Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

Image may be NSFW.
Clik here to view.
ఎల్.జ్యోతి, సికిందరాబాద్ ఉన్నవాడూ ఉన్నవాడికే పెట్టడం, లేనివాడూ ఉన్నవాడికే పెట్టడంలా ఉంది, నేటి పాతుకుపోయిన సాంస్కృతిక సంస్థలకు లభించే ఆర్థిక సహకారాలు. కొత్తవారికి ప్రోత్సాహం కరువు. కారణం? ‘పట్టు’ పరిశ్రమ శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తి ఒక వార్తాపత్రికను కొని పదిమంది చదివే దౌర్భాగ్యపు అలవాటు ఈ దేశంలోనేనా ఇతర దేశాలలో కూడా ఉన్నదా? అనేక తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను భరిస్తూ కూడా విశేష విజ్ఞానాన్ని అందించే వార్తాపత్రికను రోజుకు రెండు రూపాయలు పెట్టి కొనడానికి చేతులు రావు. అదే ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసే పాన్‌పరాగ్, గుట్కా మరియు సిగరెట్లకు రోజుకు వంద రూపాయల దాకా తగలేస్తారు. డబ్బు ఉన్నవారు కూడా 2.00 పెట్టి వార్తాపత్రికను కొనాలంటే సంశయిస్తారు. ఈ పరిస్థితి మారేదెప్పుడు? ప్రతివారూ కొనక్కర్లేదు. పత్రికల విలువ తెలిసినవాళ్లు - కొనే స్తోమత ఉండీ వాటిని రోజూ ముష్టి ఎత్తటం మానేస్తే చాలు. కోస్న ప్రభాకర్‌రెడ్డి, కోస్నపల్లె, ధర్మపురి ప్రస్తుత తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలా? వద్దా? వచ్చి తీరాలి. జి.జాహ్నవి, విశాఖపట్టణం నాయకుడిగా ప్రజలను పరిపాలించే వ్యక్తికి ఓర్పు సహనం చాలా ఉండాలి. కానీ ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చూస్తే ప్రజా ప్రతినిధా లేక రౌడీనా అనిపించింది. ఓ టోల్‌గేట్ దగ్గర ఎమ్మెల్యే కార్లకు డబ్బులు కట్టమని సిబ్బంది అడిగినందుకు ఎమ్మెల్యే బయటకు వచ్చి సిబ్బందిని కొట్టాడు. దీనిని అన్ని టీవీ ఛానెల్స్‌లో చూపించారు. ఇలాంటి వాణ్ని ఏమనాలి? ‘అసెంబ్లీ రౌడీ’ ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్ తాము పదవుల కోసం పార్టీలు మార్చటం లేదంటున్నారు. దశాబ్దాల తరబడి ఓ పార్టీలో అన్నీ అనుభవించి. మరెందుకు మారుతున్నారో? కాస్త గాలి మార్పుకు. ప్రజల్లో మార్పు రావాలని మీరు పదేపదే చెబుతున్నారు. ఎన్‌డిఏ, యుపిఏ, ఇంకేదో మూడో ఫ్రంటు అంటూ వివిధ పార్టీలకు పదవులు కట్టబెట్టారు ప్రజలు. ఇంకా ఏమి మార్పు రావాలో చెప్పండి. పార్టీలు పెట్టిన ఫ్రంట్లను నెత్తికెత్తుకోవటం కాదు. మొత్తం పార్టీలకు భయం ఉండేలా రాజకీయ వ్యవస్థను హద్దుల్లో ఉంచేలా ప్రజా చైతన్యం ఎదగాలి. పైల సంతోష్ కుమార్, పలాస మన మాజీ ముఖ్యమంత్రి తనయుడు జగన్మోహనరెడ్డిగారి అవినీతిని ఆధారాలతో సహా సిబిఐ నిరూపిస్తున్నా, వారి ఆస్తులను ఇడి అటాచ్‌మెంట్ చేస్తుంటే జగన్‌గారి సొంత పత్రిక ‘సాక్షి’ అవన్నీ కుట్రపూరిత చర్యలని, కుమ్మక్కులని ప్రజలకు చెప్పడం ఎంతవరకు సబబు. ఇది పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కాదా? చార్జిషీట్లలో పేర్కొన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు. ఎవరి పత్రికలో వారు తమ వాదాన్ని వినిపించటంలో తప్పు లేదు. మంచి చెడ్డలు నిర్ణయించాల్సింది విజ్ఞులైన ప్రజలు. శాండీ, కాకినాడ గత కొద్దికాలంగా ఉత్తరాలలో నాతో సహా తరచుగా కనిపించేవారు మాయమై కొత్తవారు కనిపిస్తున్నారు. మంచిదే. కొత్తవారిని ప్రోత్సహించవలసిందే. అందుకని పాతవారిపై శీతకన్ను వేయాలా? ‘మా పత్రిక కొని చదవండి. కాని మీ అభిప్రాయాలు మాకొద్దు’ అని పాతవారితో చెప్పడం సబబేనా? ఇవి కొన్ని, అవి కొన్ని ప్రచురిస్తే అందరికీ సంతృప్తి కాదా? మాటామంతీలో కూడా కోటాలంటే ఎలా? రమాదేవి, వినుకొండ చాలా ఉత్తరాలు చెత్తబుట్టలో వేశారు. మా ప్రశ్నలకు మీ నుంచి జవాబు ఎండమావేనా? కాంగ్రెస్ ఎం.పిలు తె.రా.స.లో చేరిక తెలంగాణ తెచ్చేలా ఉంది. హైకమాండ్‌లో కదలిక వచ్చినట్లుంది....? అది కూడా ఎండమావే! రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం పాపభీతి కొరవడినది. దేవుళ్ల సొమ్ము దోచుకు తింటున్నారు. అక్రమాలు, లంచాలు ధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్లు, దేవుని సొమ్ము అక్రమంగా తినకూడదను పాపభీతి గాని భక్తిగాని భయంగాని లేదు. మనిషి పుట్టుకతోనే దురాశాపరుడా? కాదు. అవకాశాన్ని బట్టి. మద్యాన్ని ఎం.ఆర్.పి.కి అమ్మాలని ఆందోళన చేసేవారే గాని మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని, తయారీని నిలిపివేయాలని మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన చేసేవారు కనిపించరేమండి? మందుతల్లి మహిమ. వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా స్పాట్ ఫిక్సింగ్ (క్రికెట్) వ్యవహారంలో అల్లుడి పాత్రపై రాజీనామా చేయాలని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ని డిమాండ్ చేస్తున్న యుపిఎ నేతలు, మరి లక్షల కోట్ల బొగ్గు స్కాం జరిగిన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజీనామాకు డిమాండ్ చేయరేమి? వారి స్థానంలో మీరుంటే చేస్తారా? ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా మనది సెక్యులర్ రాజ్యం అంటూనే మన నాయకులు ఓట్ల కోసం మతాలను అడ్డు పెట్టుకుంటున్నారు. ఇది న్యాయమా? కాదు. అది మత చెత్త రాజకీయం. మహమ్మద్ యూసుఫ్, కాజీపేట, వరంగల్ జిల్లా సీఎం గద్దె కోసం మ్యూజికల్ చెయిర్ పోటీ పెడితే, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్, కిరణ్‌కుమార్, జగన్‌లలో కుర్చీ ఎవరికి దక్కుతుంది? కుర్చీ విరుగుతుంది. ఎస్.ఆర్.దేవి, హ్యూస్టన్, అమెరికా దయ్యాలున్నాయా? ఉన్నారు. సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్లగొండ కార్పొరేట్ కాలేజీలలో పని చేస్తున్న పాపానికి పరీక్షలు పూర్తవగానే మమ్మల్ని విద్యార్థులను వెదికి పట్టుకొని మన కాలేజీలలో చేర్పించండి అంటూ టార్గెట్లు విధించి, కరపత్రాలను చేతికి అందించి ఎండలలో మమ్మల్ని తరుముతూ ఉపాధ్యాయులను బ్రోకర్లుగా మార్చేస్తున్నాయి కాలేజీలు. ఇదేమిటంటే నెల జీతం చేతికిచ్చి యుకెన్ గో అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. టీచర్లను బ్రోకర్ల కంటే హీనంగా దిగజార్చేస్తున్న మన విద్యా విధానం బాగుపడేది ఎప్పుడు సార్? చై-నా సంస్కృతి పోయినప్పుడు. విద్యకు కార్పొరేట్ పీడ తొలిగినప్పుడు. * ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్- 500003 e.mail : mvrsastry@gm ail.com
ఎల్.జ్యోతి, సికిందరాబాద్
english title: 
manalo manam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles