Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మహోన్నత నేత వాజ్‌పేయి

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 25 : దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మహోన్నత నేత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహరి వాజ్‌పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి కొనియాడారు. మంగళవారం వాజ్‌పేయి 94వ జయంతి వేడుకలు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి బిజెపి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రధాని చేయని విధంగా దేశాన్ని అభివృద్ధి పథంలోకి వాజ్‌పేయి తీసుకెళ్లారని కొనియాడారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఇంటింటికి గ్యాస్, ప్రతి గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం, అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పేరుతో ప్రధాన నగరాలను కలుపుతూ హైవే రోడ్లు వేయడం ఆయనకే సొంతమని కొనియాడారు. ఆయన రాజకీయాలకు రాకముందు ఒక మంచి కవి అని తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని చనిపోయే నాటికి సొంత ఇల్లు కూడా లేని మచ్చలేని నాయకుడిగా ఆయన అభివర్ణించారు. అదేవిధంగా ప్రొక్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి అగ్ర రాజ్యాలు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అటల్‌జీ అన్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్‌లోని బధిరుల పాఠశాలలోని బదిర విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు సెగ్గం శ్రీనివాస్, వి సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె నరసింహారావు, కె శ్రీనివాసరావు, మైనార్టీ మెర్చ రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫా బాషా, ఓబిసి జిల్లా అధ్యక్షులు టి సురేష్, నాయకులు ఆర్ నాగేంద్ర, మోహన్‌రాజు, బి బ్రహ్మయ్య, హరికృష్ణ, కె ప్రసాద్, జి శ్రీమన్నారాయణ, డి సురేష్, లీలారాణి, ఎం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


వ్యక్తి ఆత్మహత్య

$
0
0

యర్రగొండపాలెం, డిసెంబర్ 25: మండలంలోని పందివానిపల్లి గ్రామానికి చెందిన గోపు వెంకటరెడ్డి (31) అప్పుల బాధ , అనారోగ్యంతో స్వగృహాంలో చీరకొంగుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల మేరకు గత ఆదివారం గోపు వెంకటరెడ్డి భార్యను పుల్లలచెరువు మండలం సికొత్తపల్లి గ్రామానికి వలస పనులకు పంపించి తిరిగి ఇంటికి వచ్చిన వెంకటరెడ్డి తన స్వగృహాంలో చీరకొంగుతో ఉరి వేసుకొని మరణించాడు. అయితే గత రెండురోజుల నుంచి ఫోన్ చేసిన సమాధానం ఇవ్వకపోవడంతో భార్య అంజమ్మ బంధువులకు ఫోన్ చేసి ఆరా తీయగా ఇంటి వద్దకు వెళ్ళిన గ్రామస్తులకు దుర్వాసన వెదజల్లడంతో తలుపులను బద్దలుకొట్టగా గోపు వెంకటరెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఇతనికి ఎకరా సొంత పొలం ఉండగా మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట పండిస్తున్నాడు. వ్యవసాయ సంబంధిత పనులకు వెళ్తూవెళ్తూ ఖాళీ సమయాల్లో కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న గోపు వెంకటరెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరపించారు. మృతునికి ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

పారిశ్రామిక ప్రాంతంలో వైభవంగా క్రిస్మస్

$
0
0

గాజువాక, డిసెంబర్ 25: పారిశ్రామిక ప్రాంతంలో క్రిస్మస్ వేడకలను క్రైస్తువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రధానంగా లంకెలపాలెం నుండి సింధియా వరకు, పెదగంట్యాడ నుండి షీలానగర్ వరకు గల చర్చిల్లో క్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తువులు ఘనంగా నిర్వహించుకున్నారు. క్రైస్తవ సోదరులు సోమవారం రాత్రికే చర్చిలు చేరుకున్నారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు చర్చిల్లో క్రైస్తువులు క్రీస్తు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తును ఆత్మాను సారంగా ఆరాధించారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురష్కరించుకుని చర్చిల్లో చిన్నారుల నుండి పెద్ద వారి వరకు ఉత్సాహాంగా ప్రార్ధనల్లో పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఒకరికొకరు ఏసుక్రీస్తు జన్మదిన శుభా కాంక్షలు తెలుపుకున్నారు. క్రీస్తు జననం భక్తీగీతాలను ఆలపించారు. చిన్నారులకు భక్తీగీతాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును ఆరాధించారు. వివిధ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. వారి సందేశాలను క్రైస్తవ భక్తులకు వివరించారు. అలాగే పేద క్రైస్తువులకు దుస్తులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో జరిగిన ప్రార్ధనల్లో బోధకులు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జనన విధానం ఎంతో గోప్యంగా జరిగిందని, ఆయన జననంతోనే లోకంలో చెడు మాయమై వెలుగు నిండిందని బోధకులు పేర్కొన్నారు. ఈ లోక కళ్యాణం కోసం పుట్టిన గొర్రెపిల్ల ఏసుక్రీస్తని అన్నారు. సర్వలోక సృష్టికర్త ఏసుక్రీస్తుని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన్ని నమ్మి ఆరాధించే వారికి ఎటువంటి కష్టాలు ఎదురు కావని, విశ్వాసంగా మెలగాలని ఉద్భోధించారు. సర్వసృష్టికి మూలాధారం ఏసుక్రీస్తుని అన్నారు. ఏసుక్రీస్తు ఎక్కడ కూడా బైబిల్‌లో మతం, కులం పేర్కొనలేదని, మానవులందరు సమానమేనని చెప్పారని అన్నారు. ఇలా బోధకులు క్రైస్తవ సోదరులకు పవిత్ర బైబిల్ నుండి ఆయన జన్మించిన విధానాన్ని విలువైన వాక్యాలను విడమర్చి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుక్రైస్తువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపువ్వుల నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెదగంట్యాడ సీయోన్ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. పలు చర్చిల్లో జరిగిన కిస్మస్ వేడుకల్లో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైకాపా గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిప్పల నాగిరెడ్డిలు హాజరయ్యారు. దీంట్లో భాగంగా జీసెస్ జన్మదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పల్లా కేక్‌ను కట్ చేసి క్రైస్తువ సోదరులకు పంపిణీ చేశారు. అలాగే ఉక్కునగరం, ఆటోనగర్, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో గల పలు చర్చిల్లో క్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. దేశపాత్రునిపాలెంలో మున్నాపుల్ గోస్టల్ చర్చిల్లో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. పలు చర్చిల్లో ఏసు జన్మ రహస్యంకు సంబంధించిన షెట్టింగులను ఏర్పాటు చేశారు. గొడ్లచావడి, శాంతిదూతలు వంటి, బాల ఏసు వంటి షెట్టింగులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఉక్కునగరంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తువులు ఘనంగా నిర్వహించుకున్నారు. దీంట్లో భాగంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. క్రిస్తు జన్మదినాన్ని పురష్కరించుకుని గీతాలను ఆలపించారు. వివిధ పోటీలను ఏర్పాటు చేసి బహుమతులను అందించారు. అనంతరం సహపంక్తు భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే గాజువాక, లంకెలపాలెం, అగనంపూడి, మల్కాపురం ప్రాంతాల్లో గల వివిధ విద్యా సంస్థల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శాంతాక్లౌజ్ వేషదారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రిస్మస్ తాతయ్య చిన్నారులకు బహుమతులను, చాకెట్లును పంపిణీ చేశారు.

భయం...భయం...రైళ్ళ ప్రయాణం...

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 25: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది...పోలీసు వ్యవస్థ పటిష్టపర్చబడింది. నిఘా వ్యవస్థ విస్తరించబడింది...24 గంటలూ బందోబస్త్‌లుంటున్నాయి...సిబ్బంది కొరత లేనేలేదు...క్షేత్రస్థాయి నుంచి పోలీసు పర్యవేక్షణకు కొదవలేదు...అయినా రైళ్ళల్లో చోరీల బెడద ఎక్కువైంది. అదీ రేయింబవళ్ళు అనే తేడా లేకుండా ముఠాలు రిజర్వేషన్ కోచ్‌ల్లో సైతం చొరబడి దోచుకుంటున్న సంఘటనలు ఈమధ్యకాలంలో విపరీతంగా ఉంటున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున మహిళల మెడల్లో బంగారు ఆభరణాలను తెచ్చుకునే పోయే ముఠాలకు అడ్డూ,అదుపు లేకుండా పోతోంది. మరోపక్క అసాంఘికశక్తుల కార్యకలాపలు పెచ్చుమీరుతున్నాయి. పోలీసులకు సవాల్‌గా నిలుస్తోన్న చోరీల సంఘటనపట్ల ప్రయాణికులు భయపడుతున్నారు. సంక్రాంతి పండుగ సీజన్లలో అయితే రద్దీ రైళ్ళల్లో చోరీల బెడద మరింతగా ఉంటుందనే భయాందోళన ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవల యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ మెడలో బంగారు నగలు తెంచుకునిపోయే ప్రయత్నంలో ఆమె ప్రతిఘటించడంతో రైలు నుంచే కిందకు తోచేసిన సంఘటన ప్రయాణికులు మరిచిపోలేకపోతున్నారు. కిటికీల వద్ద ప్రయాణించే మహిళల మెడల్లో బంగారు ఆభరణాలను తెంచుకునిపోయే ముఠాలు, నిద్రించే సమయంలో ప్రయాణికుల వద్ద ఉండే విలువైన నగలు, నగదు ఎత్తుకుపోయే ముఠాలపై పోలీసుల నిఘా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎక్కువుగా ప్రశాంతి, విశాఖ, తిరుమల, గౌహతి-త్రివేండ్రం, హౌరా-చెన్నై, బోకారో, పూరి-తిరుమల, కోణార్క్ అలాగే దక్షిణమధ్య రైల్వే పరిదిలో నడిచే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో తరచూ చోరీలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే చోరీల సంఘటనలు తరచూ నమోదవుతున్నా చోరీల సొత్తు రికవరీ అనేది సమస్యగా మారుతోంది. చోరీ జరిగే సమయం గురించి ఖచ్చితంగా తెలుసుకోలేకపోవడం, ప్రయాణికులు అప్రమత్తమయ్యే సమయానికి ఏకంగా గమ్యస్థానానికి చేరుకోవడం, లేదంటే మార్గ మధ్యలో ఉండటం, దీనివల్ల ఫిర్యాదుల చేయడం సమస్యగా మారుతోంది. దీనివలనే ఎక్కువశాతం మంది ప్రయాణికులు పిర్యాదులకు వెనుకడుగు వేస్తున్నారు. ఆయా రైల్వేస్టేషన్లలో ఉండే ప్రభుత్వ రైల్వే పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ప్రయాణికులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పలాస నుంచి భీమవరం రైల్వేస్టేషన్ వరకు ఇక్కడి జీఆర్‌పీ పరిధిలోకే వస్తుంది. దీనికి తగినట్టుగా ఒక డీఎస్‌పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, హెచ్‌సీ, పోలీసు కానిస్టేబుళ్ళు దాదాపు 80 మంది వరకు ఉన్నారు. వీరితోపాటు మహిళా కానిస్టేబుళ్ళు సేవలందిస్తున్నారు. ఇందులో కొంతమంది విశాఖ రైల్వేస్టేషన్‌లో మూడు షిప్ట్‌ల్లో గస్తీ ఉంటుండగా, మరికొంతమంది గోదావరి, విశాఖ-ముంబై (ఎల్‌టీటీ), విశాఖ, తిరుమల తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో బందోబస్త్ నిర్వహిస్తూంటారు. అయినా చోరీల జరుగుతూనే ఉంటున్నాయి.
* స్టేషన్‌లోనే పటిష్టం...
విశాఖ రైల్వేస్టేషన్ వరకు భద్రత కాస్తంత పటిష్టంగానే ఉంటుంది. నిత్యం ప్రముఖుల తాకిడి, ఏ-1 క్యాటగిరీ స్టేషన్ స్థాయి కావడంతో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటోంది. 150కీ పైగానే క్లోజుడ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలు, ముఖ్యమైన రైళ్ళ వద్ద నిత్యం తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా డాగ్‌స్వ్క్వాడ్, మెటల్ డిటెక్టర్లు ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. రద్దీ రైళ్ళ వద్ద పండుగ సీజన్లలో ప్రత్యేకించి ప్రయాణికుల క్యూలైన్ల నిర్వహణ ఉంటోంది. దీనివల్ల తోపులాట లేకుండా చోరీల బెడద ఉండదనేది పోలీసుల భావన. అయితే ఈ విధమైన పటిష్ట భద్రత రైల్వేస్టేషన్‌కే పరిమితమైంది. అదీ దాదాపు లక్ష మంది ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే విశాఖ రైల్వేస్టేషన్‌లోనే కాస్తంత భద్రతా చర్యలు కనిపిస్తుంటాయి. తప్పితే విశాఖ నుంచి బయలుదేరి వెళ్ళే, విశాఖ మీదుగా నడిచే సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో జరిగే చోరీలను నియంత్రించే వ్యవస్థ మాత్రం లేకపోవడంతో భయంతోనే ప్రయాణించాల్సి వస్తోంది.
* మహిళా భద్రతా సంవత్సరం...
ప్రయాణించే మహిళలకు పటిష్ట భద్రతనివ్వడమే రైల్వే లక్ష్యంగా ఈ ఏడాది 3మహిళా భద్రతా సంవత్సరంగా2 ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వేజోన్లు, 48 డివిజన్ల పరిధిలో వందలాది రైల్వేస్టేషన్ల వేలాది రైళ్ళల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి కూడా. ప్రధానంగా రిజర్వేషన్ కోచ్‌లు, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించే మహిళల వెంట తీసుకువెళ్ళే బంగారు ఆభరణాలు చోరీకి గురికాకుండా చూడటం, ముందుగా అప్రమత్తం చేయడం, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం జరపడం వంటివి లేకుండాపోయాయి. అలాగే చోరీల సంఘటనపై దర్యాప్తులు, ముఠాలను అదుపులోకి తీసుకువడమనేవి జరగడంలేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రచారానికే పరిమితమైన మహిళా ప్రయాణికులకు భద్రత అనేది ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది.

వాల్తేరుకు తుపాన్ల దెబ్బ...

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 25: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్‌కు ఈ ఏడాదిలో అన్నీ ఆర్ధిక కష్టాలే. భారతీయరైల్వేకే ఆర్ధిక వెన్నుముకగా నిలిచే ఈ డివిజన్‌లోనే ఎక్కువుగా సమస్యలు తలెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరంలో అనేకసార్లు సంభవించిన తుపాన్ల ప్రభావం నేరుగా సరకు రవాణాపై పడింది. కిరూండల్ మార్గంలోనే సరకు రవాణా అత్యధికంగా జరుగుతుంది. ఈ మార్గంలో బొగ్గు, జిప్సమ్, ఆహారధాన్యాలు,సిమ్మెంట్, ఇనుము వంటివి రవాణా జరుగుతూ ఉంటోంది. ఈ విధంగా వీటన్నింటినీ రవాణా చేసేందుకు ప్రతిరోజు 20 గూడ్స్‌ల వరకు నడుస్తాయి. వీటి వలనే వాల్తేరుడివిజన్ ఆదాయం ఏకంగా ఆరు వేల కోట్లకు పైగానే ఉంటుంది. అటువంటిది ఈ ఏడాది అనేకసార్లు సంభవించిన పెను తుపాన్లు డివిజన్ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరుసగా తుపాన్లు, మావోయిస్టుల బంద్ ప్రభావంతో సరుకు రవాణాకు బ్రేక్ పడుతోంది. ఏడాది మొత్తం మీద ఏకంగా 120 రోజులపాటు ఈ మార్గంలో గూడ్స్ రైళ్ళను నిలిపివేయాల్సి వచ్చింది. గజ, తిత్లీ, పెథాల్ వంటి భారీ తుపాన్లతో ఆర్ధికంగా ఈ డివిజన్ ఆదాయాన్ని కోల్పోయింది. రూ.20 కోట్లకు పైగానే నష్టం ఏర్పడగా, సరకు రవాణా జరగకపోవడం కోట్లాది రూపాయల మేర ఆదాయాన్ని పొగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా దెబ్బతిన్న రైల్వే మార్గం, బ్రిటిష్ కాలంనాటి రైల్వేబ్రిడ్జిలు, టనె్నల్స్, రైల్వేస్టేషన్ల వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులతో మరికొంత మేర నష్టాలను ఎదుర్కోవావల్సి వచ్చింది. వీటితోపాటు ఈ ఏడాదిలో అనేకసార్లు మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో దీనివల్ల రోజుల తరబడి గూడ్స్‌ల నిర్వహణకు బ్రేక్ పడింది. గూడ్స్‌లతోపాటు ఈ మార్గంలో నడిచే కిరండూల్ పాసింజర్ మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాన్లతోపాటు వర్షాలు, చలి కాలంలో రైల్వేట్రాక్‌పై కొండ చరియలు విరిగిపడే పరిస్థితులు డివిజన్‌కు ఆర్ధిక కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
* విధుల నిర్వహణకు వెనుకంజ...
వాల్తేరుడివిజన్ పరిధిలోనే పలు సమస్యాత్మాక ప్రాంతాలుండటంతో ఆయా రైల్వేస్టేషన్లు, రైల్వే విభాగాల్లో పనిచేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది,అధికారులు భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తోందని అనంతగిరి, తైడా, అరకువేలీ, కిరూండల్ సమీప రైల్వేస్టేషన్ల సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైల్వేస్టేషన్ల సమీపంలో ఉండే క్వార్టర్ల వద్ద సవాలక్ష సమస్యలు తాండవిస్తుండగా, విద్యా, వైద్య సదుపాయాలు లేకుండా పోతున్నాయన్నారు. అసౌకర్యాల మధ్య, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించడాన్ని ఇంజనీరింగ్, ఆపరేటింగ్, టెలికామ్ అండ్ సిగ్నలింగ్, కమర్షియల్, రన్నింగ్ స్ట్ఫా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

31లోపు కొత్త ఈఎంవీ చిప్ కార్డులు పొందాలి

$
0
0

విశాఖపటనం, డిసెంబర్ 25: కొత్తగా ఈఎంవీ చిప్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఖాతాదారులు పొందే సౌకర్యాన్ని ఆంధ్రాబ్యాంక్ కల్పించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆంధ్రాబ్యాంకు తమ ఖాతాదారులకు ఈవీఎం డెబిట్ కార్డులను ఉచితంగా అందజేస్తోంది. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్స్ వాడుతున్న ఖాతాదారులు తమ సంబంధిత ఆంధ్రాబ్యాంకు శాఖలో తమ పాత కార్డులను అందజేసి దానికి బదులుగా కొత్త కార్డులను పొందవచ్చని బ్యాంకు ముఖ్య నిర్వాహణాధికారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు ఈ సూచన అందజేయడం జరిగింది. అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన ఈఎంవీ చిప్ కార్డులను ఉపయోగించి ఖాతాదారులు తమ లావాదేవీలను మరింత సురక్షితంగా చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుండి మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచేయవని, అందువల్ల ఖాతాదారులంతా తమ సంబంధిత ఆంధ్రాబ్యాంకుశాఖలో ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులను పొందగలరని తెలియజేయడమైందన్నారు. ఆంధ్రాబ్యాంకు శాఖల్లో తగినన్ని డెబిట్‌కార్డులు, అందుబాటులో ఉన్నాయని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహారాజా అలంకారంలో సింహాచలేశుడు

$
0
0

సింహాచలం, డిసెంబర్ 25: సింహాచలేశుని ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రాపత్తు వేడుకల్లో మంగళవారం వరాహ నారసింహుడు మహారాజా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆగమోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులు గోవిందరాజుస్వామి వారికి సర్వాభరణాలతో మహారాజ ఆలంకారం చేసారు. పల్లకిలో సింహగిరి పురవీధుల్లో తిరువీథి నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
సింహాచలేశుని సేవలో ఏసీబీ అదనపు డైరెక్టర్
సింహాచలం, డిసెంబర్ 25: ఏసీబీ అదనపు డైరెక్టర్ ఆర్‌సీ.కుమార్ మంగళవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అర్చకులు ఈయనను ఆశీర్వదించగా అధికారులు ప్రసాదాలు అందించారు.

2 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబరాలు

$
0
0

విశాఖపట్నం,డిసెంబర్ 25: వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం, సీ ఎం ఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్‌ను జనవరి రెండో నుంచి ఐదో తేది వరకూ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన విన్నర్స్, రన్నర్స్ ట్రోఫీలను మంగళవారం సీ ఎం ఆర్ షాపింగ్ మాల్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీ ఎం ఆర్ అధినేత మావురి వెంకటరమణలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమం తప్పకుండా జర్నలిస్టులకు క్రీడా సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజె ఎఫ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలిచాయన్నారు. రాష్టస్థ్రాయి క్రీడా పోటీలతోపాటు ప్రతీ ఏటా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడంతో జర్నలిస్టులకు మానసిక ప్రశాంతతోపాటు ఆరోగ్యపరంగా కూడా మేలు చేకూరుతుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరుపున జర్నలిస్టులు చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. సీ ఎం ఆర్ అధినేత మావురి వెంకట రమణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం తమ సంస్థ అవసరమైన చేయూతనిస్తుందన్నారు. విజె ఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసొసియేషన్ సహకారంతో జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా పాలసీతో పాటు అవసరమైన అన్ని మేళాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నామన్నారు. ఈ ట్రోఫీ ఆవిష్కరణలో విజె ఎఫ్ కార్యదర్శి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ట్రివిటీ లూథరన్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకులు
విశాఖపట్నం,డిసెంబర్ 25: నగరంలోని జగదాంబ సెంటర్‌లో ఉన్న ట్రివిటీ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, పాదర్లు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ కె ఎడ్వర్డ్ విలియమ్స్ పిలుపునిచ్చారు. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వేడుకులు మంగళవారం ఉదయం వరకూ ప్రార్థనలు చేశారు. ప్రపంచ శాంతికి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు ఏసుప్రభుకు శాంతి మార్గంలో అందరూ నడవాలన్నారు. చర్చి పాస్టర్లు రెవరెండ్ దోరయ్‌రాజ్, సుదర్శనరావు, జెన్ ఎఫ్ వెస్లీలు క్రీస్తు సందేశమిచ్చారు. ఈ వేడుకుల్లో చర్చి చైర్మన్ యు. ఎలీసా రత్నం, ట్రెజరర్ కె.విజయ్‌కుమార్, ప్రతినిధి ఈశ్వరరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.


మనలోనూ ‘మహనుబావులు’

$
0
0

విశాఖపట్నం,డిసెంబర్ 25: యాంత్రిక జీవన విధానాన్ని తట్టుకోలేక అధిక సంఖ్యలో ప్రజలు మానసిక సమస్యలతో భాధపడుతున్నారు. ఒత్తిడితో డిప్రెషన్ పెరిగి...యాంగ్జాయిటీ తీవ్రమవుతోంది. ప్రస్తుత కాలంలో 15 ఏళ్ల వయస్సులోనే డిప్రెషన్‌తో యువత సతమతమవుతోంది. విద్యార్థులు పోటీ రంగంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ యాంగ్జాయిటీతో బాధపడుతున్నారు. ఎమెషనల్స్, ఆలోచన, భయం పెరిగిపోవడంతో స్కిజోప్రెనియాకు గురివుతున్నారు. 2020 నాటికి డిప్రెషన్‌తో బాధపడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. తమ సమస్యను ఇతరులకు చెప్పుకోలేక, బైటపడే మార్గం తేలియక తీవ్ర మనోవేదనకు గురివుతూ, చేస్తున్న పనినితప్ప మిగిలిన పనులపై దృష్టి పెడుతూ, మరోవైపు ఆదే పనిగా చేస్తున్న పనినే చేయడం తదితర సంఘటనలతో మెదడు తీవ్ర సంఘర్షణకు గురివుతూ ఉంటుంది. మనకు తెలిసిన సాధారణ స్కిజోప్రెనియా తదితర మానసిక వ్యాధుల కంటే ఒపిడి( అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్టర్) భిన్నమైనది. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య అత్యధికంగా ఉన్నా..సహయం కోసం మాత్రం నామమత్రమే. జాల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే వున్నట్లు మానసిక వైద్యులు చెప్పుతున్నారు. ఈ వ్యాధి సాధారణంగా 18 సంవత్సరాల వయస్సులోనే ఆరంభమవుతోంది. గతంతో ఒక్క పిచ్చికేకలు తదితర సంఘటనలు చేసిన వారు మాత్రమే మానసిక వైద్యులను కలిసేవారు. కానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల కారణంగా పలు రకాల వ్యాధుల బారిన పడి అధిక సంఖ్యలోనే సైకియాట్రిస్ట్‌ల సూచనలు, సలహలను తీసుకుంటున్నారు.
* పెరుగుతున్న స్కిజోప్రెనియా బాధితులు
స్కిజోప్రెనియా వ్యాధి అధికంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో కనిపిస్తోంది. ఆలోచనలు పెరగడం, అనుమానంతో సతమతమవడం, దిగులు చెందడం, వ్యక్తిత్వాన్ని కోల్పవడం, తాను ఎందుకు పనికిరాను అనే భావన కలిగి వుండే వారి సంఖ్య మరింత పెరుగుతోందని నగరంలోని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డాక్టర్ ఎన్. ఎన్.రాజు చెప్పారు. మరో వైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి తదితర కారణాలు కూడా డిప్రెషన్‌కు ప్రదాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. కోందరిలో థైరాయిడ్ వంటి సమస్యలు కూడా డిప్రెషన్‌కు కారణమని చెబుతున్నారు. ప్రతి పది మందిలో నలుగురు లేదా అయిదుగురు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారిలో 30 నుంచి 50 శాతం, 60 నుంచి 70 ఏళ్ల మధ్య 20శాతం డిప్రెషన్‌కు గురువుతున్నారు.
* డిప్రెషన్‌ను ఇలా తెలుసుకోవచ్చు
సాఫిగా పనిచేస్తున్న వారిలో ఒక్కసారిగా నెగిటవ్ ఆలోచనలు వచ్చాయంటే డిప్రెషనన్‌లో ఉన్నట్లే. నిద్ర రాకపోవడం, ఆకలివుతున్నా తినాలని అనిపించకపోవడం, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం, పనిచేయాలనే ఆసక్తి లేకపోవడం, సామార్థ్య స్థాయి తగ్గిపోవడం, అభధ్రతాభావం, చీకటిలో గడపడం, నలుగురితో కలిసి వుండకపోవడమనేవి డిప్రెషన్‌కు కారణాలు. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వీరిలో కలుగుతాయి. అటువంటి వారీకి సరైన సమయంలో కౌన్సిలింగ్ తీసుకోవడం ఎంతో అవసరం.
* ఒసిడి ముఖ్యకారణాలు
పలు కారణాలతో మెదడులోని రసాయానాల్లో కలిగే మార్పులతో ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో స్ట్రెప్టకోస్ ఇన్‌ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధిరావచ్చు. తలకు గాయాలు తగిలినపుడు, మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత కూడా ఈ వ్యాధి సోకే అవకాశం వుంది. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి వున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు వ్యాధి సోకే అవకాశాలు 30 నుంచి 40 శాతం వుంటాయి. అయితే కుటుంబంలో ఈ వ్యాధి వున్నంతా మాత్రాన అందరికి రావాలని లేదు. వీరిలో ముఖ్యంగా ఓకే ఆలోచన పదే పదే వస్తుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా వున్నా , ఆర్థం లేని ఆలోచనలను బాధితులు గుర్తించినా వాటిని నిఘ్రయించుకునే శక్తి మాత్రం వారికి వుండదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడలేక, అనవసర పనులపై శ్రద్ద చూపలేక వారు నిరంతరం ఆందోళనక గురివుతారు. వీరికి అనుమానం, భయాలు ఎక్కువుగా వుంటాయి. ఇంటికి వేసిన తాళం, ఇంటిలో గ్యాస్ కట్టామా? లేదా? అని పదే పదే పరీక్షిస్తుంటారు. అలాగే తనకు పలు రకాల భయంకరమైన వ్యాధులు వచ్చియామోనని, వస్తాయా అని భయందోళనకు గురివుతువుంటారు. అలాగే అతిశుభ్రంగా వుంటారు. ఏ పని చేసినా అవసరం వున్నా లేకపొయినా పదే పదే చేతులు కడుగుతూవుంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా జన్యుపరంగా, చిన్నవయసు నుంచి అతి క్రమశిక్షణ కారణంగా ఈ వ్యాధికి గురవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగే మెదడులోని సిరోటినిన్ అనే పదార్థాం కూడా సరైన మెతాదులో అందకపోవడం కూడా ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఇలాంటి వారికి సుమారు 6 నుంచి 8 నెలల పాటు మందులు వాడలి. ముఖ్యంగా బిహేవియర్ థెరిపి ఇవ్వాల్సి వుంటుందని, పదే పదే చేస్తున్న పనుల నుంచి వేరే పనులపై వారి దృష్టి మళ్లింపజేయాల్సి వుంటుంది.
* ప్రజలకు అవగాహన కార్యక్రమాలేవి
నగరంలో విద్యార్థి దశ నుంచి పెద్ద వయసు గల వరకూ మానసిక ఆరోగ్యం, తీసుకొవాల్సిన జాగ్రత్తలపై సరైన అవగాహన లేకపోండంతోనే కళాశాల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు,కుటుంబ కలహలు, అనుమాన సంఘటనలు తదితర ఘటనల నేపధ్యంలో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ మరణాలు సంభవిస్తునే వున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాశాలు, పాఠశాలల్లో , నగర ప్రజలకు తెలిసే విధంగా అవగాభన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎంతో ఉపయెగం వుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

* యెగాతో ఉపశమనం
మానసిక వ్యాధులతో బాధపడే వారు ప్రతీ రోజు యెగా చేయడం ద్వారా కొంతవరకూ ఉపశమనం పోందవచ్చు. మానసిక ప్రశాంతతకు యెగా ఎంతగానో ఉపయెగపడుతోంది. ముఖ్యంగా మెడిటేషన్, ఆసనాలు,క్రియలు పాటించడం చేయడం శరీరంలో మార్పులు,జీవన శైలిలో మార్పులు కూడా వస్తాయి. కనీసం ప్రతీ రోజు గంట పాటు యెగా చేయాలి. యువత చెడు ఆలవాట్లుకు దూరంగా వుండటం ద్వారా మంచి ఫలితాలు పోందవచ్చు.

జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మానసిక వ్యాధి నివారణకు సరైన మందు సరైన సమయంలో జాగ్రత్తలు పాటించి వైద్యుల సలహలు, సూచనలు పాటించడం ద్వారా నయం చేయవచ్చు. ప్రస్తుతం డిప్రెషన్ బాధితుల సంఖ్య అధికమవుతున్నారు. యువతలో అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 నుంచి 30 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదు. ఉల్లాసంగా గడపడం, దంపతుల మధ్య అనోన్యతగా వుండటం ద్వారా డిప్రెషన్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఒసిడి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా అధికంగానే వుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదు.
రాజు, ప్రముఖ మానసిక వైద్యులు,విశాఖ.

పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం మానసిక విద్యపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ముందస్తుగానే ఒత్తిడి,డిప్రెషన్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో ఆత్మహాత్యల స్థాయిని నివారించగలమని, త్వరితగతిన అన్ని పాఠశాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టాలి.
- జి.సీతారామ్,చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు

దేశానికి వాజ్‌పారుూ సేవలు మరువలేనివి

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 25: మచ్చలేని నాయకునిగా దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పారుూ పరిపాలన దేశానికి స్వర్ణ యుగమని ఎంపీ కంభంపాటి హరిబాబు కొనియాడారు. నగర బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్‌పారుూ జయంతిని పురస్కరించుకుని యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వాని గద్దె దించి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఖ్యాతి వాజ్‌పారుూదేనన్నారు. అంతకు ముందు కాంగ్రెసేతర జనతాపార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా చిరస్మరణీయ సేవలందించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, నగర పార్టీ అధ్యక్షుడు ఎం నాగేంద్ర, యువమోర్చా అధ్యక్షుడు కులపాక చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాధ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌వీఎస్ ప్రకాశరెడ్డి, నరేంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

వినోదం ఇక ప్రియం

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 25: సామాన్యుని వినోద సాధనం కేబుల్ టీవీ ప్రసారాలు మరింత ప్రియం కానున్నాయి. టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (ట్రాయ్) నిబంధనలు, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 29 నుంచి కొత్త టారిఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకూ ఎంఎస్‌ఓల నుంచి కేబుల్ ఆపరేటర్లు పట్టణాల్లో రూ.250, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150కి కేబుల్ ప్రసారాలు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజా నిబంధనలతో కేబుల్ ప్రసారాల ప్రేక్షకులు సాధారణ ఛానల్స్‌ను వీక్షించాలన్నా కనీసం రూ.300 చెల్లించాల్సిందే. ట్రాయ్ నిబంధనల మేరకు తొలి 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆపై తొలి 25 ఛానల్స్‌కు రూ.25 చెల్లించాలి. పే ఛానల్స్ విషయంలో ప్రసార సంస్థకు కనిష్టంగా రూ.0.50పైసలు, గరిష్టంగా రూ.19 చెల్లించాల్సిందే. అన్ని ప్రసార సంస్థలు గరిష్ట మొత్తానే్న వసూలు చేయనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ టీవీ ప్రేక్షకులు సాధారణంగా వీక్షించేది మా టీవీ, జెమినీ, ఈ టీవీ, జీ టీవీ, సహా తెలుగు వార్తా ఛానల్స్ మాత్రమే. ట్రాయ్ నిబంధనలు అమలు చేస్తే తొలి 100 ఉచిత ఛానల్స్‌లో వీటికి స్థానమే లేదు. ఇక కొత్తగా రూపొందించిన ప్యాకేజీల ప్రకారం చూస్తే మా టీవీ, మా మూవీస్ సహా స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ విడివిడిగా తీసుకుంటే రూ.65 వెచ్చించాలి. ఇదే స్టార్ వాల్యూ ప్యాక్‌గా రూ.39 వసూలు చేస్తారు. జెమినీ టీవీ, జెమినీ మూవీస్, కామెడీ తదితర ఛానల్స్ విడిగా రూ.54 కాగా, ప్యాక్‌లో దీన్ని రూ.30కి ఇస్తారు. ఈ టీవీకి సంబంధించి ప్యాకేజీ రూ.35 కాగా, రూ.24 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీ ప్రైమ్ ప్యాక్‌కు రూ.37 కాగా, దీన్ని రూ.20కి ఇవ్వనున్నారు. తొలి 100 ఫ్రీ టూ ఎయిర్ ఛానల్స్‌కు రూ.130 చెల్లిస్తూ మిగిలిన వాటికి ప్యాక్‌ల మేరకు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిందే. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేస్తున్న ఛానల్స్‌ను బట్టి చూస్తే ప్రతి వినియోగదారుడు నెలకు రూ.300 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

నేడు ఢిల్లీకి కేబుల్ ఆపరేటర్లు
కేబుల్ ప్రసారాలకు సంబంధించి కొత్త నిబంధనల ప్రతిపాదనపై ఎస్‌ఎంఓలు, ఆపరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ నిబంధనల పేరిట సామాన్యుని వినోద సాధనం కేబుల్ ప్రసారాలపై ఛార్జీల భారం మోపడం ఎంత వరకూ సమంజసమంటూ కేంద్రాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 29 నుంచి అమలు చేయనున్న కొత్త టారిఫ్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓల సంఘాలు బుధ, గురువారాల్లో ఢిల్లీలో నిరసన తెలపనున్నాయి. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు జేఏసీగా ఏర్పాటై ఢిల్లీలో తమ వాదనలు వినిపించనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.

నేటి తరానికి వాజపేయి స్ఫూర్తిదాయకం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 25: వాజపేయి సేవలు నేటి తరానికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన వ్యక్తిగా వాజపేయి సిద్ధాంతాలతో రాజీపడకుండా , అధికారం కోసం అర్రులు చాచకుండా దేశ సేవ కోసం, ప్రజాసేవ కోసం అంకితమయ్యారని అన్నారు. రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం కోసం కండువాలు , పార్టీలూ మారుస్తూ విలువలకు తిలోదకాలు ఇస్తున్న ప్రస్తుత నాయకులకు వాజపేయి ఆదర్శాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టకుండా ఒక్క ఓటుతో అధికారానికి దూరమై ప్రజల్లోకి వెళ్లిన గొప్ప వ్యక్తి అటల్‌జీ అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను రాజకీయ పార్టీలూ, వ్యక్తులూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రేరణతో , వారి సిద్ధాంతాలకు అనుగుణంగా సమాజంలోని పేదల్లోని నిరుపేదలకు మొదట చేయూత ఇవ్వాలన్న అంత్యోదయ సంకల్పంతో నరేంద్రమోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. దళారుల పాత్ర రూపు మాపే పేదలకు ప్రభఉత్వ సహాయం పూర్తిగా అందాలని, సుపరిపాలన అందించాలని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సాయం, పూర్తిగా లబ్దిదారునికి అందించేలా రాయితీ సొమ్మును నేరుగా బ్యాంకులో వేస్తూ మద్య దళారులు లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో ఉన్న పార్టీలు వంద రూపాయిలు విడుదల చేస్తే 15 రూపాయిలు మాత్రమే పేదవారికి అందేదని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం జన్‌ధన్ యోజన ద్వారా పేదలకు బ్యాంకు ఖాతాలను అందించి నూటికీ నూరు శాతం ప్రభుత్వ సాయం బ్యాంకు ఖాతాల్లో జమచేసి పేదలను ఆదుకుంటోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పారదర్శక పాలనతో, అవినీతికి తావులేకుండా దళారుల పాత్ర లేకుండా జవాబుదారీతనంతో పరిపాలన సాగిస్తోందని అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం కార్యకర్తలు నడుం బిగించాలని, ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సంకల్పం తీసుకుని ముందుకు సాగాలని , ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశహితం ప్రధానంగా పనిచేసిన వ్యక్తి వాజపేయి అని కొనియాడారు. నేడు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు దేశ హితం కన్నా తమ స్వార్థ రాజకీయాలే ముఖ్యంగా భావించడం దురదృష్టకరమని అన్నారు. అవినీతిని అంతం చేసి, పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించే పరిపాలన చేయడమే సుపరిపాలన అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన శాసనసభ్యులతో నేటికీ ప్రమాణ స్వీకారం చేయించకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వపోకడ అర్ధమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ తీర్పును ప్రజలు ఇచ్చినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేసే విధంగా టీఆర్‌ఎస్ పార్టీ తీరు ఉందని అన్నారు. నేటికీ తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కేసీఆర్ నియంతృత్వం అద్దం పడుతోందని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశం అంతా తిరుగుతున్నారని మండిపడ్డారు.
చిత్రం.. మాజీ ప్రధాని వాజపేయి చిత్రపటానికి పూలమాల వేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్

అవగాహనతో అసౌకర్యం దూరం

$
0
0

కడుపుతో ఉన్నప్పుడు సహజంగానే శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి తోడు రకరకాల అనారోగ్యాలు, అసౌకర్యాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. కొన్ని సహజంగా కలిగే అసౌకర్యాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ అవగాహనతో వాటిని ఎదుర్కోవడం కూడా సులువు అవుతుంది.
వికారం
దాదాపుగా 70 శాతం మహిళలు తేలికపాటి నుండి సాధారణ స్థాయి వికారం, వాంతి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనే్న ‘మార్నింగ్ సిక్‌నెస్’ అంటారు. అనడానికి మార్నింగ్ సిక్‌నెస్ అన్నా దీని ప్రభావం రోజంతా ఉంటుది. కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినడం వల్ల మార్నింగ్ సిక్‌నెస్‌ను అరికట్టవచ్చు. ఎక్కువ ప్రొటీన్ ఉన్న పదార్థాలు తినడం, ఎక్కువసేపు కడుపులో ఏమీ లేకుండా ఉండకుండా చూసుకోవడంతో మార్నింగ్ సిక్‌నెస్‌ను నియంత్రించవచ్చు.
అలసట
పిల్లలను కనడం అంత తేలికైన విషయం కాదు. గర్భం శరీరంలోని శక్తిని, రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను పీల్చేసి శరీరాన్ని ఒక రకమైన అలసటకి గురిచేస్తుంది. ఈ అలసట ప్రతి నిముషం ఉంది అన్న భావన కలిగేలా చేస్తుంది. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవడం, గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తగ్గుతుంది.
తిమ్మిర్లు
కడుపుతో ఉన్నప్పుడు అత్యంత సహజంగా కలిగే మరో సమస్య తిమ్మిర్లు.. ప్రత్యేకించి కాళ్లలో.. కడుపులోని బిడ్డ వల్ల, తద్వారా పెరిగిన బరువు వల్ల మోకాళ్ళపై అధిక భారం పడుతుంది. దీనితో తిమ్మిర్లు వస్తాయి. ఇలాంటి సమయంలో అధికంగా కాల్షియం ఉన్న ఆహారాలు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీన్ని అధిగమించవచ్చు.
మలబద్ధకం
కడుపుతో ఉన్న సమయంలో సాధారణంగా మలబద్ధకం తలెత్తుతుంది. ప్రోగేస్తేరోన్ అనే ఎంజైమ్ అధికంగా విడుదల అవ్వడం వల్ల డైజెస్టివ్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దీనివల్ల ఆహారం చిన్న ప్రేగులో చాలా నిదానంగా జరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, అధిక మొత్తంలో ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు.

ఇవి తెలుసుకోవడం తప్పనిసరి!

$
0
0

ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. అందుకే మహిళలు తమ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ తాము ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనే విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఎంతసేపు ఇంటిపని, ఆఫీసుపని, పిల్లలతో బిజీగా గడుపుతారు కానీ.. ఇవన్నీ చేయాలంటే తమ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.. అనే ఆలోచనే వారికి తట్టదు. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన కొన్ని అత్యవసర విషయాల్లో మాత్రం ఆరోగ్య సూత్రాలు పాటించరు. కనీసం వారి శరీర భాగాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా తెలుసుకోరు. అందుకే కొందరు డాక్టర్లు మహిళలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన ఐదు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం..
జీవనశైలి..
ఒత్తిడి, అతివ్యాయామం వంటివి రుతుక్రమంపై ప్రభావం చూపించవచ్చు. వాటివల్ల రక్తస్రావం తీవ్రంగా కావడం, లేదా కొద్దిగా కావడం, లేదా మొత్తానికి కాకుండా ఉండడం జరగవచ్చు. ఎందుకంటే శరీరం కఠిన శిక్షణను తీసుకున్నప్పుడు ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల రుతుక్రమం రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే.. శరీరం తగినంత ఈస్ట్రోజన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.. ఈస్ట్రోజన్ స్ర్తి జననేంద్రియాల ఆరోగ్యం కోసమే కాదు, ఎముకలను కూడా చాలా బలంగా ఉంచుతుంది. అందుకే మహిళలకు రుతుక్రమం సరిగా రానప్పుడు, ఎముకలకు అవసరమైన పోషకాలు అందించడం కుదరదు. అలాగే మహిళలే తమ ఎముకలను బలహీనంగా మార్చేస్తారు. వారం పాటు ఏదైనా కఠిన శిక్షణ తీసుకోవడానికి బదులు వారంలో కొన్నిసార్లు చాలా తక్కువ తీవ్రత ఉన్న వ్యాయామాలు చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి తగినంత ఆహారం తీసుకోవాలి.. కంటినిండా నిద్రపోవాలి.. అనేది కూడా వారు పూర్తిగా తెలుసుకోవాలి.
తేదీలు మారడం
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు వస్తుంటుందని అందరూ భావిస్తారు. కానీ నిజానికి ఇది సగటు మహిళకు మాత్రమే జరుగుతుంది. బహుశా పది మందిలో ఒకరికి మాత్రమే ఇలా 28 రోజుల రుతుచక్రం ఉంటుంది. సాధారణ రుతుచక్రం ఎలా అయినా ఉండొచ్చు. అంటే మహిళలు నెలసరి తేదీని ఊహించుకోవచ్చు. అది దాదాపు పదిరోజుల్లోనే అవుతుందా? లేక మరో వారం పడుతుందా? అని. అలా నెలసరి ఎప్పుడు వస్తుంది అనేదానిపై మహిళలు ఒక ఖచ్చితమైన అంచనాకు రావచ్చు.
ప్రొజెస్టరాన్ స్థాయిలు
రుతుచక్రంలో వివిధ సమయాల్లో హార్మోన్ల స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. సరిగ్గా నెలసరి వచ్చే ముందు ప్రొజెస్టరాన్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. అది మహిళల్లో చాలా లక్షణాలకు కారణం అవుతుంది. అంటే వక్షోజాలు పెద్దవి కావడం, నొప్పిగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, కోపంగా ఉండటం వంటి లక్షణాలు.. ప్రొజెస్టరాన్ అనేది ప్రొ-జెస్టేషన్ హార్మోన్ అంటే గర్భధారణకు అనుకూలంగా ఉండే హార్మోను.. అంటే సాధారణంగా ఈ హార్మోన్ వల్లే మహిళలు గర్భం ధరిస్తారు. అందుకే నెలసరి సమయంలో శరీరంలో ప్రొజెస్టరాన్ ఎక్కువగా విడుదలవుతుంది. అలా మహిళల్లో చాలా నీరు నిలువ ఉంటుంది. అదే వక్షోజాలు పెద్దగా అయ్యేలా చేస్తుంది. కొంతమంది మహిళల్లో ఐబీఎస్ (ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్) లక్షణాల్లా ఇవి చాలా ఉబ్బిపోతాయి. అంతే అదంతా మహిళల రుతు చక్రం సమయంలో రకరకాల హార్మోన్ల వల్లే జరుగుతుంది. సాధారణంగా..
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారు తమ శరీరం ఏం చేస్తుంది అనేదానిపై వారు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి. అంటే పరిస్థితులు సరిగా అనిపించనపుడు మహిళలు తెలుసుకోగలిగేలా ఉండాలి. వజైనల్ డిశ్చార్జ్ గురించి చాలామంది మహిళలు తీవ్రంగా ఆందోళనకు గురికావడం చూస్తూంటాం. మహిళల డిశ్చార్జ్ నెల, నెలా మారుతూనే ఉంటుంది. హార్మోన్లు ఏం చేస్తున్నాయనేదాన్ని అనుసరించి డిశ్చార్జ్ మారుతూ ఉంటుంది. మొత్తం నెల అంతా డిశ్చార్జ్ మారుతూ ఉంటే, అది ఆ సమయంలో శరీరంలోని హార్మోన్ల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కానీ డిశ్చార్జ్‌లో గణనీయ మార్పులు కనిపిస్తే వెంటనే ఆ మహిళ డాక్టర్ సలహాను తీసుకోవాలి. శరీరంలో ఎక్కడ, ఎలాంటి పొరపాటు జరిగిందో తెలుసుకునేముందు, అసలు సాధారణంగా డిశ్చార్జ్ ఎలా అవుతుంది అనే విషయం కూడా డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.
కొవ్వు అవసరం
పురుషుల కంటే మహిళల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది సర్వసాధారణం.. ఎందుకంటే మహిళల్లో హార్మోన్లు కొవ్వుతో తయారవుతాయి. కొలెస్ట్రాల్‌తో తయారవుతాయి. శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు వాటి నుంచే వస్తాయి. జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండటానికి, ముఖ్యమైన అవయవాల రక్షణకు మహిళలకు శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉండడం చాలా అవసరం. కొవ్వు కణజాలంతోనే ఈస్ట్రోజన్ హార్మోన్ తయారవుతుంది. అందుకే తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల రుతుచక్రంపై ఆ ప్రభావం కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే శరీరానికి కావలసిన పోషకపదార్థాలు అందించకపోతే.. అవి సరైన రీతిలో హార్మోన్లను తయారుచేసుకోలేవు.. హార్మోన్ల ప్రభావం శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది.
కాబట్టి శరీరాన్ని అర్థం చేసుకుంటూ, దానికి సరైన రీతిలో పోషకాహారాన్ని అందిస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆనందం కలుగుతుంది.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-84

$
0
0

అప్పుడు అంబ అందరూ చూస్తూ ఉండగా కట్టెలు పేర్పించి అగ్నిని రగిల్చి ఆ చితిలోకి దూకి అగ్నిప్రవేశం చేసింది.
ద్రుపద మహారాజు పట్టమహిషికి సంతానం లేదు. మహారాజు తన పూజలతో శంకరుని సంతోష పరిచాడు. శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు భీష్ముని చంపే పుత్రుడు కావాలని కోరాడు. అప్పుడు ఈశ్వరుడు ఇలా అన్నాడు. ‘‘రాజా! నీకు మొదట స్ర్తి పుట్టి తర్వాత పురుషునిగా మారుతుంది’’.
కొంతకాలానికి ద్రుపదుని రాణి గర్భవతి అయింది. సరియైన సమయంలో ఆమె ఒక కన్యను ప్రసవించింది. కాని ఆమె తనకు కొడుకు పుట్టాడని అందరికీ చెప్పింది. ద్రుపదుడు ఆమె కన్య అన్న విషయాన్ని రహస్యంగా ఉంచి పుత్రునిగానే పెంచాడు. ద్రుపదునికి తప్ప ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు. ఆమెకు శిఖండి అని నామకరణం చేశారు. ధనుర్విద్య కోసం శిఖండి ద్రోణునికి శిష్యుడయ్యాడు. అతని రాణి పుత్రునిలాగ పెరుగుతున్న కుమార్తెకు భార్యను తెమ్మని అడుగసాగింది. ద్రుపదుడు వనవతి అవుతన్న కుమార్తెను చూచి చింతించ సాగాడు. అతని భార్య అతన్ని ఓదార్చి శంకరుని వరం ఎప్పటికీ మిథ్య కాదు. ఆమెకు తప్పక భార్యను తేవాలి అని మరీ మరీ చెప్పింది. ఆ దంపతులిద్దరూ చివరకు నిశ్చయించుకొని దశార్ణదేశపు రాకుమారితో వివాహం జరిపించారు. దశార్ణదేశరాజు గొప్ప సైనిక బలం కలవాడు.
వివాహం అయిన తర్వాత ఆ రాకుమారిని కాంపిల్యానికి తెచ్చారు. కొద్దిరోజుల్లోనే శిఖండి పురుషుడు కాదని ఆ రాజకుమారికి తెలిసిపోయింది. అప్పుడు ఆ రాకుమారి తన చెలికత్తెలతో శిఖండి పురుషుడు కాదని తనలాంటి కన్యయే అని చెప్పింది. దాదులు ఈ విషయాన్ని దశార్ణరాజుకు తెలియపరిచారు. ఇది విన్న రాజుకు ఆగ్రహం కలిగింది. కోపంతో అతను ఒక దూతను ద్రుపదుని దగ్గరకు పంపాడు. ఆ దూత ఏకాంతంలో రాజుతో ఇలా అన్నాడు ‘‘రాజా! వివాహ విషయంలో నీచేత మోసగింపబడిన మా రాజు నీతో ఇలా చెప్పమన్నాడు. ‘‘నా కూతురిని నీ కూతురు కోసం యాచించావు. నన్ను అవమానించావు. ఇదంతా నీ కుత్రంతమే. ఈ మోసానికి తగ్గ ఫలితం అనుభవించు. నిన్ను నీ ప్రజలతో సహా పెకిలించివేస్తాను జాగ్రత్త!’’ అన్నాడు.
ద్రుపదుడు ఈ సందేశంతో వణికిపోయి పైకి గంభీరంగా అటువంటిదేమీ లేదని వియ్యంకునికి దూత ద్వారా వార్త పంపాడు. కాని దశార్ణరాజు ద్రుపదుని కూతురు స్ర్తియే అని కచ్చితంగా తెలిసికొని అతనిపై యుద్ధానికి వచ్చాడు. ద్రుపదుడు తీవ్రమైన భయాన్ని పొంది భార్యతో ఇలా అన్నాడు. ‘‘దేవీ! నీ కుమార్తె కన్యయే అని దశార్ణరాజుకు తెలిసింది. ఈ శిఖండిని స్ర్తిలాగానే ఉంటుంది. ఈ కష్టం తీరే ఒకే ఒక్క ఉపాయం చెప్పు’’ ద్రుపదునికి నిజం తెలిసినా ఇతరుల దృష్టిలో తన నిర్దోషిత్వం నిరూపించుకునేం దుకు పైకి అలా అన్నాడు.
అప్పుడు రాణి అతనితో ఇలా అంది - ‘‘ప్రభూ! శిఖండి కన్యయే. కాని సవతులకు భయపడి పుత్రుడని చెప్పాను. ఆమెను అలాగే పెంచాము. ముందు కన్యగా పుట్టి తర్వాత పురుషు డౌతాడని చెప్పడం వలన పెళ్ళి కూడా చేశాము’’.
ఈ విషయం ద్రుపదుడు మంత్రులకు వివరించాడు. అతను భగవంతుని నమ్ముకొని పూజలు మొదలుపెట్టాడు. రాణి కూడా అతన్ని మంత్రులతో కలిసి దైవప్రార్థన చేయమంది. ఇలా బాధపడుతున్న వారిద్దరినీ చూసి వారి కుమార్తె శిఖండిని వారిద్దరూ తన వలన ఇంత దుఃఖాన్ని పొందుతున్నారని చింతించిం ది. ఆమె ప్రాణత్యాగం చేయ నిశ్చయించింది. ఇలా అనుకొని ఆమె ఒక నిర్జనమైన అరణ్యంలోకి ప్రవేశించింది. ఆ అడవిని స్థూణాకర్ణుడనే యక్షుడు కాపాడుతున్నాడు. అక్కడ అతని భవనం ఉంది.
శిఖండి అందులోకి ప్రవేశించి, తిండి తినకుండా శరీరాన్ని కృశింపజేసింది. స్ణూణాకర్ణునికి ఆమెను చూస్తే జాలి వేసింది. అతను ఆమెతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావు? నీకు ఏం కావాలో చెప్పు వెంటనే చేస్తాను. నేను కుబేరుని అనుచరుడను. ఏదైనా చేయగలను’’.
అప్పుడు ఆమె ఇలా అంది. ‘‘యక్షా! నా తండ్రికి కొడుకులు లేరు. కొలదికాలంలోనే నాశనం కాబోతున్నాడు. నా మామ అతనిపైకి దండెత్తి వస్తున్నాడు. నా తల్లిదండ్రులకు అతని బారినుండి రక్షించు. నా కోరిక తీరుస్తానన్నావు కదా! నేను ఏ లోపమూ లేని పురుషుడిని కావాలి. ఆ రోజు మా నగరాన్ని సమీపించకముందే నన్ను అనుగ్రహించు’’.
శిఖండి మాటలు విన్న యక్షుడు కొంచెంసేపు ఆలోచించి ఆమెతో ఇలా అన్నాడు. ‘‘నీ కోరిక తీర్చుతాను. నా పుంసత్వం నీకు ఇస్తాను. నీ స్ర్తిత్వం నేను తీసుకుంటాను. కాని కొద్దికాలానికి మాత్రమే ఇస్తాను. ఈ గడువులోపల నీవు రావాలి. ఇది సత్యమని, మాట తప్పనని మాట ఇవ్వు. నీవు ఆలా చేయకపోతే నేను ఏమైనా చేయగలను.’’
అప్పుడు శిఖండి ఇలా అంది - ‘‘సువ్రతా! తప్పకుండా నీ పుంసత్వాన్ని తిరిగి ఇస్తాను. దశార్ణరాజు వెళ్ళిపోగానే నేను కన్యనైపోతాను. నీవు పురుషుడవు అగుదువు’’. ఇలా వారిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ తమ చిహ్నాలను మార్చుకొన్నారు. శిఖండి తేజోరూపుడైన పురుషునిగా మారిపోయాడు. ఈ విధంగా పుంసత్వం పొంది శిఖండి నగరానికి పోయి తండ్రికి అంతా వివరంగా చెప్పాడు. ద్రుపదుడు చాలా సంతోషించాడు.
తర్వాత ద్రుపదుడు దశార్ణపతికి ‘‘నా సుతుడు పురుషుడే. మీరు నా మాట విశ్వసించండి’’ అని వార్త పంపాడు. కాని దశార్ణరాజు ఆ మాటను మన్నించక ద్రుపదునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసి ద్రుపదుడు వియ్యంకుని దగ్గరకు ఒక బ్రాహ్మణుని దూతగా పంపాడు. ఆ దూత రాజుతో ఈ విధంగా చెప్పాడు.
ఇంకావుంది...


స్వాధ్యాయ సందోహం-179

$
0
0

సూర్యచంద్రులే గాక నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ఆకాశమనే గీటురాయి మీద గీయబడిన సువర్ణరేఖలా వెలిగిపోతూ ఉంటాయి.
ఇక భూమివైపు చూడండి. కొన్ని చోట్ల పచ్చని గడ్డిపరచుకొని యుంటుంది. కొన్ని చోట్ల పచ్చని పొలాలు కళకళలాడుతూ ఉంటాయి. కొన్నిచోట్ల లతా, గుల్మ, వృక్షాలు వ్యాపించి కనబడతాయి. మరికొన్నిచోట్ల విశాల వృక్షాలు సూర్యరశ్మిని నేలమీద పడకుండ భూమిపై పచ్చదనాన్ని చల్లదనాన్ని వెదజల్లుతున్నాయి. తాళ-హింతాళ- దేవదారు మొదలయిన నానావిధ వృక్షాలు భూమికి పచ్చని రంగును పూస్తూ ఉన్నాయి. ఇదంతా భగవానుడు వినిర్మాణం చేసిందే. ఈ విధంగా బంగారు కాంతులీనే నింగికి బంగారు చీరను ధరించిన భూదేవతకు మధ్య జీవులకు అవసరమైన ఆహార సమృద్ధితో విశ్వాత్మకుడు నింపివేసాడు. అందుచేత జీవులు తమ కాహారంకోసం ఎచ్చటకు పోనవసరం లేదు. ఆ ద్యావాపృథువుల మధ్యనే సూర్య భగవానుడు వెలుగుచూపుతూ స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాడు.
మానవుడు చాలా అహంకారి. అతడు నిత్యమూ ఏవేవో నూతనావిష్కరణలను సృష్టిస్తూనే ఉంటాడు. అవి అతడికి నిత్యమూ ఏదో ఒక ఆహారాన్ని సమకూరుస్తాయి. వానినన్నింటిని నీవెక్కడినుండి తెచ్చావు? అని వేదం మానవుణ్ణి ప్రశ్నిస్తూంది. నిజానికి భగవానుడే ‘అధారయద్ధరితోర్భురి భోజనమ్’ ‘‘ద్యావాపృథువుల మధ్య దైవమే ఆహారాన్ని అమితంగా నింపి ఉంచాడు’’ నీవు దానినే గ్రహించి నూతనావిష్కరణలు చేస్తున్నావు. కాని సమస్త జీవులు తమకు సత్యమైన ఆహారాన్ని నింగి- నేల మధ్య దైవం నింపిన ఆహారానే్న ప్రధానంగా గ్రహిస్తున్నాయి. అట్టి ఎడల ఓ మానవుడా! నీకింతటి ప్రయాస దేనికి? ఈ భూలోకంలో నివసించేందుకు నిన్ను పంపిన ఆ పైవాడే ఇక్కడ సిద్ధంగా ఆహారాన్ని ఉంచాడు. అందుకోసం నీవెందుకు ఆందోళన పడిపోతావు? ఆహార విషయం అలా ఉంచు. సకల జీవులకు జీవన ప్రదాత, భోజన ప్రదాత అయిన సూర్యుడే దైవ నిర్మితమైన భూమ్యాకాశాల మధ్య సుస్థిరంగా ఉంటున్నాడు. మరి ఓ మానవుడా! దైవదత్తమైన ఆహారాన్ని గ్రహించి సుఖంగా ఉండక కృత్రిమావిష్కరణ ప్రయాసలకేల సిద్ధపడుతున్నావు?
**
సృష్టిలో కీర్తనీయుడవు నీ వోక్కడవే
యో భోజనం చ దయసే చ వర్ధనమార్ర్దాదా శుష్కం
మధుమద్దుదోహిథ స శేవధిం ని దధిషే వివస్వతి
విశ్వస్వైక ఈశిషే సాస్యుక్థ్యః॥ ఋ.2-13-6.
భావం:- ఎవరు ఆహారాన్ని దాని ద్వారా అభివృద్ధిని ఇస్తున్నాడో, ఎవడు ఆర్ద్రమైనట్టి (తడిసిన) దానినుండి ఎండిన భూమిని సృష్టించాడో, అట్టివాడవైన నీవు శుభంకరమైన నిధిని సూర్యుని ద్వారా ధరిస్తున్నావు. సమస్త విశ్వంలో నీవొక్కడవే ప్రభుడవు. నీ వొక్కడవే కీర్తినీయుడవు. వివరణ:- భగవంతుడు సర్వజీవులకు ఆహారాన్ని ఇచ్చి దానిద్వారా శారీరక- మానసికాభివృద్ధిని కూడ కలిగిస్తున్నాడు. ఆహార ప్రధాన ప్రయోజనం శారీరక, మానసికాభివృద్ధులే కదా! ఆహారం వలన నిజంగా అట్టి అభివృద్ధి సిద్ధించకపోతే అట్టి జీవులకు శరీరంలో రోగముందని నిపుణులైన వైద్యులు నిర్ధారిస్తారు. శారీరక, మానసిక వర్ధనమే ఆహార ద్రవ్యాలన్నీ ఒంటబట్టాయని చెప్పడానికి నిర్ధారణ. కాని దైవ నిర్మాణశిల్ప చాతుర్య మెట్టిదంటె- ‘ఆర్ర్దాదా శుష్కం మధుమద్ దుదోహిథ’ ‘‘తడిగా నున్నదానినుండి తీయని ఎండిన పదార్థాన్ని సృజించాడు’’ ఇక్కడ తడిగా ఉన్నది జలం. దానినుండి సృజృంపబడినది. మధురమైనది పొడిపొడిగా ఉండే (తడిలేని) భూమి.
భూమికి నాలుగువైపుల జలమే జలం. భూమిమీద కూడా జలం చాలచోట్ల ఉంది. కాని ఈ పృథివి వీటినుండి పుట్టిందని ‘అద్భ్యఃపృథివీ’ అని వేదం చెబుతూంది. ఇది ఎలా సాధ్యం? ఇదే దైవ వినిర్మాణ విచిత్రశక్తి.
మరో విచిత్రమేమంటే భూమి ఎండినట్లు కనబడినా అది చాల మధురమైనది. కాకపోతే దానినుండి మధుర రసభరిత ఫలాలు ఎలా పండుతాయి? మరి ఆ మధుర రస సర్వస్వం భూమిలోనికి ఎలా వచ్చి చేరుతుందో మనిషికి తెలియదు.
ఇంకావుంది...

సుందరకాండ

$
0
0

ఆ అనుగ్రహాన్ని ఎంతగా పొందింది అంటే, పులో మజార్బితా అని ఆమె పేరును కలుపుకొని తాను నామధారణను చేసింది అమ్మవారు.
ఇక్కడ లంకలో విభీషణ ధర్మపత్ని సరమ ఉన్నది. ఆమె సీతను సేవించుకొంటున్నది. అందుకని లంక అమరావతి. అది స్వామి దృష్టి. నగర సౌందర్యాన్ని చూడటం బాహ్యదృష్టి. ఈ తత్త్వాన్ని దర్శించడం అంతరదృష్టి.
ససాగర మనాధృష్యమతిక్రమ్య మహాబలః
త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ
స్వామి స్వస్థుడు. త్రికూట శిఖరంమీద కూర్చుని లంకా దర్శనం చేస్తున్నాడు. ఒకేమాట. దానిలో ఎంత విషయ వైవిధ్యం. అది ఋషి వాక్కు లక్షణం.
స్వామి త్రికూట పర్వతంమీద కూర్చున్నాడు ఎలా!
సుఖంగా కూర్చోలేదు. కూర్చున్నట్లున్నాడు.
మహర్షి ‘హ’ అంటారు.
ఇది బాహ్య దృష్టి. మరి ఆంతర్యమేమిటి!
కూటం అంటే అజ్ఞానం. సంసార కారణ అహంకార మమకార రూప అజ్ఞానంలో పడవేసేది. అదీ కూటము. ఈలక్షణం సత్వ రజస్తమోగుణాల విలక్షణత్వం వలన కలుగుతుంది.
అది త్రికూటం. స్వామి ఈ వేళ ఇటువంటి అజ్ఞానానికి అధ్యక్త్యం వహించి కూర్చున్నాడు. అందుకే అపుడు వెనక్కి తిరిగి చూస్తే శతయోజన విస్తీర్ణమైన తాను దాటి వచ్చిన సముద్రం కనబడింది.
ఒక్కసారి తనను చూసుకొంటే-ఇంత శ్రమను ఓర్చి చెమటను కూడా ఎరుగని తన శరీరం కనబడింది.
సముద్రాన్ని దాటినశరీరంమీద అహంకారపుట్టింది.
అంత శ్రమను తట్టుకొన్న శరీరంమీద మమకారం పుట్టింది.
శతాన్యపి యోజనానాం క్రమేయం సుబహూన్యపి - అనుకొన్నాడు.
అజ్ఞానంవలన అహంకారం, అహంకారం వలన బుద్ధి నాశనం, బుద్ధి నాశనంవలన దుఃఖమూ పుడతాయి. అందుకే లంకను చూడగానే స్వామి-
ఆగత్యాపీహ హరయో భవిష్యన్తి నిరర్థకాః
నహియుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి
కోతులు ఇక్కడకు వచ్చినా నిరర్థకమే అవుతుంది. యుద్ధం చేసి లంకను జయించడమనేది దేవతలకు కూడా సాధ్యంకాదు. అంతేకాదు వీనియందు సామదాన భేద దండములైన నాలుగు ఉపాయాలు కూడా పనిచేయవు. ఎందుకంటే-
అవకాశో న సాంత్వస్య రాక్షసే ష్వభిగమ్యతే
నదానస్య నభేదస్యనైవ యుద్ధస్య దృశ్యతే
స్వభావం చేత వీడు రాక్షసుడు. అందువలన సామం (మంచి)గా చెబితే వినడు. పోనీ దానం చేత లొంగుతాడా! వాని దగ్గర లేనిదానికి కదా! లొంగడం. వాని దగ్గర లేనిదేమున్నది. వీని దగ్గర లేనిది ముల్లోకాలలోనూ లేదు. కనుక దానానికి లొంగడు. మరీ భేదం పనిచేస్తుందా! ఎవరితో భేదాన్ని కల్పించటం, వీనంతటివాడు మరొకడుంటే కదా! భేదం. కనుక అదీ కుదరదు. యుద్ధానికి అసలే లొంగడు. అంతేకాదు, రావణ పాలితమైన ఈ లంకను -ప్రాప్యాపి సమహాబాహుః కింకర్యిఃతి రాఘవః- అంటాడు. పరాక్రమవంతమైన రామచంద్రమూర్తి కూడా ఆ లంకకు వచ్చి ఏం చేయగలడు? ఎంత విచిత్రం. అజ్ఞానం వలన పుట్టిన దుఃఖం తన స్వామి సామర్థ్యాన్ని కూడా ప్రక్కన పెట్టించింది.
ఇంకావుంది...

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

మానవుడు తన భావములకును ఆశయములకును అనుగుణమగు ఫలమును బొందుచుండును. భగవంతుడు కల్పతరువు వంటివాడు, ప్రతివాడును తాను కోరునది భగవంతుని వలన బొందగలడు. పేదవాని కుమారుడు కష్టపడి చదువుకొని యెట్లో ఉన్నత న్యాయస్థానమున న్యాయాధిపతియై యిట్లు భావింపవచ్చును.
‘‘నేనిప్పుడు హాయిగా నున్నాను. చాల పెద్ద ఉద్యోగము సంపాదించినాను. నాకేమియు లోటులేదు.’’ కాని యతడు తన యుద్యోగమును జాలించి ‘పెన్సిలు’ పుచ్చుకొనుచు, తన పూర్వజీవితమును స్మరించునపుడిట్లు పశ్చాత్తాపపడును; ‘‘అయ్యో! ఈ జీవితమున నిజముగా నేజేసిన ఘనకార్యమేమి?’’ అంతరాత్మయగు భగవంతుడును అతనికిట్లు తెల్పును; ‘‘అయ్యో! నిజమే! నీవుచేసిన ఘనకార్యమేమియు లేదే!’
4. రెండు విధములగు సంస్కారములతో మానవుడీలోకమున బుట్టుచున్నాడు. అందొకటి ముముక్షుత్వమునకు హేతువగు విద్య, రెండవది సంసార బంధహేతువగు అవిద్య. మానవుని జన్మకాలమున నివిరెండును త్రామనందలి సిబ్బులవలె సరిసమానముగానుండునని చెప్పవచ్చును. వెంటనే సంసారము ఒక సిబ్బిలో లౌకిక సుఖములను, దైవము రెండవ సిబ్బిలో దైవజిజ్ఞాసనుబెట్టును. మనస్సు సంసారమును గోరుకొనెనా, అవిద్యయను సిబ్బి బరువై మానవుడు లోకమువైపునకు మ్రొగ్గును; అటులగాక దేవుని గోరుకొనెనా, విద్యయను సిబ్బి బరువై వానిని దేవుని వైపుకు మఱల్చును.
5. ఒకటి తెలిసికొంటినా, నీకన్నియు దెలియును. ఒకటియను అంకెతరువాత సున్నలను జేర్చినప్పుడు వానికి పదులు, వందలు, వేలు మొదలుగాగలిగిన విలువ యేర్పడుచున్నది, కాని యా ఒకటియను సంఖ్యను చెఱిపివేసితివా, సున్నలకు విలువ సున్నయే. ఏకమువలననే అనేకమునకు విలువ గలుగుచున్నది. మొదటిది ఏకత్వము, తరువాతిది నానాత్వము, మొదట భగవంతుడు, అటుపిమ్మట గణింపదగినవి జీవుడు, జగత్తును.
6. మొదట ఆత్మలాభమును బొందుము, తరువాత ధనము సంపాదింపుము- ఈ వరుసను తలక్రిందు చేయయత్నింపకుము, పరమార్థమును బొందిన వెనుక సంసారమున మెలగినను నీ మనశ్శాంతికి భంగము కలుగబోదు.
7. మీరేదియో సంఘసంస్కరణమనుచున్నారే! మంచిది, మొదట భగవంతుని సాక్షాత్కారము పొందిన తరువాత మీరటులచేయవచ్చును. భగవంతునిబొందుటకై ఋషులు సంసారమును త్యజించిరని మది నుంచుకొనుడు. అదియొక్కటియే మనకు ముఖ్యము. అటువెనుక వలసిన యెడల మిగిలినవన్నియు మీకు సమకూరును. మొదట భగవద్దర్శనము పొంది, పిమ్మట ఉపన్యాసములను గూర్చియు సంఘసంస్కరణమును గూర్చియు మాటలాడుడు.
8. క్రొత్తగా పట్టణమునకు వచ్చువాడు, రాత్రి పరుండుటకు తగిన గదిని జూచుకొని అచట తన సామానులను జేర్చుకొనవలయును. అనంతరము స్వేచ్ఛగా నగర విచిత్రములను జూడబోవచ్చును. అటుల చేయని పక్షమున రాత్రి చీకటిలో నిలువ తావులేక చాల బాధపడవలసి వచ్చును. అటులనే నిత్య శాంతి నిలయమగు భగవంతుని ప్రావు ముందుగా సంపాదించెనేని, ఈ లోకములోనికి వచ్చిన నూతన పురుషుడు తన నిత్యకృత్యములను చక్కబెట్టుకొనుచు సంసారమున నిర్భయముగా వర్తింపగల్గును.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

తృప్తి ఉన్నపుడే ప్రశాంతత

$
0
0

ధోరణి మార్చడం అంటే మీరు ఒకరకంగా నాటకం ఆడుతున్నారు అని అర్ధం.
మీరు ఈ నాటకాన్ని ప్రపంచం ముందర ఆడవచ్చు. కానీ ఎప్పటికీ అలానే ఉండిపోలేరు. మీరు ఈ నాటకాన్ని మిగతా ప్రపంచ మంతటి ముందర సాగించ గలుగుతున్నా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ఇది తెలిసిపోతుంది కదా. బయటకు ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా, కనిపించే అద్భుతమైన మనుషులు ఉన్నా, అంతర్గాతంలో వారిపరిస్థితి ఘోరంగా ఉంటుంది. పైగా ఇటువంటి వాళ్లకి వచ్చే ప్రశ్న ఏంటంటే ‘‘ఎందుకు ఈ చెడ్డవారందరూ ఇంత హాయిగా ఉంటున్నారు? వీరందరికి ఇంత హాయిగా ఎలా ఉంది’’ అని. ఇది ఎందుకని అంటే మీరు కేవలం మీ ధోరణిలో మాత్రమే బాగా ఉంటే సరిపోదు. మీరు ఈ సృష్టితో అనుసంధానమై ఉండాలి. ఈ సృష్టి మూలంతో అనుసంధానమై ఉండాలి. అంతే. ఎంతో అద్భుతమైన ఈ బ్రహ్మండంతో కూడా అనుసంధానమై ఉండాలి.
కానీ ఈ మంచితనంలో మీరు మంచివారు అనుకుంటూ మీ చుట్టూ ఓ గోడ కట్టేసుకుని అందులో మీరు మరో ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరైతే ఇలా సృష్టిలో ఓ భాగంగా కాకుండా ఉన్నారో, వారు బాధకి గురి అవ్వాల్సిందే, బాధ పడవలసిందే. ఎందుకంటే ఇలాంటి వారికి బాధ కలిగేంత వరకు వీరింకా వాళళు సృష్టించుకున్న ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటారు. అందుకని ప్రకృతికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది ఇటువంటి వారిని కిందకు తీసుకువస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మిమల్ని కిందకు దింపుతుంది. ఎందుకంటే వీళ్ళ కాళళు ఈ భూమి మీద ఆనట్లేదు కదా.
వ్యవస్థను హాయిగా ఉంచడం ముఖ్యం ఈ సమయంలో అత్యాధికంగా నీరు ఈ భూమండలం మీద కిందకు దిగి వచ్చి ఉన్న సమయం. మీలో ఉన్నది 70శాతం నీరే. మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఇది మీ శరీరానికి ఈ విషయం తెలుసు. ఈ సమయంలో భూమండలం మీద అధికంగా నీరు ఉంది అన్న విషయం మీ శరీరానికి తెలుసు. ఇలా ఎండాకాలపు వేడి మొదలై అది ఎక్కువైన కొద్దీ, ఈ నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు చూడండి శారీరకంగా అంత హాయిగా ఉండదు. అదే వసంతంలో మీ శరీరంలో ఎలా ఉంటుంది..? హాయిగా ఉంటుంది. మీ శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. హాయిగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చాలా మంది మానవాళి ఇది ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడంలేదు. హాయిగా ఉండడం అంటే ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడం లేదు. ఓ చిన్న పురుగయినా సరే మిమల్ని, మీ ప్రశాంతతని భంగం చేసేయగలదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఓ ఎండుటాకు మీ మీద పడిందనుకోండి హమ్మో అంటారు. అది మీ ప్రశాంతతని కోల్పోయేలా చేయగలదు. ఎందుకంటే మీలో ఒక రకమైన హాయి లేదు. అలా హాయిగా ఉండడం అన్నది తేలికయినా విషయం కాదు. అలా హాయిగా ఉండడం అంటే మీరు ఈ సృష్టితో పూర్తిగా అనుసంధానమై ఉన్నట్టు లెక్క.
అందుకని మీ వ్యవస్థలో ఇలా ఒకరకమైన హాయిని తీసుకురావడానికి, మీ శరీరం అది ఈ భూమండలంలో ఒక భాగమే అని అర్ధం చేసుకుంటుంది. ఒకసారి మీ శరీరం కనుక ఈ గ్రహంలో భాగమే అన్న విషయం అర్ధం చేసుకున్న తరువాత మీరు అలా భూమీద కూర్చున్నారనుకోండి, మీ శరీరానికి ‘అది ఈ భూమిలో భాగమే’ అని అర్ధమవుతుంది. కానీ మీరు మీ గురించి మరేదో ఉహించుకుంటుంటారు...అదే సమస్య. కానీ శరీరానికి అది ఈ భూమిలో ఒక భాగమే అని తెలుస్తుంది. ఇది తెలుసుకున్నప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రక్రియ ఎంతో తేలికైపోతుంది. మీకు నేను ఇదే అన్న విషయం అర్ధంకాకపోయినా సరే మీ శరీరరానికి అర్ధమవుతుంది. అప్పుడు మీ వ్యవస్థలో ఒకరకమైన హాయి వస్తుంది.
ఇంకావుంది...

maatata

$
0
0
Cross Image: 
Date: 
Thursday, December 27, 2018
Viewing all 69482 articles
Browse latest View live