Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

21న ‘వేటాడు - వెంటాడు’

విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర అందిస్తున్న ద్విభాషా చిత్రం ‘వేటాడు - వెంటాడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఆడియో వేడుకల ఇటీవల జరిగింది. అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ వనమాలి రాసిన గీతాలకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం హీరో విశాల్‌కి మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మనోజ్ బాజ్‌పాయ్, సునయన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, నిర్మాత: శ్రీనివాస్ దామెర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.

విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles