవల పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలను కలుసుకున్న నేపథ్యంలో ప్రక్రియ జాప్యం చేయటం ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలను తమ పార్టీ వైపు మలచు కోవాలనేది బీజేపీ మరో వ్యూహంగా తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలకు మార్గం సుగమమైతే విభజన అంశాల సాధనతో పాటు ఆర్థికంగా గట్టెక్కినట్లే అని అధికార పార్టీ నేతలు ఆశిస్తున్నారు.
*చిత్రం... ఢిల్లీ పర్యటనలో వైసీపీ పార్లమెంట్ సభ్యులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మంతనాలు

కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం

$
0
0

పలాస, ఫిబ్రవరి 15: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపడమై ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లకాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. శనివారం బొడ్డపాడులో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. అంతకుముందు పలాసలోని డయాలసిస్ కేంద్రాన్ని, 50 కోట్లతో నిర్మితమవుతున్న కిడ్నీవ్యాధి పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిని సమూలంగా నివారించే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకు భగవంతుడు సహకరిస్తారన్నారు. పలాస, సోంపేట డయాలసిస్ కేంద్రాలకు అదనంగా 5 బెడ్‌లు చొప్పున ఏర్పాటు చేస్తామని, డయాలసిస్ చేసుకుంటున్న వారికి స్థానికంగా మందులు ఇస్తామన్నారు. కియోటన్-3,4,5 స్టేజ్‌లు దాటినవారికి 5 వేల రూపాయల పింఛన్, పింఛన్ నమోదు కార్యక్రమాన్ని స్థానికంగా చేసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ఉద్దాన ప్రాంతానికి 700 కోట్ల రూపాయలతో శుద్ధ జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఇంటింటి కుళాయి పథకాన్ని నిలుపుదల చేసి, ఉద్దాన ప్రాంతంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని ఏర్పాటు చేసారన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని, బాధితులు ధైర్యంగా ఉండాలన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని

టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

$
0
0

సూర్యాపేట రూరల్: టీఆర్‌ఎస్ నేతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వెంబడించి కత్తులతో పొడిచి, రాళ్లతో కొట్టి కిరాతకంగా హతమార్చిన సంఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సమస్యాత్మక గ్రామంగా పేరున్న ఎర్కారంలో రాజకీయ కక్షలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
ఈనేపథ్యంలోనే సహకార ఎన్నికల ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న (39)ని అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డే యల్లయ్య వర్గీయులు 20 మంది అర్ధరాత్రి సమయంలో కత్తులతో వెంబడించారు. ఒంటెద్దు వెంకన్నతో పాటు ఆయనతో ఉన్న గ్రామసర్పంచ్ భర్త చింతలపాటి మధులు వారి నుండి తప్పించుకుంటూ గ్రామంలోని ఆవుదొడ్డి సైదులు ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. ఇంట్లోకి చొరబడి కాంగ్రెస్ వర్గీయులు ఒంటెద్దు వెంకన్నపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు రాళ్లతో తలపై మోది దారుణంగా హతమార్చారు. వెంకన్న చనిపోయినట్టు నిర్ధారించుకొని కేరింతలు కొడుతూ పైశాచిక ఆనందంతో అక్కడి నుండి వెళ్లి పోయారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సమయం నుండి గ్రామంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
వడ్డే యల్లయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి తన ఓటమికి వెంకన్న కారణమని కక్ష పెంచుకున్నాడు. సహకార ఎన్నికల నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓటర్లను మూడు రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని ఒక ఫంక్షన్‌హాల్‌కు తరలించగా యల్లయ్య వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై టీఆర్‌ఎస్ వర్గీయులు దాడి చేశారు. దీంతో కక్ష పెంచుకున్న కాంగ్రెస్ వర్గీయులు వెంకన్నను హతమార్చాలని పథకం వేశారు. సహకార ప్రచారంలో ఉన్న విషయం తెలుసుకొని దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈఘటనలో కాంగ్రెస్ వర్గీయుడు మిద్దె సైదులు కత్తిపోట్లకు గురికాగా పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హత్యసమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఇన్‌చార్జీ ఎస్పీ, నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాధ్ హత్యా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపారు. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించారు.
మృతుని భార్య నిర్మల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన భర్తను వడ్డే యల్లయ్య, చింతలపాటి మధులే పథకం పన్ని హత్య చేశారని హతుడి భార్య ఆరోపించారు. హత్య నేపధ్యంలో పోలీసులు గ్రామంలో పికెట్‌ను ఏర్పాటు చేశారు.
*చిత్రాలు.. హత్యకు గురైన ఒంటెద్దు వెంకన్న, *ఫైల్ ఫొటో, * వెంకన్న మృతదేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి


పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పల్లెల ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిప్రజాప్రతినిధులను కోరారు. ఈ నెల 20వ తేదీ వనపర్తి, 21వ తేదీన జోగుళాంబ గద్వాల, 23వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాల్లో పంచాయతీ సమ్మేళనాలకు ఇన్‌చార్జీగా మంత్రిగా హాజరవుతున్నుటల్చెప్పారు. గాంధీజీ కలలుకన్న గ్రామ వికాసం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తపిస్తునానరన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నది ఇప్పటి వరకు నినాదంగానే మిగిలిపోయిందన్నారు. దీనిని కేసీఆర్ నిజం చేస్తున్నార్నారు.
గ్రామాల అభ్యున్నతి కోసం పటిష్టమైన ప్రణళికతో ప్రభుత్వం ఒక్క మనిషికి ఏడాదికి రూ..1655 కేటాయిస్తుందన్నారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి వాడుకోవాలన్నారు. మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలన్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్టమ్రే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, గ్రామాభివృద్ధిశాఖ ఉద్యోగులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఆస్ట్రేలియాలో కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు
కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని సిడ్నీ, ఆడిలైడ్, మెల్బోర్న్, కానె్బర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్‌ట, బెండిగో, బల్లార్ట్ నగరాల్లో నిర్వహించినట్లు టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి చెప్పరు. రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీల కేసీఆర్ దీర్ఘయుష్యుకై ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి, ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి చావు అంచులకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నేడు ప్రగతి రథంలో నడిపిస్తున్న కేసీఆర్ దీర్గాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరారు. ఈ వేడుకల్లో రవీందర్ చింతామణి, రవి శంకర్ దూపాటి, లక్ష్మణ్ నల్సా, పరుశురామ్, మతుకుల, సంగీత ధూపాటి తదితరులు పాల్గొన్నారు.

పశుసంవర్థక కార్యాలయాల్లో
కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు: తలసాని
ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలలు, మత్స్య శాఖ కార్యాలయాలు, డెయిరీ కార్యాలయాలు, వెటర్నరీ యూనివర్శిటీల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్న్నా అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందన్నారు. విరివిగా మొక్కలను నాటడం వల్ల కాలుష్యాన్ని నిరోధించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ ఫ్రత్యేక ఆలోచన, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా హరిత హారం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.

గిరిజనుల సంస్కృతిని పరిరక్షించిన మహానేత కేసీఆర్

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో గిరిజనుల సంస్కృతిని పరిరక్షించిన మహానేత కేసీఆర్ అని, గిరిజనుల సంక్షేమం కోసం ఇతోధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఇక్కడ ఆమె శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్, ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భోగ్ భండార్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సేవాలాల్ పండుగ కోసం కోటి రూపాయలు కేటాయించి నోగ్ భండార్ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారన్నారు. తాను తక్కువ చదువుకున్నా, సేవాలాల్ మహారాజ్ దీవెనలతో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ శాఖకు మంత్రిగా పని చేస్తూ గిరిజనులకు సేవ చేసే అవకాశం లభించినట్లు చెప్పారు. తాను ప్రస్తుతం మంత్రిని అయినా ముందుగా గిరిజన బిడ్డనని, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్నీ గురుకులాలను పెట్టరన్నారు. ఉన్నత ఉద్యోగాలు పొందాలన్నారు. బంజారాహిల్స్‌లో మనకు స్థానం లేకుండా అభివృద్ధి అయితే, ఇప్పుడు రూ.100 కోట్ల విలువైన భూమిని కేటాయించి బంజారా భవన్‌ను నిర్మించి ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నారన్నారు. కొమురం భీమ్‌భవన్‌ను కూడా నిర్మించి రాష్ట్రంలో అందరూ ఆత్మగౌరవంగా ఉండే విధంగా కృషి చేస్తున్నార్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సమాచార కమిషనర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

17 నుంచి బయో ఏషియా సదస్సు

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు బయో ఏషియా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బయో ఏషియా సదస్సు సందర్భంగా లైఫ్ సైనె్సస్ విభాగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా జీవ శాస్త్ర పరిశోధకులు, పాలసీ మేకర్లు, ఇన్నోవేటర్లు, పెట్టుబడీదారులు పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బయో ఏషియా సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పరిశోధకులు, పెట్టుబడీదారులు ఆసక్తిని కనపరుస్తున్నరన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, శాస్తవ్రేత్తలు డాక్టర్ కార్ల్ జూన్, డాక్టర్ పీటర్ పియట్, డాక్టర్ వ్యాస్ నరసింహన్,, డాక్టర్ జాన్ వాన్ ఆకర్, దిలీప్ సింఘ్వీ, అజయ్ పిరమాల్, కిరణ్ మజుందార్ షా పాల్గొంటారు. ఫార్మా పరిశ్రమ, వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

నకిలీ పట్టాలు ఇచ్చి మోసం.. నిందితుల అరెస్టు

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పట్టా ప్లాట్, డబుల్ బెడ్ రూమ్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఇల్లు ఇప్పిస్తామని పాతబస్తీ సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్‌నగర్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కోటి 10 లక్షల రూపాలు తీసుకుని నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశా. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించి కేసు నమోదు చేసి కుర్మగూడ సైదాబాద్‌కు చెందిన మహ్మద్ మసూద్ హమ్మద్, బండ్లగూడకు చెందిన ఖాజా గౌసుద్దీన్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నేడు మంత్రివర్గ సమావేశం.. అసెంబ్లీ తేదీల ఖరారు

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాష్ట్రంలో పలు అభివృద్ధి అంశాలను సమీక్షించనున్నారు. అలాగే వివిధ వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై పలు వరాలను ప్రకటిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ధర్నా 17వ తేదీకి వాయిదా

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లపై కుట్రపన్నుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన ధర్నా దీక్షను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీన సోమవారం ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆయన కోరారు.

గాంధీతోపాటు నెహ్రూ విగ్రహాన్నీ ఏర్పాటు చేస్తా

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తాను రాజకీయాలపై మూడు నెలల పాటు వౌనంగా ఉంటానని చెప్పానంటే ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడకపోవడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ రేసులో తాను ఉన్నట్లు చెప్పడమంటే ఇంటి సమస్యలపై వౌనంగా ఎలా ఉంటానని అన్నారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మార్పు తప్పదనుకుంటే తనకు ఆవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసకు వచ్చే వైద్యం తన వద్ద ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడు అంటే ఇంటి పెద్ద లాంటి వారని, ఎవరూ వ్యతిరేకించరన్నారు. సంగారెడ్డిలో గాంధీ విగ్రహంతో పాటు నెహ్రూ విగ్రహం కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 60 అడగుల నెహ్రూ విగ్రహాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తామన్నారు. జీవితం అంతా పోరాటాల్లోనే గడిపిన నేత నెహ్రూ అన్నారు. గాంధీ విగ్రహంతో పాటు నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


బాధ్యులైన వైద్యులను ఉపేక్షించం

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గాంధీ ఆసుపత్రిలో అక్రమాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని రాష్ట్ర వైద్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ స్థాయిలో ఉన్న ఒక వైద్యుడు ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదన్నారు. వైద్య శాఖలో చోటుచేసుకుంటున్న అనేక అంశాలపై కమిటీలు ఏర్పాటు చేస్తామని, వాటి నుంచి వచ్చే నివేదికలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తులు వచ్చి వెళుతుంటారని, వ్యక్తుల కంటే వ్యవస్థ మిన్న అన్నారు. రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో ప్రమాణాలను పెంచుతామన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవకతవకలపై విచారణ చేపడుతామన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేత విచారణ జరిపిస్తామన్నారు.

కేటీఆర్ పీఏనంటూ మోసం

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ నాగుజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు కోకరా వేశాడు. దీంతో పాటు ఈనెల 9వ తేదీన కేటీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఎల్‌బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం సభలో స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు చివరికి పోలీసులకు చిక్కాడు. నాగరాజు చీటర్ అని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకాకుళంకు చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెటర నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ రికార్డ్ అసిస్టెంట్

$
0
0

సైదాబాద్, ఫిబ్రవరి 15: విధినిర్వహణలో భాగంగా తాను చేయాల్సిన పనికి డబ్బు ముట్టచెప్పాల్సిందే అని డిమాండ్ చేసాడో ప్రభుత్వ విద్యాశాఖ అధికారి. న్యాయంగా తనకు రావాల్సిన సొమ్ము కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని సీనియర్ సిటిజన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లంచం ఇస్తుండగా తీసుకున్న విద్యాశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తివివరాలు ఈవిధంగా ఉన్నాయి... సైదాబాద్ ఒవైసీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మిర్ గజన్‌ఫర్ అలీఖాన్‌కు చెందిన భవనంలో గత సంవత్సరం ఏప్రిల్ వరకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలను నిర్వహించారు. దానికి సంబంధించిన అద్దె రూ.12లక్షల 26వేలలో అతని ఖాతకు రూ.11లక్షలను అధికారులు గత ఆగస్టులో జమ చేసారు. మిగిలిన రూ.1లక్షా26వేలు విషయమై ఐటీ పేచీ ఏర్పడింది. సీనియర్ సిటిజన్ అయినందున బాధితుడికి ఐటీ వెసులుబాటు ఉంది. ఈవిషయాన్ని మలక్‌పేట బీబ్లాక్స్‌లోని సైదాబాద్ రేంజ్-1 డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే గద్దం బాబురాజు నిర్దారించి రిపోర్ట్ ఇవ్వాలి. అయితే తాను ఆపని చేయాలంటే రూ.10వేలు ఇవ్వాలని బాబురాజు బాధితుడ్ని డిమాండ్ చేసాడు. తనకు రావాల్సన బకాయి సొమ్ము కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని అలీఖాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం సైదాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో అలీఖాన్ పదివేల రూపాయలను బాబురాజుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో ఉందని అధికారులు పేర్కొన్నారు.

