Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

మనీ చుట్టూ ‘వసూల్ రాజా’

Image may be NSFW.
Clik here to view.

నవదీప్, శ్రీహరి, రీతూబర్మేచా ప్రధాన తారాగణంగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో బి.ఎమ్.స్టూడియోస్ పతాకంపై బత్తుల రతన్‌పాండు, మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం ‘వసూల్ రాజా’. ఈ చిత్రానికి ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపాలకృష్ణ చిత్ర విశేషాలను వివరిస్తూ-‘‘ ఈ ప్రపంచమంతా ‘మనీ’ చుట్టూనే తిరుగుతోంది. మా సినిమా కూడా మనీ చుట్టూనే తిరుగుతుంది. ఇందులోని పాత్రీ పాత్ర డబ్బుకోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ డబ్బు వెంపర్లాట అంతా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో దొంగగా నవదీప్, పోలీస్‌గా శ్రీహరి నటిస్తున్నారు. వీరిద్దరి అనుబంధమే ఈ సినిమాకు కీలకం’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఇది పక్కా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్. బ్రహ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చింది. ఈనెల 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, సంగీతం: చిన్ని చరణ్, కెమెరా: కృష్ణప్రసాద్.

నవదీప్, శ్రీహరి, రీతూబర్మేచా ప్రధాన తారాగణంగా కార్తికేయ గోపాలకృష్ణ
english title: 
money

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles