Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

‘కలిసొచ్చిన అదృష్టం

$
0
0

విజయవాడ లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమాని, నటులు ఎన్.టి.రామారావు మిత్రులు మిద్దే జగన్నాథరావు తొలుత జలరుహ ప్రొడక్షన్స్‌పై ‘రాజనందిని’ నిర్మించారు. ఆ తరువాత ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.టి.రామారావు, కాంచన కాంబినేషన్‌లో వీరు రూపొందించిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. 10-08-1968 విడుదల.
19-02-1930లో విజయవాడలో జన్మించారు. శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ బిఎస్సీ చదివాక, వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో ఇంజనీరుగా ప్రసిద్ధిచెందారు. ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బరావుగారి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకత్వం నెరిపారు. అన్నపూర్ణావారి ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రస్థానం ప్రారంభించారు. వీరి దర్శకత్వంలో తీర్చిదిద్దిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. ఈ చిత్రానికి కథ- పినిశెట్టి, కళ-తోట, స్టంట్స్- సాంబశివరావు, ఛాయాగ్రహణం- కె.ఎస్.రామకృష్ణ, నృత్యం- చిన్ని- సంపత్, సంగీతం- టి.వి.రాజు, కూర్పు- బి.గోపాలరావు, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- కె.విశ్వనాథ్, నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
జమిందారు రావుబహద్దుర్ రాఘవేంద్రరావు, గర్భవతియైన భార్య శారదతో కలిసి ప్రయాణిస్తూ, ఆమెకు నొప్పులు రావటంచేత, దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేరుస్తాడు. ఆ ప్రసవంలో భార్యా, బిడ్డ మరణిస్తారు. అదే ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన పార్వతి (శాంతకుమారి) పేదరాలు. బహు సంతానం, అసమర్ధుడైన సోమరి భర్తతో ఇబ్బందులు పడుతుంటుంది. ఆమెకు మగపిల్లవాడు జన్మిస్తాడు. జమిందారు, ఆమెను వేడుకొని, ఆ బిడ్డని తనతో తెచ్చి పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేస్తాడు. అతడు ప్రకాష్ (ఎన్.టి.రామారావు) ప్రక్కన పల్లెటూరిలో వడ్డీ వ్యాపారి, లోభి పానకాలు (్ధళిపాళ) పేద రైతులను పీడించుకు తింటుంటాడు. అతని కూతురు శోభాదేవి (కాంచన), కొడుకు గణపతి (రాజ్‌బాబు), శోభాదేవి, ప్రకాష్ ప్రేమించుకుంటారు. ఆ వూరిలోనే భర్తను పోగొట్టుకున్న పార్వతమ్మ ఓ కొడుకు రంగడు (సత్యనారాయణ) అప్రయోజకుడు సోమరి, దొంగబుద్ధి కలవాడు. కూతురు గౌరి (సంధ్యారాణి) తల్లితోపాటు కష్టపడుతుంది. వారి మేనమామ కోటయ్య (మిక్కిలినేని) కూతురు లక్ష్మి(సుకన్య)ని రంగడికిచ్చి పెళ్ళిచేసి, రోజూ విచారిస్తుంటాడు. ఆ పల్లెటూరు వచ్చిన ప్రకాష్‌ను పార్వతమ్మ గుర్తించి, జమిందారును కలిసి నిర్ధారించుకుంటుంది. జబ్బుచేసి జమిందారు మరణించగా నౌకరు రామయ్య (మల్లాది)వల్ల పార్వతమ్మ, తన తల్లి అని ప్రకాష్ తెలుసుకుంటాడు. తల్లిని ఒప్పించి, వారందరిని తనతో పట్నం తీసుకువస్తాడు. డబ్బు చేతికివచ్చిన రంగడు, మేనేజర్ భూపతి(ప్రభాకర్‌రెడ్డి) స్నేహంతో మరింత వ్యసనపరుడుగా మారతాడు. భార్యను ఏలుకోవటంకోసం రంగడికి ఆస్తి రాసిచ్చిన ప్రకాష్‌ను కాదని, తన కూతురు శోభను రంగడికి రెండో పెళ్ళికి పానకాలు సిద్ధపడడం, తల్లిని, చెల్లిని, లక్ష్మిని హింసిస్తున్న రండికి బుద్ధిచెప్పటానికి ప్రకాష్ సర్ధార్జీగా మారువేషంలో వచ్చి, శోభతో రంగడి పెళ్ళి చెడగొట్టి, పరిస్థితులు చక్కపెట్టడం, ప్రకాష్, శోభల, గౌరి, గణపతిల వివాహం చెడగొట్టాలని, భుజంగంతో కలిసి వెళ్ళిన రంగడు, ప్రకాష్‌ను తుపాకీతో కాల్చటం, అది చూసిన పార్వతమ్మ రంగడిని తుపాకిలో చంపపోవటం, ప్రకాష్, లక్ష్మి వచ్చి వారించటం, ఈ సంఘటన రంగడిలో పరివర్తన కలిగించి, అందర్నీ క్షమించమని కోరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో శఠగోపంగా అల్లు రామలింగయ్య, డాన్సర్‌గా విజయలలిత, దర్శకులు విశ్వనాథ్ సెంటిమెంటుతో కూడిన సన్నివేశాలను, జమిందారు బాబును తీసుకువచ్చేటప్పుడు, పార్వతమ్మ ఇచ్చిన ఆంజనేయుని బొమ్మను (ఏ పుట్టుమచ్చలు కాకుండా) ఇన్ని సం. ప్రకాష్ మెడలో వుంచడం, వారి ఔన్నత్యానికి నిదర్శనంగా, దానివల్ల పార్వతమ్మ కొడుకు గుర్తించి, జమిందారును కలిసి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటం, తన తల్లి పార్వతమ్మ అని తెలిసిన ప్రకాష్, ఆమెను ఒప్పించటానికి ఓ గీతంద్వారా ప్రయాస పడడం, ‘అమ్మా నీవు నా అమ్మవుకావా అమ్మా’ (రచన- సి.నా.రె, గానం- ఘంటసాల) ఈ పాటను రాత్రిపూట, బ్లాక్‌షేడ్స్ చిత్రాల ద్వారా గుడిసెలో ఎఫెక్టివ్‌గా చిత్రీకరించటం, దానికి శాంతకుమారి రియాక్షన్ (అప్పట్లో ఈ పాట సాహిత్యం గురించి పలు విమర్శలు వచ్చాయి) ఎన్.టి.ఆర్. వ్యధ ఎంతో చక్కగా తీశారు. ఏ రక్తసంబంధీకుల లేక ఒంటరిగా పెరిగిన ప్రకాష్ అయినవారు అన్న, చెల్లి, తల్లి లభించగానే, తల్లి హెచ్చరిస్తున్న వినక అన్నగారికి తన ఆస్తికట్టబెట్టడం. ఆరోజుల్లో దేశంలో ముఖ్య సమస్యఅయిన భాషా సమస్యగూర్చి తమాషాగా చిత్రీకరించిన ప్రబోధగీతం ‘వందనాలు గైకొనుడయ్యా’(మాధవపెద్ది, ఘంటసాల, పి.సుశీల బృందం- రచన సి.నా.రె). అలాగే షావుకారు జులుం ఎదిరించి, రైతులు ప్రభుత్వ పథకాలు అనుసరించాలని, సమిష్టి వ్యవసాయం గూర్చిన గీతాన్ని ఎంతో వివరంగా ఆకట్టుకునేలా చిత్రీకరణ ‘పట్టండి నాగలి పట్టండి, కట్టండి’(రచన- సి.నా.రె, ఘంటసాల, యల్.ఆర్.ఈశ్వరి బృందం) చిత్రం చివరలో ఎన్ని నీతులుచెప్పినా వినని రంగడిలో, ప్రకాష్‌కు తుపాకీదెబ్బ తగలగానే కొంత, తల్లి అతన్ని తుపాకీతో కాల్చబోవటం, భార్య లక్ష్మి అందుకు అడ్డుపడడంతో, మార్పు పూర్తిగా రావటం, ఎటువంటి తప్పుడుభావాలు, దురలవాట్లుగల వ్యక్తులనయినా, ఏదో సంఘటన మార్పు తేగలదనే నమ్మకం చూపేలా చిత్రీకరించటం, విశ్వనాథవారి ప్రత్యేకతగా భావించాలి. ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌గా ఎన్.టి.రామారావు, పార్వతమ్మగా శాంతకుమారి నటన మెచ్చుగోదగ్గ స్థాయిలో ప్రదర్శించారు కాంచన, ఎన్.టి.ఆర్‌తో జోడిగా ముచ్చటగొలిపే నటన చూపటం, రాజ్‌బాబు, డొనేషన్లుకట్టి వైద్యం రాని డాక్టరుగా హాస్యం ఒలికించటం, అతని జోడిగా సంధ్యారాణి తనతో సమానంగా మెప్పించింది. వీరిద్దరిపై ఓ యుగళగీతం హుషారుగా సాగింది. ‘తాపం, తాపం అయ్యో ఏంతాపం’- పిఠాపురం, జమునారాణి- రచన సినారె). ఎన్.టి.ఆర్, కాంచనలపై పచ్చని పంటపొలాలలో హాయిగా చిత్రీకరించబడిన గీతం ‘పచ్చ, పచ్చని చిలుకా’(ఘంటసాల, పి.సుశీల బృందం- సినారె). మరో సినారే గీతాలు రెండు, హిందీ పదాలతో తమాషాగా ఎన్.టి.ఆర్, కాంచనలపై (ఈ ప్రేమపాఠం నీ ప్రేమకోసం ప్రియా) ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి) మారువేషంలో ఎన్.టి.ఆర్. కాంచనతో ‘అంతకోపమా వద్దువద్దు, ఓ నజరానా జర ఇధరానా’ (హిందీ పదాలు) (ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి) అలరించేలా చిత్రీకరించటం, ఈ చిత్రం పేరుచెప్పగానే గుర్తుకువచ్చే గీతాలుగా ‘పచ్చ పచ్చని చిలుకా’, ‘పట్టండి, అమ్మా నీవు నా అమ్మవు నిలవటం విశేషం. విజయలలితపై చిత్రీకరించిన కవ్వించే గీతం ‘నిన్ను చూడందే నా వలపు ఆరదు’. సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డిలపై చిత్రీకరణ. (ఎల్.ఆర్.ఈశ్వరి- రచన కొసరాజు) సి.నా.రె, కొసరాజుల సాహిత్యానికి టి.వి.రాజు అందించిన సంగీతంతో పాటలు అలరించేలా సాగాయి. ఆర్థికంగా సక్సెస్ అంతగా సాధించకపోయిన ‘కలిసొచ్చిన అదృష్టం’చిత్రం. అన్ని హంగులతో, పాటలతో చక్కని కాలక్షేప చిత్రంగా నిలవటం విశేషం.


చిత్తశుద్ధి చాటుకోండి

$
0
0

పెనుమంట్ర, ఆగస్టు 11: ఆడపడుచుల భద్రతే లక్ష్యంగా చట్టసభల్లో వారికి 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ పార్టీ గట్టిగా కృషి చేస్తుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టంచేశారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో ప్రకటించే జనసేన మేనిఫెస్టోలో దీన్ని మొదటి అంశంగా చేరుస్తానని ప్రకటించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగించారు. మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పే భారతీయ జనతాపార్టీకి నిబద్ధత ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రైవేటు బిల్లుగానైనా ప్రవేశపెట్టి చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలుగుదేశం ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నానన్నారు. 2009లో యూపీఏ హయాంలో ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయినప్పుడు తమకు పూర్తి మద్దతు లేదని వాపోయిన బీజేపీ నేతలు ఇప్పుడు పూర్తి మద్దతు ఉన్నందున తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు మించడానికి వీల్లేదని, అయితే పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలనే బీసీల డిమాండ్‌ను నెరవేర్చడానికి జనసేన కట్టుబడి ఉందన్నారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేరుస్తున్నామన్నారు. అలాగే ముస్లింల సంక్షేమానికి ఉద్దేశించిన సచార్ కమిటీ నివేదిక అమలుకు జనసేన కట్టుబడి ఉందని, ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. వర్గీకరణ పేరుతో షెడ్యూలు కులాల మధ్య రేపిన చిచ్చును సామరస్యంగా పరిష్కరించడానికి జనసేన కట్టుబడి ఉందన్నారు. షెడ్యూలు కులాలకు చెందినవారు ఒకరి
వద్ద ఉద్యోగం చేయడం నుంచి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయాలనేది జనసేన ధ్యేయమన్నారు. అలాగే అగ్రకులాల్లోని పేద విద్యార్థులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని, ఈ అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిల ఓట్ల రాజకీయాల కోసం తాను మాట మార్చేవాడిని కాదని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఒకసారి హామీ ఇచ్చాక కష్టమైనా, నష్టమైనా అండగా నిలబడతామన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల రిజర్వేషన్ల అంశం ప్రకటిస్తానని చంద్రబాబు తెలిపినప్పుడు సాధ్యాసాధ్యాలు తెలుసుకుని హామీ ఇవ్వాలని తాను సూచించానన్నారు. అయితే తప్పనిసరిగా ఇవ్వగలనని చంద్రబాబు తెలిపారని, అయితే అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల అంశాన్ని కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టేశారన్నారు. అలాగే కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్లు ఇస్తామన్న హామీని కూడా చంద్రబాబు సక్రమంగా నెరవేర్చలేకపోయారన్నారు. జగన్మోహన్‌రెడ్డి సైతం కాపు రిజర్వేషన్లపై గతంలో ఒక రకంగా, ఇప్పుడు మరోరకంగా మాట్లాడుతున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని, తెలుగుదేశం బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలు అత్యధికంగా ఉండే తెలంగాణలో వారి పార్టీకి ఎందుకు చోటు లేకుండా పోయిందని చెప్పాలన్నారు. హామీలిచ్చిన మేరకు ఆదుకోనందునే బీసీలు జనసేన వెంట నడుస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో తాను సాగించిన పోరాట యాత్రలో బీసీలంతా తన వెంట నడిచారన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తెరవెనుక పాత్ర పోషించిన తాను బీసీలకు అత్యధికంగా టిక్కెట్లు ఇవ్వడానికి కృషి చేశానని గుర్తుచేశారు.
ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్లీ మాయమాటలు, డబ్బు మూటలతో తెలుగుదేశం పార్టీ ప్రజల ముందుకొస్తోందని, 2019 ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమని గుర్తించాలన్నారు. ఈ సారి తప్పును సరిదిద్దుకోకపోతే యువత భవిష్యత్తు సర్వనాశనమవుతుందని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. తన సభలకు ఓటుహక్కు లేనివారే వస్తారని ఇతర పార్టీల నేతలు 2009 నుంచి ఎద్దేవా చేస్తున్నారని, అయితే వారంతా ఇప్పుడు ఓటుహక్కు కలిగిన పౌరులయ్యారని గుర్తించాలన్నారు. యువత అంతా ఓటర్లుగా నమోదై జనసేనకు అండగా నిలవాలని పవన్‌కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

చిత్రం..పెనుమట్ర సభలో ప్రసంగిస్తున్న పవన్

హైదరాబాద్ ‘బిట్స్’కు యూజీసీ గుర్తింపు

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 11: హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌కు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు మంజూరు చేసింది. చాలాకాలంగా బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ గుర్తింపు లేదు. అయినా, పరిశ్రమ గుర్తింపు ఉండటంతో విద్యార్థులు చేరుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన బిట్స్ యాజమాన్యం ఇటీవల యూజీసీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. దాంతో హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్‌కు, దానితోపాటు గోవా ఆఫ్ క్యాంపస్‌కు యూజీసీ గుర్తింపు మంజూరు చేసింది. ఇంకోపక్క బిట్స్ పిలానీ క్యాంపస్‌కు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమినెన్స్ హోదా కూడా దక్కనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని అత్యున్నత సంస్థలకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమినెన్స్ హోదాను మంజూరు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా పొందిన తొలి ఉన్నత విద్యాసంస్థ బిట్స్ పిలానీ అవుతుంది. ఇప్పటికే రిలయన్స్ ప్రతిపాదించిన యూనివర్శిటీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమినెన్స్ హోదా ఇచ్చిన కేంద్రం మణిపాల్ యూనివర్శిటీకి, బిట్స్ పిలానీకి కూడా ఆ హోదా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో కనీసం తొలి 500 స్థానాల్లో చోటు సంపాదించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాలకు ఈ హోదా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి దశలో 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ హోదా కల్పిస్తారు. ఆఫ్ క్యాంపస్‌లను ప్రారంభించేందుకు వీలు లేదని 2015 నవంబర్ 9న నోటీసులు ఇవ్వడంతో అటు బిట్స్ యాజమాన్యానికి, యూజీసీకి మధ్య వివాదం ముదిరింది. దాంతో బిట్స్ పిలానీ యాజమాన్యం
ఢిల్లీ హైకోర్టుకు
వెళ్లింది. తమ ఆఫ్ క్యాంపస్‌లను 2004, 2008లో నెలకోల్పామని, ఇవన్నీ డీమ్డ్ వర్శిటీ నిబంధనలు అమలులోకి రాకపూర్వం ఏర్పాటు చేశాం కనుక ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది.

ఇది అణచివేతల ప్రభుత్వం

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 11: టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అణచి వేతలు మినహా ప్రభుత్వం చేసింది, సాధించింది శూన్యమని సీఎల్‌పీ కే. జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎల్‌పీ సమావేశమై చర్చించింది. సీఎల్‌పీ నేత జానారెడ్డి అధ్యక్షతన శనివారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్‌పీ ఆఫీసులో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జే. గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌కు సీఎల్‌పీ తరఫున స్వాగతం పలుకుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే అధికారాన్ని అనుభవిస్తున్న టీఆర్‌ఎస్ ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాస్తవాలు ఎవరు మాట్లాడినా సహించడం లేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలూ దోపిడీకి గురవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను కట్టుబడి ఉండడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజల అవసరాలు తీరుతాయని
రాహుల్ చెప్పనున్నారని జానారెడ్డి అన్నారు. రాహుల్ పర్యటనను విజయవంతం చేసే అంశాలపై చర్చించేందుకు సమావేశమయ్యామని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ సమావేశం కాకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని ఆయన విమర్శించారు. అనుమతి ఇవ్వనందున, బలవంతంగా వెళ్ళేందుకు రాహుల్ ఇష్టపడరని, తన స్థాయిని తగ్గించుకోరని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే కొందరిని రెచ్చగొట్టి రాహుల్ ఉస్మానియా వర్సిటీకి రాకుండా అడ్డుకున్నదని ఆయన ఆరోపించారు.
ఏర్పాట్లపై కుంతియా, ఉత్తమ్ సమీక్ష
ఇలావుంటే, రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం గాంధీ భవన్‌లో పార్టీ నాయకులతో సమావేశమై చర్చించారు. అనంతరం వారు రాహుల్ పర్యటించే ప్రాంతాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న నాయకులకు కొన్ని సూచనలు చేశారు.

చిత్రం..అసెంబ్లీ ఆవరణలోని సీఎల్‌పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నేతలు

చిన్నారులపై దాడులు జరుగకుండా చర్యలు

$
0
0

రాజేంద్రనగర్, ఆగస్టు 11: చిన్నారులపై మానసిక, శారీరక దాడులు జరుగకుండా చర్యలు తీసుకుంటామని మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ స్పష్టం చేశారు. శనివారం సైబరాబాద్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో కాటేదాన్‌లోని అమ్మ గార్డెన్స్‌లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెనె్సస్ (పోస్కో), సేవ్ గర్ల్, చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదీశ్వర్ మాట్లాడుతూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చిన్నారులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. చిన్నారుల పట్ల ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, శారీరక వేధింపులు, మానసిక వేధింపులకు గురి చేయకుండా వారి మానసిక ఎదుగుదలకు సహకరించాలని అన్నారు. బాల్యంలో చదువులు, ఆటలు తప్ప చిన్నారులకు ఎటువంటి ఆలోచనలను, ఒత్తిడిని కలిగించవద్దని పేర్కొన్నారు.
సైకాలజిస్ట్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి బాల్యంలో చదువుపై దృష్టి కేంద్రీకృతం కావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. కార్యక్రమంలో గీతాంజలి కళాశాల, కృష్ణవేణి స్కూల్, ఆదిత్య స్కూల్, పయనీర్ కానె్సప్ట్ స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కేశంపేట, ఆగస్టు 11: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని కేశంపేట ఎంపీపీ వర్కాల లక్ష్మమ్మ వివరించారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో రైతులకు బీమాబాండ్లను పంపిణీ చేశారు. లక్ష్మమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకం అర్హులైన అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కేశంపేట వైస్ ఎంపీపీ సురేందర్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు నారాయణ రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు జమాల్ ఖాన్, వ్యవసాయ శాఖ ఎఇఓ వినయ్, చిర్ర చంద్రయ్య, పర్వత్ రెడ్డి, జంగయ్య, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కసరత్తు
వికారాబాద్, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాలు, ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కంటి వెలుగు కార్యక్రమాల ప్రాధాన్యత తెలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు కరుస్తున్నందున పరేడ్ గ్రౌండ్‌లో టెంట్లు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆర్డీవోను ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ పనులపై ప్రసంగాన్ని తయారు చేయాలని సీపీవోను ఆదేశించారు. సమావేశంలో వికారాబాద్ ఆర్డీవో విశ్వనాథం పాల్గొన్నారు.

15 నెలల్లోగా ‘డబుల్’ ఇళ్ల పూర్తి

$
0
0

రామచంద్రాపురం, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను 15 నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ భారతీ హొళ్లికేరి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ఇంజనీరింగ్, హెచ్ ఏండీఏ అధికారులను అడిగి పనులు ఎంతవరకు వచ్చాయోనని ఆరా తీశారు. వీలైనంత తొందరగా పనులను పూర్తిచేసి అపార్టుమెంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. సుడిగాలి పర్యటనగా వచ్చిన కేటీఆర్ అక్కడ నిర్మాణంలో ఉన్న పలు బ్లాక్‌లలో అధికారులతో కలిసి తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద, మెగా ప్రాజెక్టును ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తోందన్నారు. అర్హులైన పేదలకు డబల్ బెడ్‌రూంలు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రామంలోని సర్వే నంబర్ 203లో రూ.1,354.59 కోట్లతో ఈ బహుళ అంతస్తుల భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. మొత్తం ఇక్కడ 15,660 ఫ్లాట్లను నిర్మిస్తున్నారని, వీటిద్వారా దాదాపు 70 వేల మంది పేదలకు ఆశ్రయం దొరకుతుందని అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్ పర్యటన తరువాత హైదరాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ హౌసింగ్ అడిషనల్ కమిషనర్ భారతీ హొళ్లికేరి సమక్షంలో ఇంజనీరింగ్ అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.

చిత్రం..కొల్లూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నమూనాను తిలకిస్తున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

రాహుల్ బహిరంగ సభా ప్రాంగణం పరిశీలన

$
0
0

బాలాపూర్, ఆగస్టు 11: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న విద్యార్థి, నిరుద్యోగ గర్జనకు దాదాపు 50 వేల మంది వరకు రానున్నట్లు మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యాక్షురాలు పీ.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 14న సాయంత్రం 4 గంటలలకు జరగనున్న కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ ప్రాగణాని శనివారం ఎస్‌పీజీ అధికారులతో కలిసి మాజీ మంత్రి సబితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీ.సుధీర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీ.కార్తీక్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. సబితా రెడ్డి, సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి, నిరుద్యోగ గర్జనకు భద్రత సిబ్బంది సూచన మేరకు స్టేజీ, పార్కింగ్, రాహుల్ గాంధీ వచ్చే దారితో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఉండేలా తగిన ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. నేటి నుంచి సరూర్‌నగర్ స్టేడియం పూర్తిగా ఎస్‌పీజీ అధికారుల అధినంలో ఉంటుందని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం
శేరిలింగంపల్లి: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చాటిచెప్పడానికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎం.భక్షపతి యాదవ్ అన్నారు. 13న శేరిలింగంపల్లిలో నిర్వహించనున్న రాహుల్ సభకు ఏర్పాట్లను పరిశీలించారు.
లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గల సాంటా మారియా స్కూల్ పక్కన గల స్థలంలో సోమవారం సాయంత్రం 4గంటలకు జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పరిశీలించారు. శేరిలింగంపల్లి సభకు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవికుమార్ యాదవ్ నేతృత్వంలో చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివాదాలు తీరుస్తాం

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 11: జ్యోతిష శాస్త్ర వైభవాన్ని, విశిష్టతను సమాజానికి తెలియచేయడానికి, జ్యోతిష, ఆగమ, ఆలయ, ధర్మసంబంధమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వచ్చే శ్రీ వికారి నామ సంవత్సరం పండగలను నిర్ణయించి, ఆ జాబితాను ప్రభుత్వానికి అందించేందుకు వీలుగా ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జ్యోతిష మహాసభలు నిర్వహిస్తున్నారు. పండగల నిర్ణయంలో గతంలో తలెత్తిన వివాదాలు పునరావృతం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సభల ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సహకారంతో ‘తెలంగాణ విద్వత్సభ’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర శర్మ, ఉపాధ్యక్షుడు చెప్పెల హరినాథ శర్మ, కార్యదర్శి గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి, సహాయ కార్యదర్శి గాడిచెర్ల నాగేశ్వర శర్మ సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకటరమణ శర్మ తదితరులు
శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా గత ఏడాది రాష్ట్ర జ్యోతిష మహాసభలను ఘనంగా నిర్వహించామన్నారు. ప్రస్తుతం రెండోసంవత్సరం భారీ ఎత్తున జ్యోతిష మహాసభలను నిర్వహిస్తున్నామని వారు వివరించారు. రవీంద్రభారతిలో జ్యోతిష మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంగణానికి పాలకుర్తి నృసింహరామశర్మ పేరు పెట్టామన్నారు. సభలకు సంబంధించిన కరపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖలతో పాటు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ సభలకు సహకారం అందిస్తున్నాయి.


ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలి

$
0
0

షాద్‌నగర్, ఆగస్టు 11: ఆటోలో ప్రయాణించే వారిని సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు డ్రైవర్లు కృషి చేయాలని షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ సునీల్ అన్నారు. శనివారం షాద్‌నగర్‌లో ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ట్రాఫిక్ సీఐ సునీల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఆటోలో కేపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలపరాదని సూచించారు. ఆటోలో నడిపే డ్రైవర్లు విధిగా లైసన్స్‌లు కలిగి ఉండాలని, లేనివారు ఆటోలను నడిపితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ సునీల్ ఆర్థిక సహకారంతో భోజనం ఏర్పాటు చేశారు.
ఆటో యూనియన్ నూతన కమిటీ
షాద్‌నగర్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆటో యూనియన్ అధ్యక్షునిగా జీ.నారాయణ మూర్తి, ఉపాధ్యక్షులుగా శ్రీశైలం, శ్రీనివాస్, కుమార్, ప్రధాన కార్యదర్శిగా మురళీ, సహాయ కార్యదర్శులుగా సికిందర్, అశోక్, కోశాధికారిగా ఫయాజ్, సహాయ కోశాధికారిగా రామయ్య, చింటూ, సలహాదారులుగా రామలింగం, పాండును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ట్రాఫిక్ సీఐ సునీల్ సన్మానించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు షేక్ ఆయూబ్, చెన్నయ్య, పవన్, సురేష్, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర ఆటల పోటీలు
నార్సింగి, ఆగస్టు 11: శారీరక వికాసంలో ఆటలు చక్కగా ఉపయోగపడతాయని, మానసిక ఉల్లాసం కలిగి ఒత్తిడి దూరమవుతుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల శిశు మందిర బాలబాలికల ఆటల పోటీలను శనివారం బండ్లగూడ శారదాధామంలో ప్రారంభించారు. సునితా రెడ్డి మాట్లాడుతూ పాఠశాల నుంచే ఆటలు ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. కబడ్డీ, ఖోఖో, ఆటలతో జట్టు భావన నిర్మాణం అవుతుందని చెప్పారు. కలిసి కట్టుగా శత్రువును ఎదుర్కోవాలి అనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. ఆటలతో ఆధ్యాత్మిక చింతన, తాత్విక చింతన ఏర్పడుతుందని వివరించారు. శ్రీసరస్వతీ శిశు మందిరాలు పాఠశాల స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఆటలను ప్రోత్సహిస్తూ, దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించేందుకు ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. శిశు మందిర బాలబాలికల క్రమశిక్షణ అద్భుతమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర క్రీడల చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తలారి మల్లేష్, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి పాక రాజవౌళి, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర రావు, సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర రెడ్డి పాల్గొన్నారు.

‘ట్రాఫిక్’ నివారణకు సలహా ఇవ్వాలి

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 11: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారణకు సలహాలివ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూచించారు. ‘స్మార్ట్ మొబిలిటీ స్టార్టప్ ఫెస్టివల్’ కార్యక్రమం శనివారం నగరంలోని మెట్రో భవన్‌లో ప్రారంభమైంది. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఫొనెక్స్ చైర్మన్, సౌత్ కొరియా కౌన్సల్ జనరల్ సురేశ్ చుక్కపల్లి, శాంత బయోటెక్స్ చైర్మన్, పద్మభూషణ్ డా.కే.వరప్రసాద్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, డబ్ల్యుఆర్‌ఐ ఇండియా డైరెక్టర్ మాధవ్ పాయ్, టయోట మొబిలిటీ ఫౌండేషన్‌కు చెందిన ప్రస్ గణేష్, సెయింట్ ఫౌండర్ చైర్మన్ డా.బీవీ మోహన్ రెడ్డి పాల్గొన్న నగర ట్రాఫిక్ సమస్య, నివారణకు మార్గాలు అంశంపై ఇష్టాగోష్టి నిర్వహించారు. సుమారు 30 మంది కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సలహాలు సమర్పించారు. మల్డీ మోడల్ షేర్డ్ మొబిలిటీ యాప్‌ను అందుబాటులోకి తెస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతోందని కొందరు సూచించగా, మల్డీ మోడల్ షేర్డ్ మొబిలిటీ యాప్‌తో బైసైకిల్స్, బైక్స్, ఈ స్కూటర్లు మెట్రోరైలు ప్రయాణికులను ఎక్కడి నుంచి ఎక్కించుకుని, ఎక్కడైనా డ్రాప్ చేసేలా పనిచేస్తే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరికొందరు ‘త్రీ వీలర్స్ యునైటెడ్’ (టీవీయూ) అనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని వివరించారు. స్మార్ట్ వాహానాలైన ఈ-స్కూటర్లు, బైక్‌లను ఓ సమీకృత విధానం కిందకు తీసుకురావాలని సూచించారు. వాహనాలను మెట్రో ప్రయాణికులు ఒకేసారి ఎండ్ టు ఎండ్ బుక్ చేసుకునే విధానం అందుబాటులో ఉంటే బాగుంటుందని వివరించారు. ముందుగానే మెట్రోరైలులో సీటును బుక్ చేసుకునే ఇంటిగ్రేటెడ్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తే కొంత వరకు ట్రాఫిక్, రద్దీ తగ్గుతుందని గోష్టిలో పాల్గొన్న వ్యక్తలు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, అదనపు కమిషనర్ షికా గోయల్ సందర్శించారు. చర్చలో స్వీకరించిన సలహాలు, సూచనల్లో కొన్నింటిని, అమలుకు సాధ్యమైన వాటిని ఎంపిక చేసి నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు అమలు చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అద్దాలను పంపిణీ చేయటంతో పాటు అవసరమైన వారికి శస్తచ్రికిత్సలు కూడా చేయించేందుకు ఈ నెల 15న నగరంలో నిర్వహించనున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే కాలనీ సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ ఒకే సారి నాలుగు కోట్ల మందికి అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించటం, దేశంలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. నేత్ర పరీక్షలతో పాటు, మధుమేహాం పరీక్షలు కూడా కార్యక్రమంలో నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేయనున్నట్లు తెలిపారు. అయితే ఎక్కువ మందికి ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, ఏ రోజు ఎవరు, ఎక్కడ శిబిరానికి హాజరుకావాలన్న సమాచారం ముందుగానే అందించనున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీల్లోని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునేలా ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ సంఘాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. నగరంలోని కోటి పైచిలుకున్న జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు బాబా వెల్లడించారు.

జ్యోతిష మహాసభలకు విద్యాశంకర భారతీ స్వామి
హైదరాబాద్, ఆగస్టు 11: రవీంద్ర భారతిలో ఈనెల 13న ఉదయం తొమ్మిది గంటలకు జ్యోతిష మహాసభలు మొదలవుతాయి. సభలను శ్రీపుష్పగిరి మహా సంస్థానం పీఠాదీశ్వరులు అభినవోద్ధండ విద్యాశంకర భారతీ స్వామి ప్రారంభిస్తారు. 10 గంటలకు మొదటి సదస్సు పంచాంగ విభాగంపై నిర్వహిస్తారు. వీటిలో నాలుగు అంశాలపై విఖ్యాతులైన పండితులు, సిద్ధాంతులు ప్రసంగిస్తారు. తొలి అంశంగా పంచాంగ ప్రామాణికత, ముహూర్త నిర్ణయం, రెండో అంశంగా కాలసర్ప, పితృదోష విశే్లషణ, మూడో అంశంగా నామనక్షత్ర ప్రాధాన్యత, నాలుగో అంశంగా కుజదోష ప్రభావాన్ని నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు జ్యోతిషశాస్త్ర ఫలిత విభాగంపై సదస్సు ఉంటుంది. జాతకఫల నిర్ణయ సమీక్ష, ఆధునిక దృక్కోణంలో జ్యోతిషం, జ్యోతిశాస్త్ర వివిధ విభాగాలు, వాస్తు విజ్ఞాన ప్రయోజనంపై ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు యువ సిద్ధాంతుల సమ్మేళనం, 6.30 నుంచి 8.30 వరకు విద్వత్సమ్మేళనం ఉంటుంది. సమ్మేళనంలో వచ్చే వ్రీవికారి నామ సంవత్సర పండగలను నిర్ణయిస్తారు. 14న ఉదయం తొమ్మిది గంటలకు రెండోరోజు సమ్మేళనాన్ని శ్రీజగన్నాథ మఠం పీఠాధీశ్వరులు శ్రీవ్రతధర శ్రీనివాస రామానుజ జీయర్ స్వామి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆగమశాస్త్రంపై సదస్సు జరుగుతుంది. ఆగమాలు-లయాలు, ఆలయ పాలన-్ధర్మరక్షణ, అర్చకులు-విద్యుక్త ధర్మాలు, ధార్మిక స్ఫూర్తికేంద్రం-ఆలయంపై ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ధర్మశాస్త్ర సదస్సు జరుగుతుంది. ఇందులో నాలుగు అంశాలు ఉటాయి. ధర్మాచరణలో దైవజ్ఞుల పాత్ర, ధర్మమార్గ నిర్దేశకులు-పురోహితులు, ధర్మసంస్థాపనలో ధర్మాచార్యులు, సంస్కారాల ప్రయోజనంపై ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విద్వత్సభ ఆమోదించే వికారి నామ సంవత్సరం పండగల నిర్ణయం జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషికి సభల చివరలో అందిస్తామని నిర్వహహకులు వివరించారు.

పేదలందరికీ కంటి వెలుగు

$
0
0

బాన్సువాడ రూరల్, ఆగస్టు 11: నిరుపేద కుటుంబాల్లోని సభ్యులందరికి కంటి చూపు ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమంలో ముందుకు వచ్చిందని, ఈ కార్యక్రమాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బాన్సువాడ పట్టణంలో జరిగిన కంటి వెలుగు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్యాంప్‌లను ఏర్పాటు చేసేందుకు గాను కావాల్సినన్ని బృందాలను రంగంలోకి దింపామని అన్నారు. నిరుపేదలకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి కావాల్సిన వైద్య చికిత్సలతో పాటు కంటి అద్దాలు, మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శరీర అవయవాల్లో కంటిచూపు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని, చూపు మందగిస్తే అలాంటి వారి బతుకులు దయనీయంగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఎలాంటి ఖర్చులు లేకుండా తిరిగి కంటి చూపును ప్రసాదించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమలులోకి తెస్తున్నారని అన్నారు.
మోతిబిందువుతో పాటు రెటీనా సమస్యలను, ఇతరాత్ర కంటి సమస్యలన్నింటి వైద్యం అందించే విధంగా వైద్యాధికారులను నియమించామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కంటి వెలుగులో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని బుడిమి గ్రామంలో రైతులకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతుబీమా బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూ, వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుతోందని అన్నారు. పెట్టుబడి సహాయాన్ని అందించడంతో పాటు రైతులకు ఉచితంగా 5లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతాంగానికి ఆదుకునేందుకు గాను రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పోచారం తెలిపారు. రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే పంటకు కూడా పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేవి విధంగా రైతులకు టీఆర్‌ఎస్ సర్కార్ అనేక ప్రయోజనాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, రైతులు లాభాల బాటలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయానికి కావాల్సినంత సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించనున్నామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ సత్యనారాయణ, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, తహశీల్దార్ నారాయణ, వ్యవసాయ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఎజాజ్, నార్ల సురేష్, కొత్తకొండ భాస్కర్, ఎర్వల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, మోహన్‌నాయక్, దాసరి శ్రీనివాస్, నార్ల నందు పాల్గొన్నారు.

మహిళ సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

$
0
0

మొగుళ్ళపల్లి, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు మహిళ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి మందుకు పోతుందని శాసనసభాపతి సిరికొండ మధుసూధనాచారి అన్నారు. శనివారం తహశీల్ధార్ సునిత అధ్యక్షతన ఐకేపి కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గోని మాట్లాడారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన సాగిస్తుందని బిడ్డ పుట్టినప్పటి నుండి వివాహం అయ్యేంత వరకు విద్య, వైద్య, అన్ని రంగాల్లో అభివృద్ధి నిధులను మంజురు చేస్తూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెదింటి ఆడ బిడ్డలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు. శనివారం 44 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఒక్క మొగుళ్ళపల్లి మండలంలోనే పథకం ప్రారంభం చేసినప్పట నుండి ఇప్పటి వరకు 296 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు 3కోట్ల 22లక్షల రూపాయలు సాయం అందజేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌస్‌ఫెడ్ చైర్మన్ నవనీతరావు, ఎంపీపీ విజయలక్ష్మిమల్లయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అన్నారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతిరావు, జైపాల్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
* ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రమేశ్
జనగామ టౌన్, ఆగస్టు 11: విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయ ని, అందుకు విద్యార్థి లోకాన్ని సిద్ధం చేయాల్సి ఉం దని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ సమరభేరి మోటర్‌సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం జనగామ జూబ్లిగార్డెన్స్‌లో ముగింపు మహాసభ నిర్వహించారు. ఈ సభకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బానోతు ధర్మబిక్షం అధ్యక్షత వహించగా కోట రమేశ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతో ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆశలు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు అనేక రాయితీలు ఇస్తూ ప్రభు త్వ విద్యావిధానాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 400 కోట్ల స్కాలర్‌షిప్‌లను, ఫీజ్‌రీయెంబర్స్‌మెంట్‌లను వెంట నే విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అదే విధంగా వసతిగృహాల్లోనూ కనీస సౌకర్యాలను అందించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వార్డెన్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ నరేందర్, దడిగ సందీప్, సానాది కర్ణాకర్, బాబు, శ్రావణ్, లక్ష్మి, వినయ్, రంజిత్, శ్రీకాంత్, శ్రీనునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డిలు పాల్గొన్నారు.

కొత్త రాష్ట్రంలో ఇంత గొప్ప ప్రాజెక్టా?

$
0
0

మహదేవపూర్, ఆగస్టు 11: ఒక వెనుకబడిన, నూతనంగా ఏర్పాడిన రాష్ట్రంలో సముద్రం పాలు అవుతున్న జలాలను కనె్నపల్లి వద్ద గోదావరి నదిని మెడలు వంచి వెనుకకు తెప్పించిన ఇంజనీరింగ్ అద్భుతం చూస్తే ఎవరికైన ఆశ్చర్యం కలుగక మానదు. అని ప్రధానమంత్రి సచివాలయం నీటి వనరుల శాఖ అధికారి రాజీవ్ సక్సేనా అన్నారు. శనివారం దిల్లీ నుండి ప్రధాన మంత్రి సచివాలయంలోని అధికార బృందం కాళేశ్వరం ముక్తీశ్వర ఎత్తి పొతల ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను పర్యేవేక్షించే భాగంగా నందిమేడారం టనె్నల్ పనులు, కనె్నపల్లి గ్రావిటీ కెనెలా పనులను స్వయంగా పర్యేవేక్షించారు. వీరిలో సంజయ్‌కుమార్ మిశ్రా కేంద్ర ఆర్ధిక శాఖ, పునమ్‌చౌదరీ, ఆరోగ్య సంక్షేమ శాఖ, రావువినీత్‌కుమార్ పలువురు అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంగ్రామ్ సింగ్ ఠాగూర్, జిల్లా గ్రాంథాలయ సంస్థ డైరెక్టర్, జాగృతి జయశంకర్‌జిల్లా వెన్నంపల్లి మహేష్ తదితరులు ఉన్నారు.

వట్టేరువాగుకు జలకళ..
కేసముద్రం, ఆగస్టు 11: కేసముద్రం మండలంలో శుక్రవారం సాయంత్రం నుండి శనివారం రాత్రి వరకు ముసురువాన కురుస్తునే ఉంది. చినుకు.. చినుకు తోడై వరదగా మారి వాగుల్లోకి చేరడంతో వాగులకు జలకళ సంతరించుకుంది. ముసురువానలకు వరినాట్లు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసినా రైతులు వరినాట్లు వేయడంలో నిమగ్నమయ్యా రు. కేసముద్రం - గూడూరు మండలాల సరిహద్దులో వట్టేరువాగు జలకళతో ఉట్టిపడుతోంది. కేసముద్రం మండలంలో శనివారం ఉదయం వరకు 33.01 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

ఉప్పొంగుతున్న వాగులు

$
0
0

వరంగల్, ఆగస్టు 11: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్‌భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటుల నిండుకుంటున్నాయి. జలశాయాలకు భారీగా నీరు చేరుతుంది. ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆటకం ఏర్పడుతుంది. భద్రాచలం-చర్ల-వెంకటాపురం రహదారుల్లోకి వర్షం నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర ఆట కం ఏర్పడింది.
వెంకటాపురం (నూగూరు)లో..
వెంకటాపురం, వాజేడు మండలాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లె ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. కుంభవృష్టి కారణంగా జనజీవనం స్థంభించి పోయింది. అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో వెంకటాపురం, భద్రచలం నుండి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై పది అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో బల్లకట్టు, కొండపురం, రాళ్లవాగు, ఇతర వాగుల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎస్సై కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన చికుపల్లి బోగత జలపాతం భయంకరమైన ప్రమాదంగా ప్రవహిస్తుండడంతో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు పర్యాటకులను అనుమతించబోమని ప్రమాదాలకు అవకాశం ఉందని పారెస్ట్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు మీడియా ప్రకటనలు విడుదల చేశారు. విద్యుత్ లైన్లు వాగులపై స్తంబాలు వంగి పోవడంతో శుక్రవారం రాత్రి నుండి ఏజెన్సీ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివా రం కూడా భారి వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ ప్రకటించడంతో పల్లె ప్రజలను అప్రమత్తం చేశారు.
మహాముత్తారం: మండలంలో శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పోంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల దారుల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు, మహాముత్తారం, కొనంపేట అలుగు, దౌతిపల్లి వద్ద పొంగుతున్న వాగు, కనకునూరు గ్రామాల మధ్య ఉన్న రాళ్ళవాగు భారీ వర్షంతో నిండు కుండా ల ప్రవహిస్తున్నాయి. అదే విధంగా వాగులకు ఇరువైపుల వరద నీరు కమ్ముకోవడంతో వివిధ ప్రాంతాల వెళ్లే ప్రయాణీకులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. కుంటలు, చెరువులు జళమయం అవడంతో మండలంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు వేగవంతంగా చేసుకోవచ్చునని అన్నదాతలు పేర్కోన్నారు.


ముల్కనూర్ మహిళలరా.. శభాష్..!

$
0
0

* పాల ఉత్పత్తిలో రాష్ట్రానికే ఆదర్శంగా ముల్కనూర్
* ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కితాబు
* సీఎం కేసీఆర్ మానస పుత్రిక పాడి పశువుల పథకం
* తెలంగాణలో క్షీర విప్లవం తెస్తాం: ఎంపీ వినోద్‌కుమార్
భీమదేవరపల్లి, ఆగస్టు 11: శభాష్.. ముల్కనూర్ డెయిరీ మహిళ్లారా.. పాడి పరిశ్రమ ద్వారా లాభాలు సాధించడమే కాక ఆర్థిక పరిపుష్టి సాధ్యమని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కితాబునిచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో స్వకృషి డెయిరీ సభ్యులకు పాడిపశువుల పంపిణీ కార్యక్రమంకు ఈటల రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ రైతుల ప్రత్యామ్నాయ ఉపాధిగా పాడిపరిశ్రమ ఎంచుకోవడం పట్ల ఆర్థికంగా ఎదుగుతారని మహిళా డెయిరీ సభ్యులు నిరూపించినారన్నారు. చిత్తూరు రాష్ట్రంలో అక్కడి రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను ఎంచుకోవడంతో అక్కడ రైతుల ఆత్మహత్యల్లేవ్ అన్నారు. అదే విధంగా తెలంగాణలోని రైతులకు సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తే వారిలో ఆర్థిక స్థితిగతులు మెరుగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తాము కూడ 1969లో 10 బర్రెలతో పాలు అమ్ముకుంటూ జీవితం గడిపినామని ఈసందర్భంగా గుర్తుకు తెచ్చారు. ఇతర రాష్ట్రాల నుండి పాలు తెచ్చే పద్దతి మార్చి తెలంగాణలోనే పాల ఉత్పత్తి జరిపేందుకు సీఎం తగు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పాల యూనిట్లు సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణలో పాడి పశువులను పెంచి పాల ఉత్పత్తి పెంచడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి పాడి గేదెలు పెంచడానికి తగిన యూనిట్లు సబ్సిడీపై ఎన్ని కోట్లు అయిన ఖర్చు చేసి ఇస్తామన్నారు. ముల్కనూర్ డెయిరీని తెలంగాణ మొత్తం ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలన్నారు.
క్షీర విప్లవం తెస్తాం: ఎంపీ వినోద్‌కుమార్
తెలంగాణలో క్షీర విప్లవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగ్రీన్‌సిగ్నల్ ఇచ్చినారని దీంతో వేలాది కుటుంబాలకు సబ్సిడీపై పాడి యూనిట్లు మంజూరి ఇవ్వడం జరుగుతుందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కోన్నారు. కేసీఆర్ మానసపుత్రిక పాడి పశువుల పెంపకమన్నారు. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, నుండి పాలు మన రాష్ట్రానికి రాకుండా మన రైతులతోనే అధికంగా పాల దిగుబడి సాధించేందుకు గత 15 సంవత్సరాల క్రితమే ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు. హైద్రాబాద్‌కు ప్రతి రోజు 600 గొర్రెలు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుండి వస్తాయని, కాగా మన దగ్గరే గొర్రెల మాంసం ఉత్పత్తి కొరకు గొల్ల, కురుమలకు సబ్సిడీపై వేలాది యూనిట్లు మంజూరీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఎవ్వరూ నిర్వీర్యం చేయద్దని విజ్ఞప్తి చేశారు. పాడి గెదేల పెంపకం దారులు ప్రతి ఒక్కరు 10 గేదెలను పెంచే స్ధాయికి ఎదగాలన్నారు. హైద్రాబాద్‌లో పాలకు అధిక మొత్తంలో డిమాండ్ ఉందన్నారు. పాల తయారీలో ఇంటర్నేషనల్ బ్రాండ్ స్థాయికి ముల్కనూర్ డెయిరీ ఎదగాలని అభిలాషించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే సతీష్‌కుమార్
ఆ తర్వాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమెదటి సారిగా పాడిపశువుల పంపిణీ పథకం 50 శాతం సబ్సిడీపై పాడి గేదలు అందిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గానికి అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మెట్టప్రాంతం అయిన హుస్నాబాద్ తీవ్ర కరువుతో అల్లడుతున్నామని, రైతులకు నీళ్లు లేని తరుణంలో పాడిగేదలు అందజేయడం పట్ల రైతులకు అదనపు ఆదాయం లబించిందని అన్నారు. అన్ని ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ మొత్తం రైతులకు 1లక్ష 65వేల ఎకరాలకు సాగు నీటి అందించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి, భీమదేవరపల్లి ఎంపీపీ సంగ సంపత్, జడ్పీటీసీ రాంచందర్‌నాయక్, బ్యాంకు అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, డెయిరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌కుమార్, డెయిరీ అధ్యక్షురాలు గుర్రాల విజయతో పాటు 5వేల మంది డెయిరీ సభ్యులు పాల్గొన్నారు.

పాలెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

$
0
0

వెంకటాపురం(నూగూరు), ఆగస్టు 11: భారీ వర్షాల కారణంగా మండలంలోని పాలెం ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుకోవడంతో మిగులు జలాలు వదిలేందుకు గేట్లు ఎత్తేశారు. ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతో పల్లపు గ్రామాలైన ఉప్పేడు, కోయబెస్తగూడెం, కుర్సవానిగూడెం, వీరాపురం, పాత్రాపురం తదితర గ్రామాల్లో వరదనీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలతో ప్రాజెక్టు ఎగువభాగం నుంచి వరదనీరు రావడంతో అధికారులు అప్రమత్తం చేశారు. అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని వీరభద్రవరం ముత్యపు జలపాతం, వాజేడు మండలంలోని చీకుపల్లి బొగత జలపాతాల వద్దకు పర్యాటకుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రమాదకరంగా జలపాతాలు ప్రవహిస్తుండటంతో శని, ఆది, సోమవారం వరకు మూడురోజుల పాటు పర్యాటకులను నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రహరీగోడ వర్షాలకు కూలిపోయింది. మండలంలోని అనేక గ్రామాల్లో శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం అనేక పూరిళ్లు కూలిపోయాయి. భారీ వర్షాల కారణంగా వాగులకు ఇరువైపులా ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

ఏజెన్సీలో భారీ వర్షం
గూడూరు, ఆగస్టు 11: గూడూరు ఏజెన్సీలో శనివారం తెల్లవారుజా ము నుండి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల కాల్వలు, కల్వర్టులు పొంగిపొర్లాయి. గూడూరు నుండి మహబూబాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కల్వర్టుపై నుండి వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. జూలై నెలలో కురిసిన మోస్తారు వర్షాలకు రైతులు నారుమళ్లు అలికారు. ప్రస్తుతం నారు ఏపుగా పెరగడం.. ఇటు వర్షాలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులకు శనివారం కురిసిన వర్షం కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో రైతు లు తమ పొలాలను దునే్నందుకు సమాయత్తం అవుతున్నారు. మొత్తం మీద శనివారం కురిసిన భారీ వర్షంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

పొలాలను బలవంతంగా లాక్కొవద్దు
* రైతులను గోస పెట్టవద్దు
* ఎమ్మెల్యే చల్లాకు గన్నోజు హెచ్చరికసంగెం, ఆగస్టు 11: పంట పొలాలను బలవంతంగా లాక్కొని రైతులను గొస పెట్టవద్దని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి గన్నోజు శ్రీనివాసచారి ఎమ్మెల్యే చల్లాను హెచ్చరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య గంగదేవిపల్లి నుంచి ఊకల్ రాంనగర్ వరకు టెక్స్‌టైల్ పార్కుకోసం భూపట్టాదారులను వారి భూముల వద్దకు రాకుండా అడ్డుకుని కొత్తగా 150 ఫీట్ల, ఆ రోడ్డు కోసం స్థల సేకరణ సర్వే చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేసిన విషాయాన్ని తెలుసుకున్న ఆయన శనివారం రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టైక్స్‌టైల్ పార్కుకు రోడ్డు సౌకర్యం ఉన్నా కొత్తగా రోడ్డు నిర్మాణం పేరుతో నష్టపరిహారం విషయంలో మాకు ఎటువంటి హామీ ఇవ్వకుండానే నోటిసులు ఇచ్చి బలవంతం గా పోలీసులను పెట్టి మా భూముల వద్దకు మమ్ముల్ని రానివ్వకుండా అడ్డుకుని భూ సేకరణ సర్వే చేసి హద్దు రాళ్లు నాటడం ఇదెక్కడి న్యాయం అని గన్నోజుకు రైతులు మెరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌చారి మాట్లాడుతూ రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ రైతుల పట్ల వ్యవహరించేది ఇలాగేనా అని విమర్శించారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు నర్సంపేట ప్రధాన రహదారి మీదుగా ఇప్పటికే గంగదేవిపల్లి నుండి ఒకటి, ఊకల్ నుండి మరొకటి, రెండు రాహదారులు ఉన్నాయన్నారు. ఈ ప్రాతంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాడుతుందని ముందస్తు సమాచారంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచనతో తన అనుచరులతో భూములు కొనుగోలు చేయించి వారి భూములను ధరలు పెంచుకునేందుకుగతంలో ఉన్న రోడ్లను వెడల్పు చేయకుండా కొత్తగా ఈ రోడ్డు ప్రతిపాదన తీసుకువచ్చి ఎమ్మెల్యే దురుద్ధేశపూర్వకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాస్‌చారి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్తిపాక రవీందర్, రైతులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తాం

$
0
0

ధర్మపురి, ఆగస్టు 11: దేవాదాయ శాఖ కింద వివిధ దేవాలయాలలో పని చేస్తున్న అర్చకుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ గ్రాంట్ ద్వారా చెల్లింప బడుతున్న వేతనాలను అందరికీ సమానంగా వర్తింప చేయాలని, తదితర డిమాండ్లతో దేవస్థాన అర్చక, ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పని చేస్తున్న వేద పండితులు, అర్చకులు, ఉద్యోగులు, కాంట్రాక్టు అర్చకులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక నిరసన కార్యక్రమానికి శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సిఎం కేసిఆర్, మంత్రి ఇంద్రకర్ రెడ్డి, కమిషనర్ శివశంకర్ దృష్టికి సమస్యలను తెస్తామని, అవసరమైతే సంబంధిత బాధ్యుల బృందాన్ని తీసుకెళ్ళగలమని హామీ ఇచ్చారు. అంతకు ముందు శిబిరానికి మద్దతు తెలిపిన మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సత్వర పరిష్కార చర్యలకై కృషి చేస్తామన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు బొజ్జా రమేశ శర్మ నిర్వహించిన కార్యక్రమంలో ధర్మపురి ఎంపీపీ మమతారావు, జడ్పీటీసీ రాజమణి, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్, మార్కెట్ చైర్ పర్సన్ దేవమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు రాజేందర్, నరేశ్, భీమయ్య, మల్లేశం, దినేశ్, ఎల్లాగౌడ్, ప్రసాద్ తదితరులు మద్దతు తెలిపినవారిలో ఉన్నారు.

చలో ఢిల్లీని జయప్రదం చేయండి
* సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు
సుల్తానాబాద్, ఆగస్టు 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 5న చేపట్టిన చలో ఢిల్లీని విజయవంతం చేయాలని సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పిలుపు నిచ్చారు. శనివారం మండలంలోని పూసాల గ్రామంలోగల పెద్దమ్మ దేవాలయం వద్ద రైస్‌మిల్ ఆపరేటర్ల యూనియన్ సమావేశం జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ దేశంలో కొత్త ఉత్పత్తి రావాలన్నా, ఉపాధి దోరకాలన్న, దేశం అభివృద్ధి కావాలన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు కీలకమని ఈరెండు రంగాలను కార్పోరేట్ శక్తులకు అప్పగించే తిలోగమన విధానాలను అనుసరిస్తున్నారని, కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని దీని మూలంగా మన పూర్వీకులు పోరాడి సాధించుకున్న హక్కులు సౌకర్యాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతరం పలువురు పలు విషయాలపై మాట్లాడారు. సమావేశంలో మండల అధ్యక్షుడు తాండ్ర అంజయ్య, నర్సయ్య, బ్రహ్మచారి, సంపత్, చంద్రయ్య, కిరణ్, స్వామీ, రాజు, సంతోష్, పలువురు పాల్గోన్నారు.

నెరవేరనున్న ఐటీ విద్యార్థుల కల
* సంక్రాంతి నాటికి ఐటీ టవర్ ప్రారంభం
* కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, ఆగస్టు 11: కరీంనగర్ శివారు ఉజ్వల పార్కు సమీపంలో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులన్ని పురోగతిలో ఉన్నాయని, ఐటీ విద్యార్థుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. డిసెంబర్ చివరి వరకు ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేసుకుని, సంక్రాంతి నాటికి ప్రారంభించుకుంటామని తెలిపారు. శనివారం ఐటీ టవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ బిడ్డల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూ.25కోట్లతో జీ+4 ఐటీ టవర్ నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. కంప్యూటర్ కోర్సులు చదివి హైదరాబాద్, బెంగుళూరు, అమెరికా చుట్టు తిరిగే విద్యార్థుల తిప్పలు తప్పినట్లేనని అన్నారు. కరీంనగర్ విద్యార్థులు కరీంనగర్‌లోనే ఐటీ ఉద్యోగం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు సునీల్‌రావు, రూప్‌సింగ్, తదితరులు ఉన్నారు.

రైతులకు భరోసా కల్పించడమే ధ్యేయం

$
0
0

కోరుట్ల రూరల్, ఆగస్టు 11: రైతులకు భరోసా కల్పించడం కోసమే రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం బాండ్ల పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే లక్ష్యం తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతులు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబాలకు రైతు బీమా పథకం వర్తిస్తుందని అన్నారు. రైతుల కోసం పంట సాయం క్రింద ఎకరాలకు రూ. 4వేలు, సాగు విస్తీర్ణం కోసం అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు. రైతులకు మద్ధతు ధర పెంచి ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇదే విధంగా ఎన్నో పథకాలతో అన్నదాతలకు, ప్రజలకు రూపకల్పన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పార్టీయే విజయం సాధించి మళ్లీ అధికారం చేపడుతుంద ని అది ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావ్, కౌన్సిలర్లు పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, మోర్తాడ్ లక్ష్మణ్, మచ్చ రాము, నాయకులు అన్నం అనిల్,అనూప్‌రావు, తహశీల్దార్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీల ఆవిష్కరణ
తిమ్మాపూర్, ఆగస్టు 11: సర్వా యి పాపన్న 368వ జయంతోత్సవ వేడుకలు ఈ నెల 18న జరుపుకోవాలని శనివారం తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతోత్సవ ఫ్లెక్సీలను ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షు డు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, బుర్ర అనీల్, మానకొండూర్ ని యోజకవర్గ సంఘ సభ్యులు గొల్లపల్లి మల్లేశం, నాయకులు బొంగాని వీరయ్య, దేశిని వీరస్వామి, ఎ.హరీష్, పీ.హరీష్, మొగిలి, శ్రీను, పర్శరాం, ఆంజనేయులు, సంపత్‌తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

నగర బహిష్కరణ ఎత్తేయాలి
* విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాళ్ల
కరీంనగర్ టౌన్, ఆగస్టు 13: ఆధ్యాత్మిక వేత్త, హిందూ భావజాల ప్రచారకు డు, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందపై పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాళ్ళ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పోలీసుల తీరును నిరసిస్తూ తమ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 13న కలెక్టరేట్ ముట్టడి తలపెట్టినట్లు వెల్లడించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వార్త్ఛానళ్ళు నిషేధించాలని, కేవలం ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, మెజారిటీ వర్గం పట్ల నిర్లక్ష్యం కనబరుస్తుండటం సిగ్గుచేటన్నారు. స్వామీజీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తూ, హిందువుల మనోభవాలు దెబ్బతీస్తున్న పాలకులు, నగర బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సోమవారం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిలో అన్ని కులసంఘాల ప్రతినిధులు, దేవాలయాల కమిటీల పాలకవర్గ సభ్యు లు, పూజారులు, హిందూ బంధువులు పాల్గొని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వీహెచ్‌పీ నాయకులు నవనీతరావు, తోట రాజేందర్, అర్జున్, మహేశ్, వినయ్‌సాగర్, కీర్తిసాయి, సుమన్, భజరంగ్‌దళ్ నాయకులు గుజ్జేటి రాజేందర్, తోట ప్రదీప్, బుస్స శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఎడతెరిపిలేని వర్షం

$
0
0

జగిత్యాల, ఆగస్టు 11: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో కాసింత ఊరట కలిగించింది. ఖరీఫ్ పంటల కోసం వర్షాలు లేక ఒక వైపు, మరో వైపు శ్రీరాంసాగర్ నీరు అందక ఆయకట్టు ప్రాంత రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆందోళన చెందుతున్న అన్నదాతల్లో కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. వర్షాకాలం ఆరంభమై ముగుస్తున్నప్పటికీ సరిగ్గా వర్షాలు కురియకపోవడంతోపాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 16టీఎంసీల నీరు కొంతైనా విడుదల చేయాలని రైతాంగం రోడ్డెక్కి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పంట పొలాలకు నీరందడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
చొప్పదండిలో భారీ వర్షం
చొప్పదండి, ఆగస్టు 11: గత కొన్నిరోజులుగా చుట్టు పక్కల ప్రాంతాలలో వర్షం పడి చొప్పదండిలో వర్షం మొఖం చాటేయటంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ శనివారం ఉదయం నుంచి ఒక మోస్తరుగా వర్షం సాయం త్రం వరకు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెరువులు కుంటలు కొంతవరకు నీటితో నిండుకున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావటానికి ఇబ్బందులు పడ్డారు. రెండో శనివారం కావటంతో పాఠశాలలకు సెలవు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండాపోయంది. వర్షం ఓ మోస్తరుగా కురుస్తుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
సుల్తానాబాద్: మండలంలో శనివారం ఉదయం నుండి ఏకతాటిగా భారీ వర్షం పడింది. దీంతో మండల కేంద్రంలోని పలుచోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయాయి. మండకేంద్రంలోని బస్టాండ్ ఎదుట రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రక్కన వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అలాగే పలుచోట్ల వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందుల ఎదురయ్యాయి, మండలంలోని అన్ని గ్రామాలలోను వర్షం పడింది.

కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
* సీపీఐ జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి
కరీంనగర్ టౌన్, ఆగస్టు 11: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయాలనే డిమాండ్‌తో ఈనెల 13న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనం వెలికితీస్తామంటూ ఎన్నికలకు ముందు నొక్కివక్కానించిన ప్రధాని మోదీ, ఏరు దాటినంక తెప్ప తగలేసాడని మండిపడ్డారు. కా ర్పొరేట్ శక్తులకే వంతపాడుతూ, దేశాన్ని వారికి తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నాడు గొంతెత్తి, నేడు ఆ ఊసే ఎత్తకపోవటం వారిని వంచించినట్లేనన్నారు. దేశంలో అనేక కొత్త సమస్య లు ఉత్పన్నమవడానికి కారణం ప్రధాని మోదీ విధానాలేనని, దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, బడుగు,బలహీన వర్గాలు, మేధావుల హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరగటమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపుతూ, ఎన్నో హామీలు ఇచ్చాడని, వాటి ని అమలు పర్చకుండా, కాలయాపన చేస్తూ కమీషన్ల పనులు మాత్రమే చేస్తున్నాడని విమర్శించారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరును నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళల్లో భాగంగా చేపడుతున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>