Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గిరిజన బాలికలపై అత్యాచార ఘటనలో నేరస్థులను వదలొద్దు

$
0
0

విజయవాడ, మే 24: విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మయం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ డిఐజి, జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడి, వివరాలను తెలుసుకున్నారు. నేరస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆదేశించారు. నేరస్థుల వెనుక ఎవరు ఉన్నా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా బాధిత బాలికలకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
బాలికకు ఆర్థిక సాయం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరానికి చెందిన ఇంటర్ ర్యాంకర్ పూజిత పరిస్థితి తెలుసుకున్న సిఎం చంద్రబాబు, పై చదవుల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేశారు.


Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>