Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ఏసిబికి చిక్కిన లాలాగూడ ఎస్‌ఐ

తార్నాక, జనవరి 9: లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్‌హేండెడ్‌గా దొరికిన లాలాగూడ ఎస్‌ఐ రామకృష్ణ గౌడ్‌ను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుకారాం గేటుకు చెందిన జగన్మోహన్ రెడ్డి, లత దంపతలు తమ కొడుకును అమెరికా పంపేందుకు శాంతినగర్ లో ఉండే మల్లేశ్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గ్యారంటీగా వారు బ్యాంకు చెక్కులు ఇచ్చారు. సకాలంలో చెల్లించకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో మల్లేశ్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని లాలాగూడ పోలీసులను ఆదేశించింది. అయితే ఎస్‌ఐ రామకృష్ణ గౌడ్ కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండా ఇరువురికి మధ్య సయోధ్య కుదిర్చి రూ.2.25 లక్షలు ఇప్పించేందుకు మాట్లాడాడు. ఇందుకు గాను ఎస్‌ఐ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో మల్లేశ్ ఏసిబికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐని ఏసిబి అధికారులు రెడ్ హేండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.

లంచం తీసుకుంటూ ఏసిబికి
english title: 
acb

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles