Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

అధిర్ క్షమాపణ చెప్పాలి:బీజేపీ

$
0
0

న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్‌లో చేపట్టిన జాతీయ పౌరసత్వ సవరణపై మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. మోదీ, అమిత్‌షాలే చొరబాటుదారులని, వారు గుజరాత్ నుంచి ఢిల్లీ వలస వచ్చారని విమర్శించారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలపై గందరగోళం చెలరేగింది. అవమానకరంగా మాట్లాడిన అధిర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు అధిర్ పౌరసత్వంపై అనుమానం వస్తుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇటాలియన్ అని, అందుకే ఆ పార్టీ మిగతావారిని అలాగే టార్గెట్ చేస్తుందని అన్నారు.


దిశ నిందితులు కస్టడీ కోరుతూ పిటిషన్

$
0
0

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదోంతంలోని నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ జరిపేందుకు పది రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

పెరిగిన బస్ ఛార్జీలు

$
0
0

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బస్ ఛార్జీలను భారీగా పెంచింది. కనీస బస్ ఛార్జీని రూ.10లు చేశారు. పల్లె వెలుగు నుంచి ఏసీ స్లీపర్ వరకు భారీ ఎత్తున బస్ ఛార్జీలను పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.15, డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.12లకు పెంచింది. బస్‌పాస్‌లను సైతం భారీగా పెంచారు. బస్‌పాస్ ఛార్జీ రూ.770ల నుంచి రూ.950లకు, మెట్రో బస్‌పాస్ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచగా.. స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.390 నుంచి రూ.495కి పెంచింది. సూపర్‌ లగ్జరీలో కనీస చార్జీని రూ.25కి... రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌లో రూ.35 కనీస చార్జీ పెంచగా.. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస చార్జీ ఆర్టీసీ రూ. 75 చేసింది.

నక్సలిజాన్ని రూపుమాపేందుకు కృషి: అమిత్ షా

$
0
0

రాంచీ: జార్ఖండ్‌లో నక్సలిజాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన జార్ఖండ్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ అధికార దాహంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి సీఎం కావాలని చూస్తున్నారని అన్నారు. వారి ధ్యాస అంతా సీఎం కుర్చిపైనా, బీజేపీ లక్ష్యం అభివృద్ధిపైన అని అన్నారు. కశ్మీర్ దేశంలో అంతర్భాగమని జర్ఖాండ్ ప్రజలు భావిస్తున్నారని, అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు.

రైతు రుణాలు మాఫీ చేస్తాం:రాహుల్

$
0
0

రాంచీ: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిమ్‌డెగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ తమ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ రైతుల రుణాలు మాఫీ చేస్తుందని తెలిపారు. బీజేపీవారు బడా పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తూ రైతుల రుణాలు గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు.

20న తొలి కిరణం

$
0
0

జీవితంలో మంచీ చెడూవున్నా ఎప్పటికీ మంచే నెగ్గుతుందన్న కానె్సప్ట్‌తో వస్తోన్న చిత్రం -తొలి కిరణం. ఏవీయం ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై బేబీ మేరీ సమర్పణలో ఎంఆర్‌సి నాయుడు నిర్మాతగా దర్శకుడు జాన్‌బాబు తెరకెక్కించిన చిత్రమిది. డిసెంబర్ 20న విడుదలవుతోన్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి దర్శకులు సాగర్, వేణు, నటుడు భానుచందర్ హాజరయ్యారు. దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ -సినిమా కొంత ఆలస్యమైనా కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. భానుచందర్ ఓ ముఖ్య పాత్ర చేశారు. దర్శకుడు సాగర్ సహకారం మర్చిపోలేను అన్నారు. నిర్మాత నాయుడు మాట్లాడుతూ -బడ్జెట్‌కు వెరవకుండా సినిమా తీశాం. ఆడియన్స్‌కి నచ్చే సినిమా అనే అనుకుంటున్నా అన్నారు. నటుడు పిడి రాజు మాట్లాడుతూ -మూడేళ్లుగా మేంపడిన కష్టానికి దేవుడు విజయం చేకూరుస్తాడని ఆశిస్తున్నా అన్నారు. దర్శకుడు సాగర్ మాట్లాడుతూ -క్రిస్మస్ సీజన్‌లో వస్తోన్న తొలి కిరణం చిత్రం, విజయ్‌చందర్ కరుణామయుడు కంటే పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. భానుచందర్ మాట్లాడుతూ -చెడుమీద మంచి ఎప్పటికీ విజయం సాధిస్తుందన్నక కానె్సప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. నన్ను జీసెస్ పాత్ర పోషించమన్నపుడు చెయ్యలేనని చెప్పేశాను. రీసెర్చ్ చేసే పాత్రనే చేశా. డబ్బింగ్ చెబుతున్నపుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సినిమాను సక్సెస్ చేయాలని ఆడియన్స్‌ని కోరుకుంటున్నా అన్నారు.

పడిపడి నవ్వడమే..

$
0
0

ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ లీడ్‌రోల్స్‌తో రూపొందిన చిత్రం -భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఈ సినిమాతో కమెడియన్ వై శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నాడు. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, ఎస్‌ఎస్ తమన్ పాల్గొని బ్యానర్ లోగో, యానిమేటెడ్ టైటిల్‌ను ఆవిష్కరించారు. దర్శక నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ -చిన్న కానె్సప్ట్ అనుకుని ముందు నిర్మాతగా సినిమా చేద్దామనుకున్నా. టైం కలిసొచ్చి డైరెక్టర్ కావాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. సినిమా చూసిన దిల్‌రాజు, శిరీష్, సాయిలాంటివాళ్లు కొన్ని కరెక్షన్స్ చెప్పారు. అవి మాకు హెల్పయ్యాయి. ఇదొక ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా. సుమారు రెండు గంటలపాటు పడిపడి నవ్వుతారు. నాది గ్యారెంటీ అన్నారు. ఎస్‌ఎస్ తమన్ మాట్లాడుతూ -ఈ సినిమాకు రెండోసారి సాకేత్ మ్యూజిక్ అందించాడు. తన పనితో అందరికీ కలుపుకుపోయే రకం. తను మంచి సింగర్, మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్. ప్రతిరోజు కష్టపడాల్సిందే. ఆ కష్టమేంటో నాకు తెలుసు. అలాగే శ్రీనివాస్‌రెడ్డికి థ్యాంక్స్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ -ఇండస్ట్రీలో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకే నా సినిమాల్లో తనుండాలి. సరిలేరు నీకెవ్వరులో తను మిస్సయ్యాడు. సినిమాకు సలహా కోరుతూ ప్రొడక్షన్ కూడా అన్నపుడు భయపడ్డాను. రిస్క్ ఎందుకని హెచ్చరించినా, మంచి ప్లానింగ్‌తో సినిమా పూర్తిచేశాడు. అతనికి, అతన్ని నమ్మిన ఫ్లయింగ్ కలర్స్ గ్రూప్‌కి ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్‌రెడ్డి తొలి ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ -శ్రీనివాస్‌రెడ్డితో ప్రయాణం బావుంటుంది. ఈ సినిమాతో ఆయన భాగ్యనగర వీధుల్లోనే కాదు, రెండు రాష్ట్రాల్లోనూ గమ్మత్తు చేస్తాడనడంలో సందేహం లేదు. గట్టిగా నవ్వించడానికి క్లారిటీగా సినిమా తీశారు. సినిమా తప్పకుండా హిట్టవుతుంది అన్నారు. కార్యక్రమంలో సత్యం రాజేష్, షకలక శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ తదితరులు మాట్లాడారు.

అది చెప్పాలనే...

$
0
0

సొసైటీలో అక్రమాలు పెరుగుతున్నాయి. ఫలానా ఫీల్డ్‌లో అలాంటి వాతావరణం లేదని చెప్పలేని స్థితి మనది. ఆ పరిస్థితిపై కొత్త జనరేషన్‌కు అవగాహన కలిగించే ఉద్దేశంగా వచ్చిన సినిమా -అర్జున్ సురవరం అంటున్నాడు తరుణ్ అరోరా.
ఒకప్పుడు -స్టయిల్ వేరు. పెర్ఫార్మెన్స్ వేరు. ఇప్పుడు రెంటినీ మిళితంచేసి అద్భుతంగా చూపించే పాత్రలకు ప్రాణం పోస్తోంది కొత్తతరం. ఓ మోడల్‌గా అలాంటి అవకాశం అర్జున్ సురవరంతో నాకు దక్కింది. హ్యాపీ అంటున్నాడు కూడా. నిఖిల్ సిద్ధార్ధ్, లావణ్య త్రిపాఠీ జోడీగా దర్శకుడు టి సంతోష్ తెరకెక్కించిన చిత్రం -అర్జున్ సురవరం. సినిమాకు గుడ్ టాక్ రావడమే కాదు, విలన్ పాత్ర పోషించిన తరుణ్ అరోరాకు మంచి పేరు తెచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు అరోరా.
తమిళంలో వచ్చిన కణితన్‌కు రీమేక్ కనుక -తెలుగులోనూ విలన్ పాత్ర చాన్స్ వచ్చింది. అక్కడ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది. హీరో -విలన్ మధ్య ఇంటిలిజెంట్ వార్‌లా ఉంటుంది. ఇక్కడ హీరో అయిన జర్నలిస్ట్ పాయింట్ వ్యూ నుంచి మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యతనిస్తూ కథను డిజైన్ చేశారు. అందుకే ఇదొక మాస్ అప్పీల్ ఎమోషనల్ స్టోరీ అనిపిస్తోంది. రెండు వర్షన్ల మధ్య అదే తేడా.
దర్శకుడు సంతోష్ చెప్పాడంటున్న సీక్వెల్ గురించి నాకు తెలీదు. ఓ నటుడిగా చాలెంజింగ్ రోల్స్ ఎక్కడొచ్చినా, ఎందులో వచ్చినా చేస్తా. అదృష్టంకొద్దీ సీక్వెల్‌లోనూ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎవరి ఎఫర్ట్ అయినా సినిమాను సక్సెస్ చేయడమే.
సినిమా విస్తృతమవుతోంది. ప్రమాణాలు పెరిగాయి. వెబ్ సిరీస్‌లూ వస్తున్నాయి. ఆర్టిస్టులకు మంచి టైం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఏ భాషలో సినిమా చేసినా దానికో వర్కింగ్ స్టయిల్ ఉంటుంది. ఆ ఫ్లేవర్‌ను అందిపుచ్చుకుంటే -మంచి నటులు అనిపించుకుంటామన్నది నా భావన. అలా నాకో ప్లేస్ దొరకడం హ్యాపీ.
కణితన్, ఖైదీ నెం 150 తరువాత -భాషతో సంబంధం లేకుండా నార్త్, సౌత్ చాన్స్‌లు వస్తున్నాయి. మలయాళంలో మమ్ముట్టి మమాంగంలో చేస్తున్నా. తమిళంలో కార్తి హీరోగా ఓ సినిమా, బాలీవుడ్‌లో అక్షయ్ ‘లక్ష్మీబాంబు’ చిత్రాల్లో చేస్తున్నాను.
తెలుగు పరిశ్రమ ఇప్పుడు చాలా హైట్స్‌లో ఉంది. కథలపరంగా, నిర్మాణపరంగా గొప్ప చిత్రాలకు వేదికవుతోంది. ఈ క్రమంలో నాకు ప్లేస్ దొరకడం నా అదృష్టం.
విలన్ పాత్రలే చేయాలన్న ఆలోచన లేదు. నన్ను అలా యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక, విలన్ పాత్రలు చేస్తున్నా. కాలక్రమంలో ఇది మారొచ్చు. క్యారెక్టర్ రోల్స్, స్వీట్ రోల్స్ చేయడానికి నేను రెడీ


ఓన్లీ నేను...

$
0
0

శరకడం స్టోరీస్ బ్యానర్‌పై చెంగ్, మైరా అమితి జోడీగా విఘ్నేశ్ కలగర దర్శకత్వంలో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం -ఓన్లీ నేను. సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కార్యక్రమానికి హాజరైన నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ -ఓన్లీ నేను టీజర్ బావుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ -ఓన్లీ నేను ట్రైలర్‌తోనే డైరెక్టర్ ప్రతిభ తెలుస్తోంది అన్నారు. డైరెక్టర్ వీరభద్రం మాట్లాడుతూ -ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేసిన దర్శక నిర్మాతలకు అభినందన తెలిపారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ -ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను శిల్పారామంలో 15న నిర్వహిస్తున్నాం. ఔత్సాహిక దర్శకులు, నిర్మాతలను కలిపే వేదిక అది. టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఆడిషన్స్ ద్వారా ఆర్టిస్టులూ తమ ప్రతిభను ప్రూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ నేను ట్రైలర్‌పట్ల హ్యాపీగా ఉన్నా. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతా అన్నారు. చిత్ర దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ -ఓన్లీనేను షూటింగ్ చివరి దశకు చేరింది. ఒక స్కాం బేస్డ్‌గా నడిచే థ్రిల్లర్ కానె్సప్ట్ ఇది అన్నారు.

రీఎంట్రీకి రెడీయేనట

$
0
0

అంజలా జవేరీ. ఒకప్పటి అందాల తార. అందాన్ని లలితంగా చూపించి ఆకట్టుకున్న బ్రిటిష్ ఇండియన్ యాక్ట్రెస్. ఎంట్రీ ఇచ్చిన ఏడాదే మూడు భాషల్లో నాలుగు సినిమాలు చేసేసిన టాప్‌మోస్ట్ హీరోయిన్. బాలీవుడ్‌లో హిమాలయ్‌పుత్ర చిత్రంతో అరంగేట్రం చేసిన అంజల -తెలుగులో ప్రేమించుకుందాం రా, తమిళంలో పగైవన్, హిందీలో బేతాబి సినిమాలు చేసి సెనె్సషన్ సృష్టించింది. కెరీర్ ఆరంభంలో ఏటా రెండునుంచి నాలుగు సినిమాలు చేస్తూ వచ్చిన అంజల -అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో జోడీకట్టే అవకాశాలు అందుకుంది. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో మాయ పాత్ర చేసి మాయమైపోయిన అంజల -రీబ్యాక్‌కు రెడీ అవుతోందట. కెరీర్ టాప్‌లో ఉండగానే టాప్ మోడల్ తరుణ్ అరోరాను పెళ్లాడి స్క్రీన్‌కు దూరమైన అంజలా జవేరీ -మంచి కథ దొరికితే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగానే ఉందట. ‘గ్లామర్ రోల్స్ చేయడానికి యంగ్‌స్టర్స్, ఫ్రెషర్స్ చాలామందే ఉన్నారు. సో, మంచి కథ దొరికితే, అందులోని పాత్ర ఇంప్రెస్ చేస్తే రీఎంట్రీ కోసం ఆమె రెడీయే’ అంటూ భర్త తరుణ్ అరోరా స్పష్టం చేయడం విశేషం. ‘ఆమె రీఎంట్రీ కోసం నేనూ ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఆ టైం ఎప్పుడొస్తుందో చూద్దాం’ అంటున్నాడు తరుణ్. సో, అంజల మళ్లీ స్క్రీన్‌కు వచ్చే టైం ఎంతోదూరం లేదన్న మాట. పాత హీరోయిన్లు రీఎంట్రీ టైం నడుస్తోన్న ఈ తరుణంలోనే అంజలా జవేరీ మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుందని ఆశిద్దాం.

అప్పటివరకూ.. నిశ్శబ్దం

$
0
0

ఆసక్తి రేకెత్తిస్తోన్న అనుష్క తాజా చిత్రం -నిశ్శబ్ధం. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పోస్ట్ ప్రొడక్షన్స్‌లోవున్న సినిమాను జనవరి 31న థియేటర్లకు తేనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్‌లో నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ -హేమంత్ చెప్పిన కథ బాగా నచ్చింది. మేం నమ్మిన కథను ముందుకు తీసుకెళ్లేందుకు మాకు పీపుల్స్ మీడియా అండగా నిలిచింది. ఫుల్‌లెంగ్త్ మూవీ అమెరికాలో షూట్ చేయడం బహుశే ఇదే మొదటిసారి. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అనుకోని విధంగా ఫ్లైట్ జర్నీలో అనుష్కకు చెప్పిన కథ ఇది. సినిమా నిర్మాణంలో వివేక్ కూచిభొట్ల సహకారం మర్చిపోలేం. గోపీసుందర్ సంగీతం, టెక్నీషియన్ల పనితనం సినిమాకు ప్లస్. సినిమాలో హీరో హీరోయిన్లంటూ ఉండరు. అనుష్క, అంజలి, మాధవన్, షాలిని ఇలా ఎవరి పాత్ర వాళ్లదే అన్నాడు. నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ -పాటలు బాగున్నాయి. ఆర్టిస్టులంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నాడు. సీనియర్ ఆర్టిస్టులతో నటించే అవకాశం దక్కడం నా అదష్టం అని నటి వందన పేర్కొంది. విశ్వప్రసాద్ మాట్లాడుతూ హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా తీయాలన్న నా కల నిశ్శబ్ధంతో నెరవేరింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -విడుదలపై ఆడియన్స్‌లో ఆసక్తివుంది. డిజార్డర్‌వున్న ఆర్ట్ లవర్‌గా అనుష్క కనిపించనుంటే, సెలో ప్లేయర్‌గా కీలక రోల్ పోషిస్తోన్న మాధవన్‌తో ఆమె రిలేషన్‌పైనా ఆసక్తివుంది. హారర్ ఎఫెక్ట్స్‌తో పాత్రల్ని పరిచయం చేయడం, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ డిటెక్టివ్ కెప్టెన్ రోల్ పోషిస్తుండటం.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రచయిత కోన వెంకట్ తన సొంత బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నాడు.

వక్కంతంతో వరుణ్?

$
0
0

బాక్సర్‌గా విశ్వరూపం చూపించేందుకు గద్దలకొండ గణేష్ గట్టిగానే కష్టపడుతున్నాడు. వరుణ్‌తేజ్‌ను స్ట్రీట్‌బాక్సర్‌గా చూపిస్తూ దర్శకుడు కిరణ్‌కుమార్ తెరకెక్కించనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్స్ కొలిక్కి వచ్చాయట. టైం కలిస్తొసే వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లిపోతుంది. ఈలోగానే తరువాతి ప్రాజెక్టునూ లైన్‌లో పెట్టే పనిలోవున్నాడు వరుణ్. డిఫరెంట్ జోనర్లను టచ్ చేస్తూ వస్తున్న వరుణ్ -ఈసారి వక్కంతం వంశీ చెప్పిన కథకు కనెక్టయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన వక్కంతం -దర్శకుడిగా తొలి సినిమా ‘నా పేరు సూర్య..’తోనే చతికిలపడ్డాడు. బన్నీ కెరీర్‌లో ‘నా పేరు సూర్య’ అతి పెద్ద డిజాస్టర్. అయితే అదేమీ పట్టించుకోకుండా వక్కంతం చెప్పిన కథపై నమ్మకంతో వరుణ్ ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అప్‌డేట్స్ రావొచ్చన్న మాట వినిపిస్తోంది.

అన్నదమ్ములు

$
0
0

శ్రీరాముడు లక్ష్మణునికి అనే్న కాదు, ఆదర్శమూర్తి కూడాను. అసలు రాముడు వేరు లక్ష్మణుడు వేరా అంటే కాదు, ఇద్దరూ ఒక అంశలో పుట్టినవారేనన్నది సత్యం. పుత్రకామేష్ఠి యాగం చేసియజ్ఞపాయస ప్రభావంతో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మించారు. సుమిత్రకు రాముడి అంశతో లక్ష్మణుడు, భరతుని అంశతో శతృఘు్నడు జన్మించారు.రావణుడు, కుంభకర్ణుడు అరాచకాలకు పాల్పడుతున్నారు. వారిని సంహరించి లోకకళ్యాణం చేయడానికి మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అతని ఆయుధాలైన శంఖ, చక్ర గదలు లక్ష్మణ, భరత, శతృఘు్నలుగా అవతరించారు అనే పురాణం మనకు లభ్యమవు తుంది. రాముడు ఉన్నతాశయాలు కలిగినవాడు. మితభాషి, శాంతిప్రియుడు. ఎవరైనా కోపం తెచ్చుకున్నా వారిని మంచిమాటలతో సానుకూల ధోరణికి వచ్చేట్టు చేసేవాడు. అట్లాఅని కోపం లేనివాడు కాదు. శాంతమూర్తి. ధర్మాగ్రహం వస్తే రామునికి ఎదురొడ్డినిలిచేవారు ఎవరూ ఉండరు. లక్ష్మణుడు ఉగ్రమూర్తి. కోపం వచ్చిందా ఎదుటివారుకోపాగ్నికి ఆహుతి అవ్వవలసినదే. కానీ రాముడు లక్ష్మణుడిని శాంత పరిచి ఎదుటివారిలో తప్పు ను సరిచేయగలమేమో చూసి వారు మారరు అని నిర్ణయంచుకున్న తరువాత మాత్రమే వారిని శిక్షించేవారు. కనుక రామునికి శాంత మూర్తి అన్నపేరు సార్థకం అయంది. లక్ష్మణుడు ఉగ్రమూర్తి అయనా అన్న మాటను జవదాటని తమ్మునిగా పేరుపొందినవాడు అయ్యాడు. అన్నదమ్ములెవరైనా రామలక్ష్మణుల్లా ఉండాలి అనుకొంటారు. *

బ్రహ్మచర్యాదీక్షాపరులు

$
0
0

మనస్సెపుడూ బ్రహ్మమందే చరిస్తూ ఉండడమే బ్రహ్మచర్యమన్నారు. ప్రాచీన ఋషులు మనిషి జీవితాన్ని బ్రహ్మచర్యం, గార్హ్యస్థం, వానప్రస్థం, సన్న్యాసం అని నాలుగు భాగాలుగా విభజించారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్య దీక్షాసమయం బాల్యం నుండి పాతిక సంవత్సరాల వయస్సు వరకు అంటారు. అది విద్యార్థి దశ. కానీ, ప్రతి వ్యక్తి నింరతరం బ్రహ్మచర్యవ్రతమాచరించగలిగితే నిజతత్త్వం తెలసుకుని పరమాత్మానుభూతి పొందగలడని అనేకమంది మహనీయులు అనుభవ పూర్వకంగా తెలిపారు.
ప్రతి వ్యక్తి దైహిక ఇంద్రియ సుఖాలకు, మానసికంగా కూడా శృంగారకాంక్షలకు దూరంగా ఉంటూ సత్యానే్వషిగా నిరంతరం పరమాత్మ యందే మనస్సు నిలిపియుంచి, తాను కేవలం దేహం కానని, తాను ఒక దివ్యకాంతిస్వరూపమనే ఎరుకతో ఉండాలి. బ్రహ్మచర్యవ్రతం మనిషికొక అద్భుత శక్తినిస్తుంది. ఆనందం కలిగి, సృజనాత్మకత సిద్ధిస్తుంది. వీర్యనష్టం వలన ఏకాగ్రత చెడుతుంది. చెడు అలవాట్లు పతనం చేస్తాయి. శృంగారకాంక్ష ఆహారంలో రుచిని గురించిన ధ్యాస, సుగంధ వాసనల పట్ల మమకారం వదులుకోవాలి. తానుజ్ఞానం పొంది జీవాత్మ పరమాత్మల ఏకతాభావం పొందగలిగే సాధన చేయాలి. ఈ సాధన మొదట కష్టమన్పించినా, అసాధ్యం కాదని స్వీయానుభావంతో ఎంతోమంది తెల్పియున్నారు.
మనసా, వాచాకర్మణాల తన కోరికను చంపుకుని, ఇంద్రియనిగ్రహం కలిగి, మనస్సును దైవం పైన సమాజసేవ పైనా నిలిపి ఉంటే బ్రహ్మం వశమవుతుంది. వ్యక్తే దైవంగా మారుతాడు. బ్రహ్మచర్యం వలన చాలా లాభాలున్నాయి.వీర్యవృద్ధి తో బాటు,మానసిక ప్రశాంతత, స్వచ్ఛత, పవిత్రత, ఏకాగ్రత నైతికశక్తి, శరీరిక బలం కలిగి ముఖం తేజోవంతం అవుతుంది. తేజస్సు, ఓజస్సు పెరిగి వ్యక్తి ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్కుడు అవుతాడు.
ప్రతిబాలునికి సంపూర్ణ బ్రహ్మచర్యమాచరించే శిక్షణ నివ్వాలి. అప్పుడతనికి విశ్వాసము, శద్ధ్రాసక్తులు పెరుగుతాయి. మనస్సు, వచస్సు, కర్మణలతో నిరంతర సచ్ఛీల భావంతో ఉండటమే బ్రహ్మచర్యం. అపవిత్రాలోచన అపవిత్రచర్య కంటే చెడునైనది అన్నారువివేకానంద ఒకసారి.
ఉపనయనం బ్రహ్మచర్యానికి ఆరంభం. అది సమావర్తనంలో ముగుస్తుంది. సమావర్తనమంటే బయలుదేరిన చోటుకే తిరిగిరావడం. గురుసాన్నిధ్యంలో విద్య పూర్తి చేసుకొని, భిక్షాటనతో లేదా విద్యాప్రదర్శనతో ధనం సంపాదించి గురుదక్షిణ చెల్లించి ఇంటికి తిరిగి రావడమే సమావర్తనం. సమావర్తనానంతరం. అవివాహితుడుగా ఉండేవాడు. స్నాతకుడు. కాశీయాత్ర చేసినవాడితడే. ఇట్లు ‘ఉపనయనం’ మొదలుకొని స్నాతకపర్యతం భిక్షాచరణ చేస్తూ వ్రతానుష్ఠాన మూలంగా బుద్ధికి చురుకుదనం సాధించి వేదాధ్యయనం చేస్తూ పూజ, స్నా ఔపోసనాదికాలు తెలుసుకొనడమే బ్రహ్మచర్యం అన్నారు కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారు.
స్ర్తిపురుషులెవరైనా బ్రహ్మచర్యాదీక్షను స్వీకరించవచ్చు. బ్రహ్మచర్యదీక్షతీసుకొన్న పురుషులనుబ్రహ్మచారులు అంటే స్ర్తిలను బ్రహ్మచారిణులని అంటారు. ఆంజనేయస్వామి, భీష్ముడు, మీరాబాయి, సులభ, గార్గి, త్రిమతాచార్యులు, స్వామి దయానంద సరస్వతి,శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవింద ఘోష్, శ్రీరమణ మహర్షి, సాధ్వీరీతాంబరి ఇలాంటి వారంతా కూడా బ్రహ్మచర్యాన్ని దీక్షగా తీసుకొన్నవారు. పతంజలి యోగసూత్రాల్లో బ్రహ్మచర్యదీక్ష పాటిస్తున్న వారికి బ్రహ్మవర్చస్సు, వీర్యలాభం, అమానుష ప్రజ్ఞ,జితేంద్రియత్వం సిద్ధిస్తాయని చెబుతున్నాయి.

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

$
0
0

‘‘పొలము దున్నుచుండెను కృషీవలుడొకండు
పాలపిట్టలు రివ్వున పారిపోయె
ఆకసము వౌనమును బూనె- అంత నిలచి
చూచితి పృథివి నర్థవిస్ఫూర్తికొఱకు’’ నవ్వాడు మనిషి
నాజూకు పెదవుల మధ్య నగపతిని నిలిపి నవ్వాడు మనిషి
నాజూకు మడతల మధ్య నాలి పాడిని పొదిగి
‘‘మనిషి నేడు మనిషియయ్యె నతి వేల
వస్య విజ్ఞాన శాస్త్ర రహస్య దీప్తి
నైన నేమి? యసలు రహస్యమ్ము మనిషి
మనసికాలేదు భేదముల్ మఱువలేదు
ఉర్వికిని చంద్రునకు మధ్యనున్న దూర
మెంత? స్వార్థ సమష్టి సౌఖ్యాంతరస్థ
దూరమున కొంత! ధని దరిద్రులకు నడుమ
గల విభేదమ్ము కొలత లోన లవమంత
జగమంతా వెతికాను జనం కోసం నాలోనే ఉన్నాడని తెలియక
స్వప్నాలు శాశ్వత వాస్తవాలుగా ఇప్పుడు
నన్ను నేనే వెతుక్కుంటున్నాను...
సుకవి జన విధేయ సాంధ్యశ్రీ నామధేయ కవి ప్రణీత ‘సృస్థిలయ’ అనుబంధ కావ్యం ‘సత్యం శివం సుందరం’ కావ్యేన ప్రథమసర్గ సమాప్తం.
ఇంకాఉంది


మనసుంటే మార్గాలు కోకొల్లలు

$
0
0

మనసుండాలే కానీ మార్గాలు కోకొల్లలు.చేసే పనిమీద మనసును లగ్నం చేస్తే అన్ని సఫలం అవుతాయి. ‘చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద’ అన్నట్లుగా ఉంటే ఫలితం ఉండదు. మనం చేసే ఏ పనిమీదనైనా సూక్ష్మదృష్టి పెట్టి చేస్తే అది ఫలవంతమవుతుంది. ‘సంకల్ప బలం’ ఉండి ఏకాగ్రతతో ఏ పని చేసినా చివరికి దాని ఫలితం లభిస్తుంది.కశ్యప మహామునికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి సంతానం రాక్షసులు, అదితి సంతానం దేవతలు. వీరు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి వారు గెలిస్తే మరోసారి వీరు గెలిచేవారు. అలా కొనసాగుతుండగా, రాక్షస గురువైన శుక్రాచార్యుడు తపస్సు చేసి ‘మృత సంజీవని’ విద్యను సాధించాడు. ఆ విద్య కారణంగా యుద్ధంలో మరణించిన రాక్షసులందరినీ తిరిగి బతికించసాగాడు. అప్పటికి దేవతలు ఇంకా ‘అమృతపానం’ చెయ్యలేదు. అందువల్ల వారు మరణించిన వారిని బతికించలేకపోయారు.
ఎలాగైనా ఆ విద్యను సాధించాలనే ఉద్దేశ్యంతో దేవ గురువైన బృహస్పతి తన కుమారుడైన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృతసంజీవని విద్యను నేర్చుకురమ్మని పంపాడు. కచుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి ప్రవర చెప్పుకొని విద్య నేర్చుకోవటం ప్రారంభించాడు. అనతికాలంలోనే గురువుకి ఇష్టుడయ్యాడు. అది చూసి మిగతా శిష్యులందరికీ కంటగింపుగా మారింది. వారి మనసు ఈర్ష్య అసూయలతో నిండిపోయింది. ఎలాగైనా కచుని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు పథకం ప్రకారం అతనిని హతం చేసి, కాల్చి బూడిద చేసి ఆ బూడిదను గురువుగారికి సురలో కలిపి ఇచ్చారు.
విషయం తెలియని గురువుగారు సురాపానంచేశారు. ఇంతలో కుమార్తె అయిన దేవయాని వచ్చి కచుడు కనబడలేదు అని వార్త చెప్పింది. దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు. కచుని బతికించడానికి తప్పనిసరి పరిస్థితిలో మృత సంజీవని విద్య నేర్పించాడు. విద్య నేర్చుకున్న కచుడు బయటకు వచ్చి గురువును కూడా బతికించాడు. నేర్చుకోవాలన్న తపన ఉంటే పరిస్థితులు కూడా అలా కలిసి వస్తాయి. తనకున్న అకుంఠిత దీక్ష కారణంగా చనిపోయి కూడా బతికి ఆ విద్యను సాధించాడు.

కాలీ‘ఫ్లేవర్’ అదరహో..