సహకార ఫలితాల్లో కారు హవా

$
0
0

షాద్‌నగర్, ఫిబ్రవరి 15: మున్సిపల్ ఎన్నికల ఫలితాలను తలపిస్తూ..సహకార సంఘాల ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోయింది. షాద్‌నగర్ డివిజన్‌లోని ఆరు సహకార సంఘాల ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. షాద్‌నగర్-్ఫరూఖ్‌నగర్ సహకార సంఘంలో మొదటి వార్డులో నందిగామ శ్రీనివాస్, 2వ వార్డులో పాండురంగారెడ్డి, 3వ వార్డులో మాణెమ్మ, 4వ వార్డులో శివరాజ్‌గౌడ్, 5వ వార్డులో ఉమాదేవి, 6వ వార్డులో చెన్న కేశవులు, 7వ వార్డులో ప్రభాకర్, 8వ వార్డులో అంతయ్య (కాంగ్రెస్), 9వ వార్డు బక్కన్న యాదవ్, 10వ వార్డులో బాబు నాయక్, 11వ వార్డులో జగదీశ్వర్, 13వ వార్డులో మల్లయ్యలు ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించారు. షాద్‌నగర్-్ఫరూఖ్‌నగర్ సహకార సంఘం ఎన్నికల్లో మొత్తం 13వార్డులకు ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12వార్డులో ఫలితం రీకౌంటింగ్‌కు దారి తీసింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు చివరకు రీకౌంటింగ్‌కు పట్టు పట్టడంతో ఎన్నికల అధికారులు రీ కౌంటింగ్ ద్వారా విజేతను ప్రకటించారు. . షాద్‌నగర్‌తో పాటు కొత్తపేట, మేకగూడ, కొందుర్గులలో కారు దూసుకుపోయింది. ఇక్కడ మెజార్టీ డైరెక్టరు స్థానాలను కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్ పార్టీ చైర్మను పదవులను తమ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది..నందిగామ, చేగూరులలోనే స్పష్టత రాలేదు.
టీఆర్‌ఎస్‌కు 54డైరెక్టర్ స్థానాలు.. కాంగ్రెస్‌కు 23డైరెక్టర్ స్థానాలు
షాద్‌నగర్: ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ హవా జోరుగా వీసింది. షాద్‌నగర్ డివిజన్‌లోని ఆరు సహకార సంఘాలకు శనివారం నిర్వహించిన పోలింగ్, ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎక్కువ డైరెక్టర్ స్థానాలను కైవసం చేసుకుంది. షాద్‌నగర్ డివిజన్‌లోని ఆరు సింగిల్ విండోల్లో మొత్తం 78డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 54డైరెక్టర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. 23స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విజయం సాధించింది. చేగూరు 13వ వార్డు నుండి విజయం సాధించిన అభ్యర్థి ఎటువైపు వెళ్తుందో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. నందిగామ సింగిల్ విండో ఎన్నికల్లో 8డైరెక్టర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఐదు స్థానాల్లో మాత్రం టీఆర్‌ఎస్ గెలుపొందింది. కొత్తపేట సహకార సంఘంలో 11డైరెక్టర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా రెండు స్థానాలను దక్కించుకుంది. చేగూరు సహకార సంఘంలో 8డైరెక్టర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. షాద్‌నగర్ డివిజన్‌లోని మొత్తం ఆరు సహకార సంఘాల ఎన్నికల్లో నాలుగు సంఘాలను అధికార పార్టీ కైవసం చేసుకున్నప్పటికి మరో సింగిల్ విండోల్లో ఎవరు చైర్మన్ పదవీ దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
మేకగూడ డైరెక్టర్లు వీరే
కొత్తూరు: నందిగామ మండలం మేకగూడ సహకార సంఘం ఎన్నికల ఫలితాలు మొదటి వార్డు టై కావడంతో ఉత్కంఠను రేపింది. 1వ వార్డు నుండి రవిందర్, యాదయ్యలకు చెరి 55ఓట్లు వచ్చి టై కావడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లాటరీ ద్వారా గెలుపు యాదయ్యను వరించింది. 2వ వార్డు డైరెక్టరుగా కంకంటి మంజుల రెడ్డి, 3వ వార్డు నుండి మామిళ్లపల్లి సత్యమ్మ, 4వ వార్డు నుండి దేశాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5వ వార్డు నుండి పల్గుట్ట శంకరయ్య 64ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 6వ వార్డు నుండి యాదమ్మ, 7వ వార్డు నుండి బల్వంత్ రెడ్డి, 8వ వార్డు కొర్ర తావుర్య, 9వ వార్డు నుండి కళ్లెం నరేందర్ రెడ్డి, 10వ వార్డు నుండి ఎర్ర శ్రీనివాస్, 11వ వార్డు నుండి ఎమ్మె జంగయ్య, 12వ వార్డు నుండి బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, 13వ వార్డు నుండి ఎల్లారం తిరుపతి రెడ్డి డెరెక్టర్లుగా ఎన్నికయ్యారు.
నందిగామలో
నందిగామ సహకార సంఘం ఎన్నికల్లో స్పష్టమైన అధిక్యం ఎవరికి లభించలేదు. 1వ వార్డు నుండి డైరెక్టరు కె.వెంకట్‌రెడ్డి, 2వ వార్డు నుండి మమత, 3వ వార్డు నుండి సురేష్, 4వ వార్డు నుండి రాంబాబు, 5వ వార్డు నుండి జయమ్మ, 6వ వార్డు నుండి పాత్లావత్ రూప్‌సింగ్, 7వ వార్డు నుండి తోట రాజగోపాల్, 8వ వార్డు నుండి గంగిశెట్టి రవి కుమార్, 9వ వార్డు నుండి రామస్వామి, 10వ వార్డు నుండి అంజయ్య యాదవ్, 11వ వార్డు నుండి రజనీకాంత్, 12వ వార్డు నుండి మేకల నర్సింలు, 13వ వార్డు నుండి పీర్లగూడం శంకరయ్య గెలుపొందారు.
మంజులా రెడ్డి అదృష్టం
మేకగూడ మాజీ సర్పంచ్ కంకంటి మంజులా రెడ్డిని మరోసారి అదృష్టం వరించనుంది. మేకగూడ గ్రామ పెద్ద మనిషిగా ఉంటూ అందరికి తలలో నాలుకలా ఉన్న కంకంటి నారాయణ రెడ్డి మృతి చెందడంతో ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మంజుల రెడ్డి మొదటి సారి సర్పంచ్‌గా గెలిచింది. ఇపుడు కొద్ది రోజుల క్రితమే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయి ఇపుడు పీఎసిఎస్ చైర్మను రేసులో ఉన్నారు. ఆదివారం జరుగనున్న పీఏసీఎస్ ఎన్నికల్లో చైర్మనుగా మంజుల రెడ్డిని ఎన్నుకునేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది.
