ఉంగుటూరు, డిసెంబర్ 12: బ్యాంకులు సహకరించకపోయినా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం కైకరంలో జరిగిన రైతు సాధికార సదస్సులో సిఎంను పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రుణాలు రద్దు చేసి రైతు గుండెల్లో బాబు నిలిచిపోయారని అన్నారు. రూ.16 వేల కోట్లు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రుణాలు మాఫీ చేయడం సిఎం ఘనతగా పేర్కొన్నారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వాగ్దానాన్ని సిఎం నిలబెట్టుకున్నారని అన్నారు. అవినీతి రహిత పాలనను చంద్రబాబు అందిస్తున్నారని ఆమె తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రైతు పక్షపాతిగా చంద్రబాబు ఆహర్నిశలూ పనిచేస్తున్నారని కొనియాడారు. టిడిపి విప్ చింతమనేని ప్రభాకరరావు మాట్లాడుతూ రైతులు, పేద వర్గాలకు సిఎం చంద్రబాబు అండగా నిలిచారని అన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే వీరాంజనేయులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సిఎం చంద్రబాబు పూర్తి చేస్తారన్న నమ్మకం రైతు వర్గాల్లో కలిగిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి బాబు విశేషంగా కృషిచేస్తున్నారన్నారు. సదస్సులో ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, చైతన్యరాజు, రవివర్మ, ఎమ్మెల్యేలు కలవపూడి శివ తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు
english title:
s
Date:
Saturday, December 13, 2014