$
0
0

చలికాలంలో ఎక్కువగా వచ్చే కాయగూర కాలీఫ్లవర్. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకుపచ్చని కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి ఆకుపచ్చని కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఇది రుచికరమైన మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అధికంగా కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి కేన్సర్‌తో పోరాడుతుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. గుండెపోటును దూరం చేసే విటమిన్లు అయిన బి1, బి2, బి3, బి5, బి6, బి9లు కాలీఫ్లవర్లో ఉన్నాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందజేసే కాలీఫ్లవర్‌తో కూరలే కాకుండా గోబీ మంచూరియా, 65, మసాలా కూర.. ఇలా పిల్లలకు నచ్చేవిధంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైన వంటలను ఎలా తయారుచేయాలో చూద్దామా..
*
కాలీఫ్లవర్ రైస్
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: అర పువ్వు
బాసుమతి అన్నం: రెండు కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: రెండు
జీలకర్ర: అర చెంచా
పసుపు: పావు చెంచా
కారం: అర చెంచా
దాల్చిన చెక్క: కొద్దిగా
లవంగాలు: నాలుగు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
*
తయారుచేసే విధానం
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న పూవులుగా విడదీసుకోవాలి. తరువాత వీటిని మరుగుతున్న నీళ్లలో వేసి కాసేపు ఉంచాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక పాన్‌ను తీసుకుని దాన్ని స్టవ్‌పై ఉంచి నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. పోపు వేగిన తరువాత అందులో కారం, పసుపు, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులోనే కాలీఫ్లవర్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి సన్నని మంటపై పదినిముషాలు వేయించాలి. ఇలా గోబీ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. గోబీ మెత్తగా మారిన తరువాత ఇందులో ముందుగా వండి పెట్టుకున్న అన్నవం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా ఐదు నిముషాలు తక్కువ మంటపై వేయించాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. అంతే గోబీ రైస్ తయారు.
*
గోబీ మంచూరియా
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: రెండు కప్పులు
నూనె: వేయించడానికి సరిపడా
మైదా: ఐదు చెంచాలు
కార్న్ ఫ్లోర్: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: పావు చెంచా
ఉల్లిపాయ తరుగు: అరకప్పు
పచ్చిమిర్చి తరుగు: పావు కప్పు
వెల్లుల్లిపాయల తరుగు: మూడు చెంచాలు
కెచెప్: రెండు చెంచాలు
రెడ్ చిల్లీ సాస్: రెండు చెంచాలు
నీళ్లు: తగినన్ని
కార్న్‌ఫ్లోర్: రెండు చెంచాలు
సోయాసాస్: నాలుగు చెంచాలు
వైట్ వెనిగర్: రెండు చెంచాలు
తయారుచేసే విధానం: ముందుగా నాన్‌స్టిక్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారగానే అందులో కెచప్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సోయాసాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో రెండు చెంచాల కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని స్టవ్‌పై ఉంచిన సాస్ మిశ్రమంలో వేసి ఐదు నిముషాల పాటు బాగా కలపాలి. తరువాత ఈ సాస్‌ను పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్‌ను వేయాలి. స్టవ్‌పై బాణలి ఉంచి నూనెను పోయాలి. నూనె కాగిన తరువాత కాలీఫ్లవర్‌ను ఇందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా కాలీఫ్లవర్ అంతటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారుచేసి పెట్టుకున్న సాస్‌ను మళ్లీ స్టవ్‌పై ఉంచి సిమ్‌లో పెట్టుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ను కలిపి ఐదు నిముషాల పాటు వేడిచేయాలి. అంతే అందరికీ నోరూరించే గోబీ మంచూరియా తయారు.
*
గోబీ బటర్ మసాలా
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: ఒకటి పసుపు: అర చెంచా
బటర్: మూడు చెంచాలు బిర్యానీ ఆకు: ఒకటి
లవంగాలు: రెండు యాలకులు: రెండు
దాల్చిన చెక్క: చిన్న ముక్క ఉల్లి తరుగు: అర కప్పు
టొమాటో తరుగు: అర కప్పు అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
కారం: రెండు చెంచాలు ధనియాల పొడి: మూడు చెంచాలు
గరం మసాలా: అర చెంచా జీడిపప్పు పలుకులు: కొన్ని
కసూరీ మేథీ: అర చెంచా తాజా క్రీమ్: పావు కప్పు
నూనె: రెండు చెంచాలు కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత స్టవ్‌పై ఒక గినె్నలో నీళ్లు తీసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. ఇందులో పసుపు కూడా వేయాలి. కాలీఫ్లవర్ తరుగును ఇందులో వేసి కొద్దిసేపు ఉంచాలి. తరువాత కాలీఫ్లవర్‌ను వడకట్టాలి. చల్లటినీటితో కాలీఫ్లవర్‌ను మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. ఇది కరిగాక కాలీఫ్లవర్ తరుగును వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. దీనికి కొద్దిగా నీళ్లు జతచేసి మూత ఉంచి మూడు నిముషాల పాటు ఉడికించి పక్కకు తీసుకోవాలి. అదే బాణలిలో మరికాస్త బటర్ వేసి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత దీనికి ఉల్లి తరుగు కూడా జతచేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తరువాత ఇందులో టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలు మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే బాణలిని స్టౌవ్‌పై ఉంచి కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలపాలి. ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు జతచేసి సుమారు ఐదు నిముషాల పాటు ఉడికించాలి. తరువాత ఇందులో తాజా క్రీమ్, కసూరీ మేథీ జతచేసి మరోమారు కలియబెట్టి రెండు నిముషాలు ఉడికిన తరువాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.
*
గోబీ 65
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: పెద్దవి రెండు
పెరుగు: రెండు కప్పులు
ఉప్పు: తగినంత
పసుపు: చిన్న చెంచా
కారం: మూడు చెంచాలు
తందూరి రంగు: చిటికెడు
అల్లం, వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
గరం మసాలా: ఒక చెంచా
ఆవాలు: రెండు చెంచాలు
జీలకర్ర: రెండు చెంచాలు
కరివేపాకు: కాసింత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
కాలీఫ్లవర్ పువ్వుల్ని శుభ్రం చేసుకుని మరుగుతున్న నీటిలో ఒక నిముషం పాటు ఉంచి, కాసింత ఉప్పు కలిపి దించేయాలి. తరువాత పువ్వుల్ని పురుగులు ఉన్నాయా చూసుకుని చిన్న చిన్నవిగా కాలీఫ్లవర్‌ను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెరుగులో కారం, ఉప్పు, పసుపు పొడులను వేయాలి. ఇందులోనే తందూరి రంగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే కాలీఫ్లవర్‌ను వేసి పది నిముషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత ఈ కాలీఫ్లవర్‌ను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇవి చిటపటలాడాక వేయించిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా వేయించి దించేయాలి. అంతే గోబీ 65 తయారు. దీన్ని పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా వట్టిదే, స్నాక్స్‌లా తినేస్తారు.
*
గోబీ ఫ్రై
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ తరుగు: మూడు కప్పులు
నీళ్లు: మూడు కప్పులు
ఉప్పు: తగినంత
అల్లం-వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
సోంపు: పావు చెంచా
నెయ్యి: మూడు చెంచాలు
ఉల్లి తరుగు: అర కప్పు
పచ్చిమిర్చి తరుగు: ఒక చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
టొమాటో తరుగు: అర కప్పు
పసుపు: పావు చెంచా
కారం: పావు చెంచా
మిరియాల పొడి: పావు చెంచా
గరం మసాలా: పావు చెంచా
జీలకర్ర పొడి: అర చెంచా
ధనియాల పొడి: అర చెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
నీటిని మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి అందులో కాలీఫ్లవర్ తరుగు వేయాలి. కాసేపటి తరువాత కాలీఫ్లవర్‌ను తీసి ప్లేటులో వేయాలి. స్టవ్‌పై బాణలిని పెట్టి నెయ్యివేసి వేడిచేయాలి. ఇందులో మొదటగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇందులో టొమాటో తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ముక్కలు బాగా మెత్తబడ్డాక, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత ఇందులో కాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలపాలి. దీన్ని సన్నని మంటపై కొద్దిసేపు ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి. ఇది అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

బలమైన ఎముకలకై..

$
0
0

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
* గుమ్మడి గింజల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలన్నీ ఇందులో ఉంటాయి. శరీరానికి ఇతర విటమిన్లు కూడా అందుతాయి. అందువల్ల వీటిని తీసుకుంటే హృద్రోగాలకు దూరంగా ఉండచ్చు. సెరటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
* నువ్వుల్లో జింక్, కాల్షియం, ఫాస్పరస్‌లు ఎక్కువ. ఇవి ఎముక మజ్జను ఏర్పరచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఎముక పుష్టినీ పెంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును, గుండె జబ్బుల్ని అదుపులో పెట్టుకోవచ్చు.
* అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. ఇవి హార్మోన్ల అసమతుల్యతని తగ్గిస్తాయి. నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వీటిల్లో కావలసినంత పీచు ఉంటుంది. అవిసె గింజల నుంచి అందే మాంసకృత్తులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. అలాగే బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.

సత్వర న్యాయం సాధ్యమేనా?

$
0
0

‘దిశ’ హత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖండిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని న్యాయవ్యవస్థల్లో జాప్యం వల్ల తప్పించుకుని తిరుగుతున్న రేపిస్టులకు తెరదించే పనిలో పడింది కేంద్రం.
*
నేడు మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్త లేని దినపత్రిక ఉందా? లేదనే విషయం అందరికీ తెలుసు. మహిళలపై వరుస నేరాలు నిత్యకృత్యమయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార కేసుల్లో శిక్షలు పడే కేసులు ఎన్నో తెలుసా? కేవలం నాలుగు శాతం లోపేనట. జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదిక చెబుతున్న గణాంకాలు ఇవి. అంటే వందకు 96 కేసుల్లో నిందితులు బయటపడుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ మహిళలపై జరిగే అన్ని నేరాల్లో 6.2 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అత్యాచార కేసులను పరిశీలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.
నేడు ‘దిశ’ ఘటనతో మరోసారి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రస్తావన వచ్చింది. సత్వర న్యాయం అందించడానికి ‘్ఫస్ట్‌ట్రాక్’ పేరుతో తీసుకువచ్చిన కోర్టుల్లో కూడా అంతే జాప్యం జరుగుతోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం వీటిని ఏర్పరస్తున్నారు. సంచలన కేసుల విషయంలో ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడం మునుపు మనం చూశాం. పాత కేసుల పరిష్కారానికి 2000 సంవత్సరంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికింద తెలంగాణలో 36 కోర్టులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో జిల్లా జడ్డి కోర్టులు 22 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుగా పనిచేస్తుండగా వీటిలో తొమ్మిది కోర్టులను పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో మరో 16 సబార్డినేట్ కోర్టులు పనిచేయడం లేదు. అత్యాచారం, పోక్సో కేసులు సుమారు 5598 ఉండగా, 36 కోర్టులను కేటాయించారు. ఇందులో పది కోర్టులు కేవలం పోక్సో కేసులను, 26 కోర్టులను అత్యాచారం, పోక్సో కేసుల విచారణకు నిర్దేశించారు. వరంగల్లో తొమ్మిది నెలల పిల్లను అత్యాచారం చేసి చంపిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా 61 రోజుల్లోనే దర్యాప్తును పూర్తిచేసి నిందితుడికి కోర్టు ఉరిశిక్షను విధించింది. నిందితుడు హైకోర్టుకు వెళితే దాన్ని యావజ్జీవంగా మారు స్తూ నిందితుడికి చివరి శ్వాస వరకూ జైలులోనే ఉంచాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఐదేళ్ల క్రితం అభయ అత్యాచారం కేసులో విచారణను తొమ్మిది నెలల్లో పూర్తిచేసి ఇద్దరు నిందితులకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ రెండు కేసులు మినహా సత్వర న్యాయం జరిగిన కేసులు తక్కువే.
నేరాలు-శిక్షలు
జాతీయ నేరాల నమోదు సంస్థ 2017లో వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో న్యాయవిచారణ చేపట్టిన కేసులు 1,46,201 అయితే ఇందులో శిక్ష పడిన కేసులు కేవలం 5,822 మాత్రమే.. ఇందులో కొట్టేసిన కేసులు 11, 453. అదే రాష్ట్రంలో అయితే 2017కు గాను 17, 521 కేసులు నమోదయ్యాయి. ఇందులో శిక్షలు పడిన కేసులు 426 మాత్రమే.. మిగిలిన కేసులు ఎప్పుడు కొలిక్కి వస్తాయో, నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుందో ఆ దేవుడికే తెలియాలి.
మనదేశంలో కోర్టు తీర్పులు వెలువడడానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకించి చెపాల్సిన అవసరం లేదు. నిర్భయ కేసే దీనికి మంచి ఉదాహరణ. ఇలా చట్టం వల్ల ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుని. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించనుంది. ఇకపై ఎవరైనా రేప్ చేస్తే హైకోర్టు కూడా బైపాస్ చేస్తూ నేరుగా ఉరిశిక్ష విధించే వీలుంటుంది. అప్పుడు ఆ సదరు ముద్దాయికి సుప్రీం కోర్టుకు తప్ప వేరే కోర్టును ఆశ్రయించే ఆప్షన్ లేదు. తద్వారా న్యాయం జరగడానికి జరిగే జాప్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. నిర్భయ సంఘటన 2012 డిసెంబర్‌లో జరిగితే.. 2013 సెప్టెంబర్‌లో కింది కోర్టు తీర్పును వెలువరించింది. ఆ తరువాత నిందితులు హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. 2014 హైకోర్టులో కింద కోర్టు ఇచ్చిన తీర్పు వేసిన మరణ దండన సరైందేనని చెప్పింది. వారు ఆ తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017లో సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష విధించాల్సిందేనని చెప్పినప్పటికీ ఇంతవరకు వారిని ఉరి తీయలేదు. ఇప్పటికీ వారు తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఇలాంటి జాప్యాలను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి కఠిన చట్టాలైనా ఇలాంటి కామాంధులను ఆపుతాయో లేదో చూడాలి.. *

సాహిత్యంతో మానవీయ ప్రయోజనం (సుహృల్లేఖ -3)

$
0
0

సంగీత - సాహిత్య సంచారిణి
*
కావ్యంలో ఉపదేశ వాక్యమొకటి ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఉండవచ్చు, లేదా పరోక్షంగాను ఉండవచ్చు. మొత్తం కావ్యవస్తువా వాక్య భావం చుట్టూ తిరుగుతుండవచ్చు. విపులంగా చర్చించడానికిది చోటుగాకున్నా, ఒక మంచి మాటను లౌకికులు వారి వారి అవసరాలకి ఉపయోగపడేట్టు వాడుకొంటారు. ఇట్లాంటి అనేక విషయాలు మనస్సులో ఉంచుకొని కావ్యం చదవాలి. శబ్దతశ్చ, అర్థతశ్చ విషయాన్ని మధించి (వస్తువు, వాస్తవికత), వస్తుతత్వమును గ్రహించాలి. ‘వయస్యః పరమాగతిః’ అని వున్నది. ఈ వాక్య కావ్యతత్త్వాన్ని త్రికరణశుద్ధిగా గ్రహించి అనుసరించినవారు రామసుగ్రీవులు; వస్తువునంటిబెట్టుకున్న వాస్తవికతను మాత్రం తీసికొన్న వారు వాలి రావణులు. వారిద్దరు కూడా మిత్రులే. వారి వారి అవసరాలకు ఈ సూక్తిని వాడుకున్న విధమిది-
దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగచ్ఛాదన భాజనం
సర్వమేవా విభక్తం నో భవిష్యతి హరీశ్వర!!
- అంటాడు రావణుడు.
భార్యా పుత్రాదులతో సహా రాజ్యాన్ని, దేశాన్ని సర్వభోగాలను వాలి రావణులిద్దరూ సమానంగా అనుభవించాలి అని భావం. కొంతమంది ఒక ఉపదేశ వాక్యాన్ని తమకనుకూలంగా అన్వయింపజేసికొంటారు. ఇది దుష్టాచరణం. మరి వాలి రావణులిద్దరూ విద్వాంసులే. అపరిమిత బలశాలురే. వారి ఆచరణ మంచిది కాదని మనకు కథ చెప్తూనే ఉంటుంది. కావ్యంలో ఉల్లేఖించబడిన మంచిని కొంతమంది తెలిసినవారే దానికి స్వార్థం రంగునెట్లా పూస్తారో గ్రహించవలసిన అవసరమున్నది.
భారతంలో ఒక వాక్యమున్నది. ‘అర్థస్యదాసః పురుషః’. ఈ వాక్యాన్ని చాలామంది స్వార్థపరులు తమను తాము సమర్థించుకునేందుకు వాడుతుంటారు. భీష్ముడు కౌరవ పక్షాన ఉన్నందున తన నిస్సహాయతను, అర్థప్రాబల్యాన్ని వెల్లడించే సందర్భంలోనిదీ మాట. ఇంతకీ ఒక సూక్తికి కావ్యంలోగల ప్రముఖ స్థానాన్ని గురించి తెలుసుకోవాలి. చాలామంది ఈ ఉపదేశాలు మాకెందుకు అంటుంటారు. మరి నన్నయభట్టు నానారుచిరార్థసూక్తి నిధి. ఆయన వెర్రివాడు కాదు, కుర్రవాడు కాదు.
కవిత పరమార్థం ఆనందం. ఇది ముఖ్యమైన ప్రయోజనం. రేఖామాత్రంగా చూద్దాం. లాక్షణికులు ఆత్మానందమనీ, రసానందమనీ, అది బ్రహ్మానంద సహోదరమనీ వివరించారు. మళ్లీ ‘రసోవైసః’ అన్నారు. మనలో చాలామందికి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో అభిరుచి ఉన్నదనేది స్పష్టం. కొంతమందికి అభినివేశం కూడా ఉండి ఉండవచ్చు. మీతో ఈ మాటలు చెప్తూ క్రమంగా ఒక సన్యాసి ఆశ్రమానికి తీసికొని వెళ్తున్నానని భావించకండి. సంతోషానికి వ్యతిరేకం విచారం, సుఖానికి దుఃఖం, శాంతికి అశాంతి వ్యతిరేకాలు. అవి దేశ కాల మనస్సంబంధ స్థితులు. ఆనందానికి వ్యతిరేకం లేదు. గణితశాస్త్ర రీత్యా ఆది ఒక బిందువనుకొంటే దానికి కొలతలు లేవు. తైత్తిరియోపనిషత్తులో ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా’ అని అంటారు. ఎక్కడ ఈ మాటలు, మనస్సు యింక ముందుకు వెళ్ళలేక వెనక్కి తిరుగుతాయో అది ఆనంద స్థానం. సత్కావ్య రచనం, పఠనం, శ్రవణం ఆ మహత్తరమైన ఆనందసీమకు ప్రయాణింపజేస్తుంది. అభ్యుదయ కవితా స్రష్ట అనిపించుకున్న మహాకవి శ్రీశ్రీ ఈ ఆనంద పథాన్ని హేతువాదపరంగా, గతితార్కిక భౌతికవాద దృష్ట్యా అంటే మార్క్సిస్టు దృక్పథంతో కూడా నిర్వచించవచ్చునన్నారు (శ్రీశ్రీ సాహిత్య వ్యాస సంపుటి). వివరాలు వచ్చే లేఖలో వ్రాస్తాను. ‘అగ్ని కురిసినా - అమృతం జల్లినా (దాని) పరమవాధి ఆనందం’ (తిలక్)
ముగింపుగా- సాహిత్యం వ్యష్టి వికాసాన్ని సమష్టి పర్యంతం విస్తరిస్తూ ఒక మానవీయ ప్రయోజనాన్ని సంపాదించి పెడుతుంది. ‘జీవితమంటే మంచు- ఉన్నదానిలో అందరికి పంచు’ అంటాడు గోపాల చక్రవర్తి. ‘ఆనందం జీవనదిలో మిగిలినది అనుభవించు’ అన్న మరొక వాక్యం చేరిస్తే భావం పరిపుష్టమవుతుంది.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>