Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ముగిసిన స్పీకర్ పర్యటన

భీమవరం, మార్చి 4: రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం భీమవరంలో మంత్రి వట్టి వసంత్‌కుమార్, జిల్లా కలెక్టర్ వాణీమోహన్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు తదితరులతో అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లా స్థితిగతులపై స్పీకర్ ఆరా తీశారు. స్పీకర్ నాదెండ్లను కలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అతిధి గృహం వద్దకు భారీ సంఖ్యలో విచ్చేశారు. అలాగే సిఫీ టెక్నాలజీ అధినేత వేగేశ్న అనంతకోటిరాజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో స్పీకర్ ఫొటోలకు ఫోజులిచ్చారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న దాతలతో కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

ముగిసిన స్పీకర్ పర్యటన
english title: 
ggh

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>