కొందురు: సహకార సంఘం ఎన్నికల్లో మెజార్టీ డైరెక్టరు స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 1వ వార్డు నుండి జగదీశ్వర్ గౌడ్, 2వ వార్డు నుండి మాలకుంట్ల నర్సమ్మ, 3వ వార్డు నుండి కమ్మదనం శ్రీనివాస్ రెడ్డి, 4వ వార్డు నుండి కేతావత్ రెడ్యా, 5వ వార్డు నుండి ఎ.చక్రం రెడ్డి, 6వ వార్డు నుండి నర్సయ్య, 7వ వార్డు నుండి సి.దామోదర్ రెడ్డి, 8వ వార్డు నుండి పోల్కంపల్లి రామయ్య, 9వ వార్డు నుండి శ్రీనివాస్, 10వ వార్డు నుండి ఎస్.నారాయణ, 11వ వార్డు నుండి అబ్దుల్ జబ్బార్, 12వ వార్డు నుండి జి.బాల మాణెమ్మ, 13వ వార్డు నుండి జితేందర్ రెడ్డిలు విజయం సాధించారు. కొందుర్గు సహకార సంఘంలో మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు తొమ్మిది డైరెక్టర్ స్థానాలు అధికార పార్టీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. చైర్మన్ స్థానం అధికార పార్టీ దక్కించుకుంది. ఆదివారం చైర్మన్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
షాద్‌నగర్ చైర్మన్‌గా బక్కన్న?
షాద్‌నగర్ రూరల్: షాద్‌నగర్-్ఫరూక్‌నగర్ సింగిల్‌విండో చైర్మన్‌గా రాయికల్‌కు చెందిన బక్కన్న దాదాపు ఖరారయ్యారు. షాద్‌నగర్ సహకార సంఘం పరిధిలో మెజార్టీ డెరెక్టర్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో అధిష్టానం కూడా బక్కన్న వైపే మొగ్గు చూపుతోంది. 13డైరెక్టర్లకు గాను 11డైరెక్టరు స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా బక్కన్న, వైస్ చైర్మను బాబు నాయక్‌లను అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
చైర్మన్ కోసం పోటా పోటీ
కొందుర్గు సింగిల్‌విండో చైర్మను పదవి కోసం పోటా పోటీ నెలకొంది. శనివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో 13స్థానాలకు గాను టీఆర్‌ఎస్9, కాంగ్రెస్ 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాగా టీఆర్‌ఎస్ పిఏసిఎస్ చైర్మను పదవిని దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. దీంతో అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారినట్లు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డితో పాటు దామొదర్ రెడ్డి ఇరువురు చైర్మను పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలోనని అధిష్టానం తల పట్టుకుంది.
తలకొండపల్లి: మండల కేంద్రంలోని శనివారం నిర్వహించిన సింగిల్ విండొ ఎన్నికలకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చల్లంపల్లి గ్రామ నివాసి కావడంతో 2వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి 4వ వార్డులోని తన మద్దతు దారునికి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చుక్కాపూర్‌లో టీఆర్‌ఎస్ సంబరాలు
మండల కేంద్రంలోని సహకార సంఘం ఎన్నికలలో 4వ వార్డు నుండి టీ ఆర్ ఎస్ మద్దతు దారుడిగా మావిళ్లపల్లి వెంకట్‌రెడ్డి అభ్యర్థి పోటీ చేసి ఘన విజయం సాధించారు. శనివారం రాత్రి చుక్కాపూర్ గ్రామంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాలాపూరం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణా సంచాలు కాలుస్తూ ర్యాలీ తీశారు.
హయత్‌నగర్: రైతు సేవా సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఎన్నికల్లో మొత్తం 13 వార్డులకు గాను టీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 5, బీజేపీ ఒకటి చొప్పున గెలుపొందారు. హయత్‌నగర్ రైతు సేవా సహకార సంఘం ఎన్నికల్లో మొత్తం 13 వార్డులకు టీఆర్‌ఎస్ 5, కాంగ్రెస్ 6, ఒకరు ఏకగ్రీవం, మరొక వార్డులో ఎవరు పోటీ చేయకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు.
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండల రైతు సేవా సహకార సంఘం పాలకవర్గం ఎన్నికలలో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుని విజయ భేరీ మోగించింది. మండల రైతు సేవా సహకార సంఘం పరిధిలో మొత్తం 13 స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 డైరక్టర్ స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ ఒక్కటి, బీజేపీ ఒక్కటి స్థానాలకు పరిమితం అయ్యాయి. ఒక్కటో వార్డుకు చైర్మన్ అభ్యర్థి సింగిరెడ్డి రాంరెడ్డి, నాలుగవ వార్డుకు బీ.స్రవంతి రెడ్డి ఏకగ్రీవం కాగా మిగతా 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ హవా అత్యధిక స్థానాలను గెలిపించింది. ఒక్కటవ వార్డు సింగిరెడ్డి రాంరెడ్డి టీఆర్‌ఎస్ ఏకగ్రీవం, రెండవ వార్డు రేసు లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్, మూడవ వార్డు జిల్లెల పోచిరెడ్డి టీఆర్‌ఎస్, నాలుగో వార్డు బొక్క స్రవంతి టీఆర్‌ఎస్ ఏకగ్రీవం, ఐదో వార్డు వి.నర్సింగ్ టీఆర్‌ఎస్, ఆరవ వార్డు చందుపట్ల ధర్మారెడ్డి టీఆర్‌ఎస్, ఏడవ వార్డు కే. ఉదయ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఎనిమిదవ వార్డు గ్యార వెంకటేశ్ టీఆర్‌ఎస్, తొమ్మిదో వార్డు జడిగే రమేశ్ టీఆర్‌ఎస్, 10వ వార్డు గోపు బాల్‌రాజు టీఆర్‌ఎస్, 11వ వార్డు వంగూరి లక్ష్మమ్మ టీఆర్‌ఎస్, 12వ వార్డు బద్దం అనంత రెడ్డి టీఆర్‌ఎస్, 13వ వార్డు రామకృష్ణా రెడ్డి బీజేపీ గెలుపొందారు. కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి, మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజి ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.సహకార సంఘం ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవటంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

మేడ్చల్, డబిల్‌పూర్, పూడూరు పీఏసీఎస్‌లలో విజేతలు వీరే

$
0
0

మేడ్చల్, ఫిబ్రవరి 15: మేడ్చల్, డబిల్‌పూర్, పూడూరు పీఏసీఎస్‌ల పరిధిలో విజయం సాధించిన అభ్యర్థులు సాయంత్రం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వారిని పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మేడ్చల్ సహాకార సంఘం పరిధిలో 13 వార్డులు ఉండగా అందులో జంగ సత్యనారాయణ(1వ), గడ్డం బాలమ్మ(2వ), దామన్నగారి నరహారి(3వ), ఆర్. శ్రీరాములు(4వ), బీ. శ్రీనివాస్(5వ), జీ. శ్రీనివాస్ రెడ్డి(6వ), ఎస్. రణదీప్ రెడ్డి(7వ), ఏ. కృష్ణ యాదవ్(8వ), మెట్టు భార్గవి(9వ), ఎం. వెంకట్రామి రెడ్డి(10వ), ఎం.యాదగిరి(11వ), బీ.రాంరెడ్డి(12వ), బీ.నవీన్(13వ) వార్డుల నుండి విజయం సాధించారు. పూడూరు పీఏసీఎస్ పరిధిలో 13 వార్డులు ఉండగా ఎన్.సుధాకర్ రెడ్డి 1వ, బీ.స్వరూప 2వ, మాలోత్ రవి 3వ, ఎం.విఠల్ రెడ్డి 4వ, కే.వీరేందర్ 5వ, ఎం.మల్లేశ్ 6వ, ఎల్.శ్యాంలాల్ 7వ, ఎం.శ్రీశైలం 8వ, డీ.విజయ్‌కుమార్(9వ), కే.అర్జున్10వ, బీ.శ్రీనివాస్(11), తునికి సత్తమ్మ(12వ), వేముల సత్యనారాయణ రెడ్డి(13వ) వార్డుల నుండి గెలుపొందారు. అదేవిధంగా డబిల్‌పూర్ సోసైటీ పరిధిలో 12 వార్డులు ఉండగా అందులో కే. సత్తయ్య(1వ), ఏ. మధుసూదన్ రెడ్డి(2వ), జీ. వెంకటేశ్(3వ), శంగవుల మధుసూదన్(4వ), ఎం.దేవేందర్ రెడ్డి(5వ), జీ. భూపాల్(6వ), బ్రహ్మనంద రెడ్డి(7వ), జీ.పోచమ్మ(8వ), ఉసిగారి మల్లమ్మ(9వ), ఎస్.సురేశ్‌కుమార్ రెడ్డి(10వ), చిన్నోళ్ల సంజీవ(11వ), జీ.్భక్షపతి(12వ) వార్డుల నుండి విజయం సాధించారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>