Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

వినోదాత్మకంగా ‘మిస్టర్ మనీ’

Image may be NSFW.
Clik here to view.

నవీన్ (‘నచ్చావులే’ ఫేం), అలేఖ్య నాయకా నాయికలుగా కృష్ణవేణి ఫిలింస్, అరవింద్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మనీ’ (‘కనెక్టింగ్ పీపుల్’ అనేది ట్యాగ్‌లైన్). ఈ చిత్రానికి కంది రామచంద్రారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మందాడి అరవింద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం ఎడిటింగ్ పూర్తిచేసుకొని డబ్బింగ్‌ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ-ఇది వినోదాత్మక చిత్రం. దర్శకుడు చిత్రాన్ని బాగా తీర్చిదిద్దుతున్నాడు. ఈనెలలోనే ఆడియోని విడుదల చేసి మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేశాం. ఇదొక లవ్ ఎంటర్‌టైనర్. పాటలు చాలా బాగా వచ్చాయి అని తెలిపారు. కొండవలస, పృధ్వీరాజ్, చిత్రం శ్రీను, తడివేలు. తా.రమేష్, సుమన్‌శెట్టి, కోట శంకరరావు, వేదం నాగయ్య, పొట్టి చిట్టిబాబు, తిరుపతి ప్రకాష్, ద్రాక్షారామం సరోజ, బండ జ్యోతి, గబ్బర్‌సింగ్ బంటి, ఆంజనేయులు, పటేల్ అశోక్ పాండ్యన్, నల్లబాలు, పలాస శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రైసాబ్, సంగీతం:శ్రీవెంకట్, సహ నిర్మాత: రమేష్ చౌదరి, నిర్మాత: మందాడి అరవింద్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కంది రామచంద్రారెడ్డి.

నవీన్ (‘నచ్చావులే’ ఫేం), అలేఖ్య నాయకా నాయికలుగా
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles